తండ్రి మృతి.. కూతుళ్లకు అనుమానం | - | Sakshi
Sakshi News home page

తండ్రి మృతి.. కూతుళ్లకు అనుమానం

Published Mon, Sep 30 2024 12:24 AM | Last Updated on Mon, Sep 30 2024 12:24 AM

తండ్రి మృతి.. కూతుళ్లకు అనుమానం

పాతపట్నం: అంతరాబ గ్రామంలోని స్టూడెంట్‌ కాలనీవీధిలో నివాసం ఉంటుంన్న కమ్మకట్ల రామయ్య (83) శనివారం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కానీ ఆయన మృతిపై కూతుళ్లు అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానం వ్యక్తం చేసింది తమ సోదరిపైనే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రామయ్యకు ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలయ్యాయి. రామయ్య భార్య చనిపోవడంతో చిన్నకుమార్తె సు గ్గు పుష్పలత తండ్రి వద్ద ఉంటూ బాగోగులు చూసుకుంటున్నారు. రామయ్యకు ఏడెకరాల పొ లం, మూడు ఇళ్లు ఉన్నాయి. ఆస్తి విషయంలో పెద్ద కుమార్తె పరపతి లక్ష్మి, రెండో కుమార్తె ధర్మాన పద్మావతిలతో చిన్నకుమార్తెకు తరచూ గొడవలు జరిగేవి. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. పది రోజుల కింద చిన్నకుమార్తె తండ్రిని తన అక్కలకు తెలియకుండా గార మండలం వమ్మరవల్లిలోని తన అత్తవారింటికి తీసుకెళ్లింది. ఈ నెల 28న రామయ్యకు ఆరోగ్యం బాగులేకపోవడంతో రిమ్స్‌కు తీసుకెళ్లగా.. ఆయన అక్కడే చనిపోయా రు. ఈ విషయాన్ని అక్కలకు పుష్పలత తెలియజేసి తండ్రి మృతదేహాన్ని అంతరాబ స్టూడెంట్‌ కాలనీకి తీసుకురాగా.. పద్మావతి, లక్ష్మిలు తమ సోదరిపై అ నుమానం వ్యక్తం చేశారు. అనంతరం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో పద్మావతి ఫిర్యాదు చేశారు. దీంతో ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్‌కు తరలించి ఆదివారం ఉదయం పోస్టుమార్టం చేసి, బంధువుల సమక్షంలో మృతదేహాన్ని ముగ్గురు కుమార్తెలకు అప్పగించారు. తండ్రి మృతదేహానికి రెండో కుమార్తె పద్మావతి, చిన్న కుమార్తె పుష్పలత తలకొరివి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement