-
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
భోగాపురం: మండలంలోని అమటాం రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరాములు (60) విజయనగరం ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దల్లిపేటకు చెందిన దల్లి అప్పలరాములు భార్య ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటినుంచి మద్యానికి బానిసైన అప్పలరాములు మంగళవారం ఉదయం అనుకోకుండా ఫినాయిల్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఆయన చెల్లి నరసయ్యమ్మ అన్న పరిస్థితి చూసి స్థానికుల సహాయంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు దల్లి ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. -
అంతన్నాడు..ఇంతన్నాడు..!
ప్రజల కష్టాలు తీరుస్తా..స్వర్ణాంధ్రప్రదేశ్ను నిర్మిస్తా..రైతులు, డ్వాక్రా మహిళలకు అప్పు లేకుండా చేస్తా..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చేలా చేస్తా..నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా..లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా..ఈ హామీలన్నీ వింటే ఠక్కున గుర్తొచ్చేది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. సరికదా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేసేలా చేసి నానా ఇక్కట్లకు గురిచేసిన పాలనను ఇంకా మేం మర్చిపోలేదని, మరోసారి ఆ పాలన వద్దు బాబూ అంటూ రాష్ట్రప్రజలు ఉలిక్కిపడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన చంద్రబాబు ప్రభుత్వ పాలన ఇప్పటికీ పీడకలలా వస్తూనే ఉందని వాపోతున్నారు. బాబుపై నమ్మకం లేదు.. చంద్రబాబు ఏమి చెప్పినా నమ్మడం సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే పింఛ న్ రూ.4 వేలు అంటున్నా డు. దాని అమలు కోసం అనేక నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లు ఎన్ని ఊడుస్తాడో తెలియదు. సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నా క్రమం తప్పకుండా ఠంచన్గా ఒకటో తేదీనే వలంటీర్ ఇంటి తలుపుతట్టి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో రూ.500 పెంచుతానని చెప్పాడు. జగన్ చెప్పాడంటే..చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. –బి. రాము, పింఛన్ లబ్ధిదారు, పార్వతీపురం పట్టణంపార్వతీపురంటౌన్: ఇష్టారాజ్యంగా హామీలిచ్చేసి, గద్దెనెక్కిన తర్వాత నమ్మి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను నిలువునా ముంచేయడం ఎలా అన్న విషయం ఆయన గత పాలన చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. పొరపాటున అధికారంలోకి వస్తే. ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచేసి, అన్నీ అమలు చేశానని బుకాయించడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ తెలియదేమో! అందుకే బాబు నోటి నుంచి ఏది వస్తుందో అది చేయరు అన్న విషయం ప్రజల మదిలో నాటుకుపోయింది. నిన్నెలా నమ్మాలి బాబూ..! ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లాలో పలు చోట్ల సభలు నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఊదరగొట్టారు. అయితే, వారి మాటలు ఎవరూ నమ్మడం లేదన్న విషయం తండ్రీకొడుకులకు బోధపడింది. ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్ రూ.3 వేలు ఇస్తోంది. తాను రూ.నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నా కనీసం దానిపై ప్రజల్లో చర్చ జరగడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలతో టీడీపీ అభ్యర్థులు జిల్లాల్లో ఇంటింటికీ తిరుగుతున్నా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్కు మరో నాలుగు రోజులే గడువు ఉండడం, బాబు హామీలను ప్రజలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. గుణపాఠం చెప్పినా అదే తీరు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్క దాన్ని కూడా సరిగ్గా నెరవేర్చిన పాపాన లేదు, దీంతోనే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి ‘నిన్ను నమ్మం బాబు’ అని స్పష్టం చేశారు. అయినా, గతం మరిచి నేడు మళ్లీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను భయాందోళనకు గురి చేసైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో, బాబు ఇచ్చిన ఆదేశాలతో పచ్చమూకలు దాడులకు దిగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, టీడీపీ కుయుక్తులను గమనిస్తున్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దిమ్మతిరిగే సమాధానం చెబుతారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. గతాన్ని మర్చిపోలేం కొత్త హామీలు నమ్మలేం చంద్రబాబు గత పరిపాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు అధికారంలోకి వస్తే ఉన్న పథకాలను ఎత్తేస్తారని ఆందోళన ఇప్పటికే కక్షగట్టి పింఛన్లు నిలిపేశారని అవ్వాతాతల ఆగ్రహం బాబును నమ్మలేమంటున్న మహిళలు ప్రజల్లో వ్యతిరేకత గమనించి ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ ఉన్నవే రాకుండా చేసి..కొత్తగా ఏమిస్తారు? జిల్లాలో 1.48 లక్షల మంది వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీనే వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి డబ్బు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ విషయంపై ఇప్పటికే వృద్ధులు, సామాన్య ప్రజానీకం తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్లకు ఎంతో స్వాంతన చేకూరుస్తున్న వలంటీర్ వ్యవస్థనే ఆపేయించిన బాబు..కొత్తగా రూ.4 వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ పెంచుతానన్న హామీతో కరపత్రాలు ఇస్తుంటే వాటిని వెంటనే చెత్తబుట్టలో విసిరేస్తున్నారు. జన్మభూమి కమిటీల పాలన వద్దే వద్దు టీడీపీకి పొరపాటున ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు కొని తెచ్చుకున్న ట్టే. అప్పట్లో ఏ పథకం కావాలన్నా ఆ కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చే ది. ఆ సమయంలో వారు ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే భయమేస్తోంది. చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటైన ఈ కమిటీలు పేద ల రక్తాన్ని పీల్చాయి. ఆ పాలన మళ్లీ కావాలని కోరుకోవడం లేదు. –పి.రాముడమ్మ, పింఛన్ లబ్ధిదారు, పార్వతీపురం పట్టణంపీడకలలా జన్మభూమి కమిటీలు పెట్టిన కష్టాలు 2014–19 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలను తెచ్చి పల్లెల్లో నిప్పులు పోశారని, ఏ ఒక్కరికీ లబ్ధి కలగకుండా చేశారని గ్రామీణులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వచ్చి జన్మభూమి కమిటీలు ప్రవేశపెడితే తమ బతుకులు ఎంత దుర్భరంగా మారతాయోనని పేదప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా నేరుగా వలంటీర్లే ఇంటికొచ్చి పథకాల గురించి చెప్పి, అర్హులైన వారికి లబ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉన్న ఊరిలోకే పాలన వచ్చింది. కానీ, బాబు వస్తే ఇవన్నీ అమలు చేయరేమోనన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బాబుకు బుద్ధి చెబుదాం ప్రతినెలా వలంటీర్ ఇంటి కి వచ్చి నాకు రూ.3 వేలు పింఛన్ ఇచ్చేవాడు. చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడంట. దీంతో రెండు నెలలుగా పింఛన్ సరిగా అందలేదు. పేదలను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఆయన మాటలను నమ్మితే ప్రజలు మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. –జె.ఎల్లయ్య, పింఛన్ లబ్ధిదారు, పార్వతీపురం పట్టణం -
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు గుమ్మలక్ష్మీపురం: ఓటు హక్కును అర్హులైన ప్రతిఒక్కరూ వినియోగించు కోవాలని ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. ఈమేరకు బుధవారం ఆయన గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం కీలకమైన ఎన్నికల ఘట్టంలో ఉన్నామని ఓటర్లంతా చైతన్యవంతులై ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ ఓటు హక్కు కల్పించడం పట్ల అప్పట్లో ప్రపంచ మేధావులంతా ఎన్నికలు మనలేవని హేళన చేశారని, కానీ వారి ఆలోచనలకు భిన్నంగా నేడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటుండడం శుభపరిణామమ న్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ఓటర్లంతా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎస్టీ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం కుదరలేదని, అయినా ఫోన్ల ద్వారా, మీడియా ద్వారా వచ్చిన గిరిజనుల సమస్యలపై దృష్టిసారించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు దన్నుగా ఎస్టీ కమిషన్ ఉందన్న విషయాన్ని గిరిజనులంతా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్కు వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు, స్థానిక పెద్దలు భోగాపురపు నాగు, బోటు లక్ష్మీనారాయణ, వహీద్ఖాన్, మద్ది దొరబాబు, మురళి తదితరులు స్వాగతం పలికి దుశ్శాలువాతో సత్కరించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన పలువురు నాయకులు
సాలూరు: మండలంలోని పెదపధం పంచాయతీకి చెందిన పలువురు నాయకులు, ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరారు. పంచాయతీకి చెందిన సుమంతల వెంకట్రావు, నందేల శ్రీధర్, అల్లు తిరుపతి, అప్పలనాయుడు, గౌరమ్మ, విజయ, బొమ్మి శేషగిరి తదితరులు వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, వైస్ఎంపీపీ రెడ్డి సురేష్ల ఆధ్వర్యంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాలకేంద్రానికి వెళ్లిన వారిని, రామమందిరం వద్ద కూర్చుని ఉన్న వారిని టీడీపీ వాళ్లు పిలిచి మాయమాటలు చెప్పి ఆ పార్టీ కండువాలు వేశారని, మేమంతా వైఎస్సార్సీపీయేనని పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే మళ్లీ వైఎస్సార్సీపీలో చేరామని వివరించారు. మలేరియా నిర్మూలనకు విస్తృత చర్యలుసీతంపేట: మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా నివారణాధికారి జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు సీతంపేట మండలంలోని దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి అక్కడి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ల్యా బ్ రికార్డులు తనిఖీ చేసి, జ్వరాలు ఏ మేరకు నమోదవుతున్నాయో పరిశీలించారు. జ్వర లక్షణాలు న్న వారికి సత్వరమే రక్తపూతలు సేకరించి నివేదికలు తెలియజేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల్లో చిన్న ఆరో గ్య సమస్య లున్నా వెంటనే హైరిస్క్గా పరిగణించి తగు చికిత్సలు అందజేయాలని కోరా రు. కిల్కారీ వాయిస్ వినిపించాలని చెప్పారు. రక్తహీనత నివారణపై దృష్టిపెట్టాలని, గ్రామాల్లో డ్రై డే కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంవో సూర్యనారాయణ, వైద్యాధికారి గిరీష్, సూపర్వైజర్ ధమయంతి, గంగమ్మ పాల్గొన్నారు. ఆటోబోల్తా: నలుగురికి గాయాలుసీతంపేట: మండలంలోని జజ్జువ సమీపంలో బుధవారం ఆటో బోల్తాపడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. తమ గ్రామం నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి పాలకొండకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నిమ్మక మాణిక్యం, నారాయణమ్మ, సవర సూ రయ్య, రామారావులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఏరియా ఆస్ప త్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఒకరిని, శ్రీకాకుళం రిమ్స్కు మరొకరిని రిఫర్ చేశారు. మిగతా ఇద్దరు కోలు కున్నట్లు ఏఎస్సై సంజీవరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలుండకూడదు● ఆర్ఓ విష్ణుచరణ్ సాలూరు: ఎన్నికల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఐటీడీఏ పీఓ, సాలూ రు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విష్ణుచరణ్ అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాన్ని బుధవారం ఆయన పరి శీలించారు. ఎన్నికల సిబ్బందికి మంచినీరు, అల్పాహారం, భోజనం తదితర పంపిణీ కౌంటర్లపై ఆరా తీశారు. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడ ఎన్నికల సామగ్రి తీసుకోవాలనే అంశంపై సందేహాలకు తావులేకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ను ఆయన పరిశీలించారు. హోమ్ ఓటింగ్ బ్యాలెట్లను సీల్ చేశారు. -
నేటితో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరి
● నాల్గవ రోజు ప్రశాంతం పార్వతీపురంటౌన్: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బుధవారం నాల్గవరోజు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పోలీసు సిబ్బంది, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. పార్వతీ పురం మన్యం జిల్లాలో ఓటు కలిగి ఉండి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వారి సొంత నియోజకవర్గ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పార్వతీపురంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు విని యోగించుకున్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మరోరోజు పొడిగిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ ప్రకటించారు. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో, 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోస్ట ల్ బ్యాలెట్ ఓటింగ్ చేసే వెసులు బాటు కల్పించిన ట్లు కలెక్టర్ నిషాంత్కుమార్ పేర్కొన్నారు. -
లలితమ్మా నీకో దండం..!
ఒకటి కాదు రెండు కాదు ఆమె పదేళ్లు పదవిలో ఉన్నారు.. ఏదో చేస్తారని ఆశించి ప్రజలు పట్టం కట్టారు. ‘కోట’ను అభివృద్ధి చేయాలని పదేపదే విన్నవించారు. ఆ పార్టీ పెద్దలు సైతం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచాయే తప్ప ఒక్క అభివృద్ధి పనీ తలపెట్టలేదు. ఒక్క కుటుంబానికి కూడా సరిగా ‘సంక్షేమం’ అందజేయలేదు. అన్నా.. తమ్ముడూ.. బావా.. మరిదీ.. అక్కా.. చెల్లీ అంటూ తీపిమాటలు వడ్డించడమే తప్ప మనసుపెట్టి ప్రజలకు మేలు చేయడం ఆమెకు తెలియదు. అందుకే.. ఇప్పుడు ఎస్.కోట ప్రజలందరూ ఆమెకో దండం అంటూ ఛీత్కరిస్తున్నారు. చాలుచాలు మీ పాలన అంటూ మోహం మీదే చెబుతున్నారు.ఎస్.కోట నెట్వర్క్: నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి.. ఎమ్మెల్యే. ఆ పదవిలో ఉన్నవారు కృషి చేస్తే.. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ముఖచిత్రమే మారిపోతుంది. అయితే... ఎస్.కోట ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు పని చేసిన కోళ్ల లలితకుమారి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడితే.. ప్రతిష్టను దిగజార్చారన్నది ఇక్కడి జనం మాట. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా ఆమె చేసినది శూన్యమన్న మాటే వినిపిస్తోంది. పదేళ్ల ఎమ్మెల్యే పదవిని ఆస్తులు కూడబెట్టేందుకే వినియోగించుకున్నారన్న అపవాదు ఉంది. ఓట్ల చీలికతో పదవి దక్కినా.. ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఏదో ఉద్ధరిస్తానంటూ ఎన్నికల ప్రచారానికి ఊరూరా తిరుగుతున్న ఆమెను జనం ఛీత్కరిస్తున్నారు. చేసినది చాలు అంటూ మొహంచాటేస్తు న్నారు.. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో మాకు తెలుసు అంటూ చెబుతుండడంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో అనవసరంగా బరిలో దిగామంటూ పలువురి వద్ద నిట్టూర్చుతోందట. మామ పేరు చెప్పినా ప్రజలు హర్షించడంలేదంటూ వాపోతున్నట్టు సమాచారం.కోళ్ల పాలనలో ప్రగతి సున్నా...👉 విశాఖ–అరకు రోడ్డును అభివృద్ధి చేస్తాం, అరకును ఆంధ్రా ఊటీ చేస్తామంటూ చంద్రబాబుతో కలిసి కోళ్ల లలితకుమారి చెప్పిన మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. విశాఖ–అరకు రోడ్డుపై కనీసం గోతులు పూడ్చలేకపోయారు.👉 వేపాడ మండల ప్రజల రాకపోకలకు ఆధారమైన సోంపురం–ఆనందపురం రోడ్డు రాళ్లుతేలి గాత లు, గోతులు మయమైనా ఏనాడూ ఒక్క రూపా యి ఖర్చుచేసి అభివృద్ధి చేయలేదు. జనం కష్టాలను ఆమె పట్టించుకోలేదన్నది ఇప్పటికీ ఈ ప్రాంతీయులు విమర్శిస్తారు.👉 ఏడు మండలాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేస్తానంటూ ఉత్తుత్తి ప్రసంగాలకే ఆమె పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేకపోయారు.👉 మండలాల్లోని పీహెచ్సీల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది, మందుల నిల్వలపై కనీసం ఆలోచన కూడా చేయలేదు.👉 జామి, లక్కవరపుకోట మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్ కళాశాలలు తెస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేశారే తప్ప విద్యార్థుల చదువు కష్టాలు పట్టించుకోలేదు.👉 రోడ్డు సదుపాయం లేక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడినా పదేళ్ల లో ఒక్కటంటే ఒక్క రోడ్డు మార్గాన్నీ పూర్తిగా నిర్మించలేదు.👉 ఇళ్లు, మరుగుదొడ్లు, రైతు రథాలు, పింఛన్లు ఇలా.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదేమటని ఎమ్మెల్యే వద్ద ప్రాథేయపడినా కనీసం పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల వసూళ్లలో ఆమెకూ వాటా చేరడమే దీనికి కారణమన్నది జనం మాట.👉 వేపాడ మండలంలోని మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట రోడ్లకు అటవీశాఖ అనుమతులు తేవడంలో లలితకుమారి విఫలమయ్యారు.అభివృద్ధి అంటే ఇదే కదా... సమస్యల కోటగా పేరుపడిన శృంగవరపుకోటలో 2019లో వైఎస్సార్సీపీ జెండాను ప్రజలు ఎగురవేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అంతే.. కేవలం 59 నెలల జగన్మోహన్రెడ్డి పాలనలో ఎస్.కోట ప్రగతి పట్టాలెక్కింది. సంక్షేమ, అభివృద్ధిపాలన చేరువైంది. ఇంటింటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. 👉జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ–అరకు రోడ్డుకు జాతీయ హైవేగా గుర్తింపు తీసుకొచ్చారు. అభివృద్ధికి నాంది పలికారు. అర్ధంతరంగా వదిలేసిన బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణాలను రూ.9కోట్ల ఖర్చుతో పూర్తిచేశారు. 👉 రూ.39 కోట్ల ఖర్చుతో సోంపురం–ఆనందపురం రోడ్డును అభివృద్ధి చేశారు. 👉ఎస్.కోటలో ఉన్న 30 పడకల సీహెచ్సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా స్థాయిపెంచారు. రూ.12.60 కోట్లతో ఆస్పత్రికి కావాల్సిన హంగులు కల్పిస్తున్నారు. 👉 నియోజకవర్గంలోని 7 పీహెచ్సీల కొత్త భవనాలు, ఆధునీకరణకు రూ 8.25 కోట్లు కేటాయించడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీహెచ్సీల్లో రెండో వైద్యాధికారిని నియమించి నిరంతర వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. 👉ఎస్.కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ హైసూ్కల్లో బాలికల జూనియర్ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి ఇంటరీ్మడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల స్కూళ్లను నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. 👉 జల్జీవన్ మిషన్ కింద రూ.200 కోట్ల ఖర్చుతో 137 గ్రామాలకు ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి. 👉 నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఒక్కో లబి్ధదారుకు రూ. 1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధు చొరవతో వేపాడ మండలం మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట గిరిశిఖర గ్రామాలకు అటవీశాఖ అనుమతులతో రోడ్లు పనులు చకచకా సాగుతున్నాయి. 👉నియోజకవర్గంలో కేవలం 59 నెలల పాలనలో రూ.750 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాగా, వివిధ సంక్షేమ పథకాల కింద 70,291 మందికి రూ.2,335 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 👉 విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో నియోజకవర్గ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశిస్తున్నారు. -
ఎన్నికల కమిషన్ పక్షపాతం
మక్కువ: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరి స్తుందని, ఐవీఆర్సర్వే ద్వారా ప్రచారం చేసినా, టీడీపీ నాయకులు దారుణంగా మాట్లాడుతు న్నా పట్టించుకోవడంలేదు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలను గమనించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర కోరారు. ఈ మేరకు మక్కువ మండలంలోని ఎన్. కె.గైశీల గ్రామంలో మంగళవారం మంత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ 14ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబునాయుడు, తమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇంతవర కు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొత్త పథకాలైతే అడ్డుకోవాలి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్గా అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పలు సంక్షేమ పథకాలను ఎలక్షన్ కమిషన్ నిలిపివేసింద ని విమర్శించారు. కొత్తగా పథకాలు అందిస్తే అడ్డుకోవాలని, గత ఐదేళ్లుగా ప్రజలకు అందిస్తున్న పథకాలను అడ్డుకోవడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మూడురోజుల ముందు పసు పు, కుంకుమ పథకం అందించిందని, అప్పట్లో ఎందుకు ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. రైతుల కు ప్రభుత్వం ధాన్యం నగదు అందించలేదని ఐవీ ఆర్ఎస్ ద్వారా ప్రతిపక్షాలు లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్రె డ్డి ఫొటోను కాల్చివేసినా, సీఎం జగన్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, టీడీపీ నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ తమ హక్కులను సక్రమంగా నిర్వహించడం లేదని డిప్యూటీసీఎం రాజన్నదొర ఆవేద న వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై పెట్టిన కేసులపై సీఐడీ అధికారులు త్వరితిగతిన నిగ్గుతేల్చాల ని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడు మావుడి శ్రీని వాసరావు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మావు డి రంగునాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు దారుణంగా మాట్లాడినా చర్యలేవీ? గతంలో టీడీపీ పసుపు, కుంకుమకు అనుమతి ప్రస్తుతం వైఎస్సార్సీపీ పథకాల అడ్డగింత మీడియాతో డిప్యూటీ సీఎం, సాలూరు అసెంబ్లీ అభ్యర్థి రాజన్నదొర -
ఈదురు గాలుల బీభత్సం
గుమ్మలక్ష్మీపురం: మండలంలో మంగళవారం వేకువజాము నుంచే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల మండలంలోని ఆలవడ్డ గ్రామంలో పత్తిక ముసురమ్మ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే వామాసి గ్రామంలో కూడా ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. గోరటి గ్రామంలో నిలిపి ఉన్న ద్విచక్రవాహనాలు గాలిధాటికి పడిపోవడంతో పాటు గ్రామంలోని నలుగురి ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. లప్పటి గ్రామంలో రైతు మల్లేష్ పాకపై విప్ప చెట్టు కొమ్మ పడటంతో పాక కూలిపోయింది. సీతంపేటలో భారీ వర్షం సీతంపేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ వర్షంతో జీడి,మామిడి తోటలకు నష్టం ఏర్పడిందని గిరిజన రైతులు తెలిపారు. ఊరటనిచ్చిన వర్షం పాలకొండరూరల్: వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. సగటున రోజుకు 44డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఈ వర్షాలతో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఖరీఫ్ దగ్గరపడుతుండడంతో ఈ వర్షాలు రైతులకు అనుకూలంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
● మూడవ రోజు వినియోగించుకున్న ఉద్యోగులు 1422 మంది ● రెండవ రోజు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న వారు 201 మందిపార్వతీపురం టౌన్: ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మంగళవారం మూడవరోజు ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో సౌకర్యాలను కల్పించడంతో ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్తో కలిసి సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రమోద్ కుమార్ మెహర్దా మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్లకు అందుతున్న సహకారం, జాబితాలో ఓటరు పేరు ఉన్నది లేనిది తనిఖీ చేశారు. తరువాత పోలింగ్ సరళి, బ్యాలెట్ పేపర్లు, కవర్ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్ ఏర్పాటును నిశితంగా గమనించారు. ఎన్నికల కమిషన్ కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వివిధశాఖల ఉద్యోగులు వినియోగించుకోవాలని పరిశీలకుడు కోరారు. ఈ పరిశీలనలో పార్వతీపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు. మూడవ రోజు ఓటింగ్ ఇలా తొలి రెండు రోజులు 5812 మందిఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముడవరోజు 1422 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో రోజు హోమ్ ఓటింగ్ ప్రతి నియోజకవర్గంలో పది టీమ్లతో హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ పకడ్బదీగా నిర్వహించింది. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఈ వెసులుబాటును 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 592 హోమ్ ఓటింగ్కు అర్హులు ఉండగా రెండురోజుల్లో 516 మంది వినియోగించుకున్నారు. తమకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించినందుకు ఎలక్షన్ కమిషన్కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. నేటితో పూర్తి కానున్న ఓటింగ్ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం బుధవారంతో పూర్తి కానుంది. ఉద్యోగులకు మే 5,6 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు సమర్పించి ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేని వారి అభ్యర్థన మేరకు మరో రెండు రోజులు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. -
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రజల కోసమే..పదవిమా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.సంపూర్ణంగా మహిళా సాధికారత2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్కార్డులు, ఆధార్ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..అభివృద్ధి అంటే ఇది కాదా?59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్గ్రేడ్ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధిసీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు. -
విజయం మీదే..!
● ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఓటర్ల హామీ..సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల పాటు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఓటర్లతో మమేకమవుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే నవరత్నాలు ప్లస్2 మేనిఫెస్టోను మాట తప్పకుండా అమలు చేసి, పేదల కళ్లలో సంతోషం విరబూయిస్తామని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లు కూడా మీ వెంటే మేముంటామంటూ అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ -
పేదలకు ఉచితంగా.. కార్పొరేట్ విద్య
● ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం పార్వతీపురం: ఉన్నత వర్గాల వారి పిల్లలకే పరిమితమైన ప్రైవేట్ పాఠశాలల విద్యను నేడు ప్రభుత్వం పేద పిల్లలకు సైతం చేరువ చేస్తోంది. ఎలాంటి ఖర్చులేకుండా 1వ తరగతి నుంచి పదోతరగతి వరకు ఖరీదైన, నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ప్రతి ఏటా జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లు పేదవారికి కేటాయిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది 198మందికి అవకాశం లభించనుంది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల వారికి చెందిన పిల్లలకు కార్పొరేట్ చదువులు అందనుండడంతో ఆయా కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. అమల్లో విద్యాహక్కు చట్టం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో 90 పాఠశాలల్లో ఉండగా వాటిలో 25శాతం సీట్లను ఉచిత విద్యకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించి విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఐదేళ్లు నిండిన వారికి మాత్రమే 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచిత సీట్లను లాటరీ పద్ధతిలో మొదటి విడత సీట్లు ఎంపిక చేశారు. వారంతా ఆయా పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవే శం పొందాల్సి ఉంది. ఈ విషయమై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపి ఎంపికై న విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని జి ల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులను చెల్లించనుంది. ఇంతవరకు 93మంది ఆయా పాఠశాలల్లో చేరారు. మిగిలినవారు కొద్ది రోజుల్లో చేరనున్నారు. -
నిన్ను నమ్మలేం బాబూ..!
పార్వతీపురంటౌన్: టీడీపీ మేనిఫెస్టోతో ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తోంది. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నిదర్శనం. మూడు రోజులుగా సాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్యోగులంతా వైఎస్సార్ిసీపీకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 6810 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే రెండు రోజుల్లోనే భారీగా ఓటింగ్ నమోదైంది. ఇందులో ఎక్కువ శా తం ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమలుకాని హామీలతో ప్రజల్ని బురిడీ కొట్టించాలని చంద్రబా బు చూస్తున్నారని ఉద్యోగులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు ఓటింగ్ సరళిని చూస్తే అర్థమవుతోంది. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే తమ జీతాల్లో కోత తప్పదని భావించి ఉద్యోగులు వారి ఓట్లను గంపగుత్తగా వైఎస్సార్సీ పీ అభ్యర్థులకు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చంద్రబాబు, పవన్కల్యాణ్కు చెమటలు పట్టిస్తోంది. ఉద్యోగులంతా తమకు మద్దతుగా నిలుస్తారనుకుంటే..మొత్తం వ్యతిరేకమయ్యారని తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కూటమి శ్రేణులే చర్చించుకుంటున్నాయి. కూటమి నేతలు సూపర్సిక్స్ పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల అమలు సాధ్యం కాదని ఉద్యోగులు తేల్చేశారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3 లక్షల కోట్లు అవసరం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మొన్నటివరకు చంద్రబాబు అండ్ కో ఏపీ శ్రీలంక అవుతుందని చేసిన ప్రచారం వారి మేనిఫెస్టోతో ఇప్పుడేమవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లో ఓట్ల కొనుగోలుపై ఫోకస్పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ అనుకూలంగా లేకపోవడంతో కూటమి అభ్యర్థులు షాక్కు గురవుతున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లోని ఓటర్ల కొనుగో లుపై దృష్టి సారించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం పట్టణంలోని పలువురు టీడీ పీ నేతలు గ్రామాల్లో ఓటుకు రూ. 3వేల వరకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకొండ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లను మభ్యపెట్టేందుకు జనసేన, కూటమి అభ్యర్థులు ఓటుకు రూ.2వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి ఎవరూ రాకపోవడంతో ప్రతి వార్డుకు, గ్రామానికి రోజుకు రూ.5వేలు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపోతే ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉండేందుకు కొందరు అధికారులను రోజూ మద్యం బార్లకు తీసుకెళ్లి బేరసారాలు అడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..నిత్యం గ్రామాల్లో కూటమి అభ్యర్థుల మాట వినకపోతే వారితో గొడవలకు దిగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు.ప్రజాస్పందన కరువుకూటమి అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజ కవర్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రజాదరణ కనిపించడంలేదు. డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, కొద్ది సేపటికే ముఖం చాటేస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆయనకు ఎటూ పాలుపోవడంలేదు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులను కొన్నంత సులభంగా ఓట్లు బదిలీ అవుతాయనే వారి భ్రమ సైతం తొలిగిపోయింది. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించడంతో చంద్రబాబుపై నమ్మకం ప్రజల్లో మరింత సన్నగిల్లింది.ఓటమి భయంతోనే పర్యటనలుకూటమి అభ్యర్థుల ప్రచారానికి జనాదరణ కరువైంది. వార్డుల్లో, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి స్థానిక నాయకులు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక టీడీపీ నాయకులే ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. ఏమి చేయాలో తోచక అది కప్పి పుచ్చుకొనేందుకు అసెంబ్లీ, లొక్సభ నియోజకవర్గాల ప్రచారానికి సినీనటులు, కేంద్రమంత్రులు వస్తున్నారని జిల్లా అంతా కోడై కూస్తోంది. -
రిసెప్షన్ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి విజయనగరం అర్బన్: రిసెప్షన్ సెంటర్ల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, ఎస్పీ దీపికతో కలిసి డెంకాడ మండలంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ సెంటర్ను మంగళవారం పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్లు, బారికేడింగ్, పార్కింగ్, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. లెండి కళాశాలలో రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకువచ్చే అధికారు లు, సిబ్బంది రాకపోకలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సులు, అధికారుల వాహనాలు లోపలికి రావడానికి, సిబ్బందిని దించి బయటకు వెళ్లడానికి వీలుగా మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఈవీఎంలతో లోపలికి వచ్చిన దగ్గర నుంచి.. తమకు కేటాయించబడిర కౌంటర్లకు సులువుగా చేరుకునేలా నేమ్బోర్డులు, డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్డీఏ ఎస్డీ అనిత, రిసెప్షన్ సెంటర్ నోడల్ అధికారులు మెప్మా పీడీ ఎం.సుధాకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ శ్రీధర్రాజు, డీఎంఅండ్హెచ్ఓ భాస్కరరావు, డీఎస్ఓ మధుసూదనరావు, అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో 70 కుటుంబాల చేరిక
● పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి సీతంపేట: ఐదేళ్ల ప్రభుత్వ పాలనకు ఆకర్షితులైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో సహా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ మేరకు సీతంపేట మండలంలోని బిల్లుమడ, వెంపలగూ డ, ముకుందాపురం, పులిపుట్టి గ్రామాలకు చెందిన 70 కుటుంబాల వారు మంగళవారం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన గంటా ప్ర సాద్, నవీన్కుమార్, ఎల్.రమేష్, పి.రమేష్, పి.జో గారావు, తిరుపతిరావు, పి.కృష్ణ, పి.సునీల్, ఉమ, ఎం.బాలకృష్ణ, ఎన్.ఆనందరావు, పి.మన్మథరావు తదితరులకు వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వా నించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్య మంత్రిగా గెలిపించుకునేందుకు తామంతా సిద్ధమ ని పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామారావు, వెంకటేష్, కృష్ణ పాల్గొన్నారు. అంటిపేటలో 20 కుటుంబాలు పార్వతీపురం టౌన్: సీతానగరం మండలం పరిధి లో గల అంటిపేట పంచాయతీ నుంచి 20 టీడీపీ కుటుంబాలు మంగళవారం పార్వతీపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారందరినీ ఎమ్మెల్యే జోగారావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో ప్రధానంగా కోట పైడమ్మ, కోట గోవింద, కోట శివ, దీన, బోనెల అప్పలస్వామి, బోనెల లక్ష్మి, శివ, నాగమ్మ, బలరాం, లక్ష్మిలతో పాటు 20 కుటుంబాల వారున్నారు. మాజీ జెడ్పీటీసీ అంబటి కృష్ణంనా యుడు, సర్పంచ్ బొంగు తిరుపతిరావు, దానబాబు, తిరుపతిరావు, సిరికి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
● సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్దా పార్వతీపురం: సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రమోద్ కుమార్ మెహర్దా అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో సూక్ష్మ పరిశీలకులకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని, ఓటరు మినహా పోలింగ్ కేంద్రాలలోకి ఎవరినీ అనుమతించరాదని చెప్పా రు. పోలింగ్ జరిగిన చోట ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే ప్రిసైడింగ్ అధికారి, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించా రు. పోలింగ్లో ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. పోలింగ్ రోజున మాక్పోలింగ్, పోలింగ్ ముగింపు అతి ముఖ్యమన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయ డం నిషేధమని పేర్కొన్నారు. ఓటరు మాత్రమే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావాలని, ఇతరులు ఎవరినీ లోపలికి అనుమతించరాదని స్ప ష్టం చేశారు. నియమించిన పోలింగ్ ఏజెంట్లు ఉద యం 5గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జనరల్ ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు 11వ తేదీ సాయంత్రం 5 గంట ల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్ రోజు ఉదయం 5.30 గంటలకు కచ్చితంగా మాక్ పోలింగ్ను జనరల్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. ఉదయం 7 గంటల సమయానికి పోలింగ్ మొదలు కావాలని, మాక్ పోలింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటుహక్కు ప్రశాంతంగా వినియోగించుకునే విధంగా మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించిన గుర్తింపు కార్డు చూపించిన వారికి ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలవద్ద స్ట్రైకింగ్ పోలీస్ ఫోర్స్ నిఘా ఉంటుందన్నారు. సీఆర్సీ పూర్తయిన వెంటనే పోలింగ్ సీల్ చేయాల ని, మైక్రో అబ్జెర్వర్ల రిపోర్ట్ పూర్తి చేయాలని వివరించారు. ప్రిసైడింగ్ అధికారులు మాత్రమే మొబైల్ ఫోన్ వాడేందుకు అవకాశం ఉందని చెప్పారు. మే 12న పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్ట నున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలవద్ద వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫ్ చిత్రీకరణ ఉంటుందని ఎన్నికల పోలింగ్ సరళి, నిర్వహణ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫొటో, వీడియో గ్రాఫ్, సెల్ఫీలు నిషేధమని ఆదేశించారు. మాక్ పోలింగ్ నుంచి పోలింగ్ ముగింపు వరకు నిర్వహించాల్సిన ప్రక్రియను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ అవగాహన కల్పించారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
● రెండోరోజు వియోగించుకున్న ఉద్యోగులు 2,532 మంది పార్వతీపురంటౌన్: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సోమవారం రెండవరోజు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పోలీసు సిబ్బంది, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను వినియోగించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటు కలిగి ఉండి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వారి సొంత నియోజక వర్గ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి పార్వతీపురంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండవ రోజు ఓటింగ్ ఇలా జిల్లా వ్యాప్తంగా 6,810 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా తొలిరోజు 3280 మంది వినియోగించుకున్నారు. రెండవ రోజు 2532 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓటింగ్ కంపాట్మెంట్లు, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఏర్పాటు చేసిన విధానాన్ని అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఇతర జిల్లాల ఉద్యోగులకు గడువు పెంపు ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని రెండు రోజుల పాటూ పొడిగిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. ఇతర జిల్లాల ఉద్యోగులకు మే 5,6 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు సమర్పించి ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేని వారి అభ్యర్థన మేరకు మరో రెండు రోజులు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. పోస్టల్ బ్యాలెట్కు గతంలో దరఖాస్తులు సమర్పించిన ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులంతా శ్రీ వేంకటేశ్వరా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో 7,8 తేదీల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేసే వెసులుబాటు కల్పించారు. హోం ఓటింగ్లో 312మంది వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు హోమ్ ఓటింగ్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టగా జిల్లాలో 85 ఏళ్లు దాటిన వారు 3,900మంది ఉండగా, 270మంది హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే దివ్యాంగులు 12,247మంది దివ్యాంగు లు ఉండగా 383మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. హోమ్ ఓటింగ్ ఎన్నికల సిబ్బంది సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి ఇళ్లకు వెళ్లి హోమ్ ఓటింగ్కు చర్యలు తీసుకున్నారు. హోమ్ ఓటింగ్ విధానంలో సెక్టోరల్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్, పోలింగ్ బూత్ అధికారి, ఆర్మ్డ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ పాల్గొన్నారు. ఓటింగ్ ప్లాట్ఫాం ఏర్పాటుచేసి ఓటింగ్ విధానం పూర్తి సీక్రెట్గా జరిగేలా చర్యలు తీసుకున్నారు. -
ఇతర జిల్లాల ఉద్యోగులకు నేడు, రేపు అవకాశం
పార్వతీపురం: ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని రెండు రోజుల పాటు పొడిగించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న 5,6 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని వారి అభ్యర్థన మేరకు గడువును మరో రెండు రోజులు పెంచినట్లు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు గతంలో దరఖాస్తులు సమర్పించిన ఇతర జిల్లాలకు చెందిన అందరు ఉద్యోగులు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో 7,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వ్యయ రిజిస్టర్ల పరిశీలనసీతంపేట: సాధారణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వ్యయ రిజిస్టర్లను పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు రమాకాంత్ ప్రధాన్ సోమవారం పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఐటీడీఏలో గల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో వాటిని పరిశీలించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు పలు సూచనలిచ్చారు. వ్యయ రిజిస్టర్లో అభ్యర్థి ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. ఈనెల 11వ తేదీన మరోమారు రిజిస్టర్ల పరిశీలన ఉంటుందని, ఆ రోజు తప్పనిసరిగా ఖర్చుల వివరాలు పరిశీలన చేయించుకోవాలని అభ్యర్థుల కు సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులతో పాటు వ్యయపరిశీలన బృందా లు పాల్గొన్నాయి. ఓటర్లకు గమనిక● బీప్ సౌండ్ వస్తేనే ఓటు పడినట్లు పార్వతీపురం: పోలింగ్ బూత్లో ఈవీఎం బటన్ నొక్కినపుడు బీప్ శబ్దాన్ని ఓటర్లు గమనించాలి. శబ్దం రాకుంటే ఓటు దుర్వినియోగం అయినట్లుగా భావించవచ్చు. ఓటర్లు ఈవీఎం శబ్దంపై దృష్టి కేంద్రీకరించి అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. పోలింగ్ బూత్లో ఉన్న ఒక అధికారి వద్ద ఈవీఎం మాస్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అది నొక్కినప్పుడే ఈవీఎం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తరువాత ఓటరు పరదా చా టున ఈవీఎంలో నచ్చిన అభ్యర్థికి ఓటు వేయా లి. బటన్ నొక్కినపుడు ఒక శబ్దం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న వీవీప్యాట్లో ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ వివరాలు కనిపిస్తాయి. బటన్ నొక్కినపుడు శబ్దం రాకపోతే ఓటు పడలేదని అర్థం. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలి. ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలు నిషేధం సాక్షి,పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఘాట్ రోడ్లలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని బొడ్డవర నుంచి అనంతగిరి, రకులోయ మీదుగా పాడేరు జాతీయ రహదారి, వడ్డాది–పాడేరు ఘాట్రోడ్డు, లంబసింగి, మారేడుమిల్లి–భద్రాచలం ఘాట్రోడ్ల మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందన్నారు. ఈ రోడ్లపై భారీ వాహనాలు, మల్టీ ఎక్సెల్ సిమెంట్, స్టీల్ రవాణా చేసే వాహనాల రాకపోకలను ఆయా తేదీల్లో నిషేధిస్తున్నామని తెలిపారు. వాహనదారులంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ విజయసునీత సూచించారు. జగనన్నకే జై రామభద్రపురం: విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యాకానుక, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పక్షాన యువత నిలబడుతోంది. విద్యార్థులకు మేలుచేసే సీఎంకు జై కొడుతోంది. -
మాటకు నిలబడే వ్యక్తికే ఓటు
● వైఎస్సార్సీపీ మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు జియ్యమ్మవలస: ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తికే ఓటు వేయాలని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన జియ్యమ్మవలస మండలంలోని గవరమ్మపేట పంచాయతీ పరిధిలో ఉన్న గవరమ్మపేట, వెంకటరాజపురం, ఎరుకలపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్ధిక అభివృద్ధిని కాంక్షిస్తూ గడపగడపకూ నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మరోసారి సంక్షేమ ప్రభుత్వ పరిపాలనకు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదేనన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లి సత్యంనాయుడు, నాయకులు కోమటిపల్లి చంద్రశేఖరరావు,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
సొంత లాభం తప్ప..!
సాక్షి, పార్వతీపురం మన్యం: గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన ప్రజాప్రతినిధీ కాదు. అధికార పార్టీకి చెందిన నాయకుడు అన్న ముద్ర ఒక్కటే. అయితేనేం..మొత్తం పాలకొండ నియోజకవర్గాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు. 2014–19 సంవత్సరాల మధ్య ప్రభుత్వపరంగా ఏ పథకం మంజూరు కావాలన్నా..ఆయన అంగీకారం ఉండాల్సిందే. అప్పట్లోనే ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తనదేనని భావించి గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ..చివరి నిమిషంలో పొత్తులో భాగంగా మరో పార్టీకి ఇక్కడి సీటు వెళ్లడంతో..అందుకోసం ఇన్నాళ్లూ ఉన్న పార్టీని తృణప్రాయంగా వదిలేశా డు. పక్క పార్టీ కండువా కప్పేసుకుని టికెట్ సాధించాడు. రుణం పొందాలన్నా..రథం కావాలన్నా.. 2014– 2019 కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం కనీసం సహకారం అందించలేదు. పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి విశ్వాసరా యి కళావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వపరంగా ఏ పథకం మంజూరైనా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అనుమతి తప్పనిసరి. కనీసం ఎమ్మెల్యేకు నామమాత్రమైనా సమాచారం ఇవ్వకుండా పథకాలను ఇష్టానుసారం సొంత పార్టీ నేతలకు అందజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న..అప్పటి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించిన వ్యక్తి మొత్తం అంతా తానై నడిపించాడు. రైతు రథాలన్నీ ఆ పార్టీ వారికే. ట్రాక్టరుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేశాడు. ట్రైకార్ రుణాలను సైతం తాను సూచించిన వారికే. ఇప్పించాడు. కొంత రుణాలను దారి మళ్లించి..సొంతానికి వాహనాలు సమకూర్చుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మాఫియా అతని కనుసన్నల్లోనే నడిచింది. వీరఘట్టం మండలంలోని ఓ ఇసుక ర్యాంపు, ఆయనతోపాటు, అనుచరులు పాలకొండ నాగావళి నదీ తీరాన్ని కొల్లగొట్టారు. అంగన్వాడీల నుంచి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల వరకు అమ్ముకున్నట్లు అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. నీరు–చెట్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. క్యాడర్తోనూ దూరం ఏ పార్టీకై నా క్యాడరే బలం. అలాంటిది ఆయనతో పదేళ్లుగా టీడీపీ శ్రేణులు నరకయాతన అనుభవిస్తున్నారు. పార్టీలో వివాదాస్పదుడిగా, కళా వెంకటరావు వర్గీయుడిగా ముద్ర పడిపోయాడు. దీంతో టీడీపీలోని ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. కొత్తగా పడాల భూదేవి వర్గం తెరపైకి వచ్చింది. ఆమె సైతం టీడీపీ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో వారిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి వెళ్లాయి. ఈలోగా ఎన్నికలు రావడంతో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసి, తీరా చివరి నిమిషంలో మరో పార్టీలోకి ఇద్దరూ కుప్పిగంతులు వేశారు. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున సదరు అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ.. మిగతా వర్గం ఆయనకు దూరంగానే ఉంటోంది. ప్రధానంగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి వర్గం అంటీముట్టనట్లే ఉంటోంది. అంతేకాదు.. నాలుగు మండలాల్లో క్యాడర్ అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. నియోజకవర్గ ప్రజల్లో చర్చ.. సదరు వ్యక్తి వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజల్లో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. అప్పట్లోనే లబ్ధిదారుల పేరిట భారీగా స్వాహా చేశాడని..తన అనుచరులకే చాలా వరకూ కట్టబెట్టాడని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి పనికీ లంచాలు మరిగిన వ్యక్తి అని చర్చించుకుంటున్నారు. అధికారం కోసం రాత్రికి రాత్రి పార్టీలు మారే వ్యక్తి..ఇంక ప్రజల బాగోగులు ఏం పట్టించుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం పూటకో పార్టీలోకి జంప్ పదవి లేకపోయినా..పెత్తనం అప్పట్లో ఇసుక మాఫియా వ్యవహారం ట్రైకార్ రుణాలతో సొంతానికి వాహనాలుగతంలో ప్రభుత్వపరంగా ఏ పదవీ లేకున్నా నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించాడు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం అధికారంలో ఉండగా ఆ వ్యక్తి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు డాన్గా వ్యవహరించాడు. ప్రభుత్వపరంగా మంజూరైన పథకాలను తనకు కావాల్సిన వారికే కట్టబెట్టాడు. అలాగే ట్రైకార్ రుణాలు అనుయాయులకు కట్టబెట్టి తన పార్టీ వారి దగ్గరే వసూళ్లు చేసి సొంత వాహనాలు కొనుగోలు చేసుకున్నాడు. 2019లో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేయగా ప్రజలు తిరస్కరించారు. తాజాగా 2024 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని టీడీపీ టికెట్ ఆశించినా ఆ సీటు కాస్త పొత్తులో భాగంగా జనసేన పార్టీకి వెళ్లిపోయింది. దీంతో రాత్రికి రాత్రి ఊసరవెల్లిలా రంగులు మార్చి జనసేన పార్టీలోకి దూకి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నాడు. -
జూలై నుంచి వలంటీర్లతో పింఛన్ల పంపిణీ
దత్తిరాజేరు: వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటివలే వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. విజయనగరంలో తన ఇంటి వద్ద ‘సాక్షి’తో సోమవారం మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన తప్పుడు మేనిఫెస్టోను ప్రజల నమ్మరని, గతంలో ఇచ్చిన ఏ ఒక్క హమీని అమలుచేయకపోవడమే దీనికి కారణమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పారంటే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఓటువేయని కుటుంబాలకు జగన్మోహన్రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అందాయని, టీడీపీ పాలనలో కంటే వైఎస్సార్సీపీ హయాంలోనే మేలు జరిగిందని, టీడీపీ మద్దతు దారులందరూ ఈ సారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న పాలనకు మహిళా లోకం జై కొడుతోందని తెలిపారు. -
స్కూటీ దగ్ధం
సాలూరు: పట్టణంలోని డబ్బివీధి మామిడిపల్లి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో ఓ స్కూటీ కాలిపోయింది. దీనిపై అగ్నిమాపక శాఖ అధికారి సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం డబ్బివీధి మామిడిపల్లి రోడ్డు పక్కన గల 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ పేలి, మంటలు చెలరేగాయి.ఈ అగ్నిప్రమాదంలో సమీపంలో ఉన్న స్కూటీ కాలిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపుచేశారు. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని ఎలక్ట్రికల్ ఎ.డి రంగారావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సాకేంద్రాలు ● డీఎంహెచ్ఓ భాస్కరరావు విజయనగరం ఫోర్ట్: సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడు నియోజకవర్గాల్లోని 1847 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ఎస్. భాస్కరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలకు సామగ్రి అందజేసే కేంద్రాల వద్ద 12వ తేదీన.. పోలింగ్ కేంద్రాల వద్ద 13వ తేదీన చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా స్ట్రాంగ్రూమ్ల వద్ద 13వ తేదీ సాయంత్రం శిబిరాలు ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ సిబ్బందికి ఈ నెల 11 నుంచి 15 వరకు ఎటువంటి సెలవులు మంజూరు చేయమన్నారు. పోక్సో కేసులో ముద్దాయికి జైలు శిక్ష విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్ స్టేషన్లో 2020లో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2,500 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారని విజయనగరం రూరల్ సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ద్వారపూడి గ్రామానికి చెందిన కళ్లేపల్లి అప్పారావు (61) అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో 2020 జనవరిలో అప్పటి ఎస్సై ప్రసన్నకుమార్ కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ –1 డీఎస్పీ బి.మోహనరావు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నాగమణి ముద్దాయికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మావూరి శంకరరావు వాదనలు వినిపించగా.. ప్రస్తుత డీఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవేక్షణలో రూరల్ సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై ఆర్.వాసుదేవ్, కోర్టు ఉమెన్ కానిస్టేబుల్ టి.లక్ష్మి, సీఎంఎస్ హెచ్సీ రామకృష్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలురాజాం సిటీ: మండల పరిధి గురవాం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న ఆటోను డోలపేటకు చెందిన గోవింద్ ద్విచక్రవాహనంపై వస్తూ వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో అదుపుతప్పి పక్కకు పడిపోగా సారథి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బి.మురళితో పాటు అందులో ప్రయాణిస్తున్న పాలకొండ మండలం తంపటాపల్లికి చెందిన పకీరు, వీరఘట్టం మండలం నందివాడకు చెందిన చందు గాయపడ్డారు. ద్విచక్రవాహనదారుడు గోవింద్కు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎస్. భాస్కరరావు తెలిపారు. సెంచూరియన్లో వక్తృత్వ పోటీలు నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో ఓటింగ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే అంశంపై సోమవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. సీసీసీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో బీఎస్సీ అనస్తీషియా విద్యార్థి వహీదా మొదటి బహుమతి, నిఖిల్ రెండో బహుమతి, ప్రజ్ఞ మూడో బహుమతి సాధించారు. విజేతలను వీసీ పీకే మహంతి, రిజిస్ట్రార్ పల్లవి అభినందించారు. -
టార్గెట్ విజయమే
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. గడిచిన ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరఫున అందజేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ..మరోసారి తమను గెలిపిస్తే మరింతగా సంక్షేమం, అభివృద్ధిని అందజేస్తామని హామీ ఇస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ -
ల్యాండ్ టైట్లింగ్ రాద్ధాంతం
కాళ్ల గౌరీశంకర్ ఆరోపణలు ఆవాస్తవం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మా భూములు రీ–సర్వే చేసినప్పుడు మమల్ని పిలిచి మా ముందరే సర్వే చేశారు. మా భూమి రికార్డుల్లో ఎంత ఉంది? భౌతికంగా ఎంత ఉందో కచ్చితంగా నిర్ధారించి భూమిని అప్పగించారు. అటువంటప్పుడు నా ప్రమేయం లేకుండా నా భూమిని ఎవరు కాజేస్తారు.ఇది కే వలం చంద్రబాబు ఆడుతున్న ఎన్నికల గిమ్మిక్కు. ఇటువంటి ట్రిక్కులను, చంద్రబాబును ప్రజలు నమ్మే రోజులు పోయాయి. కిల్లారి శ్రీనివాసరావు, రైతు,వీరఘట్టం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పద్ధతి కాదు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటమి భయంతో చంద్రబాబునాయుడు చేస్తున్న గిమ్మిక్కులు ఇవి. తొలుత ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అవగాహన లేనివాళ్లు భయపడ్డారు.తర్వాత ఈ చట్టంపై అందరూ అవగాహన పెంచుకున్న తర్వాత ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం పద్ధతి కాదు. కర్రి లీలాప్రసాదరావు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు, వీరఘట్టం ● టీడీపీపై రైతుల ధ్వజం వీరఘట్టం: పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే దారుణంగావ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవ హారశైలిపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నా రు. తాజాగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని రాజకీయ విశ్లేషకులు, మేధావులు హితవు చెబుతున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న పచ్చమీడియా రాతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహం వారి మాటల్లోనే...●రీ–సర్వేతో రైతులకు ఎంతో మేలుల్యాండ్ టైట్లింగ్ చట్టంలో భాగంగా చేపడుతున్న రీ–సర్వేతో ఎన్నో సమస్యాత్మక భూములకు చిక్కులు వీడాయి. ఎన్నో సవాళ్లతో కూడికుని ఉన్న భూముల రీ–సర్వేను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతంగా నిర్వహిస్తూ, రైతులకు వివాద రహిత భూమిని అందిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి ఓటమి ఖాయమని సర్వేలు చెబుతుండడంతో ఆ ఫ్రస్టేషన్లో ఉన్న చంద్రబాబు పనిగట్టుకుని ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. ఆయనకు తోడుగా పచ్చమీడియా ఉండడంతో పనిగట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.ఈ ప్రచారాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరు. కర్రి గోవిందరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు, వీరఘట్టం వందేళ్లనాటి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడో బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగింది. తర్వాత చాలా ప్రభుత్వాలు మారాయి గాని ఎవరూ ఈ భూసర్వేను పట్టించుకోకపోవడంతో నిత్యం భూ సమస్యలతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.ఇటువంటి వందేళ్లనాటి భూసమస్యలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేధావులు చెబుతున్నారు. ఈ పనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ యజ్ఞంలా మూడేళ్లుగా చేపడుతుండడంతో ప్రజలు,రైతుల్లో జగన్మోహన్రెడ్డిపై ఓ సుస్థిర స్థానం ఏర్పడింది.దీన్ని తట్టుకోలేక పచ్చమీడియాతో కలిసి చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దమలపాటి వెంకటరమణనాయుడు, ఎంపీపీ, వీరఘట్టం -
కోడ్ ఉల్లంఘన కాదా?
భారీ వర్షం● ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు? సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఫెసిలిటేషన్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వేళ కొందరు టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా వ్యవహరించారు. అక్కడ వేసిన టెంట్లలో కూర్చుని, టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలంటూ పార్టీ గుర్తు కనిపించేలా మాక్ ఈవీఎంలను వెంటపట్టుకుని తిరిగారు. తమదైన శైలిలో ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు.ఇది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అని ఎన్నికల అధికారులు పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఓటర్లు అక్కడ మాట్లాడుకోవడం తారసపడింది. భామిని: మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో సోమవారం జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారుల్లో వర్షపునీరు ప్రవహించింది. గాలుల ఉద్ధృతితో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తాటిమానుగూడ వద్ద భారీ మర్రిచెట్టు నేలకొరిగింది. గిరిజన యువకులు రోడ్లపై పడ్డ చెట్ల కొమ్మలు తొలగించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్ది రోజులుగా ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడిన ప్రజలకు ఈవర్షం కొంత ఊరటనిచ్చింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement