రాయగడ: ఒక యువకుడిని గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో వెంటాడి నరికి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని బిసంకటక్ పోలీసుస్టేషన్ పరిధి చాటికొన మలివీధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి ఘాసీరాం జిలకర్ర (32)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మలివీధిలో ఆరు బయట ఉన్న ఘాసీరాంపై గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని వెంటాడి మరీ నరికి చంపాడు. దుండగుడు దాడి చేస్తున్న సమయంలో ఘాసీరాం పరుగున తన ఇంటివరకు వెళ్లి ఇంటి ఆవరణలో పడిపోయాడు. దీంతో మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటి బయట రక్తపు మడుగులో పడి ఉన్న ఘాసీరాంను చూసిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి బుధవారం తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment