ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
వేంపల్లె : వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లె గ్రామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ముకుంద ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి వేంపల్లెకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో ఎరగ్రుంట్లకు వెళుతుండగా నేలతిమ్మయ్యగారిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న ముకుంద ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు, శ్రీనివాసులు, అంజనమ్మ, లక్ష్మయ్య, వీరయ్య, రమణమ్మ, చిన్న రాయుడులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరయ్య (57)మృతి చెందాడు. ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్కు తరలించారు. సంఘటన స్థలాన్ని వీరపునాయునిపల్లె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment