మధురవాడలో 243 గదులు కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

మధురవాడలో 243 గదులు కేటాయింపు

Published Fri, Feb 9 2024 12:38 AM | Last Updated on Fri, Feb 9 2024 12:38 AM

- - Sakshi

మధురవాడ: మధురవాడ సుద్దగెడ్డ వద్ద టిడ్కో ఇళ్ల సముదాయంలో మహిళా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలను గురువారం జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఆర్డీవో భాస్కరరెడ్డి, జీవీఎంసీ ఏడీసీ వై.శ్రీనివాస్‌, డీసీఆర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ పరిశీలించారు. ఇక్కడ 26 జిల్లాల మహిళా జట్లకు వసతి కల్పిస్తున్నారు. ఇందుకోసం 243 గదులు కేటాయించారు. భోజనం, తాగునీరు, వసతి, రక్షణ కోసం 100 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, ప్లంబర్‌, విద్యుత్‌ తదితర సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భీమిలి జెడ్సీ శైలజా వల్లి ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పింక్‌ మొబైల్‌ టాయిలెట్‌    క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌  1
1/1

పింక్‌ మొబైల్‌ టాయిలెట్‌ క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement