ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవన సాఫల్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవన సాఫల్య పురస్కారం

Published Fri, Sep 27 2024 1:58 AM | Last Updated on Fri, Sep 27 2024 1:58 AM

ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవన సాఫల్య పురస్కారం

మద్దిలపాలెం: ప్రఖ్యాత నాట్య కళాకారిణి ప్రతిభా ప్రహ్లాద్‌ ‘వైశాఖీ జీవన సాఫల్య పురస్కారం–2024’కు ఎంపికయ్యారు. నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 16వ అఖిలభారత శాసీ్త్రయ నృత్యోత్సవం పేరిట ‘వైశాఖీ నృత్యోత్సవాలు’జరగనున్నాయి. తొలి రోజు సుప్రసిద్ధ భరతనాట్య, కూచిపూడి నాట్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రతిభా ప్రహ్లాద్‌ను వైశాఖీ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిన రంగ విక్రమ్‌ కుమార్‌ తెలిపారు. ఆమె దేశంలో 3 వేలకు పైగా భరతనాట్య ప్రదర్శనలు, దాదాపు 85 దేశాల్లో భారతీయ నృత్య ప్రదర్శనలు చేసి అరుదైన ఘనతకు సొంతం చేసుకున్నారు. ఫోరం ఫర్‌ ఆర్ట్‌ బియాండ్‌ బోర్డర్స్‌ పేరుతో ప్రసిద్ధి పొందిన ఫౌండేషన్‌ వ్యవస్థాపక మేనేజింగ్‌ ట్రస్టీ ఆమె.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement