-
మాటల్లో కాదు చేతల్లో చూపించిన ప్రభుత్వం
ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్ వేటపాలెం: సీఎం జగన్ మోహన్రెడ్డి అంటేనే నమ్మకమని.. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించిన ఎకై క సీఎం ఆయనేనని చీరాల వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్ పేర్కొన్నారు. మండలంలోని పాపాయిపాలెం, వాకావారిపాలెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలిస్తూ మోసగించేందుకు వస్తున్న కూటమి పార్టీల్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇటీవల జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రతిపక్షాల మేనిఫెస్టోతో పోలుస్తూ వివరించారు. అప్పట్లో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తర్వాత వాటిలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. మళ్లీ ఆదే తరహాలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బీరక సురేంద్ర, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, పులి శ్రీనివాసరావు, పులి హరికృష్ణ, పులి శ్రీనివాసరావు (బుజ్జి), మల్లారపు హనుమంతరావు, గడ్డం వెంకట్రావు, మద్దిన రాంబాబు, మదిన శివకృష్ణ, పాలంకి జగన్, ఖమ్మం హరి, డక్కుమల్ల విజయ్, ఏ. నాగరాజు, నాగార్జున, గడ్డం లోకేష్, గవిని వెంకటరావు, డక్కుమల్ల కోటయ్య, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. -
చెక్పోస్ట్ల వద్ద తనిఖీలు ముమ్మరం
బాపట్ల టౌన్: చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మండలంలోని చుండూరుపల్లి చెక్పోస్ట్ను బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు నగదు, మద్యం, ఇతర వస్తువుల్ని వినియోగించే అవకాశం ఉందన్నారు. వాటిని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారని తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. వాహన తనిఖీలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, పరిమితికి మించి ఇతర వస్తువులు తరలిస్తూ ఉంటే వాటిని సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలిపారు. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని, వాటిల్లో తొమ్మిది బాపట్ల జిల్లా సరిహద్దుల్లో, మరో తొమ్మిది జిల్లాలో అంతర్గతంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిల్లో ఎస్ఎస్టీ బృందాలు మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వహిస్తూ 24 గంటల పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఎస్పీ తెలిపారు. చెక్పోస్ట్ల వద్ద వాహన తనిఖీలు నిర్వహించే పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఎస్పీ వకుల్ జిందాల్ -
కూటమి మేనిఫెస్టో పెద్ద బూటకం
● ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి ● ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మొద్దు ● జోరుగా ఎన్నికల ప్రచారం సంతమాగులూరు (అద్దంకి రూరల్): మోసపూరిత కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మి ఓటు వేయవద్దని అద్దంకి వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి కోరారు. సంతమాగులూరు మండలంలోని కొప్పరంలో బుధవారం రాత్రి ఆయన సంతమాగులూరు మండల ఇన్చార్జి కై పు మహేష్రెడ్డి సతీమణి సుష్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గ్రామంలో పర్యటించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా హనిమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజల అండ, ఆశీర్వాదాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కులం, మతం పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిచిన ఘనత ఒక్క జగనన్నకే దక్కిందని పేర్కొన్నారు. పేద ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న జగనన్నను ఈసారి ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చో పెడతారని పేర్కొన్నారు. కూటమి ఓటమి భయంతోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని బయటకు తీసుకువచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలు తనతో పాటు కుటుంబ సభ్యుల్ని ఎంతో ఆదరిస్తున్నారని, వారి రుణం తీర్చుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అద్దంకి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీ అభ్యర్థిగా తనను, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్కు ఫ్యాన్ గుర్తుపై రెండుసార్లు బటన్నొక్కి గెలిపించాలని కోరారు. అనంతరం అద్దంకి మండలంలోని చిన కొత్తపల్లి, గోవాడ, గ్రామాల్లో హనిమిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, మండల, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో ఉప్పు రైతులకు ముప్పు
● రెండు వేల ఎకరాలలో వర్షార్పణం ● లబోదిబో మంటున్న రైతులు చినగంజాం: అకాల వర్షంతో మండలంలోని ఉప్పు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీజన్లో ఆనందంతో సాగు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వర్షం పడి వారి ఆశలపై నీరు చల్లింది. సహజంగా ఉప్పు సాగుకు వేసవి అనుకూలం. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు భావించారు. ఎకరాకు రూ.40 వేలు పైగా ఖర్చు చేసి సాగును చేపట్టారు. మండలంలో సుమారు 2500 ఎకరాలకు పైగా ఉప్పు భూముల్లో సన్న, చిన్న కారు రైతులు సాగు చేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచే సాగు చేపట్టారు. ఈ పాటికే ఉప్పును కొంతమేర తీసి నిల్వలు సైతం పెట్టారు. అకాల వర్షంతో కరిగిపోయిన కొఠార్లు మండలంలో మంగళవారం రాత్రి గాల్పులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మడుల్లో నిల్వ ఉంచిన ఉప్పు కరిగి పోయింది. ఈ పాటికే గట్టుకు చేర్చి నిల్వ ఉంచిన బస్తాలు సైతం వర్షం కారణంగా తడిచి పోయి కరిగిపోయాయి. మడుల్లో ఎక్కాలపై తీసి ఉంచిన ఉప్పు కరిగి గట్టుకు చేర్చేందుకు కూడా మిగలకుండా కరిగిపోయింది. ఉప్పు మడులు సైతం వర్షపు నీటితో నిండిపోయి సాగుకు తీవ్ర ఆటంకం కలిగించింది. -
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి
జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్ బాషా బాపట్ల: సార్వత్రిక ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్బాషా తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల నోడల్ అధికారులతో స్థానిక కలెక్టరేట్లో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు మరింత పటిష్టంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్ఎస్టీ టీంలు తనిఖీ చేసే ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు మార్చాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా నగదు, మద్యం, ఆభరణాలు వంటి బహుమతులు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పారు. గుర్తింపు కార్డుల్ని సంబంధిత ఓటర్ల చిరునామాలకు పంపామని, పోలింగ్ సిబ్బందికి కూడా శిక్షణలు పూర్తయ్యాయని తెలిపారు. 12వ తేదీ ఉదయాన్నే ఆయా నియోజకవర్గాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బంది రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ యంత్రాలు, సామగ్రి తరలించడానికి ఆర్టీసీ బస్సుల్ని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి నూరు శాతం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సెక్టార్ ఆఫీసర్లు, ఎస్ఎస్టీ టీంలు ప్రయాణించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ సిబ్బంది సంక్షేమం చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. పోలింగ్ రోజు వినియోగంలోకి రాని ఈవీఎంలు, రిజర్వ్ ఈవీఎంలను బాపట్ల మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంకు తరలించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. సక్షం వెబ్ సైట్లో ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి పోలింగ్ రోజున ఇంటి వద్దకు వాహన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు పాల్గొన్నారు. -
బల్లికురవ ఎస్ఐ సస్పెన్షన్
బల్లికురవ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బల్లికురవ ఎస్ఐ పి. నాగశివారెడ్డిపై బుధవారం బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల బల్లికురవలో ఓ వృద్ధుడిపై దాడి, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలీస్ స్టేషన్లో సత్కారం పొందడం, పర్చూరులో ఎన్నికల విధుల్లో భాగంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గీయుల్ని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలపై అందిన నివేదికలతో ఎస్పీ నాగశివారెడ్డిని సస్పెండ్ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ఫోన ్లకు అనుమతి లేదు నరసరావుపేట: ఈనెల 13వ తేదీన పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి చెప్పారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల పరిశీలకులు, కేంద్ర బలగాలు, పోలీస్శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాంకేతిక సమస్యలు, అల్లర్లు, గొడవలు వల్ల రీ–పోలింగ్ జరగకుండా చూడడమే ముఖ్య కర్తవ్యమని స్పష్టం చేశారు. జిల్లాలో 1,929 పోలింగ్ స్టేషన్లో 557 సమస్యాత్మకంగా ఉన్నాయని, వాటిలో జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్, సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి సలహాలు, సూచనలు అందజేయాలని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు 18 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వ్కు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతిస్తారని చెప్పారు. జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ జిల్లాలో ఎన్నికల బందోబస్తును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సుమిత్ కుమార్, జార్జ్ జోసఫ్, గౌతమ్, బూరె సర్వేశ్వర నరేంద్ర, శ్రీహరి ప్రతాప్సాయి, అజిత్ సింగ్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎ.శ్యాంప్రసాద్, రమాకాంత్ రెడ్డి, సుబ్బారావు, శ్రీరాములు, సరోజిని, నారదముని, మురళీకృష్ణ, 18 కంపెనీల కమాండెంట్లు పాల్గొన్నారు. కుట్రను ఛేదించిన పోలీసులు టీడీపీ సానుభూతిపరుడి ఇంట్లో బాంబులు, బరిశెలు దుర్గి: మండలంలోని సమస్యాత్మక గ్రామమైన జంగమహేశ్వరపాడులో బుధవారం బాంబులు, బరిశెలు, గొడ్డళ్లు, ఇనపరాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వారం రోజుల క్రితం టీడీపీకి చెందిన వారు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి వారికి రక్షణగా ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు పోలీసులు టీడీపీ సానుభూతిపరుడు గుమ్మా నాగరాజు ఇంట్లో 17 బాంబులు, మూడు బరిశెలు, ఇనపరాడ్లు, గొడ్డలిని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు కలవరపాటుకు గురయ్యారు. మూడు వైద్య విభాగాల్లో పల్నాడు జిల్లాకు ర్యాంకులు నరసరావుపేట: జిల్లాకు మూడు వైద్య విభాగాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకులు లభించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ బీవీ రంగారావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసవాలు చేయటంలో గైనకాలజీ విభాగం, కళ్ల ఆపరేషన్లు చేయటంలో ఆప్తమాలజి, ఎక్కువ ఆరోగ్యశ్రీ కేసులు పరిష్కరించినందుకు ఈ మొదటి ర్యాంకులు లభించాయన్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకెండరీ హెల్త్ విభాగ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు సమీక్ష చేసి ఈ ర్యాంకులను పల్నాడు జిల్లాకు ప్రకటించారని తెలిపారు. ఆప్తమాలజీ (కంటి) విభాగంలో లింగంగుంట్ల ఏరియా వైద్యశాల మొదటి స్థానంలో నిల్చిందని పేర్కొన్నారు. సీహెచ్సీలలో మాచర్ల సీహెచ్సీకి ప్రథమ ర్యాంకు వచ్చిందని వివ రించారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐ బదిలీ మాచర్ల: నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వారు వ్యవహరించిన తీరును పరిశీలించి కమిషన్ కారంపూడి సర్కిల్ పరిధిలో సీఐ చిన్న మల్లయ్య యాదవ్, మాచర్ల అర్బన్ సీఐ శరత్బాబు, వెల్దుర్తి మండల ఎస్ఐ శ్రీహరిలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల నుంచి వీరిని తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి స్థానంలో వేరే వారిని నియమించాలని పోలీసు అధికారుల్ని ఆదేశించింది. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
పర్చూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమటి ఇంకొల్లు (చినగంజాం)/మార్టూరు: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తనవంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి య డం బాలాజీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం ఇంకొల్లు మండలంలోని కొణికి, దుద్దుకూరు గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా పూలు చల్లుతూ మేళతాళాలతో యువకులు కేరింతల నడుమ ప్రచారం సాగింది. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాను పర్యటించానని, స్థానికంగా పలు సమస్యలు నెలకొని ఉన్నాయని, వైఎస్సార్ సీపీ పాలనలో శాసన సభ్యుడు పర్చూరు నియోజకవర్గంలో లేకపోవడం లోటుగా కన్పించిందని, ఆ లోటును తాను భర్తి చేస్తానన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పోటీలో ఉన్న తనకు ఈవీఎం బ్యాలెట్లో 3వ నంబరులో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి గెలిపించాలని కోరారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మండల పార్టీ కన్వీనర్ బండారు ప్రభాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని ఇసుక దరిశి గ్రామంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుతో కలిసి యడం బాలాజీ కార్యకర్తల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పార్టీ నాయకులు శివరాత్రి గిరిబాబు నివాసంలో సమావేశం నిర్వహించారు. అందరూ వివాదాలకు దూరంగా ఉండి పార్టీని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సత్తెనపల్లి నారాయణమ్మ, హనుమంతరావు, ఎమ్పిటిసి గోరంట్ల మల్లీశ్వరి, లక్ష్మీ నారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షుడు మేరువ కోటయ్య, వినుకొండ సుధాకర్, మాజీ సర్పంచి శివరాత్రి సుబ్బారావు, శివరాత్రి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీ పోలింగ్ జరిగేలా విధులు నిర్వహణ నగరంపాలెం: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ పక్రియ జరిగేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన వివి ధ రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది శిక్షణ ఐపీఎస్ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై ఆచరించాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధి నిర్వహణలో పాటించాల్సిన ఎన్నికల నిబంధనలపై వారికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై దృష్టిసారించాలని కోరారు. అనంతరం జిల్లా భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు, ఇతరత్రా అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో గుంటూరు తూర్పు ఏఎస్పీ నిచికేత్షెల్కే, శిక్షణ ఐపీఎస్ అధికారి మనోజ్ హెగ్డే పాల్గొన్నారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామల రవి కిశోర్రెడ్డి రెంటచింతల: ౖవెఎస్సార్సీపీ ప్రచారానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన రావడంతో రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామల రవి కిశోర్రెడ్డి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపద్యంలో వెల్ధుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ, మరికొందరు మహిళలపై టీడీపీ మూకలు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దౌర్జన్యంతో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్న టీడీపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పడానికి నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మాచర్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ గుండాలు మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేయడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ జిల్లాకు తొమ్మిది మంది శిక్షణ ఐపీఎస్ల కేటాయింపు -
మంచిని అడ్డుకుంటున్న టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
పట్నంబజారు: మంచిని అడ్డుకున్న ప్రతి ఒక్కరూ చరిత్ర హీనులుగా మిగలిపోవడం ఖాయమని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని హెచ్చరించారు. స్థానిక 24వ డివిజన్కు చెందిన 25 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరాయి. స్థానిక శ్యామలానగర్ రెండో లైను లోని మంత్రి రజిని నివాసంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసే తేదీలు ముందే ప్రకటించి మరీ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని చెప్పారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ప్రజల్లో ఆగ్రహావేశాలు మరింత పెరుగుతున్నాయన్నారు. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికల వెల్లువ కొనసాగుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు మొహ్మద్ అమీర్, జ్యూస్ వలి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి షేక్ సైసా బాబు, షేక్ ఇస్మాయిల్, షేక్ రఫి, షేక్ నాగుల్షరీఫ్, షేక్ సైసా, షేక్ మీర్షా, ఇసా జానీ, షేక్ చిన్న సైసా వైస్సార్సీపీలో చేరారు. -
ఎవరు పిలిచినా వెంటనే పలుకుతా
భట్టిప్రోలు: ఎవరు పిలిచినా వెంటనే పలుకుతా.... పిలిస్తే పలికేంత దూరంలో ఉంటా.. ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండి మంచి చేస్తా.. వచ్చే ఎన్నికల్లో నన్ను ఆదరించండి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు అన్నారు. బుధవారం భట్టిప్రోలు, అద్దేపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ప్రచారంలో పాల్గొని మద్దతు తెలియ చేశారు. మహిళలు మంగళ హారతులు పట్టారు. అందరితో మమేకమైన ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్బాబు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఈతి బాధలు తనకు తెలునని ఇంటిల్లిపాదీ కష్టపడితే రోజుకు రూ.300లు రావడం గగనమన్నారు. నేతన్నల స్ధితిగతులను గమనించిన సీఎం జగన్ నేతన్న నేస్తం కింద రూ. 24 వేల వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కొండా శివ ప్రసాదరెడ్డి (ఎస్పీ రెడ్డి), సర్పంచ్ దారా రవి కిరణ్మయి, ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయ భాస్కరి, వైస్ఎంపీపీ కె. పిచ్చయ్య శాస్త్రి, కుందేటి రమేష్, ఎంపీటీసీ సభ్యులు గద్దె సుశీల, కౌతరపు పద్మావతి, డొక్కు నాగకుమారి, పంచాయతీ వార్డు సభ్యులు అబ్ధుల్ కరీమ్, పెరికల శ్యాం, వైఎస్సార్ సీపీ నాయకులు బండారు శ్రీబండారు శ్రీనివాసరావు, సిరాజ్, తబ్రేజ్, మద్దుల గిరిధర్, దారా చె న్నయ్య, జల్లి జ్షోకాంత్, గోవర్ధనగిరి పెదబుజ్జి, దావూరి నాగమల్లేశ్వరరావు, దయమ్మ, షర్ఫుద్దీన్, కుతుబుద్దీన్, ఖురేషి, గౌస్, తలకొల యలమంద, వేల్పూరి చిన్నారి,నాగేశ్వరరావు, చేబ్రోలు నాగార్జు న, తిరువీధుల వెంకటేశ్వర్లు, గోలి శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వికలాంగుల సంఘ నాయకులు వేమూరు మండలం చావలి, భట్టిప్రోలు గ్రామాలకు చెందిన వికలాంగుల సంఘ నాయకులు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య ఆధ్వర్యంలో అశోక్బాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో ఆకుల వెంకటేశ్వర్లు, విష్ణునాయుడు బి. కృష్ణారెడ్డి, ఆకురాతి విష్ణు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్బాబు నేతన్నల ఈతి బాధలు తెలుసు భట్టిప్రోలులో ఎన్నికల ప్రచారం -
రాష్ట్రంలో కుల–మతాలకు అతీతంగా పాలన
పిట్టలవానిపాలెం:కుల,మతాలకతీతంగా సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనని బాపట్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోన రఘుపతి అన్నారు. మండలంలోని కొత్తపాలెం, మంతెనవారిపాలెం, పిట్టలవానిపాలెం, అల్లూరు, అలకాపురం, గోకరాజజు నల్లిబోయిన వారిపాలెం, ఖాజీపాలెం, పిట్టువారిపాలెం, చందోలు గ్రామాలలో ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్తో కలిసి ఎన్ని కల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. బాపట్ల శాసన సభ్యునిగా తనను మూడవసారి ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ను రెండవసారి గెలిపించాలని కోరారు. ఈనెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జ్ ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, మాజీ ఎంపీపీ షేక్బాజి, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అహ్మద్ హుస్సేన్, వైస్ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు యేట్ర అశ్వినిరెడ్డి, దబ్బకూటి మాధవరావు, మండే విజయ్ కుమార్, జడ్పీటీసీ మాజీసభ్యులు చిరసాని నారపరెడ్డి, మునీర్, బడుగు ప్రకాశరావు, కూసంపూడి దేవేంద్రరాజు, గుమ్మడి సీతయ్య, వాలి శివారెడ్డి, మోదుగుల ప్రభాకర్రెడ్డి, కుంఠం ప్రసన్నరాజు, సుబ్రమణ్యం రెడ్డి, బొలగాని సుబ్బారావు, దోమ తిరుమలరెడ్డి ఉన్నారు. ఆ ఘనత సాధించింది సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోన రఘుపతి -
జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
నిజాంపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిండి పంచాయతీలో బుధవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న పాలనా సంస్కరణలతో గ్రామీణ ప్రాంతాలను సైతం పట్టణాలకు ధీటుగా రూపురేఖలు మారుతున్నాయన్నారు. రైతుల సేవకై రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, సచివాలయాలతో ప్రభుత్వ పౌర సేవలు, వైద్యసేవలు అందించేందుకు అర్బన్ హెల్త్సెంటర్ల అభివృద్ధితో పాటు నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో ప్రజల మనస్సులను గెలిచిన ముఖ్యమంత్రిగా జగనన్న పేరొందారన్నారు. నవరత్న పథకాలతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటకెళ్లినా ప్రజ లు తాము పొందిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికలలో బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి నందిగం సురేష్, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీపీ మోపిదేవి హరనాథ్, డీసీఎంఎస్ చైర్మన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్, సర్పంచ్ యేమినేని రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గణేష్ -
ఐదేళ్లలో చీరాలను అభివృద్ధిలో ముందుంచాం
చీరాల: రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రతి గడపలో సంక్షేమాన్ని అందించిన ఘనత చరిత్రలో సీఎం జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, కొనుగోలుదారులతో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. గత ఐదేళ్లుగా సీఎం జగనన్న అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిదారుల మాటల్లోనే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపడితేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ లభిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే కళ్లబొల్లి హామీలను ప్రజలు విశ్వసించరన్నారు. జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైఎస్సార్ సీపీకి అధికారం కట్టబెడుతుందన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పి ప్రజల ముగింటకే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలను అందించి సుస్థిర పాలన చేస్తున్న జగనన్నే మళ్లీ సీఎం పీఠం అధిరోహిస్తారని చెప్పారు. అందుకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే కరణం వెంకటేష్ను, ఎంపీగా నందిగం సురేష్ను గెలిపించుకోవడంతో మళ్లీ సీఎంగా జగనన్నను గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్చైర్మన్ జైసన్బాబు, పార్టీ నాయకులు గుంటూరు మాధవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిద విభాగాల నాయకులు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ప్రజలు పాల్గొన్నారు. చీరాల ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో పాటుగా వ్యాయామం చేసుకుంటున్న పుర ప్రజలతో ‘గుడ్ మార్నింగ్ చీరాల’ కార్యక్రమం నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. తమ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో నియోజకవర్గ ప్రజలందరూ చూశారని, విద్వేష రాజకీయాలకు తావు లేకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బాలకృష్ణ, ప్రభాకరరావు, పార్టీ నాయకులు గుంటూరు మాధరావు, శ్రీను తదితరులు ఉన్నారు. మళ్లీ అవకాశం ఇవ్వండి వెంకటేష్ను అసెంబ్లీకి పంపండి, మరింత అభివృద్ధి చేస్తాం పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కరణం బలరాం -
సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి
గుంటూరు మెడికల్: ప్రైవేటు ఆస్పత్రుల్లో నూరు శాతం సిజేరియన్లు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ కాన్పులు కంటే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారని, ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎక్కువ శాతం సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించి ఆపరేషన్లు చేయడానికి గల కారణాలు సమీక్షించి నోటీసులు అందజేస్తామన్నారు. సాధ్యమైనంత మేరకు ప్రసవాలు ఆపరేషన్లతో పనిలేకుండా నార్మల్గా అయ్యేలా చూడాలన్నారు. -
జగనన్నపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారు
రేపల్లె రూరల్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలోకి పలువురు ఆకర్షితులై చేరుతుండటంతో పార్టీ మరింత బలోపేతం అవుతోందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. నిజాంపట్నం మండలంలోని ముత్తుపల్లి, మరకా వారి పాలెం గ్రామాలకు చెందిన 25 టీడీపీ కుటుంబాల సభ్యులు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి రేపల్లె పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కండువాలు కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. జగనన్న పాలనా సంస్కరణలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ అభ్యున్నతికి కృషి చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయంతో గెలుపొందేలా పనిచేయాలని చెప్పారు. మైలా పవన్ కుమార్, మైలా సర్జన్ రాజు, మైలా కోటేశ్వరరావు, మైలా వంశీ, మైలా రాకేష్, మరకా జోషి, మరకా భూషయ్య, మరకా శివనగరాజు, చుక్క స్వరూప్, మరకా ప్రసాద్, మైలా నాగరాజు, మరకా శ్రీనివాసరావు, మైలా శ్రీనివాసరావు, మైలా సాంబశివరావు, యల్లావుల గోపికృష్ణ, శ్రవణం దుర్గరెడ్డి తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. కార్యక్రమంలో కూచినపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ బసవపున్నయ్య, నిజాంపట్నం సొసైటీ చైర్మన్ మారకా శ్రీనివాసరావు, నిజాంపట్నం మాజీ ఎంపీపీ ప్రసాదం వాసుదేవ, నిజాంపట్నం మాజీ సర్పంచ్ నర్రా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు వైఎస్సార్ సీపీలోకి పలువురి చేరిక -
ఆశ కార్యకర్తల పనితీరు మెరుగవ్వాలి
డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ చీరాల టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పని తీరు మెరుగుపర్చుకుని ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజలకు సక్రమంగా వైద్య సేవ లు అందించాలని బాపట్ల జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. విజయమ్మ సూచించారు. మంగళవారం ఆశ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఈపురుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో జరుగుతున్న సమావేశాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విజయమ్మ మాట్లాడు తూ వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా వడ దెబ్బలు తగలకుండా అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, పీహెచ్సీ సిబ్బంది ఉన్నారు. కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతదేహం తెనాలి రూరల్: తెనాలి మండలం కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతి చెంది ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొలాల్లో గుర్తు తెలి యని మృతదేహం ఉందన్న సమాచారంతో రూరల్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, సిబ్బంది ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. మృతదేహం వద్ద సెల్ఫోన్ ఉండడంతో దాని ద్వారా అతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోరెన్ విజయ్(39)గా గుర్తించారు. తన తోటి కూలీలతో కలసి చైన్నెలో పనులకు వెళ్తూ ఆదివారం తెనాలిలో రైలు దిగి అది కదిలే లోపు ఎక్కలేకపోయాడు. సోమవారం ఉదయం పట్టాల వెంబడి నడుచుకుంటూ కఠెవరం పొలాల వైపు వచ్చి బహిర్భూమికి వెళ్లి రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శిక్షణలో నేర్పించే అంశాలు
● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. ● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ -
జగనన్న హయాంలోనే పేదల జీవితాల్లో వెలుగులు
వేటపాలెం: రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని చీరాల వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధిలోని ఆణుమల్లి పేట, చిన్నబజార్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. అయన వెంట పార్టీ నాయకులు, పార్టీ శేణులు భారీ ఎత్తున అనుసరించారు. ప్రతివీధిలో పూలుజల్లుతూ వెంకటేష్కి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాల వల్ల నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈనెల 13న జరగబోవు ఎన్నికల్లో ఫాన్ గుర్తుపై ఓటు వేసి తనకు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్ కందేటి రమణ, మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామహాలక్ష్మి, కంచి సాంబిరెడ్డి, పిన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డి, అందె కృష్ణ, బుద్ధి రవి, మిరియాల రాఘవయ్య, కర్పూరపు రమాదేవి, నర్మదా ప్రశాంతి, కట్ట జార్జి శ్యామేలు, జమ్మి ప్రసాద్రెడ్డి, జిడుగు మస్తాన్, ప్రతి వెంకట సుబ్బారావు, చుండూరి వెంకట రమణ, రాజశేఖర్, బండి కళ్ల నరేష్, చిట్టిబాబు, దావీదు, పింజల శంకర్రావు, బొడ్డుకోట సుబ్బారావు, మధుర రివి నజ్మా, కప్పల హేన్నా కార్యకర్తలు పాల్నొన్నారు. గెలిపించండి.. మరింత అభివృద్ధి చేస్తా వైఎస్సార్ సీపీ చీరాల అభ్యర్థి కరణం వెంకటేష్ చిన్నబజార్, ఆణుమల్లిపేటలో ఎన్నికల ప్రచారం అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు -
సంక్షేమ ప్రభుత్వాన్ని సాధించుకుందాం
యద్దనపూడి: పేదల వైపు జగనన్న అండగా ఉంటే, పెత్తందారుల వైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా, బీజేపీ అండగా ఉన్నాయి.. అందుకే పెత్తందారులను సాగనంపి మరోమారు సంక్షేమ ప్రభుత్వాన్ని సాధించుకుందామని పర్చూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి, యద్దనపూడి, గన్నవరం, వింజనంపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావుతో కలిసి యడం బాలాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని అలివి కాని హామీలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి తమ్మా అమ్మిరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలెపోగు రాంబాబు, ఎంపీపీ పులగం రజినీ, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా బ్రహ్మానందం, జంపాని కోటేశ్వరరావు, మువ్వల రాంబాబు, సన్నేబోయిన వెంకటప్పయ్య, రావూరి వేణుబాబు, నక్కా పోతిరెడ్డి, మానుగొండ శ్రీనివాసరెడ్డి, చిలుకూరు కృష్ణయ్య, ధూలిపాళ్ల వేణు, చెరుకూరి వేణు, తూబాటి బాలకృష్ణ, సర్పంచ్లు ఎమేలమ్మ, సుమలత, ఆయా గ్రామాల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి -
కూటమి కుతంత్రంతో సంక్షేమ పథకాలు రద్దు
కూచిపూడి(వేమూరు) : పేదలకు వైఎస్సార్ సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల్ని తెలుగుదేశం పార్టీ కూటమి కుతంత్రాలతో రద్దు చేయిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు రావెల కిశోర్బాబు ధ్వజమెత్తారు. అమర్తలూరు మండలంలోని కూచిపూడి గ్రామ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేస్తే పథకాల్ని రద్దు చేస్తుందని ప్రజల్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డిని ఓడించేందుకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి చేస్తున్న ప్రయత్నాలు, మాయ మాటల్ని నమ్మవద్దని ఆయన సూచించారు. నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంతా అభూత కల్పనని కొట్టిపారేశారు. గత ఎన్నికల్లోనూ అమలు చేయని మేనిఫెస్టోతో మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు యుద్ధం లాంటివని పేర్కొన్నారు. పెత్తందారుల, పేదల మధ్య జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని అశోక్బాబు స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలన సాగించారన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్, వేమూరు అసెంబ్లీ అభ్యర్థి వరికూటి అశోక్బాబును గెలిపించాలని అశోక్బాబు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొలకలూరు కోటేశ్వరరావు, అత్తోట జోసఫ్, నియోజక వర్గం ఎన్నికల అధికారి బసవ పున్నారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యలవర్తి సురేష్, బొల్లిముంత ఏడుకొండలు, ఎంపీపీ రాపర్ల నరేంద్ర, గాజులవర్తి సుధీర్, పెరికల పద్మారావు, మోదుకూరి హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు రావెల కిశోర్బాబు -
74 శాతం ఉద్యోగస్తులు ఓటుహక్కు వినియోగం
బాపట్ల: ఎన్నికల విధుల్లో ఉండి అంతర్ జిల్లాలో ఓటుహక్కు కలిగిన ఉద్యోగులు మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 3531 మంది ఓటర్లు ఓటు పొందేందుకు నమోదు చేసుకోగా 2605మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1607మంది కాగా, మహిళలు 998మంది ఉన్నారు. 74శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్ బాషా తెలిపారు. తొలుత ఆయన బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం రేపల్లె ఆర్డిఓ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, రేపల్లె ఆర్డీఓ హేలా షారోన్ ఉన్నారు. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
రేపల్లె రూరల్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా, సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. రేపల్లె పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సరళిపై సంబంధిత అధికారులు, పీవోలు, ఏపీవోలకు దిశా నిర్దేశంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. గత ఎన్నికల అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అల్లర్లు జరిగిన గ్రామాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని గుర్తించి ఎన్నికల కమిషన్కు నివేదించామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక పోలీసు బలగాల పహారాతో పాటు ఓటింగ్ సరళిని లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బుధవారం వరకు అవకాశం కల్పించామని తెలిపారు. అనంతరం ఆర్వో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని, మండలంలోని పేటేరులోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఆయన వెంట రేపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెలా షారోన్ తదితరులున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్ బాషా -
వేమూరులో ఫ్యాన్ ఫుల్ స్పీడ్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సమర్థపాలనతో పాటు పేదల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు.. సమన్యాయం కోసం సామాజిక సమీకరణలకు పెద్దపీట.. బలహీనవర్గాలకు పదవులు, పాలనలోనూ ప్రాధాన్యత.. సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన తీరు ఇది. ఆయన జనరంజక పాలనలో అర్హులైన అన్ని వర్గాల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన లభించింది. అటు సమాజంలోనూ గౌరవస్థానం పొందారు. దీంతో ప్రజలంతా ఈ ఎన్నికల్లో సామూహికంగా ఓట్లేసి తిరిగి వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలనను తెచ్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలోనూ పరిస్థితులు దీనికి అద్దంపడుతున్నాయన్నది పరిశీలకుల మాట. వరికూటి విజయం ఖాయం వేమూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్బాబు టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు పోటీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన వేమూరులో గత ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు పేదలు సంక్షేమ పథకాల ద్వారా పెద్దఎత్తున లబ్ధి పొందారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగారు. అందరికీ సమ అవకాశాలు దక్కాయి. ఇవన్నీ అధికార పార్టీ అభ్యర్థి విజయానికి దోహద పడనున్నాయని అంచనా. వరికూటి అనుకూలతలు వేమూరుకు కొత్త అభ్యర్థిగా వరికూటి అశోక్బాబును అధికారపార్టీ ఎంపికచేయడం కలిసి వచ్చిన అంశం. హుషారుతనం, కలుపుగోలుగా ఉండటం, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లడం, మార్నింగ్ కాఫీ కార్యక్రమంతో ఉదయాన్నే జనంలోకి వెళ్లడం, కార్యకర్తలతోపాటు ఓటర్లను ఆప్యాయంగా పలకరించడం ఆయనకు తక్కువ సమయంలోనే మంచిపేరు తెచ్చింది. అవసరాన్ని గుర్తించి పేదల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. నియోజకవర్గంలోని చుండూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, కొల్లూరు మండలాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లను సొంత డబ్బులు వెచ్చించి మరమ్మతులు చేయించడంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వరికూటిని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ సుమారు 80 వేల పైచిలుకు ఉన్న ఎస్సీ సామాజికవర్గం ఓటర్లలో అత్యధిక శాతం వైఎస్.జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా నిలవనున్నారు. వీరితో పాటు రెడ్డి, ముస్లిం, బీసీ వర్గాల ఓటర్లు సైతం అధికార పార్టీకి అండగా నిలువడం ఈ ఎన్నికల్లో వరికూటి అశోక్బాబుకు మరింతగా కలిసిరానుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అక్రమాలే టీడీపీ అభ్యర్థి ప్రతికూలతలు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు అక్రమాలు ఆయనకు ప్రతికూలతగా మారిందన్నది పరిశీలకుల అంచనా. గుంటూరులో విలువైన ఆంధ్ర లూథరన్ ఆస్తుల్ని 99 సంవత్సరాల లీజు పేరుతో కొట్టేసి కోట్లాది రూపాయల్ని ఆర్జిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గుంటూరు నాజ్ సెంటర్లో గుంట గ్రౌండ్కు చెందిన 25 ఎకరాల స్థలాన్ని లీజుపేరుతో కొట్టేసి ఎగ్జిబిషన్లు, కూటమి మీటింగులు, సభలు, సమావేశాలకు ఇచ్చి కోట్లు గడిస్తున్నారు. ఇక్కడే కుగ్లర్ ఆసుపత్రికి చెందిన 7.50 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని నర్సింగ్ కాలేజీ నడుపుతున్నారు. కొంత స్థలంలో ఏకంగా అపార్ట్మెంట్ లేపారు. గుంటూరు అరండల్ పేటవద్ద ఉన్న స్థలాన్ని లీజుకు దక్కించుకొని నాగార్జున గ్రాండ్ పేరుతో హోటల్ నిర్మించి నడుపుతూ పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారు. దీంతో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పైగా ఆయన గుంటూరులో ఉంటూ వేమూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో పలు మండలాలకు చెందిన పలువురు నేతలు ఆనందబాబు వ్యవహార శైలి నచ్చక అసంతృప్తితో ఉన్నారు. వీరిలో చాలామంది ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాలనలో లబ్ధి పొందిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లేసి తిరిగి వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అశోక్బాబును వేమూరు శాసనసభ్యుడిగా గెలిపించనున్నారన్నది పరిశీలకులు అంచనా. గెలుపుబాటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరికూటి అశోక్బాబు సీఎం వైఎస్.జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల నుంచి సానుకూలత సంక్షేమ పథకాలతో పేదల ఆర్థికాభివృద్ధి సామాజిక సమీకరణలకు పెద్దపీట టీడీపీ అభ్యర్థికి ప్రజల నుంచి వ్యతిరేకత ఆంధ్రా లూథరన్ ఆస్తులు కొల్లగొట్టాడన్న ఆరోపణలు కేడర్ను పట్టించుకోని వైనం తిరిగి వైఎస్.జగన్ పాలన కోరుకుంటున్న ప్రజలు -
ఎన్నికల కమిషన్ ‘బాబు కమిషన్’గా మారిపోయింది
ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: ఆంధ్రప్రదేశలో ఎన్నికల కమిషన్ బాబు కమిషన్గా మారిపోయిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. స్థానిక కోన చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల్ని మన రాష్ట్రంలో మాత్రం నిలుపుదల చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఆసరా పథకం నాలుగో విడత విడుదల చేసి 74శాతం పంపిణీ చేయగా మిగిలిన 26 శాతం నిలుపుదల చేయడం దుర్మార్గమైన విషయమని ఖండించారు. ఫీజురీయింబర్స్మెంట్ను కూడా నిలుపుదల చేయడం వల్ల విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొన్నిచోట్ల విద్యార్థులు పరీక్షలకు కూడా వెళ్లకుండా కళాశాలలు అడ్డుకుంటున్నాయని కోన రఘుపతి వెల్లడించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా నిలుపుదల చేయించారని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని తెలియజేశారు. ఫించన్ల పంపిణీలోనూ తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరితో ఎంతో మంది అవ్వాతాతయ్యలు ఇబ్బందులు పడ్డారని కోన గుర్తు చేశారు. ఎండలో వృద్ధుల్ని కష్టపెట్టిన పాపం చంద్రబాబు టీంకు తగులుతుందని తెలిపారు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని కోన రఘుపతి కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, కోకి రాఘవరెడ్డి, కృష్ణ గుప్తా పాల్గొన్నారు. -
పేదల పక్షపాతి జగనన్న గెలుపు తథ్యం
రేపల్లె రూరల్: పేదల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి నందిగం సురేష్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పేటేరులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఎక్కడ ప్రచారం నిర్వహించినా తరలివస్తున్న అశేష జనవాహినిని చూస్తుంటే 2024 ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రిగా జగనన్నను చూడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. నవరత్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ప్రజల్ని మరోమారు మోసగించేందుకు అమలు చేయలేని హామీలతో కూటమితో వస్తున్న చంద్రబాబును, ఆయన భజన బృందాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. గత ఐదేళ్లలో నవరత్న పథకాల ద్వారా ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో పాటు జగనన్న ప్రకటించిన మేనిఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ కుమారుడు సృజన్, వైఎస్సార్ సీపీ గ్రామ ఇన్చార్జి కనపర్తి రవికిరణ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రావు ప్రభాకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేటేరు గ్రామ ప్రచారంలో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ -
సైకిల్కు త్వరలో పంక్చర్ ఖాయం
సంతమాగులూరు (అద్దంకి): సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడుతో టీడీపీ సైకిల్కు పంక్చర్ పడక తప్పదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మండలంలోని పుట్టావారిపాలెం (అడ్డరోడ్డు), పాతమాగులూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు కై పు మహేశ్రెడ్డి, కై పు సుష్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గ్రామానికి వచ్చిన ప్రియతమ నాయకుడికి ప్రజలు డప్పు వాయిద్యాలతో పూల జల్లుతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వంలో ఎవరికేమి మేలు జరిగిందో వివరిస్తూ, చిన్న పిల్లలను, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా హనిమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వపాలనకు ప్రజలే తేడా చెప్తున్నారన్నారు. దాంతో వారంతా వై.ఎస్.జగన్ మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అయితే వారి గుండెల్లో గుడికట్టుకున్న వ్యక్తి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఒంటరి పోరాటమే ఆయన నిజాయతీకి, తాను అందించిన పాలన పట్ల ఉన్న విశ్వాసమన్నారు. అబద్ధాలు చెప్పడం చేతనైతే ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవారని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ వంటి ప్రజాకర్షక పథకాలు వినడానికి తప్ప అమలు చేయడానికి సాథ్యం కానివన్నారు. గతంలో చంద్రబాబు మోసాలు తెలిసిన వారెవరూ ఆ పథకాలు నమ్మడం లేదని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే పథకాలతో ప్రజారంజకంగా సాగిన వైఎస్సార్ సీపీ పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పా రు. ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికల్లో అద్దంకిలో తనను, బాపట్ల ఎంపీగా నందిగం సురేశ్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ మోసమే వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
విశాఖకే జై కొట్టిన టిడిపి
రాసలీలల రామ్మోహన్!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement