నేత్రవైద్య సేవలు అభినందనీయం
కడపకోటిరెడ్డి సర్కిల్: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రజలకు అందిస్తున్న నేత్ర వైద్య సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి కొనియాడారు. శనివారం కడప నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎల్వీపీఈఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ , డాక్టర్ రమేష్, డాక్టర్ అవినాష్ పట్బంగి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కావ్య మాధురి టీం కార్యక్రమాలను పర్యవేక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment