
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ను కోరారు.
ఈ మేరకు సోమవారం సీఎల్పీ పక్షాన ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీలోపు వీలున్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని ఆ లేఖలో భట్టి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment