చెలరేగిన ఆంధ్రా బ్యాట్స్మన్
రెండో మ్యాచ్లో భారీస్కోరు దిశగా ఆంధ్రా జట్టు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో కల్నల్ సీకే నాయుడు అండర్–23 అంతర్ రాష్ట్రాల క్రికెట్ మ్యాచ్లో ఆంధ్రా జట్టు బ్యాట్స్మన్ చెలరేగారు. శనివారం నిర్వహించిన మ్యాచ్లో హిమాచల్ప్రదేశ్, ఆంధ్రా జట్లు తలపడగా ఆంధ్రా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆంధ్రా జట్టు 360 పరుగులు చేసింది. జట్టులోని హేమంత్రెడ్డి 136 పరుగులు, వెంకటరాహుల్ 162 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హిమాచల్ప్రదేశ్ బౌలర్లు సాహిల్ శర్మ 2, నారాయణ 2 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment