కేఎల్‌ఐలో కృష్ణా జలాలు | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఐలో కృష్ణా జలాలు

Published Thu, Oct 17 2024 7:18 AM | Last Updated on Thu, Oct 17 2024 7:18 AM

కేఎల్‌ఐలో కృష్ణా జలాలు

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) డీ–82 కాల్వ నుంచి కృష్ణా జలాలు పారుతుండంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేఎల్‌ఐ పథకంలో భాగంగా ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండ లాల పరిధిలో దాదాపు 37వేల ఎకరాలకు సా గు నీరందించేందుకు డీ–82 కాల్వ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితమే అనుమతులిచ్చింది. ఇందుకు రూ.178 కోట్లు నిధులు మంజూరు చేసింది. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి వెల్దండ, ఆమనల్లు మాడ్గుల మండలంలోని నాగిళ్ల వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు. ఆమనగల్లు మండలంలో పోలెపల్లి, సింగంపల్లి పరిధిలో ఎనిమిది కిలోమీటర్లు, మాడ్గుల మండలం అవురుపల్లి, దొడ్లపహాడ్‌, అప్పారెడ్డిపల్లి, నాగిళ్ల వరకు కాలువ నిర్మాణ పనులు చేపట్టా రు. దాదాపు 90 శాతం పనులు పూర్తయినప్పటి కీ నాలుగేళ్లుగా పనులు పెండింగ్‌లోనే ఉన్నా యి. ఎమ్మెల్సీగా ఉండి కాలువ నిర్మాణానికి కృషి చేసిన కసిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ప్రత్యేక శ్రద్ధతో కాలువ నిర్మాణం పూర్తి చేయించారు. నెలరోజుల క్రితం ఆయన ఇరిగేష న్‌ శాఖ అధికారులతో కలిసి అసంపూర్తి పనుల ను పరిశీలించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సాగునీరును విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆమనగల్లు మండలంలో రెండుచోట్ల అసంపూర్తి పనులు పూర్తయితే మాడ్గుల మండలంలోని నాగిళ్ల వరకు కృష్ణజలాలు చేరుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement