బడంగ్పేట్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎలుగంటి మధుసూదన్రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, బుయ్యని మనోహర్రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. గ్రంథాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని గ్రంథాలయాలను బలోపేతం చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా చూడాలని చైర్మన్కు సూచించారు. అనంతరం స్పీకర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ రఘు తదితరులు ఉన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మధుసూదన్రెడ్డి ప్రమాణ స్వీకారం
హాజరైన స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment