పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ గ్రామం పదగాం శివమందిరం వద్ద శుక్రవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు సమావేశమయ్యారు. వీహెచ్పీ, భజరంగ్ దళ్ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా నవంబరు 3న మోహ నా సరస్వతీ శిశు మందిర్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానించారు. పర్లాకిమిడి, బరంపురం ఎంకేసీజీ మెడికల్లో పేషేంట్లకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం దృష్ట్యా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వీహెచ్పీ జిల్లా నాయకులు గౌడో తీర్మానించారు. ఈ సమావేశంలో మోహన, చంద్రగిరి, అడవ గ్రామం భజరంగ్దళ్, వీహెచ్పీ సభ్యులు ముందుకు రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment