● అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సాక్షి,యాదాద్రి: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి నోడల్ ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు రోజువారీ రిపోర్టులు పంపాలన్నారు. జిల్లాలో మొత్తం 985 ఓటర్లు ఉన్నందున వారు ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ కేంద్రాలకు అవసరమైన మెటీరియల్ను సకాలంలో చేర్చాలన్నారు. 17 పోలింగ్ కేంద్రాలకు ఆరు రూట్ల ద్వారా 17 మండలాలకు బ్యాలెట్ బాక్సులు పంపే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సంబంధిత నోడల్ అధికారులు, సూపరింటెండెంట్లు రామారావు, శాంతి లాల్, డీటీ సురేష్, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment