చేవెళ్ల: చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో రెండు రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.7.50కోట్ల నిధులు విడుదలైనట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులకు నిధు లు కేటాయించాలని ఆగస్టులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరానని గుర్తు చేశారు. నిధులు విడుదల చేసిన మంత్రి సీతక్కకు ఆయ న నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పంచాయతీరా జ్ శాఖ జీఓ నంబర్ 582 ద్వారా చేవెళ్ల నుంచి ముడిమ్యాల వయా మల్కాపూర్ మీదుగా 3.28 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.35 కోట్లు, మొయినాబాద్ మండలం హిమాయత్నగర్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ నుంచి గండిపేట్ వరకు 2.50కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.4.15కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు.
మంత్రి సీతక్కకు ఎంపీ కొండా ధన్యవాదాలు
Comments
Please login to add a commentAdd a comment