కొరాపుట్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం సీఎల్పీ నాయకుడు రాంచంద్ర ఖడం తన నియోజకవర్గం పొట్టంగిలోని నందపూర్ సమితి పంతులుగాంలో వాల్మీకి అశ్రమం సందర్శించారు. అశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముక్తి అంబ వద్ద రాజా గుహని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత బందుగాం, అలమండ, కప్పలాడ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో సమస్యలను బీడీవోకి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment