శ్రీకాళహస్తి: గుంటూరులోని తాడికొండలో ఉన్న రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన రాజ్యపురస్కార్ టెస్టింగ్ క్యాంపులో పాల్గొన్న శ్రీకాళహస్తి బాబూ అగ్రహారం పురపాలక సంఘ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు స్కౌట్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పీ.వినోద్, పీ.మురళీకృష్ణ, ఎస్.శ్రీనివాసులు, ఏ.యశ్వంత్, జే.లోకేష్ ఉన్నారు. ఏడు రోజులపాటు నిర్వహించిన టెస్టింగ్ క్యాంపులో అవార్డులకు అర్హత సాధించారు. వీరికి రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షులు అబ్దుల్ నజీర్ సంతకంతో కూడిన సర్టిఫికెట్స్ అందజేస్తారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఎస్కే.అజారుద్దీన్ను కమిషనర్లు ఎంఎం.రెడ్డి, రమేష్బాబు, జిల్లా కార్యదర్శి జయరాం, సహాయ కమిషనర్ పార్వతి, డీటీసీ సావిత్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప, ఉపాధ్యాయులు యోగానంద తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment