తిరుమల: శ్రీవారి పుష్కరిణి లో ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న చక్రస్నానం ఏ ర్పాట్లను టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులతో క లసి గురువారం తనిఖీ చేశా రు. ప్రవేశ మార్గాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, విజిలెనన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులను సమన్వయం చేసుకుని చక్రస్నాన సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 79,753 మంది స్వామివారిని దర్శించుకోగా 29,623 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment