మర్రిపాలెం: వైఎస్సార్సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తర నియోజకవర్గంలోని వెలమ సామాజిక వర్గ పెద్దలు స్పష్టం చేశారు. బిర్లా జంక్షన్ వద్ద గల బొత్స కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఉత్తర ఎన్నికల పరిశీలకుడు చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో ఆదివారం వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు హాజరై మాట్లాడారు. మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలపాలని బొత్స ఝాన్సీ కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కె.కె.రాజును, ఎంపీగా తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కె.కె.రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, వీకేపీసీపీఐఆర్ మాజీ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, యర్రా సన్యాసినాయుడు, పాసిల సూర్యనారాయణ, వెన్నెల సూర్యనారాయణ, పరదేశి నాయుడు, బాపునాయుడు, వెలమ సామాజిక వర్గ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
విశాఖ ఎంపీ, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, కె.కె.రాజు
వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన
వెలమలు