హన్మకొండ చౌరస్తా:
హనుమకొండ బస్ స్టేషన్ అడ్డాగా జరిగే నీచమైన దందాలెన్నో. రాత్రీ పగలు తేడా లేకుండా.. ఇక్కడ అన్ని రకాల సేవలు లభిస్తున్నాయి. మత్తు.. మగువ ఇలా ఏది కావాలంటే అది డబ్బులిస్తే చాలు అన్నీ దొరుకుతున్నాయి. ఓవైపు ఐటీ, వైద్య, విద్యా రంగాల్లో నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. మరో వైపు గంజాయి, మద్యం, మగువలతో కొందరు నగర కీర్తిని మసకబారుస్తున్నారు. హనుమకొండ నగర నడిబొడ్డున గంజాయి ప్యాకెట్లు, బీర్లు.. మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. విటులకు మగువలను సరఫరా చేస్తూ ఓ మాఫియా జేబులు నింపుకుంటోంది.
మధ్యవర్తులుగా..
అనాదిగా ఈ నీచపు దందా నడిపిస్తున్న మాఫియాకు, పోలీసులకు మధ్య కొందరు మీడియా వ్యక్తులు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు స్థానికులు చెబుతుండడం గమనార్హం. ఠాణాకు కొత్త అధికారి రాగానే.. మాఫియా నుంచి మామూళ్లను ఈ మధ్యవర్తులే అందజేస్తున్నట్లు తెలుస్తోంది. మత్తుకో రేటు.. మగువకో రేటును ఈ మీడియేటర్లే ఫిక్స్ చేసి పోలీస్ అధికారులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిటీలోని మీడియా మొత్తం తమ చేతుల్లోనే ఉందని పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. కాగా.. ముడుపులు అందుతుండడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మధ్యవర్తులుగా మీడియాలోని కొందరు
మేమున్నామంటూ పోలీసులకు భరోసా
మామూళ్ల మత్తులో
చూసీచూడనట్లుంటున్న ఖాకీలు
Comments
Please login to add a commentAdd a comment