మల్కన్గిరి: జిల్లాలోని ఎంవీ 8 గ్రామంలో సోమవారం రాత్రి మిలాన్ ముజూంధర్ అనే వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మిలన్ భార్య సుమిత్ర ముజూంధర్ మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎంవీ 7 గ్రామానికి చెందిన విధన్ మండాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మల్కన్గిరి ఎస్డీపీవో సచిన్ పటేల్ తెలిపిన వివరాల మేరకు.. ఇరుగుపొరుగు గ్రామాలకు చెందిన విధన్ మండాల్, మిలన్ ముజూంధర్లు స్నేహితులు. దీనిలో భాగంగా 15 రోజుల క్రితం ఇద్దరూ కలిసి మద్య సేవించే సమయంలో మిలాన్ ముజూంధర్ విధన్ భార్య కోసం తప్పుగా మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటినుంచే మిలాన్న్ చంపాలని చూస్తున్న విధన్ సోమవారం మద్యం తాగేందుకు పిలిచాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వెనుక నుంచి కత్తితో మెడపై వేటువేశాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అనంతరం మిలాన్ ఒంటిపై ఉన్న బంగారం, సెల్ఫోన్, డబ్బులు తీసుకొని విధన్ పరారయ్యాడు. అయితే కేసు విచారణ సమయంలో వీరి స్నేహం గురించి తెలుసుకొని ఆరా తీసి విచారణ చేయగా విషయం బయటకొచ్చిందన్నారు. విచారణ అనంతరం శనివారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment