ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి: హరీశ్‌రావు | Harish Rao Comments On CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి: హరీశ్‌రావు

Published Sat, Sep 28 2024 6:10 AM | Last Updated on Sat, Sep 28 2024 6:10 AM

Harish Rao Comments On CM Revanth Reddy: Telangana

సాక్షి, సిద్దిపేట/నంగనూరు: హామీలన్నీ తుంగలో తొక్కుతున్న సీఎం.. ఇక నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి కాదని, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలకేంద్రంలో శుక్రవారం రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ దసరాలోపు రైతులందరికీ రుణ మాఫీ చేయాలని, లేకపోతే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకు రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతా అన్నారు. ఒక్క నంగనూరు మండలంలోనే 11 వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే, కేవలం 5,102 మందికే మాఫీ అయ్యిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెబుతున్న సీఎం.. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌ ఎలా నిండిందో చెప్పాలన్నారు. దసరాలోపు మాఫీ చేయకుంటే రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement