సూళ్లూరుపేట: భవిష్యత్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ బలీయమైన సంస్థగా రూపొందాలంటే నేటి యువత శాస్త్రవేత్తలు కావాల్సిన అవసరం ఉందని చైన్నె నాయి ట్ కేంద్రం డైరెక్టర్ బాలాజీ రామకృష్ణ సూచించారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన గురువారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి నాయిట్ డైరెక్టర్ బా లాజీ రామకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. షార్ లోని బ్రహ్మప్రకాష్ హాలులో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతరం అంతా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలతోపాటు రూ.లక్షల వేతనం వైపు చూస్తున్నారని, కాని ఇస్రోలో చేరితే ఉద్యోగంతోపాటు దేశానికి సేవలు అందించిన శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందుతారనే విషయాన్ని మరచిపోకూడదని విద్యార్థులకు సూచించారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మాట్లాడుతూ 1999 నుంచి అంతరిక్ష వారోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఈసారి నిర్వహించిన కార్యక్రమాల్లో 2,700 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. రాబోయే రోజుల్లో గగన్యాన్–1 ప్రాజెక్ట్, చంద్రయాన్–4, వీనస్ (శు క్రయాన్) లాంటి అత్యంత భారీ ప్రాజెక్ట్లను చేపట్టి ఇస్రో ప్రతిభను చాటుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో వి జేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, డిప్యూటీ డైరెక్టర్లు ఆర్ సెంథిల్కుమార్, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment