టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి

Published Thu, May 9 2024 6:15 AM

టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి

అట్లూరు : వేల రూపాయల జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టి టీడీపీ ప్రచారంలో పాల్గొనడం మండల వ్యాప్తంగా దుమారం లేపుతోంది. అట్లూరు మండలం వరికుంట గ్రామానికి చెందిన శింగన సుబ్బరామిరెడ్డి ముంపు బాధితుల కోటాలో పుట్టపర్తి జిల్లా కదిరి జలవనరుల శాఖలోని డివిజన్‌–9 కింద సబ్‌ డివిజన్‌–3లోని మదనపల్లిలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు డుమ్మా కొట్టి బద్వేల్‌ ఉమ్మడి బీజేపి అభ్యర్థిని గెలిపించాలంటూ బుధవారం అట్లూరు క్రాస్‌రోడ్డులోని పునరావాస కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement