‘సీజనల్’.. కిటకిట
శనివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ పాలకులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో దవాఖానాల్లో రోగుల రద్దీ తీవ్రమైంది. ఇందుకు తగ్గట్టు వైద్యులు, సిబ్బంది, మందులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు.
10లోu
అరకొర వైద్యం!
తాండూరు: పేదలకు వైద్యం అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వారికి కూర్చునేందుకు కుర్చీలు లేవు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీలో వైద్యం అందించాల్సిన వైద్యులు ఉదయం 10గంటలకు వచ్చి మధ్యాహ్నం 12గంటలకే వెళ్లిపోతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి, మాతాశిశు ఆస్పత్రులను శుక్రవారం సాక్షి విజిట్ చేసింది. ఉదయం 10 గంటల తర్వాత వచ్చిన వైద్యులు రోగిని ముట్టుకోకుండానే మందులు రాసి పంపించారు. మరోవైపు పలు విభాగాలకు చెందిన వైద్యులు విధులకు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లా ఆసుపత్రిలోని ఓ విభాగంలో 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించకుండా ఒకే చోట చేరి సెల్ ఫోన్లు చూస్తూ ముచ్చటించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో బిజీగా కనిపించారు. ఓపీ క్లోజ్ చేయడంతో అత్యవసర వైద్య విభాగం ఎదుట రోగులు వైద్యం పొందేందుకు క్యూ కట్టారు.
నేలపై కూర్చుని పడిగాపులు
మాతా శిశు ఆసుపత్రి వైద్య సేవలు దారుణంగా కనిపించాయి. ఎంసీహెచ్లో వైద్యులు ఓపీ సేవలను త్వరగా క్లోజ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైరల్ ఫీవర్, పలు రకాల జబ్బులతో పసి పిల్లలతో వచ్చిన తల్లి బిడ్డలకు వైద్య సేవలను అందక ఇబ్బందులు పడ్డారు. పసి పిల్లలతో వచ్చిన తల్లులకు కూర్చునేందుకు కుర్చీలు అందుబాటులో లేక నిల్చోవడం.. నేలపై కూర్చొని పడిగాపులు కాశారు. చిన్నారులకు వైద్య సేవలు అందించే డ్యూటీ డాక్టర్ తల్లి బిడ్డలను నిలబెట్టి వైద్యం అందించారు.
ఓపీలకు భారీగాపెరిగిన రద్దీ
న్యూస్రీల్
మధ్యాహ్నం 12 గంటలలోపే ఓపీ క్లోజ్
Comments
Please login to add a commentAdd a comment