Arjun
-
కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే ఎలా? కృష్ణ మందహాసం
సరిగ్గా యుద్ధం ఆరంభం కాబోతుండగా, అర్జునుడు అకస్మాత్తుగా అశ్రునయనాలతో ‘నేను ఈ యుద్ధం చేయ లేను!’ అనేశాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ‘తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ.’ సమాధానం విషయం తరవాత. తనకు అత్యంత ఆప్తుడూ, మహావీరుడూ అంతటి విషాదగ్రస్థుడై ఉంటే, అచ్యుతుడికి చిరునవ్వు ఎందుకు వచ్చినట్టు అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. సమ్మోహనకరమైన చిరునవ్వు శ్రీకృష్ణుడి సహజ లక్షణం. ఆయన నల్లనివాడూ, నవ్వు రాజిల్లెడి మోమువాడూ కదా! అదొక కారణం.ఎన్నో ఆశలు తన మీద పెట్టుకొని, ఇంత సేన యుద్ధంలోకి దిగ గానే, తమ పక్షంలో అందరికంటె గొప్పవీరుడు ‘నేను యుద్ధం చేయను, పొ’మ్మంటే, సామాన్యుడయితే కోపావేశంలో మునిగి పోయేవాడు. కానీ, విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే, తల పెట్టిన కార్యం తలకిందులవుతుందని ఆ ఘటనాఘటన సమర్థుడికి బాగా తెలుసు. కనక ఆయన చిరునవ్వు చెదరలేదు.శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ముఖ్య కారణం అర్జునుడి ఆవేదన వెనక ఉన్న అజ్ఞానమూ, అమాయకత్వమూ! ‘నేను స్వజనాన్ని చంపితే పాపాన్ని పొందుతాను!’ అన్న అభ్యంతరం ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నివిధాలా అవక తవకగా ఉంది. ఆయన ‘నేను, నేను’ అని అహంకరిస్తు న్నాడు, ‘నేను’ అంటే ఎవరో గ్రహించకుండా. ‘స్వజనం, బంధుమిత్రులూ’ అంటూ ‘మమ’కారం చూపుతున్నాడు, ఆత్మస్వరూపుడైన తనకు స్వజనం–పరజనం అన్న పరి మితులు లేవని విస్మరించి! ‘చంపటం’ గురించి వాపోతు న్నాడు, చావు గురించిగానీ, చంపేదెవరూ, సమసేదెవరూ అని గానీ సరైన ఎరుక లేకుండా! ‘పాపం తగులుతుంద’ని బాధపడుతున్నాడు, ఎటువంటి కర్మల వల్ల పాప పుణ్యాలు చుట్టుకొంటాయో, ఎలాంటి కర్మలవల్ల పాప పుణ్యాల బంధనాలను తప్పించుకోవచ్చో మరచిపోయి! మహామహా వీరులు కూడా జగన్మాయకు అతీతులు కాలేరు గదా అన్న స్ఫురణ కలిగి, మాధవుడి ముఖాన ముందొక మందహాసం వెలిగింది. ఆ తరవాత వివరంగా గీతాబోధ చేశాడు.– ఎం. మారుతి శాస్త్రి -
నటుడు అంబటి అర్జున్ కూతురి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్షిప్లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత్కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్మనీ లభిస్తుంది. చాంపియన్గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్మనీ చేరుతుంది. చాంపియన్కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
కూతురి డ్రీమ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్..
-
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్ను టైబ్రేక్లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్గా నిలిచాడు. -
పోటాపోటీ యాక్షన్
అర్జున్, జేడీ చక్రవర్తి లీడ్ రోల్స్లో నటించిన కన్నడ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ ‘ఒప్పంద: కాంట్రాక్ట్’. ఈ చిత్రంలో రాధికా కుమార స్వామి, సోనీ చరిష్ఠ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో డీఎస్ రెడ్డి సమర్పణలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో రేపు విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్, చక్రవర్తిగార్లు పోటాపోటీగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్గారు, ఆమిర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి’’ అని అన్నారు. -
ప్రపంచ మూడో ర్యాంకర్గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్లో నిలిచారు. నంబర్వన్గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్ను నిలబెట్టుకొని భారత నంబర్వన్గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్లో, వైశాలి 15వ ర్యాంక్లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్లో, సవితాశ్రీ 99వ ర్యాంక్లో నిలిచారు. -
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్లో నిలిచింది. అయితే చాంపియన్ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
హార్ట్ బ్రేకింగ్.. ఒకే ఒక్క పాయింట్! తృటిలో చేజారిన పతకం
ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్కు తృటిలో మరో పతకం చేజారింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బాబుటా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పతకానికి 1.1 పాయింట్ దూరంలో అర్జున్ నిలిచిపోయాడు.ఓ దశలో గోల్డ్మెడల్ రేసులో ఉన్న అర్జున్ ఒత్తడిలో తప్పిదాలు చేస్తూ 208.4 పాయింట్లతో నాలుగో స్ధానానికి పడిపోయాడు. క్రొయేషియా షూటర్ మిరాన్ మారిసిచ్ 209.3 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.ఇక 231.1 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచిన చైనా షూటర్ షెంగ్ లిహావోకు గోల్డ్ మెడల్, 230.5 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ షూటర్ విక్టర్ లిండ్గ్రెన్ సిల్వర్ మెడల్ దక్కింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కూడా భారత్కు నిరాశే ఎదురైంది. ఫైనల్స్లో భారత షూటర్ రమితా జిందాల్ ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్ పతకాన్ని సాధించే అవకాశాన్ని రమితా జిందాల్ కోల్పోయింది. -
కన్నడ సినీ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ హీరో అర్జున్ కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాసవి ఎంటర్ప్రైజెస్ ద్వారా ఉదయ్ కె మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే, రూ. 3 కోట్ల వరకు విశాఖ వాసి సత్యారెడ్డి తమను మోసం చేశాడంటూ మార్టిన్ చిత్ర నిర్మాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నిందితుడు సత్యారెడ్డిని విశాఖపట్నంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్టిన్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ను సత్యారెడ్డి ఏజన్సీకి సదరు నిర్మాత అప్పగించారు. అయితే, డబ్బు తీసుకుని ఆ సినిమాకు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్మాత ఉదయ్ కె మెహతా ఇలా చెప్పారు.. 'మార్టిన్ సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్, సిజి, విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం కాబట్టి మేము గత జూన్-జూలైలో సత్యారెడ్డి నేతృత్వంలోని గ్రాఫిక్ డిజైన్ ఏజెన్సీని సంప్రదించాము. మేము వారికి అడ్వాన్స్గా రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాము. అయితే, సినిమాకు సంబంధించిన పని విషయంలో సత్య ఆలస్యం చేస్తూ గత డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ జూన్లో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.' అని మార్టిన్ చిత్ర నిర్మాత చెప్పారు. సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆయన నిర్లక్ష్యం వల్ల తాము 15 వేర్వేరు సంస్థలకు గ్రాఫిక్స్ పనిని అప్పగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యారెడ్డిపై ఉదయ్ కె మెహతా చీటింగ్ కేసు పెట్టారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. -
టాప్ సీడ్ జోడీని ఓడించిన అనిరుధ్–అర్జున్ ద్వయం
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్లో అనిరుద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్ సీడ్, 28వ ర్యాంక్ జోడీ లామోన్స్ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం అనిరుధ్ 128వ ర్యాంక్లో, అర్జున్ 111వ ర్యాంక్లో ఉన్నారు. -
స్టాలిన్కు శుభలేఖ అందించిన అర్జున్
యాక్షన్కింగ్గా అభిమానులను అలరించిన హీరో అర్జున్.. ఆయన కూతురు నటి ఐశ్వర్య వివాహబంధంలో అడుగుపెట్టబోతుంది. సినీ దర్శకుడు, నటుడు తంబిరామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఈ వేడుక జూన్లో చెన్నైలో జరగనుంది. వీరి వివాహ నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన జరిగింది. కాగా ఉమాపతి, ఐశ్వర్యల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అర్జున్, తంబిరామయ్య కుంటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వివాహ వేడుకను జూన్ 10న చెన్నై, గిరకంబాక్కంలో నటుడు అర్జున్కు చెందిన తోటలో నిర్విహించ తలపెట్టినట్లు సమాచారం. ఈ వివాహా వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో అర్జున్, తంబిరామయ్య కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తాజాగా వీరి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆహ్వన పత్రికను అందించారు. పెద్ద పెట్టెలా ఉన్న ఈ ఆహ్వన పత్రిక అందరినీ ఆకర్షిస్తోంది. -
'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్
‘ప్రసన్న వదనం’ ఫస్ట్ కాపీ నిన్ననే చూశాను. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు. ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్ రాశిసింగ్. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్ రెడ్డి, జెస్ మణికంఠ అన్నారు. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్కు చెందిన జీవన్ నెడున్జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్జెవ్స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత నంబర్వన్గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత కొత్త నంబర్వన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!
బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే.. కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) ఎందుకు వస్తుందంటే.. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 24 గంటల నొప్పి అనడానికి రీజన్.. సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు. ఎలా గుర్తిస్తారంటే.. అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు. సర్జరీ తప్పదా అంటే.. చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ.. ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది. (చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!) -
అర్జున్కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జియాంగ్జి బు (చైనా), యాంగీ యు (చైనా), అర్జున్ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... జియాంగ్జి టైటిల్ గెల్చుకోగా... యాంగీ యు రన్నరప్గా నిలిచాడు. అర్జున్కు మూడో స్థానం ఖరారైంది. ఏడు గేమ్లు ఆడిన అర్జున్ మూడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయాడు. -
కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే!
కాంగ్రెస్ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్లో కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు. గుజరాత్లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్బందర్ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు. #WATCH | Gandhinagar | Senior leaders from Gujarat Arjun Modhwadia, Ambrish Der, and others - who resigned from the Congress yesterday - join BJP in the presence of State BJP chief CR Paatil. pic.twitter.com/ioOe5K2cnD — ANI (@ANI) March 5, 2024 -
ఆయన మాటల వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే: విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వరుసగా రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం 'గామి' రిలీజ్కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా కొద్ది గ్యాప్లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్సేన్. ఒకరు చేసిన పని వల్ల తాను చాలా నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అప్పట్లో అర్జున్ ప్రెస్మీట్ పెట్టి విశ్వక్సేన్ కమిట్మెంట్ లేని నటుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విశ్వక్ ఈ విషయం గురించి పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది..? సినిమాని క్యాన్సిల్ చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆపమని కోరాను. ఆ సమయంలో ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. మా అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి కూడా చేశారు. ఆ విషయాలు ఎవరికీ తెలియదు. నాకు సినిమా నేపథ్యం లేదనో, మరేదో కావచ్చు అనుకుని అనుకుని మీడియా సమావేశం పెట్టారు. కానీ ఆయన మీద గౌరవంతో దానిని మళ్లీ సాగదీయాలనుకోలేదు. ఆ అంశంపై నేను ఎందుకు సమాధానం చెప్పాలి.. ఆ అవసరం కూడా లేదు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి నేను తీసుకున్న రెమ్యునరేషన్కు రెట్టింపు తిరిగిచ్చేశాను. నాపై కోపంతో ఆయన చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే.' అని విశ్వక్ అన్నారు. హీరోగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విశ్వక్.. నిర్మాతగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. కానీ మార్చి 8న రానున్న గామి చిత్రంపై ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ సుమారు నాలుగేళ్ల పాటు జరిగింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. -
వాచ్మెన్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా: మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్యపై మేస్త్రి అర్జున్ దాడి చేశాడు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్య స్క్రాప్ అమ్ముకుంటున్నాడని కోపంతో మేస్త్రి అర్జున్ దాడి చేశాడు దాడిలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మేస్త్రి అర్జున్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'
డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్సీరీస్లో నటించారు. అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్ను కోలీవుడ్కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్కు చెందిన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం. అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్కు ఆరో ర్యాంక్, అరోనియన్కు ఏడో ర్యాంక్, డెనిస్కు ఎనిమిదో ర్యాంక్లు ఖరారయ్యాయి. భారత్కే చెందిన ఇతర గ్రాండ్మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్లో, నారాయణన్ 35వ ర్యాంక్లో, గుకేశ్ 38వ ర్యాంక్లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్ 13వ ర్యాంక్లో, కోనేరు హంపి 17వ ర్యాంక్లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్లో, వైశాలి 36వ ర్యాంక్లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్లో నిలిచారు. -
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
Aishwarya-Umapathy Engaged: ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్షిప్లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
హీరోతో ప్రేమలో అర్జున్ సర్జా కూతురు.. త్వరలోనే నిశ్చితార్థం!
అర్జున్ సర్జా.. సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటించి యాక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్లపాటు హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈయనకు డైరెక్షన్లోనూ అనుభవం ఉంది. అర్జున్ సర్జాకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్ మాత్రం తన ఖాతాలో పడలేదు. కూతురి కోసం నటుడి విశ్వ ప్రయత్నాలు కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సొల్లితరవా సినిమా తీశాడు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. దీంతో మరోసారి తన కూతురిని హీరోయిన్గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్య చాలాకాలంగా ప్రముఖ నటుడి తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కోలీవుడ్లో ఓ వార్త వైరల్గా మారింది. ఉమాపతి కూడా హీరోయే! వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారని, త్వలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే ఉమాపతి కూడా కోలీవుడ్లో హీరోగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని ఓ లుక్కిచ్చారు -
ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నాకు చాలా కంఫర్ట్..!
-
ఆ సినిమా చూసి నన్ను పాలిటిక్స్ లోకి వెళ్ళమన్నాడు
-
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్మనీ, 125 పాయింట్లు లభించాయి. -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్గా, రేసీ స్క్రీన్ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్లో హెరాల్డ్ దాస్తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్డమ్ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
మూవీ ఫ్లాప్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది : అర్జున్
-
ఆ హీరోతో కలిసి నటించాలని ఉంది... మనసులో కోరిక బయటపెట్టిన అర్జున్
-
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
అర్జున్ పరాజయం సెమీస్లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్లను ఆడించారు. తొలి గేమ్లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడించారు. ఇందులో తొలి గేమ్లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్డెత్’ తొలి గేమ్లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
క్వార్టర్స్లో అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్తో సెట్స్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్పై సూపర్గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్గా సిల్వర్ స్క్రీన్పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్లో పోలీస్గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్గ్రాడ్కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
Anjana Arjun : అర్జున్ సర్జా చిన్నకూతురు గ్లామర్ షో, హీరోయిన్ అవ్వడానికేనా? (ఫోటోలు)
-
ఆ డైరెక్టర్ నన్ను కొట్టాడు.. ఎగతాళి చేశాడు..
-
ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం
ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్కు మూడు నెలల క్రితమే హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
లియో సినిమాలో యాక్షన్ కింగ్, డిఫరెంట్ లుక్లో..
హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే లోకేశ్ కనకగరాజ్ చివరి సినిమా విక్రమ్ ఘన విజయం సాధించింది. అటు విజయ్ నటించిన వారసుడు కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ సినిమాలతో జోరు మీదున్న ఇద్దరి కాంబినేషన్లో లియో రాబోతోంది. త్రిష, ప్రియా ఆనంద్, నటుడు అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, థ్యూ థామస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే కాశ్మీర్లో భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తాజాగా లియో చిత్ర షూటింగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో అర్జున్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.. కాగా ఈ చిత్రంలో అర్జున్ గెటప్ కోసం ప్రత్యేకంగా ఇటీవల లుక్ టెస్ట్ చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. చదవండి: రజనీకాంత్ చిన్నకూతురి ఇంట్లో చోరీ -
సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!
సిల్క్ స్మిత పేరు ఇప్పటి సినీ ప్రేక్షకులను తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పేరు. ఆ రోజుల్లో తన అందంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ కూడా మరిచిపోలేరంటే ఎంతలా పేరు సంపాదించిందో అర్థమవుతోంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయ లక్ష్మి. సిల్క్ స్మిత తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది. నిజం చెప్పాలంటే.. సిల్క్ స్మిత జీవితం ముళ్ల పాన్పు లాంటిది. అందరూ తెరపై ఆమె అందాన్ని చూశారే కానీ.. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆమె శృంగార తారగానే ముద్రపడిపోయింది. తాజాగా ఆమె ఫోటోను నాని నటించిన దసరా మూవీలో ప్రదర్శించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెకు వీరాభిమాని కావడం వల్లే ఆమె పోస్టర్ను సినిమాలో చూపించారు. తక్కువ కాలంలోనే ఎన్నో ఆవమానాలు ఎదుర్కొన్న సిల్క్ స్మిత తొందరగానే స్టార్ డమ్ తెచ్చుకుంది. అదే సమయంలో తెరమీద ఆమె అందాలను చూసిన వారే.. బయట చాలా చులకనగా చూసేవారట. వాటితో పాటు మన అనుకున్న వారే ఆస్తి కోసం మోసం చేశాడని తెలియడంతో తాను మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాటిని భరించలేక 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో ఎంతోమందిని కలిచివేసింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా భౌతికకాయాన్ని చూడడానికి కూడా రాలేదట. కనీసం ఆమె కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. కానీ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరేమనుకున్నా తనకు నష్టం లేదని.. ఆమె కడచూపు కోసం వచ్చాడట అర్జున్. అందుకు ప్రధాన కారణం సిల్క్, అర్జున్ మంచి స్నేహితులుగా ఉండేవారట. సిల్క్ స్మిత ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా అని అడిగేదని చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని కోలీవుడ్కు చెందిన సినీ జర్నలిస్టు తోట భావనారాయణ రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. కాగా.. సిల్క్ స్మిత చివరిసారిగా తిరుంబి పార్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నాలుగు సినిమాలు మరణానంతరం 2002లో విడుదలయ్యాయి. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు పతకం ఖరారైంది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్తో జరిగిన గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
సచిన్ కొడుకుపై షారుక్ ట్వీట్ అదే రేంజ్ లో సచిన్ రిప్లై
-
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
Bigg Boss 6: ‘అరేయ్ పప్పు’.. ఈ ఒక్కమాటే టాస్క్ని రద్దు చేసిందా?
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ రద్దయింది. బిగ్బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్ని కంటెస్టెంట్స్ సరిగా ఆడలేదు. దీంతో బిగ్బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి సీరియస్ అయ్యాడు. బిగ్బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలేదంటూ.. టాస్క్నే నిలివివేశాడు. హౌస్లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి. (చదవండి: కంటెస్టెంట్స్పై బిగ్బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ నిలిపివేత) అయితే ఈ టాస్క్ రద్దుకు శ్రీసత్య కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అర్జున్ని రెచ్చగొట్టిమరి రేవంత్తో గొడవకు దిపింది. దీంతో వారు పాత్రల్లోని బయటకు వచ్చి గొడవపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. రెండు టీమ్లుగా విడిపోయిన కంటెస్టెంట్స్కి ‘వాల్పోస్టర్’అనే చాలెంజ్ని ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భాగంగా ఇరు టీమ్ సభ్యులు.. వాల్పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే.. ‘అరేయ్ పప్పు’అని రేవంత్ అంటాడు. ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్టైన్మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. అందుకే బిగ్బాస్ రంగంలోకి దిగి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి కంటెస్టెంట్స్ని ఏ సీజన్లో చూడలేదని చెప్పుకొచ్చాడు. బిగ్బాస్ ఆదేశాలను, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇష్టం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చుని గేట్లు ఎత్తేశాడు. దీంతో ఇంటి సభ్యులు దిగొచ్చి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ బిగ్బాస్ కరగలేదు. ఈ వారం టాస్కే లేదని చెప్పేశాడు. మరి ఇప్పుడు హౌజ్మేట్స్ ఏం చేస్తారో? గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. -
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
BWF World Badmintonship: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా
MR Arjun- Dhruv Kapila: భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సింగపూర్ జోడీతో తలపడింది. ఈ మ్యాచ్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించింది. మొదటి గేమ్లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్ కపిల- ఎం. ఆర్ అర్జున్ జంట క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇక అంతకు ముందు రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్(అన్సీడెడ్) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్- అర్జున్.. మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటీవాన్తో తలపడనున్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్తోనూ ముచ్చట! Big task ahead for @arjunmr & @dhruvkapilaa in their maiden #BWFWorldChampionships quarterfinals and they are up for it 👊🔥#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise#Badminton pic.twitter.com/idvcF3rX2V — BAI Media (@BAI_Media) August 25, 2022 -
Shooting World Cup 2022: భారత్కు మరో స్వర్ణం, రజతం
దక్షిణకొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ గురువారం మరో స్వర్ణం, రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం లభించింది. అర్జున్ బబుటా, తుషార్ మానే, పార్థ్ మఖీజా సభ్యులుగా ఉన్న భారత బృందం ఫైనల్లో 17–15 తేడాతో ఆతిథ్య కొరియా టీమ్పై విజయం సాధించింది. అదే విధంగా.. మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్కు రజతం లభించింది. ఎలవెనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమిత సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో కొరియా చేతిలోనే 10–16తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్కు మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం లభించింది. -
అర్జున్ గురి అదిరె...
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ సీజన్లోని మూడో ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పసిడి బోణీ కొట్టింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల అర్జున్కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం. 2016 జూనియర్ ప్రపంచకప్లో అతను స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన అమెరికా షూటర్ లుకాస్ కొజెనిస్కయ్తో జరిగిన ఫైనల్లో అర్జున్ 17–9తో గెలుపొందాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో పోటీపడుతున్న ఇద్దరు షూటర్లలో తొలుత 16 పాయింట్లు గెలిచిన షూటర్ను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో షాట్లో ఇద్దరు షూటర్లలో అత్యధిక స్కోరింగ్ షాట్ సాధించిన షూటర్కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇద్దరు స్కోరింగ్ షాట్ సమంగా ఉంటే ఒక్కో పాయింట్ ఇస్తారు. లుకాస్తో జరిగిన ఫైనల్లో 13 షాట్లలో అర్జున్ ఎనిమిదింట పైచేయి సాధించగా, లుకాస్ నాలుగు షాట్లలో భారత షూటర్కంటే ఎక్కువ స్కోరు చేశాడు. మరో షాట్లో ఇద్దరూ సమానంగా స్కోరింగ్ షాట్ కొట్టారు. అంతకుముందు ఎనిమిది మంది మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో అర్జున్ 261.1 పాయింట్లు, లుకాస్ 260.4 పాయింట్లు సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. భారత్కే చెందిన పార్థ్ మఖీజా 258.1 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్గా, సీహెచ్ కార్తీక్సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న హీరో అర్జున్ కూతురు!
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే కన్నడలో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మను తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం చేయాలని అర్జున్ భావిస్తున్నారట. తన సొంత డైరెక్షన్లోనే ఓ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్సేన్ను ఈ సినిమాలో హీరోగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. -
తొలిరోజు భారత్కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్లో బెంగళూరు! -
అభిషేక్ను పట్టుకోవడంతో అర్జున్ జంప్!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీప బంధువైన అర్జున్ వీరమాచినేని తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున పబ్పై పోలీసులు దాడిచేసి అందరినీ బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం అర్జున్ ఠాణా వద్దకు వచ్చాడు. తానెవరో చెప్పకుండా గమనించడం మొదలుపెట్టాడు. అప్పటికే పబ్ భాగస్వామి అభిషేక్, మేనేజర్ అనిల్కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది చూసిన అర్జున్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు గురువారం అర్జున్, కిరణ్రాజ్ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పబ్లో అభిషేక్తోపాటు అర్జున్, పెనుమత్స కిరణ్రాజు భాగస్వాములుకాగా.. అనిల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు దాడి చేసినప్పుడు అనిల్, అభిషేక్ పబ్ వద్దే ఉండటంతో పట్టుబడ్డారు. రిమాండ్లో ఉన్న ఈ ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై శుక్రవారం ఎంఎస్జే కోర్టులో వాదనలు జరగనున్నాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
అనసూయ సినిమాకు అర్జున్ సాయం
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’.కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దర్జా’ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందనిపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు. ‘ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్లానే.. ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది’అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ ‘యాక్షన్ కింగ్ అర్జున్గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్కి షకీల్ అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. మోషన్ పోస్టర్ లాగే సినిమాను కూడా అంతా ఎంజాయ్ చేస్తారు’అని అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్
జాతీయ సీనియర్ పురుషుల చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్మాస్టర్ గుకేశ్ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్లో అర్జున్ 41 ఎత్తుల్లో ఇనియన్ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్ 64 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (పీఎస్పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్ గేముల్లో సేతురామన్ (పీఎస్పీబీ)తో అర్జున్, ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్ ఆడతారు. -
అజేయంగా నిలిచిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్
Tata Steel Chess 2022: టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీని తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజయంతో ముగించాడు. నెదర్లాండ్స్లో ఆదివారం జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల అర్జున్ 62 ఎత్తుల్లో మార్క్ మౌరిజి (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్ ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు. చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో అర్జున్ వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్కు క్లీన్ చిట్
Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు. -
`ఫ్రెండ్షిప్’లో తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది: ఎ.ఎన్ బాలాజీ
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకులు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై ఎ.ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున విడుదలవుతున్న ఫ్రెండ్షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన `క్వీన్` సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని `ఫ్రెండ్షిప్` పేరుతో రీమేక్ చేశారు. హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. దాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారు. సినిమా ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
రోయర్ల తడాఖా...
భారత రోయర్లు అర్జున్–అరవింద్ సింగ్ ఒలింపిక్స్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ముందంజ వేశారు. లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో సెమీఫైనల్లోకి చేరారు. టోక్యోలోని సీ ఫారెస్ట్ వాటర్వేలో ఆదివారం జరిగిన రెపిచేజ్ రౌండ్లో భారత జోడీ పోటీని 6ని:51.36 సెకన్ల టైమిం గ్తో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన హీట్స్లో అర్జున్– అరవింద్ ద్వయం ఐదో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహంతో 28న జరిగే గ్రూప్ ‘బి’ సెమీఫైనల్లో భారత జట్టు టాప్–3లో నిలిస్తే ఫైనల్కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి మరో మూడు జోడీలు ఫైనల్కు చేరుతాయి. -
సీఎం స్టాలిన్తో నటుడు అర్జున్ భేటీ
ముఖ్యమంత్రి స్టాలిన్ను నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్న విషయం తెలిసిందే. అదేక్రమంలో కరోనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్ ముఖ్యమంత్రి స్టాలిన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. నటుడు అర్జున్ చెన్నై కెరుగంబాక్కంలోని తన తోటలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని గతంలో నిర్వహించతలపెట్టారు. అయితే కరోనా కారణంగా ఆ ఉత్సవం వాయిదా పడుతూ వచ్చింది. కాగా జులై 1, 2వ తేదీల్లో ఆంజనేయస్వామి దేవాలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి స్టాలిన్ను ఉత్సవానికి ఆహ్వానించడానికే నటుడు అర్జున్ ఆయన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే శ్రీఆంజనేయ ఆలయ కుంభాభి షేకానికి ప్రజలను భారీఎత్తున ఆహ్వానించాలని భావించినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అయితే భక్తులకు ఆ కొరత లేకుండా కుంభాభిషేక కార్యక్రమాన్ని యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నటుడు అర్జున్ వెల్లడించారు. చదవండి: తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు -
మహేష్కి విలన్గా కన్నడ సూపర్ స్టార్?
మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రకు ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యాక్టర్ అర్జున్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు అర్జున్ను చిత్రయూనిట్ సంప్రదించిందని, అది విలన్ పాత్రే అని ఫిల్మ్నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మరి.. ‘సర్కారువారి పాట’ చిత్రంలో విలన్గా అర్జున్ ఖరారవుతారా? వేచి చూడాల్సిందే. -
కరోనా : అంబులెన్స్ డ్రైవర్గా మారిన యంగ్ హీరో
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్, ప్రియాంక చోప్రా, ఆలియాభట్, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా అంబులెన్స్ను స్వయంగా నడుపుతూ పలువురు కోవిడ్ రోగులకు సహాయం అందించాడు. ఈ సందర్భంగా అర్జున్ గౌడ మాట్లాడుతూ..తాను ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’..అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులను హాస్పిటల్స్కు తరలించడం సహా కోవిడ్ కారణంగా చనిపోయినవారికి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తానే స్వయంగా ఆరుగురికి అంత్యక్రియలు జరిపించానని వెల్లడించాడు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వారు అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తానని తెలిపాడు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్ను రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు. ‘యువరత్న’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అర్జున్ గౌడ చేస్తోన్న మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అర్జున్ గౌడను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చదవండి : ఐసీయూలో కరీనా కపూర్ తండ్రి రణదీర్ KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత -
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ ఫోటోషూట్: వైరల్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీకి త్వరలో పరిచయం కాబోతున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య లాంచింగ్ ముందే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చీర కట్టులో ఐశ్వర్య ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి నీలాకాశం రంగు చీరతో ఐశ్వర్య చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య 2013లో విశాల్ హీరోగా వచ్చిన పట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిపిందే. ఆ తర్వాత ప్రేమ బారాహ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. మంచి అందం, అభినయం ఉన్నా బాక్సీఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన స్వీయ దర్శకత్వంలో ఐశ్వర్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు అర్జున్. మరి ఈ భామ ఎంతవరకు ఆకట్టుకుంటుదో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
'ఫ్రెండ్షిప్'.. లైఫ్లో మజా కోసం..
క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ఫ్రెండ్షిప్". 'సింగ్ అండ్ కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇటీవల ఈ సినిమా నుంచి 'లైఫ్ లో మజా కోసం' అనే పాట విడుదలైంది. శరత్ సంతోష్ ఆలపించిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ విలన్గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ నటిస్తున్నాడు. శాంతకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. చదవండి: నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు! సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? -
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో అర్జున్ భేటీ
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్రెడ్డితో నటుడు అర్జున్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. చెన్నైలో తిష్ట వేసి ఎన్నికల వ్యూహాలకు కిషన్రెడ్డి పదును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్, కిషన్రెడ్డిలను అర్జున్ మంగళవారం కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. కొంత సేపు వీరి మధ్య పలు అంశాలపై చర్చ సాగిన సమాచారంతో అర్జున్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ పలకరింపు మర్యాద పూర్వకమేనని, కిషన్రెడ్డి తనకు సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను కలిసినట్టుగా అర్జున్ పేర్కొన్నారు. చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్! -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
యుద్ధ ట్యాంకర్ల హబ్గా తమిళనాడు
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మెట్రో సేవలు.. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ దశాబ్దం భారత్దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ ప్రతి నీటి చుక్క కీలకం.. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు. పుల్వామా అమరులకు నివాళి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. -
భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అన్నది ఉపశీర్షిక. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్తో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్.బాలాజీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్ . బాలాజీ మాట్లాడుతూ –‘‘ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో ప్రేమలు, గొడవల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే చిత్రమిది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. హర్భజన్ సింగ్కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది’’ అన్నారు. -
జెంటిల్మేన్ 2
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ని దర్శకునిగా పరిచయం చేస్తూ కేటీ కుంజుమోన్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మేన్’. 1993లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. ఈ సినిమా విడుదలైన 27ఏళ్లకు ‘జెంటిల్మేన్2’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జెంటిల్మేన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనువదించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకుంది. తొలి భాగానికి రెండింతలు గొప్పగా ‘జెంటిల్మేన్ 2’ని తెరకెక్కించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తాం. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
కన్నీటిపర్యంతమైన అర్జున్
సాక్షి, కర్ణాటక : గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫారంహౌస్లో ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిపారు. ఆదివారం రాత్రి నుంచి నగరంలోని బసవనగుడిలోని చిరంజీవి సర్జా నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. పెద్దసంఖ్యలో బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు అంతిమ దర్శనం చేసుకున్నారు. పురోహితులు సంస్కార పూజలను పూర్తి చేసి, మధ్యాహ్నం రెండు గంటలకు పూలతో అలంకరించిన వాహనంలో కనకపుర రోడ్డులోని సొంత ఫాంహౌస్ బృందావనకు తీసుకెళ్లారు. అభిమానులు అధిక సంఖ్యలో వస్తారని భావించి రామనగర జిల్లా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదట మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ తమ్ముడు ధృవ సర్జా బృందావనంలోనే అన్న స్మృతి ఉండాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అశ్రు నివాళులు మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు వెక్కివెక్కి ఏడ్చిన అర్జున్ చిరంజీవి సర్జా మామ, బహుభాషా నటుడు అర్జున్ కుటుంబం ఆదివారం రాత్రి చెన్నై నుంచి కారులో రాత్రి 11:30 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. నేను మీ మామ వచ్చాను, లేవరా అని బిగ్గరగా విలపించడం చూసి అందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా పార్థవశరీరం దర్శించటానికి ప్రముఖులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆత్మీయునికి దూరమయ్యాం యశవంతపుర: కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మృతి పట్ల శాండల్వుడ్ ముఖ్యలు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సర్జా సతీమణి మేఘనారాజ్ను, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం డీకేశి మీడియాతో మాట్లాడుతూ మనిషిగా పుట్టాక మరణం అనివార్యమన్నారు. చావు ఎవరి చేతిలో లేదు. యముడు మనపై ఎలాంటి కరుణ చూపడు అనటానికీ చిరంజీవి సర్జా మరణం సాక్షి. చిన్న వయస్సులోని ఒక నటుడు దూరం కావటం సినిమా రంగానికీ తీవ్ర నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని పేర్కొన్నారు. నాకు గాడ్ ఫాదర్ : చందనశెట్టి తను బెంగళూరుకు వచ్చిన మొదటలో చిరంజీవి సర్జా ఆశ్రయం కల్పించిన్నట్లు బిగ్బాస్ విజేత, గాయకుడు చందనశెట్టి తెలిపారు. చిరంజీవి సర్జా మరణవార్త విని షాక్కు గురైన్నట్లు చెప్పారు. అర్జున్, చిరంజీవి సర్జాలు వారి ఇంటిలోనే పెట్టుకొని సంవత్సరం పాటు తనకు ఆశ్రయం కలి్పంచిన్నట్లు చెప్పారు. చిరంజీవి సర్జా నటించిన వరదనాయక్ సినిమాలో పాటలు పాడే చాన్స్ ఇచ్చాడని తెలిపారు. మిత్రున్ని కోల్పోయా : రాధికా పండిత్ ఒక మంచి స్నేహితుడిని దూరమైనాడని నటి రాధికా పండిత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇన్స్ట్రాగాంలో పోస్ట్ చేస్తూ చిరంజీవి సర్జా మరణవార్తను నమ్మలేకపోతున్నా. మేఘనా, ధృవ కుటుంబానికీ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు కల్పించాలని అని కోరుకున్నారు. సర్జా కుటుంబానికి జూన్ నెల విషాదం చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి సర్జా అన్న కిశోర్ సర్జా 2009 జూన్ 27న గుండెపోటుతో 50 ఏళ్లు వయస్సులో మృతి చెందారు. దీనితో జూన్ నెల సర్జా కుటుంబానికి కలిసి రావటం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు కన్నీరు చిరంజీవి సర్జా కుటుంబానికి రామనగరకు సమీపంలో నెలగుళి వద్ద నాలుగు ఎకరాల తోట ఉంది. అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవారు. గ్రామస్థులను చూసి ఆయన కారు నిలిపి ఆప్యాయంగా మాట్లాడేవారు. చిరంజీవి సర్జా మరణ వార్తతో గ్రామస్తులు కన్నీరుకార్చారు. సర్జా పెళ్లి సందర్భంగా తోటలో గ్రామస్తులకు విందునిచ్చారని గుర్తుచేసుకున్నారు. -
నాలుగు భాషల్ ఫ్రెండ్షిప్
క్రికెటర్ హర్భజన్సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్. -
క్రికెటర్ టు స్టూడెంట్!
క్రికెటర్ నుంచి యాక్టర్గా మారి ‘ఫ్రెండ్షిప్ యువర్స్ ఫ్రెండ్లీ’ అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు హర్భజన్ సింగ్. ఇందులో లోస్లియా మరియాసేన్ కథానాయికగా నటిస్తున్నారు. జాన్పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్ స్టూడెంట్గా హర్భజన్ సింగ్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘‘స్కూలింగ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్ సింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ చదవడం కోసం పంజాబ్ నుంచి కోయంబత్తూర్ వచ్చి ఓ కాలేజ్లో జాయిన్ అవుతారు హర్భజన్. కోయంబత్తూర్కే హర్భజన్ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్కు థ్రిల్లింగ్గా ఉంటుంది. లాక్డౌన్కి ముందే తొలి షెడ్యూల్ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది..
‘అగ్నిసాక్షి’ సీరియల్ హీరో శంకర్ బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితం. అసలు పేరు అర్జున్ అంబటి. బుల్లితెరపై గౌరితో ప్రణయం, పరిణయం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ‘స్టార్ మా’లో వచ్చే ఇస్మార్ట్ జోడీ రియాల్టీ షో ద్వారా తన అర్ధాంగి సురేఖతో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్తో సందడి చేస్తున్నారు. ‘నేను బెంగళూరు నుంచి వచ్చాను అనుకున్నారు చాలామంది. కానీ, తెలుగింటి అబ్బాయినే’ అంటూ తన గురించి వివరించారు అర్జున్. ‘అగ్నిసాక్షి’ సీరియల్కు ముందు ‘అర్ధనారి’ అనే సినిమా చేశాను. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సౌఖ్యం, దేశముదురు ఇటీవల అశ్వమేధం సినిమాల్లో నటించాను. నేను స్క్రీన్ ముందుకు రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చెన్నై, హైదరాబాద్లలో ఐటీ కంపెనీలో జాబ్ చేశాను. సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపుగా వచ్చాను. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆసక్తిగా అగ్నిసాక్షి వందలో ఒకటో రెండో ఇలాంటి సీరియల్ టాపిక్స్ వస్తాయనుకుంటాను. అరుదైన కథతో ఆసక్తిగొలిపే కథనం గల ఈ సీరియల్ నన్ను వరించడం గొప్పగా భావిస్తున్నాను. ఈ సీరియల్ నటుడిగా నన్ను నిలబెట్టింది. ఈ సీరియల్లో డ్రెస్సింగ్ స్టైల్ మిగతా అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ఆప్యాయంగా చూడటం, కుటుంబం.. ఆ పద్ధతులు... అన్నీ చాలా డిఫరెంట్. ఈ సీరియల్లోని విషయాలు కొన్ని నా నిజజీవితంలో పాటించేలా చేశాయి. చేసిన ఫస్ట్ సీరియల్కే మంచి గుర్తింపు వచ్చింది. అవార్డులూ వరించాయి. సాఫ్ట్వేర్ నుంచి.. మొదట్లో అందరూ నన్ను బెంగుళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మాది విజయవాడ దగ్గర నర్సరావు పేట. మా నాన్న ఫిల్మ్ డిస్టిబ్యూటర్. అమ్మ గృహిణి. తమ్ముడు, చెల్లీ ఉన్నారు. వాళ్లిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా నేనూ, సురేఖ బయట కలిశాం. మా పరిచయం స్నేహంగా మారింది. రెండేళ్లు గడిచాక ఇరు కుటుంబాల అంగీకారంతో మా ప్రేమ పెళ్లి పీటలెక్కింది. రియాల్టీ షో ‘స్టార్ మా టీవీ’లో ఇస్మార్ట్ జోడీ అనే పేరుతో వచ్చే భార్యభర్తల డ్యాన్స్ ప్రోగ్రామ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. నా భార్య సురేఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా ఇరువైపు కుటుంబాల్లో ఏ చిన్న ఈవెంట్ అయినా తన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాకపోతే ఇలా కెమెరా ముందు డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. తను చాలా ఎగ్జయిట్మెంట్తో ఈ షోలో పాల్గొంది. అది చూసి నాకూ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్లో ప్రతీవారం ఒక థీమ్ ఇస్తారు. వెడ్డింగ్, కుకింగ్ స్పెషల్.. అంటూ ఒక్కోవారం ఫన్ టాస్క్లు ఉంటాయి. రూమర్స్కి దూరం మా పెళ్లి అయ్యి ఏడాది పూర్తయ్యింది. సురేఖ చాలా సపోర్టివ్ నాకు. రూమర్స్ వచ్చినప్పుడు నేను కొంత డిస్టర్బ్ అయినా తనే నన్ను అర్థం చేసుకుంటుంది. ‘మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది. నేను అర్ధం చేసుకోగలను’ అంటుంది. తను చాలా కూల్ పర్సన్. మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఏదైనా విషయంలో ఇద్దరం గొడవపడినా.. తనే ముందు మాట్లాడి మూడీగా ఉన్న వాతావరణాన్ని ప్లెజెంట్గా మార్చేస్తుంది. అందరం ఒక చోట మా అమ్మ నాన్న విజయవాడలో. తమ్ముడు, చెల్లి విదేశాల్లో. మేం హైదరాబాద్లో. మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఇటీవల కాలంలో ఉన్నది లేదు. పండగలప్పుడు కూడా అందరం కలవడానికి కుదరడం లేదు. అదొక్కటే బాధగా ఉంటుంది. మేమందరం కలుసుకుని సరదాగా గడిపేలా ఒక్క పండగైనా చేసుకోవాలని మా వాళ్లకు చెబుతుంటాను.’– సంభాషణ: నిర్మలారెడ్డి -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
‘సిస్టమ్ను మార్చడానికి హీరో కావాలి’
కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే', ‘మన విద్యావిధానంలో అందరు చదువుకోవచ్చు కానీ అందరు సాధించలేరు. ఈ సిస్టమ్ను మార్చడానికి ఒక కామన్ మ్యాన్గా ఉండే సరిపోడు.. ఒక హీరో కావాలి’, ‘ఒక మనిషిని నాశనం చేయవచ్చు.. వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయవచ్చు.. కానీ వాడి ఐడియాలను, ఐడియాలజీస్ని ఎవడూ నాశనం చేయలేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంఈ నెల 20న సినిమా విడుదల కానుంది. -
హర్భజన్ ‘ఫ్రెండ్ షిప్’లో అర్జున్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నయా ఇన్నింగ్స్లో భజ్జీ హీరోగా అవతారమెత్తనున్నారు. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్యల సంయుక్త దర్శకత్వంలో హర్భజన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’ . తమిళ బిగ్బాస్ ఫేమ్ మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జేపీఆర్, స్టాలిన్లు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ను చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర చేయడానికి యాక్షన్ కింగ్ అర్జున్ అంగీకరించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అర్జున్తో పాటు తమిళ నటుడు సతీష్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. -
హర్భజన్ సినిమాలో యాక్షన్ కింగ్
తన స్పిన్ బౌలింగ్తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధమయ్యాడు. పలు యాడ్ ఫిల్స్మ్ కోసం కెమెరా ముందుకొచ్చిన హర్భజన్ సింగ్.. ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. తమిళ బిగ్బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్టో స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఫ్రెండ్ షిప్’ను పలు భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమైంది. -
ఆర్చ... అదరహా
మోహన్లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
అర్జున్ మేనల్లుడి పొగరు
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పొగరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో బి.కె. గంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. హీరోకు, అంతర్జాతీయ బాడీ బిల్డర్స్కు మధ్య వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ బాడీ బిల్డర్ కై గ్రీనే, జాక్ లుకాస్, జో లిన్డర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ నటిస్తున్నారు. ‘భైరవగీత’ ఫేమ్ ధనుంజయ్ విలన్గా నటిస్తున్నారు. సంపత్ రాజ్, రవి శంకర్, పవిత్రా లోకేష్ కీలక పాత్రధారులు. ‘‘ప్యాన్ ఇండియా సినిమాగా పొగరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం
‘‘మా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కొందరు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ఆ సినిమా ఒకేసారి పుట్టింది. ఇక రాదు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేయొచ్చు’’ అన్నారు నిర్మాత మునిరత్న. మహాభారతాన్ని తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీద త్రీడీలో ‘కురుక్షేత్రం’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో దుర్యోధనుడిగా కన్నడ హీరో దర్శన్, కర్ణుడిగా అర్జున్, అర్జునుడిగా సోనూ సూద్, అభిమన్యుడిగా నిఖిల్ గౌడ, భీష్ముడిగా అంబరీష్ నటించారు. రాక్లైన్ వెంకటేశ్ సమర్పణలో కథను అందించడంతో పాటు మునిరత్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగన్న దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘భారతాన్ని త్రీడీలో తీయాలనుకున్నాను. ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రస్తుత తరానికి మహాభారతాన్ని తెలియజేయడానికి ఈ సినిమా చేశాం’’ అన్నారు మునిరత్న. ‘‘ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించినందుకు నిర్మాతలకు కృతజ్ఙతలు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘దేశంలో మొట్టమొదటి త్రీడీ మైథాలజీ సినిమా ఇది. ‘కురుక్షేత్రం’ పండగలా ఉంటుంది’’ అన్నారు నాగన్న. ‘‘1970–2019 వరకూ ఉన్న గొప్ప యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా భారతంలోని పాత్రలన్నీ పరిచయం చేస్తుంది’’ అన్నారు దర్శన్. ‘‘చారిత్రాత్మక చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అర్జున్. ‘‘ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా ఉండటం సంతోషం. తెలుగులో రిలీజ్ చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు రాక్లైన్ వెంకటేశ్. ‘‘ఈ సినిమాలో మాటలు, పాట లు రాసే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వెన్నెలకంటి. ‘‘నటుడిగా ఈ సినిమా ఓ మంచి అనుభూతి’’ అన్నారు సోనూ సూద్. -
హీరోకి విలన్ దొరికాడు
‘2.ఓ’ సినిమాలో అక్షయ్కుమార్, ‘పేట’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తమిళంలో ‘హీరో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్గా నటించనున్నారు అభయ్ డియోల్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తు్తన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
కొడుకుతో సరదాగా నాని..
నేచురల్ స్టార్ నాని తన కుమారుడు అర్జున్తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంట్లో బెడ్ కింద దాక్కునేందుకు యత్నించిన అర్జున్ను.. నాని స్టైలిష్గా తన భూజలపైకి ఎత్తుకుని ఆడిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాని భార్య అంజన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు.. ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది జెర్సీ మూవీ సూపర్ హిట్ కొట్టిన నాని, మరికొద్ది రోజుల్లో ‘గ్యాంగ్లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. View this post on Instagram 🎵Kailove chedugudugudu🎵 A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on Jun 22, 2019 at 8:00am PDT -
సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు
‘మీరెలాంటి ఫాదర్’ అంటే ‘మా నాన్నంత బెస్ట్ నేను కాదు’ అంటారు అర్జున్. ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తన తండ్రిని చూసి నేర్చుకున్నాను అంటున్నారు. ఇంకా అర్జున్ చెప్పిన విశేషాలు. ► ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి? ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే మా నాన్నలా ఉండాలి. ఏ తండ్రి అయినా పిల్లలకు కొంచెం సంస్కారం ఇవ్వాలి. అది నా తండ్రి నాకు ఇచ్చారు. పిల్లలకు ఆస్తులు కూడబెట్టి ఇస్తారు కొందరు. లేనివాళ్లు ఇవ్వలేరు. అయితే సంస్కారం అనేదానికి డబ్బు అక్కర్లేదు. ఆ తండ్రి సంస్కారవంతుడు అయితే బిడ్డలకు కూడా అదే నేర్పిస్తాడు. నా తండ్రి (అర్జున్ తండ్రి జేసీ రామస్వామి నటుడు – ఆయన స్క్రీన్ నేమ్ శక్తిప్రసాద్) మాకు సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు. ► సంస్కారం ఉన్నవాళ్లు తమ సంసారం విషయంలో చాలా బాధ్యతగా కూడా ఉంటారు. కుటుంబం విషయంలో మీ తండ్రి తీసుకున్న కేర్ గురించి? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తండ్రి అయిపోడు. పెళ్లంటే పెద్ద బాధ్యత. భార్యని తన తల్లిలా చూసుకునేవాడే నిజమైన తండ్రి.. బిడ్డల్ని కూడా తల్లిలా చూసుకోవాలి. భార్యని, పిల్లలను సరిగ్గా చూసుకోలేనివాళ్లు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి మగవాళ్లకు పెళ్లి చేసుకునే అర్హత లేదని నా అభిప్రాయం. ఎఫెక్షన్, కేరింగ్ అనేవి చాలా ముఖ్యం. మా నాన్న చనిపోయి దాదాపు 30 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆయన తాలూకు జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉన్నాయి. అంతలా మీ నాన్నగారు మీకోసం ఏం చేశారంటే ఒకటి, రెండు, మూడు... అని లెక్కేసి ఇన్సిడెంట్స్ చెప్పలేను. అదొక ఫీలింగ్. నేను స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అరగంట లేటైతే చాలు కంగారుపడేవారు. 5:30 గంటలకు రావాల్సింది 6 గంటలకు వస్తే నేను వచ్చేవరకూ బయట నిలబడి వెయిట్ చేస్తుండేవారు. అంత కేరింగ్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అయితే చెప్పాను కదా.. నాన్న అంటే ఓ ఫీలింగ్ అని. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో తెలియడంలేదు. ► జనరల్గా అమ్మ దగ్గర చనువు ఉంటుంది. నాన్నకు భయపడతాం. మరి మీరు? మా నాన్న అంటే నాకు భయం. అయితే నేను తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడేవాడిని. లేకుంటే ఆయన మెడపై కూర్చునేటంత చనువు ఉంది. ఎప్పుడూ నన్ను భయపెట్టాలని ఓ టీచర్లాగా ‘ఏయ్’ అంటూ అరిచేవారు కాదు. నాతో మామూలుగా మాట్లాడేవారు. అయితే తప్పు చేస్తే నాన్నకు కోపం వస్తుంది అనే ఫీల్ని పిల్లలకు కలిగేలా చేయగలిగారు. ► మీ నాన్నగారు మీకు నేర్పించిన విషయాల్లో ముఖ్యమైనవి ఏమైనా? దేశభక్తి, దైవభక్తి... రెండూ నేర్పించారు. ఈరోజు ఆధ్యాత్మికంగా ఓ గుడి (ఆంజనేయ స్వామి) కడుతున్నానంటే భక్తి అనే విత్తనాన్ని నా మైండ్లో చిన్నప్పుడే నాటారు నాన్న. దేశం పట్ల ప్రేమ, భక్తి ఉండాలని నా గుండెల్లో పెట్టుకునేలా చేసింది కూడా ఆయనే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి చెప్పారు. వారి త్యాగాల గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడు తెలియకుండానే ‘ఓహో... దేశం అంటే ఇది. మన స్వాతంత్య్రం వెనక ఇంతమంది త్యాగం ఉంది’ అనేది మనసులో నాటుకుపోయింది. దేశభక్తి భావం పెంపొందింది. దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమించాలని చెప్పేది కూడా నాన్నే అయ్యుండాలి. ఇలాంటి అర్హతలన్నీ ఉంటేనే ఫాదర్.. లేకుంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లనేది ఓ బాధ్యత.. ఓ కర్తవ్యం. ► అర్జున్ వాళ్ల తండ్రి గొప్పా? లేక ఐశ్వర్య (అర్జున్ కూతురు) తండ్రి గొప్పా? ప్రపంచంలో నా తండ్రే గొప్ప అని ప్రతి పిల్లలు చెప్పుకుంటారు. నిజంగా నేను కూడా అలాగే ఫీలవుతాను.. అలాగే నేను గొప్ప తండ్రిని అనుకుంటున్నాను. మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా, చాలా సెక్యూర్డ్ ఫాదర్ని.. నా కూతురు పక్కన నేనుంటే తనని చూడటానికి కూడా భయపడతారు. ఇవన్నీ ఓకే.. కానీ మనం ప్రేమ ఇవ్వాలి. ప్రతి తండ్రీ ‘ఐ యామ్ ది బెస్ట్’ అంటుంటారు. మా అమ్మాయి ‘మా నాన్న బెస్ట్’ అంటుంది. అప్పుడు నేనేమన్నానంటే.. ‘నీకు నేను బెస్ట్ అయితే.. మా నాన్న నీ బెస్ట్ ఇంటూ వెయ్యి రెట్లు’ అన్నాను. మా నాన్న అంత గుడ్ ఫాదర్లా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ► మీ నాన్నగారు సంస్కారం ఇచ్చారు. మీ పిల్లలకు మీరు అది ఇవ్వడంతోపాటు బాగా ఆస్తులు కూడా ఇచ్చారు కదా? యస్. నా వద్ద డబ్బు ఉంది.. స్టేటస్ ఉంది. బాగా ఖర్చు పెట్టగలుగుతాను.. మా అమ్మాయి ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలను. ఫారిన్ పంపించగలను. అప్పట్లో మా నాన్నకి అంత స్తోమత లేదు.. అయినా మా నాన్నగారు బెస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఎబౌట్ మనీ, నాట్ స్టేటస్.. ఇట్స్ ఎ ఫీలింగ్. మనం పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. సమాజంలో వాళ్లు ఓ మంచి వ్యక్తిగా బతికేలా తీర్చిదిద్దుతున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. ► ఇంతకీ మీ నాన్నగారు మీకు జీవితం గురించి పదే పదే చెప్పేవారా? జస్ట్ ఆయన్ని చూసి నేర్చుకోమనేవారా? లైఫ్ అంటే ఒక ‘ఫ్లేవర్’. ఆ సువాససను మనం ఆస్వాదించగలుగుతాం తప్ప చూడలేం. వేరేవాళ్లు అడిగేటప్పుడే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. మీ ఫాదర్తో ఎప్పుడెప్పుడు మీకు అలా అనిపించింది? అని అడిగితే.. ఉదాహరణకి.. చిన్నప్పుడు హెయిర్ కటింగ్ షాప్కి నాన్న తీసుకెళ్లారు. అక్కడ కుర్చీలో ఎత్తు కోసం మరొక స్పాంజ్ సీట్ వేశారు. కటింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతూ తల కిందికి ఓ వైపు వాల్చేసేవాడిని. అప్పుడు కటింగ్ చేసే ఆయన తలని సరిగ్గా పెడతాడు. అయితే అతని చర్య సున్నితంగా ఉండదు. తలను అలా లాగి పక్కకి పెట్టినట్లు పెడతాడు. అది మా నాన్నకు నచ్చేది కాదు. అందుకని నా పక్కనే కూర్చుని నేను నిద్రపోకుండా కథలు చెబుతూ కటింగ్ చేయించేవారు.. ఇదొక సంఘటన. ఈ విషయంలో మీకు ఏం తెలుస్తుంది.. కేరింగ్, అఫెక్షన్ తెలుస్తున్నాయి కదా. ఇంకొక్కటి చెబుతా.. ఇవన్నీ నిజాలు.. ఒకరోజు నాన్న నన్ను ఎత్తుకుని రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద ఎద్దు మీదకు వచ్చేసింది.. మా నాన్న పహిల్వాన్.. అంత స్ట్రాంగ్గా ఉండేవారు. కొంచెం అయ్యుంటే అది పొడిచేసేది. దాని ముక్కుతాడుని పట్టుకుని కంట్రోల్ చేశారు.. దాని యజమాని వచ్చేవరకూ అలాగే పట్టుకుని ఉన్నారు. ఇదంతా ఒక సినిమాటిక్గా ఉంటుంది. ► అప్పుడు మీ నాన్నని హీరో అనుకున్నారా? అంతేకదా! ఆయన కాకుంటే ఇంకెవరుంటారు? మా నాన్నది పల్లెటూరు. నాకూ చాలా ఇష్టం. అక్కడికి వెళ్లాలనిపిస్తుంటుంది? చెట్లు పెంచాలనిపిస్తుంది.. ఆవులు ఉండాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అది నా రక్తంలోనే ఉంది. పనసపండు ఉంటుంది కదా.. దాన్ని మా నాన్నే కోసి మా అందరికీ ఇచ్చేవారు. పిల్లలందరం కావాల్సినవి తీసుకునేవాళ్లు. మా నాన్నకి ఒక్కటే మిగిలేది. ఏమీ అనేవారు కాదు. అదే తినేవారు. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే.. ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశారాయన. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై హీరో’. ► హీరోగా మీ విజయాన్ని మీ నాన్నగారూ చూశారా? చూశారు. పిల్లల సక్సెస్ని తల్లిదండ్రులు తమ విజయంగా భావిస్తారు. నేను హీరోగా నటించిన సినిమాల వంద రోజుల వేడుకలకు నాన్న వచ్చారు. వాటిలో తెలుగు సినిమా ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా ఫంక్షన్ ఒకటి. మరణం మన చేతుల్లో లేదు. నాన్న చనిపోయినప్పుడు నాకు పాతికేళ్లు కూడా ఉండవనుకుంటా. ఆయన జ్ఞాపకాలు పదిలంగా మనసులో దాచుకున్నాను. కుమార్తె ఐశ్వర్య, భార్య నివేదితాతో అర్జున్ -
‘కిల్లర్’ సినిమా సక్సెస్మీట్
-
కిల్లర్ రియల్ సక్సెస్
‘‘ఇప్పుడు సినిమాలు హిట్ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్’ చిత్రం రియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్ అన్నారు. విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా నర్వాల్ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన సక్సెస్మీట్లో విజయ్ఆంటోని మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి ‘కిల్లర్’ సినిమాతో నిరూపితమైంది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో అర్జున్గారు నటించడం మా ప్రధానబలం. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. ‘‘దాదాపు 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణగారికి కృతజ్ఞతలు. ‘కిల్లర్’ చిత్రం బాగా ఆడుతోంది. రెండోవారంలో 60థియేటర్స్ పెరగడం ఈ సినిమా విజయానికి సంకేతం. విజయ్ ఆంటోనీ, ఆండ్రూస్ బాగా చేశారు’’ అన్నారు అర్జున్. ‘‘విజయ్ ఆంటోని వల్లే ఈ అవకాశం వచ్చింది. అర్జున్గారు నటించడం హైలైట్. ఈ సినిమా సక్సెస్లో మా టీమ్ కీలకం’’ అన్నారు ఆండ్రూ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంజయ్య, ప్రదీప్, కథానాయిక ఆషిమా నర్వాల్, నటి భానుశ్రీ, సంగీత దర్శకుడు సైమన్ కింగ్ పాల్గొన్నారు. -
పైరసీని ఎంకరేజ్ చేయకండి : విజయ్ ఆంటోని
‘బిచ్చగాడు’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని.. ఇక్కడ కూడా క్రేజ్ను సంపాదించుకున్నాడు. అప్పటినుంచి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ను పలకరించినా.. బిచ్చగాడు రేంజ్ సక్సెస్ను సాధించలేకపోయారు. అయితే ఈ శుక్రవారం కిల్లర్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ కింగ్ అర్జున్తో కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ప్రమోషన్ సరిగా లేక కిల్లర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు గానీ, కోలీవుడ్లో ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా.. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడండని, పైరసీనీ ఎంకరేజ్ చేయకండని విజయ్ ఆంటోని ప్రేక్షకులను కోరారు. మంచి సినిమాలను ఆదరించాలని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. -
వంద సినిమాల్లో ఒకటిలా ఉండదు
‘‘కళకు భాషతో సంబంధం లేదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందర్నీ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా బాగుంది.. పెద్ద హిట్ అవుతుంది.. మళ్లీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలుద్దాం’’ అన్నారు విజయ్ ఆంటోని. అర్జున్, విజయ్ ఆంటోని హీరోలుగా, ఆషిమా నర్వాల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని టి.నరేష్కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోని, అర్జున్.. తమ నటనతో ఆకట్టుకున్నారు. కథ చాలా బాగుంటుంది. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఉత్కంఠ పరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తమిళంలోకి హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పటికైనా సావిత్రిగారంత పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు ఆషిమా నర్వాల్. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. పాటలకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సంగీత దర్శకుడు సైమన్ కె. కింగ్. ‘‘వంద సినిమాల్లో ఒక సినిమాలా ‘కిల్లర్’ ఉండదు.. వంద సినిమాలకు ఒక సినిమాలా ఉంటుంది’’ అని చిత్ర రచయిత భాషా శ్రీ అన్నారు. -
హత్యలకు కారణం ఏంటి?
‘‘కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం నేను సంగీతంపై ఆసక్తిగా లేను. ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే పెట్టి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగు బాగా నేర్చుకున్న తర్వాత టాలీవుడ్లో స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో ప్రదీప్ నిర్మించిన తమిళ చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ అనే టైటిల్తో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 7న కిల్లర్ చిత్రం విడుదల కానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇందులో సీరియల్ కిల్లర్ పాత్ర చేశాను. దర్శకుడు ఆండ్రూస్ నా క్లాస్మేట్. ఈ కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సినిమాలో నేను చెడ్డవాడినా? లేక మంచి వాడినా? అసలు హత్యలకు కారణం ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇది పక్కా కమర్షియల్ మూవీ. వేరే బ్యానర్లో నేను చేసిన తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ‘ఖాకి’, ‘జ్వాల’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
విజయ్ ఆంటోని ‘కిల్లర్’ మూవీ స్టిల్స్
-
థ్రిల్లింగ్ కిల్లర్
యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘కొలైగారన్’. దియా మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘కిల్లర్’ పేరుతో టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ విడుదల చేస్తున్నారు. ఆండ్య్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. రంజాన్ పండగ సందర్భంగా జూన్ 7న ‘కిల్లర్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అర్జున్, విజయ్ ఆంటోనిలకు ఉన్న క్రేజ్తో ఇప్పటికే తెలుగులో మంచి బిజినెస్ జరిగింది. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చి్రత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ అందించిన పాటలు ఓ హైలైట్’’ అన్నారు. ఆశిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, సంపత్రాజ్ తదితరులు నటించారు. -
హత్య చేసిందెవరు?
విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్’. అషిమా కథానాయికగా నటించారు. దియా మూవీస్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్పై టి.నరేష్కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా టి.నరేష్ కుమార్–టి.శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘మర్డర్ మిస్టరీ, క్రైౖమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన చిత్రమిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నెరేషన్తో రక్తి కట్టిస్తుంది. అర్జున్ నటన సినిమాకే హైలైట్. విజయ్ ఆంటోని పాత్ర ఏమిటిన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె.కింగ్, కెమెరా: మ్యూక్స్. -
కొడుక్కి సారీ చెప్పిన నాని!
నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నాని కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. సరదా ట్వీట్లతో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. తాజాగా తన ముద్దుల కుమారుడికి సారీ చెబుతూ ఓ ఫొటోతో కూడిన పోస్ట్ను పంచుకున్నాడు. ఈ ఫొటోలో నాని కుమారుడు ‘మా డాడీ నా పేరు దొంగలించాడు’ అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకోగా.. ఆ పక్కనే కూర్చున్న నాని టీషర్టుపై అర్జున్ 36 అని ఉంది. ఈ ఫొటోకు ‘సారీ రా.. జున్ను తప్పలేదు’ అని క్యాఫ్షన్గా పేర్కొన్నాడు. జెర్సీ చిత్రంలో నాని.. అర్జున్ అనే 36 ఏళ్ల క్రికెటర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన కొడుకు పేరు కూడా అర్జునే కావడంతో.. అతని పేరు దొంగలించక తప్పలేదు.. సారీ రా అంటూ సరదగా ట్వీట్ చేశాడు. ఎమోషనల్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాండల్వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్కు పరిచయం అవుతుండగా.. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. Sorry ra Junnu ...తప్పలేదు 😉 pic.twitter.com/z6RPybO7Ec — Nani (@NameisNani) 18 April 2019 -
హంతకుడు ఎవరు?
అర్జున్, విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్’. ‘హంతకుడు’ అన్నది ఉపశీర్షిక. బి.ప్రదీప్ సమర్పణలో దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రం స్నీక్ పీక్ టీజర్ను రిలీజ్ చేయగా, బిగ్ సీడీని అర్జున్ విడుదల చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘అర్జున్గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే. ఆషిమా ఈ సినిమాతో ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావుగారు నాకు గాడ్ ఫాదర్. భాష్యశ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారు. మేలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేశా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ మంచి మనిషి. ఈ చిత్రంలో ‘కిల్లర్’ ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అన్నారు అర్జున్. ‘‘నాకు తెలుగు రాకున్నా తెలుగు వారికి నచ్చే సినిమా తీశా. విజయ్ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్గారు ఈ సినిమా చేయటమే మా మొదటి సక్సెస్. టెక్నికల్గా నెక్ట్స్ లెవెల్ మూవీ అవుతుంది’’ అన్నారు ఆండ్రూ లూయిస్. సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్, పాటల రచయిత భాష్యశ్రీ, అషిమా నర్వాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మ్యూక్స్. -
వారియర్
మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభుదేవా, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్లాల్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేసిన ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. మోహన్లాల్, సునీల్ శెట్టి, ప్రభుదేవాలపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని సునీల్ శెట్టి లుక్ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఓ హాలీవుడ్ సినిమాలోని వార్ ఫిల్మ్ ఆధారంగా ఆయన లుక్ను డిజైన్ చేశారట. ఈ చిత్రంలో వారియర్గా (యోధుడు) సునీల్శెట్టి నటిస్తున్నారు. -
శ్రీ కొత్త అల్లుడుగారు
చెట్టు మీద ఉన్న శవాన్ని ఎప్పటిలాగే భుజాన వేసుకున్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! ఏదో చెప్పబోవుచున్నావు?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘చెప్పడమా పాడా.... నములుచున్నాను. సంక్రాంతి పిండి వంటలు భలే పసందుగా ఉన్నవి’’ నములుతూనే చెప్పాడు విక్రమార్కుడు.‘‘నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకేనా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఓకే’’ అన్నాడు మురుకులు నములుతూ విక్రమార్కుడు.‘‘విక్రమార్కా! పండక్కి అత్తారింటికి వెళ్లని అల్లుడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నాడంటావా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఎందుకులేడు, ఒకే ఒక్కడున్నాడు’’ అన్నాడు విక్రమార్కుడు అర్ష ముక్క నోట్లో వేసుకుంటూ.‘‘యూ మీన్ అర్జున్?’’ అన్నాడు భేతాళుడు.‘‘కాదెహే... నేను చెప్పేది చె.చె. గురించి’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘చె.చె? అదేం పేరు!’’ ఆశ్చర్యపడ్డాడు భేతాళుడు.‘‘చెంబూరు చెంగయ్య. షార్ట్కర్ట్లో చె.చె. అని పిలుస్తుంటారు’’ వివరించాడు విక్రమార్కుడు.‘‘ఈ చెంగయ్య పండక్కి అత్తారింటికి ఎందుకు వెళ్లడు? ఆ కథాకమామిషు ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు:అనగనగా ఒక చెంగయ్య. అతనికి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన కొన్నిరోజులకు పెద్ద పండగ వచ్చింది.‘‘మీరు పండక్కి తప్పనిసరిగా రావాలి అల్లుడు’’ అని గోముగా అడిగాడు మామ.‘‘అలాగే మామయ్య... తప్పకుండా వస్తాను’’ అంటే లెవల్ పడిపోతుందని...‘‘అబ్బే! కుదరదు మామయ్య.... బోలెడంత పని ఉంది’’ అబద్ధమాడాడు చెంగయ్య.‘‘ఓకే అల్లుడూ...పని ముఖ్యం. పని పట్ల నీ శ్రద్ధ నాకు బాగా నచ్చింది. పనికొచ్చే లక్షణం’’ అని నాన్స్టాప్గా పొగడటం మొదలుపెట్టాడు మామయ్య.ఆయన పొగడ్తల్లో ‘పొగడ్త’ కంటే... ఖర్చు తప్పిందనే సంతోషమే ఎక్కువగా ధ్వనించింది.‘కలికాలం. ఏదో మాట వరసకు పని ఉందంటే, ఖండించాల్సింది పోయి, ఏది ఏమైనా మీరు తప్పకుండా రావాలి అని బతిమిలాడాల్సింది పోయి.... తాపీగా ఓకే అంటాడా’ తనలో తాను కుమిలిపోయాడు చెంగయ్య. అది పండగరోజు.పెద్ద బ్యాగుతో ఊడిపడ్డ అల్లుడిని చూసి ఆటంబాంబును చూసినట్లు అదిరిపడ్డాడు చెంగయ్య.అయినప్పటికీ ఆ అదురు పాటును ముఖంలో కనిపించకుండా...‘‘చాలా సంతోషంగా ఉంది అల్లుడు’’ అంటూ మందులో సోడా కలిపినట్లు నవ్వులో ఏడ్పును కలిపాడు మామయ్య.అల్లుడుగారికి అత్తారింటి మర్యాదలు మొదలయ్యాయి.‘ఆపరేషన్ పిండివంటలు’ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతుంది.‘‘నేను పిండివంటలు పెద్దగా తిననండి’’ అంటున్నాడు అల్లుడు. అయినా తింటూనే ఉన్నాడు!‘‘అయ్యో! కడుపు నిండింది’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘‘ఇక చాలు’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘చాలు బాబోయ్’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.కొద్దిసేపటి తరువాత...అతడి కడుపులో సునామీమొదలైంది.ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అవి ‘స్వచ్ఛ్భారత్’ ‘ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి’ లేని రోజులు. ఎంతటి మొనగాడైనా చెంబట్టుకొని ఊరవతలికి పోవాల్సిందే.కడుపులో ఏదో కీడు శంకించడంతో తినడం ఆపేశాడు చెంగయ్య.వింటి నుంచి దూసుకొచ్చిన బాణంలా ఇంటి వెనక్కి దూసుకొచ్చి చెంబు పట్టుకొని అదే వేగంతో వీధిలోకి పరుగులు తీశాడు.ఇప్పుడు మనం పీపారాయుడి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ రాయుడి ఇంటి ముందు ప్రతి సంక్రాంతికి గొబ్బెమ్మ పెడతారు. ఇందులో విశేషం ఏముంది అందరి ఇండ్ల ముందు గొబ్బెమ్మలు పెడతారనే కదా మీ డౌటు! కానీ ఊళ్లో ఉన్న గొబ్బెమ్మల కంటే ఈ గొబ్బెమ్మ పెద్దది. ఎత్తయినదీనూ!‘గొబ్బెమ్మ అయినా సరే మన తాహతకు తగినట్లు ఉండాలి’ అంటాడు పీపారాయుడు.మరి అలాంటి గొబ్బెమ్మకు ఏమైంది?ఏమీ కాలేదు... కానీ చెంగయ్యకి అయ్యింది.చెంబుతో పరుగెత్తుకుంటూ వస్తున్న చెంగయ్య పీపారాయుడి గొబ్బెమ్మను తాకి బొక్కబోర్లా పడ్డాడు. పడితే పడ్డాడు... కానీ అతని చేతిలోని చెంబు వెళ్లి పీపారాయుడి బట్టతల మీద పడింది.పడితే పడింది కాని చెంబుదెబ్బకు పీపారాయుడి మతి చలించింది.అతని నోటి నుంచి వింతవింత మాటలు వినిపిస్తున్నాయి.వెంటనే డాక్టర్ను పిలిపించారు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని ఏదీ లేదు డాక్టర్!’’ అన్నాడు పీపారాయుడు.‘‘ఎవరయ్యా రాయుడిగారికి మతిచలించింది అని చెప్పింది.... శుభ్రంగా మాట్లాడుతుంటేనూ.... ఆయన మాటల్లో పిచ్చి ఎక్కడిది? ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. అంతేగా!’’ భరోసాగా అన్నాడు డాక్టర్.‘‘నేను చెప్పినదానితో ఏకీభవిస్తారా డాక్టర్?’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత గొప్పగా చెప్పారండీ’’ తన్మయంగా వంకర్లు తిరిగాడు డాక్టరు. ‘‘మీ సూది ఇలా ఇస్తారా డాక్టరు’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఎందుకు?’’ భయంగా అడిగాడు డాక్టర్.‘‘ఆ సూదిబెజ్జంలో దూరుతాను... ఈ ప్రపంచంలో అసాధ్యమైంది లేదు...’’ అంటున్నాడు రాయుడు.‘‘ఓరి నాయనో...’’ అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు డాక్టరు.‘‘మా రాయుడిని విత్ ఇన్ టెన్మినిట్స్లో పిచ్చెక్కిస్తావా? నీకు ఎన్ని గుండెలు?’’ అంటూ చెంగయ్యను చావబాదడమే కాకుండా, ‘‘ఇక ముందు ఎప్పుడూ మా ఊళ్లోకి అడుగుపెట్టవద్దు’’ అని శాసనం చేశారు ఊరి ప్రజలు. ఇక అప్పటి నుంచి అత్తింటివారి ఊరి పేరు వింటే చాలు గజగజా వణికిపోతాడు చెంగయ్య! – యాకుబ్ పాషా -
ప్రయాణం మొదలైంది
భారీ నౌక ప్రయాణానికి సిద్ధమయ్యారు కల్యాణి ప్రియదర్శన్. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది కూడా. మరి ఈ ప్రయాణం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ‘కుంజలీ మరక్కార్’ చిత్రం చూడాల్సిందే. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మోహన్లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్లాల్, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ తండ్రి దర్శకత్వంలో నటిస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. అందుకే ఈ సినిమా తనకు స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షూట్లో శనివారం జాయిన్ అయ్యారు కల్యాణి. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
పడవలు సిద్ధం!
పెద్ద పెద్ద పడవలను రెడీ చేస్తున్నారు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్. ఆల్రెడీ కొన్ని పడవలను సిద్ధం చేశారు కూడా. ఆయన కొత్త వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు. ‘మరాక్కర్–అరబ్బికడలింటే సింహం’ అనే సినిమా కోసమే ఇదంతా. మోహన్లాల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, ప్రణవ్ మోహన్లాల్, కీర్తీ సురేశ్, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘బాహుబలి’ ఫేమ్ సాబు శిరిల్ ఆధ్వర్యంలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ సెట్ ఫొటోలను సోషల్æమీడియాలో షేర్ చేశారు కల్యాణి ప్రియదర్శన్. అలాగే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారామె. సముద్రపు దొంగల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇప్పుడు అర్థం అయ్యింది కదా... దర్శకుడు ప్రియదర్శన్ పడవలను ఎందుకు తయారు చేస్తున్నారో! -
ఇంకేం ఇంకేం కావాలే...
క్లాప్బోర్డులు, ఆర్క్ లైట్లు, స్టార్ట్ కెమెరా, షాట్ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్ ప్లేసెస్ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్ రీ–యూనియన్’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. ఈసారి వీళ్లు మిస్సింగ్. వైట్ అండ్ బ్లూ కలర్ని డ్రెస్కోడ్గా ఫిక్స్ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్లాల్, సీనియర్ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్, శరత్కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్ చేశారట. మోహన్లాల్ కేరళలోని సంప్రదాయపు బోట్ నడుపుతున్నట్టు యాక్ట్ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం. -
ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో సౌరభ్కు స్వర్ణం
భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి ఆసియా ఎయిర్గన్ షూటింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో సౌరభ్ 239.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. అర్జున్ (భారత్, 237.7 పాయింట్లు) రజతం, హువాంగ్ వై టి (చైనీస్తైపీ, 218 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు. టీమ్ విభాగంలో సౌరభ్, అర్జున్ సింగ్ చీమా, అన్మోల్ జైన్లతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లతో పసిడి చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 10 (3 స్వర్ణ, 5 రజత, 2 కాంస్య) పతకాలు సాధించింది. -
అందమైన లవ్స్టోరీ
అర్జున్, మధుసూదన్, పావని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అందమా అందుమా’. శ్రీ కృపామణి ఫిలిమ్స్ పతాకంపై ప్రళయ కావేరి మధుసూదన్రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రళయ కావేరి మధుసూదన్రావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. కథానుగుణంగా ఉన్న నాలుగు ఫైట్స్ని అవినాష్ మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. పావని ఇప్పటి వరకూ పలు సినిమాలు చేసినా ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అర్జున్కి మంచి పేరుతో పాటు నటుడిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథ పరంగా సాగుతుంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. ఆత్రేయ, కెమెరా: ధీరజ్. -
మీటూ కేసులో అర్జున్ అరెస్ట్ అవుతారా?
యాక్షన్కింగ్ అర్జున్ అరెస్ట్ అవుతారా? ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం ఇదే. మీటూ సినీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. దీని ఎఫెక్ట్ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మీటూ కారణంగా కేంద్రమంత్రే పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. కోలీవుడ్లో గాయనీ చిన్మయి ప్రముఖ గీతర చయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీటూతో బీటలు వేసిన విషయం తెలిసిందే. ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. చిన్మయి ఆరోపణలు కొట్టిపారేసిన వైరముత్తు ఆమెపై కోర్టుకెళ్లతానని బెదిరించినా, అలాంటి ప్రయత్నానికి సాహసించలేదు. ఇక మరో మలయాళీ నటి శ్రుతీహరిహరన్ సీనియర్ నటుడు అర్జున్పై లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. ఆమె ధైర్యాన్ని పలువురు శభాష్ అంటూ అభినందించారు. నటుడు ప్రకాశ్రాజ్ అయితే నటుడు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కూడా. ఇక నటుడు అర్జున్ కూడా నటి శ్రుతీహరిహరన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే బెంగళూర్ సిటీ సివిల్ కోర్టులో శ్రుతిహరిహరన్పై రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక నటి శ్రుతీహరిహరన్ కూడా అర్జున్ను ఢీకొనడానికి సిద్ధమైంది. బెంగళూర్లోని కబ్బన్పార్క్ పోలీసులకు అర్జున్పై ఫిర్యాదు చేసింది. అందులో నటుడు అర్జున్ 2015లో ఒక చిత్రంలో నటిస్తుండగా లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. శ్రుతీహరిహరన్ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్పై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటుడు అర్జున్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. -
హీరో అర్జున్పై నటి శ్రుతి ఫిర్యాదు
బెంగళూరు: బహుబాషా నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ లైంగికంగా వేధిస్తూ తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడని బెంగళూరు లోని పోలీస్స్టేషన్లో హీరోయిన్ శ్రుతి హరిహరణ్ ఫిర్యాదు చేశారు. 2016లో విడుదలైన ద్విభాషా చిత్రం ‘విస్మయ’ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 354, 354ఏ(మహిళల గౌరవాన్ని భంగపర్చడం), 506(బెదిరింపులకు పాల్పడటం), 509(మాటలు చేష్టల ద్వారా గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ అర్జున్ ఆమెపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
మీటూ...పై మాట మార్చిన నటుడు ప్రకాశ్ రాజ్
కర్ణాటక, యశవంతపుర : అర్జున్పై మీటూ ఆరోపణలు చేసిన శ్రుతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ప్రకాశ్ రాజ్ మాటమార్చారు. తాను ఆయన నిందితుడంటూ ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్లో స్పందించగా మంత్రి జయమాల కూడా స్పందించారు. శ్రుతి ఆరోపించినట్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదన్నారు. మాటమార్చిన ప్రకాశ్ రాజ్ నటుడు అర్జన్పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలపై మొదట శ్రుతిహరిహరన్ తరపున నిలబడిన నటుడు ప్రకాశ్ రాజ్ మాట మార్చారు. అందులో అర్జున్ నిందితుడంటూ ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ట్విట్టర్ ద్వారా తనకు అర్జున్ మంచి స్నేహితుడని, సినీ రంగంలో తన సహ నటుడని, అతడిని చాలా దగ్గర నుంచి చూశానని, అయితే శ్రుతి ఆరోపణలు నేపథ్యంలో ఇద్దరి ఒక వేదికపై పిలిచి సమస్య పరిష్కరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. మీటూ దుర్వినియోగం కాకూడదు : నటి, మంత్రి జయమాలా మీటూ వేదికను దుర్వినియోగం చేసుకోకూడదని కన్నడ సంస్కతిశాఖ మంత్రిఇ జయమాలా అన్నారు. ఇదీ మహిళలకు ఇది ఒక బలమైన వేదిక అని అన్నారు. గురువారం ఆమె లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బైందూరు తాలూకా నాగూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆధార రహిత మాటలను పత్రికల ముందు నిలబడి చెప్పటం సరికాదన్నారు. నటుడు అర్జున్ మంచి నటుడని అమె సమర్థించుకున్నారు. -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్లో కన్నడ స్క్రీన్ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్ప్లే రైటర్గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్మెంట్స్ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
అర్జున్ పై నటీమణుల ప్రకటనలు
శాండల్వుడ్లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరో అర్జున్ సర్జాను తనను వేధిం చారని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండించడం జరిగిపోయింది. మేఘనా గాంవ్కర్, అవంతిక షెట్టి శ్రుతికి సోమవారం మద్దతు ప్రకటించగా, ఈ తరుణంలో అర్జున్కు అండగా ఖుష్బు, హర్షిక, తార గళమెత్తారు. అర్జున్ జెంటిల్మెన్ అన్నారు. కర్ణాటక, యశవంతపుర: మీటూ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు అర్జున్కు పలువురు నటీనటులు అండగా నిలిచారు. అర్జున్పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలను ఖండిస్తూ ప్రముఖ నటి ఖుష్బూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘శ్రుతి ఆరోపించిన విధమైన వ్యక్తి అర్జున్ కాదు. ప్రతి ఒక్కరికీ ఆయన మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. అయన అలా చేయలేదనటానికి నేరు గ్యారంటీ ఇస్తాను. 34 ఏళ్ల నుండి సినిమా రంగంలో నాకు పరిచయం. నేను నటించిన మొదటి సినిమాకు ఆయన హీరో. ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదదు. శ్రుతి హరిహరన్ ఆరోపణలు విని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక కుటుంబానికి తండ్రైన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆరోపణలు చేసే ముందు యోచించాలి. ఇప్పుడు అర్జున్కు నేను మద్దతు ఇవ్వకుంటే 34 ఏళ్ల స్నేహానికి అవమానం కలుగుతుంది’ అని ఆమె చెప్పారు. అలాంటి వ్యక్తులా మీ టూ అనేది: హర్షిక అర్జున్కు అందాల నటీమణి హర్షికా పూణచ్ఛ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రుతి హరిహరన్పై పరోక్షంగా ఆరోపణల వర్షం కురిపించారు. ‘నేడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే నాడు ప్రముఖు వ్యక్తుల జతలో అర్థనగ్న ప్రదర్శనలు చేశారు’ అని హర్షిక సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్డడం సంచలనం కలిగిస్తోంది. ‘మీటూ ఆరోపణలను గమనిస్తున్నాను. అయితే ఒక మహిళగా నేను చిత్రరంగాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా. ఒక మహిళను గౌరవించటం ధర్మం. అయితే పబ్లిసిటీ కోసం ఒక కుటుంబాన్ని విడదీసి వారి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దశాబ్దాలుగా చిత్ర రంగంలో ఉంటున్న వ్యక్తుల పేరును ఒక అసత్యం ద్వారా చెడగొట్టవద్దు. అ వ్యక్తి (అర్జున్) ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో గమనించాలి. పేరు రావడానికి ఏం చేసినా సరిపోతుంది. పేరు వచ్చిన తరువాత తను ఏం మాట్లాడినా సరిపోతుందని భావించటం పద్ధతి కాదు’ అని శ్రుతిపై మండిపడ్డారు. పేరున్న నిర్మాత తనకు ఒక వీడియో చూపించారని, మీటూ అంటున్న నటి ఆ వ్యక్తి భుజం మీద నిద్రిస్తున్న వీడియోను చూశానని, అలాంటి మీ టూ అంటుంటే సిగ్గేస్తోందని చెప్పారు. అర్జున్ సర్జా మంచోడు : నటి తార మండ్య: మీటూ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ నాయకురాలు, నటి తారా అనురాధ తెలిపారు. ప్రచారంలో ఆమె మాట్లాడారు. బహుభాషా నటుడు అర్జున్ సర్జాపై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన ఆరోపణల వ్యవహారంలో అర్జున్ సర్జాకే మద్దతు తెలుపుతున్నామన్నారు. అర్జున్తో తాము గతంలో పలు చిత్రాల్లో కలసి నటించామని ఎప్పుడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. అయితే నటి శృతి ఆరోపణలు అవాస్తమనేది తమ ఉద్దేశం కాదన్నారు. అర్జున్పై ఎందుకు ఆరోపణలు చేశారో తమకు అంతుచిక్కడం లేదన్నారు. -
డబ్బు ఇచ్చి అమ్మాయిలను..
పెరంబూరు: నటుడు అర్జున్ అభిమానుల నుంచి తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని నటి శ్రుతీహరిహరన్ ఆరోపించింది. దేశంలో మీటూ కలకలం రోజురోజుకు పెరిగిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది రచ్చ రచ్చగా మారింది. మీటూ ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నా, గాయని చిన్మయి గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇది ఒక ఉప్పెనలా చెలరేగింది. నటుడు అర్జున్ను కూడా ఈ మీటూ సెగలు తాకాయి. మలయాళ నటి శ్రుతీహరిహరన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. షూటింగ్ పూర్తి కాగానే క్యారవాన్కు రమ్మని సినీ కార్మికుడితో చెప్పేవారని, పలు మార్లు రాత్రి విందుకు ఆహ్వానించి వేధించారని ఆరోపించింది. శ్రుతీ హరిహరన్ ఆరోపణలను అర్జున్ కొట్టి పారేస్తూ, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆదివారం మళ్లీ ఆరోపణలు చేసింది. ఈమె కేరళాలో జరిగిన హక్కులు సమధర్మ సినీ శాఖ అనే సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నటుడు అర్జున్పై లైంగిక ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారంది. అపరిచితుల ఫోన్కాల్స్ నిరాటంకంగా వస్తున్నాయని చెప్పింది. ఈ సందర్భంగా ఏడాది దాటిన తరువాత ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు తాను అప్పుడే తన ఆవేదనను, వ్యతిరేకతను ఆ చిత్ర దర్శకుడి వద్ద వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా ఆ చిత్ర రిహార్సల్స్కు వెళ్లడం మానేశానని, అంతకంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తాను ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు మీటూ ద్వారా పలువురు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా చెప్పడానికి ముందుకు రావడంతో తాను తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. సహాయ నటి ఆరోపణలు.. నటుడు అర్జున్పై మరో సహాయ నటి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒక చిత్ర షూటింగ్లో వేరే యువతిని తన గదికి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని, అదే విధంగా ఆర్టిస్ట్ సప్లయర్కు డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని ఆ సహాయ నటి ఆరోపణలు చేస్తూ ఒక టీవీకిచ్చిన భేటీలో పేర్కొంది. -
అప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు?
‘‘నిబుణన్’ షూటింగ్లో నాతో అర్జున్ అసభ్యకరంగా వ్యవహరించారు. సినిమాను ఆపడం ఇష్టం లేకే ఈ విషయాన్ని అప్పుడు కాకుండా ఇప్పుడు చెబుతున్నా’’ అని నటి శ్రుతీ హరిహరన్ పేర్కొనడం సంచలనం రేపింది. నటుడు ప్రకాశ్రాజ్తో పాటు మరికొందరు శ్రుతీకి మద్దతుగా నిలిస్తే, ‘నిబుణన్’ చిత్రదర్శకుడు అరుణ్ వైద్యనాథన్తో పాటు ఇంకొందరు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా అర్జున్ తనయ, నటి ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘మీటూ’ ఉద్యమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు. తన సినిమా కథలను వినమని నాన్న నాకు చెబుతుంటారు. ‘నిబుణన్’ కథలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగిస్తే కానీ చేయనని మా నాన్న చెప్పినప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు? ఆ సినిమాకి ఆమె పనిచేసింది 5 రోజులే. ఆ 5 రోజుల్లో నాన్న వల్ల ఇబ్బంది కలిగిందని వెల్లడించారు. రిసార్ట్కి, డిన్నర్కి పిలిచేంత టైమ్ నాన్నకు లేదు. అస్సలు మా నాన్న పబ్కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్కు రమ్మంటారా? శ్రుతి సొంత లాభం కోసమే ఇలా చేస్తున్నారు’’ అన్నారు ఐశ్వర్య. -
సెల్ఫీ తీసుకోవాల్సింది
నటుడు అర్జున్పై కన్నడ నటి శ్రుతీ హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రుతికి మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు మరో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ‘‘2016 నవంబర్లో ఓ టాక్ షో టైమ్లో శ్రుతీ నాకు ఈ సంఘటన చెప్పింది. కాకపోతే అప్పుడు పేరు చెప్పలేదు. ఏం జరిగిందో ఇప్పుడు బయటకు చెప్పింది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని షేర్ చేశారు శ్రద్ధా. ‘‘ఓసారి బెంగళూరు నుంచి కొచ్చిన్కి బస్లో వెళుతున్నాను. ఓ వ్యక్తి చేయి నన్ను అసభ్యంగా తాకడంతో నిద్ర నుంచి మేల్కొన్నాను. అందుకు నా దగ్గర ఏటువంటి ఆధారం లేదు. ఆ చేదు అనుభవం మాత్రం మిగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతనితో పాటు, ఆ చేయితో కూడా ఓ సెల్ఫీ తీసుకొని ఉంటే అది సాక్ష్యంగా ఉండేదేమో?’’ అని పేర్కొన్నారామె. మరోవైపు శ్రుతీ హరిహరన్కు నటుడు ప్రకాష్రాజ్ మద్దతు తెలిపారు. ‘‘నా వృత్తిపరమైన కారణాల వల్ల నా పేరును చెప్పదలచుకోలేదు. శ్రుతీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. అర్జున్తో ఓ సందర్భంలో ఇబ్బంది పడ్డాను. ముందు అతడిని ‘జెంటిల్మెన్’ అని పిలవడం ఆపండి’’అంటూ మరో మహిళ అర్జున్ను ఆరోపించినట్లుగా, ట్వీటర్లో పోస్ట్ చేశారు శ్రుతీ హరిహరన్. ఇదిలా ఉంటే అర్జున్ పరిపూర్ణమైన ‘జెంటిల్మెన్’ అంటూ ఆయనతో ‘కాంట్రాక్ట్’ సినిమాలో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ సోనీ చరిష్టా పేర్కొన్నారు. -
అర్జున్ అసలు సిసలైన జెంటిల్మెన్ : హీరోయిన్
మీటూ ప్రకంపనలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. హాలీవుడ్లో మొదలై బాలీవుడ్లో తారస్థాయికి చేరుకుంటున్న ఈ ఉద్యమంలో తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ పేరు రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అర్జున్ కూడా సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయితే ఇదే విషయంపై మరో హీరోయిన్ స్పందించారు. అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంట్రాక్ట్’లో నటిస్తున్న సోనీ చరిష్టా ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. తనతో నటించే హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని నమ్మలేకపోతున్నానని, కాంట్రాక్ట్ అనే చిత్రంలో ఆయనతో కలిసి నటించానని, ఆయన అసలుసిసలు జెంటిల్మెన్ అని అన్నారు. ‘మీ టూ’ మెల్లగా పక్కదారి పడుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్జున్, సోనీ చరిష్టా నటించిన కాంట్రాక్ట్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. -
అర్జున్ నన్ను వేధించారు
‘మీటూ’ ఉద్యమం సౌత్లోనూ ప్రకంపనలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘మీటూ’ ఉద్యమానికి చాలా మంది సౌత్ కథానాయికలు మద్దతు తెలిపారు. ఇటీవల కన్నడ నటి సంగీతా బాత్ తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. తాజాగా కన్నడ నటి శ్రుతీ హరిహరన్ కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్’ సెట్స్లో (కన్నడలో ‘విస్మయ’) నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ‘‘నా లైఫ్లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్ను స్టార్ట్ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్తో వర్క్ చేసే చాన్స్ రాగానే ఎగై్జట్ అయ్యాను. కానీ ‘విస్మయ’ సినిమా సెట్లో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్ఫుల్గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్గా చెబుతున్నాను’’ అంటూ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు శ్రుతీ హరిహరన్. కాల్స్, మేసేజ్లు చేయవద్దు ‘‘సినిమాలో ఏ సంఘటన గురించి అయితే ఇంత వివాదం జరగుతుందో ఆ సీన్ను నేను స్క్రిప్టింగ్ టైమ్లో చాలా రొమాంటిక్గా రాశాను. అది చదువుతున్నప్పుడే ‘నాకు టీనేజ్లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్లో నటించలేను’ అని అర్జున్ సార్ చెప్పారు. ఆయన కోరికే మేరకే ఆ సీన్లో రొమాంటిక్ ఫ్లేవర్ను తగ్గించాను. ఇప్పుడు అర్జున్పై శ్రుతీ హరిహరన్ చేసిన ఆరోపణలు విని షాక్ అయ్యాను. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. మినిట్ టు మినిట్ నాకు గుర్తులేదు. ఈ సినిమా షూట్ టైమ్లో సెట్లో మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. అర్జున్, శ్రుతీ ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ‘‘కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు మహిళలకు అన్ని చోట్లా సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిచ్యువేషన్స్ను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని ‘మీటూ’ గురించి ఆయన చెప్పారు. ఇక ఈ వివాదం గురించి ఎవరూ నాకు ఫోన్ కానీ మేసేజ్ కానీ చేయవద్దు. ఎందుకంటే.. నేను చెప్పాల్సినదంతా ఈ పోస్ట్లోనే చెప్పాను’’ అని పేర్కొన్నారు అరుణ్. చట్టపరమైన చర్యలు? ఈ సంగతి ఇలా ఉంచితే... శ్రుతీ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు అర్జున్. ‘‘మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 150 సినిమాల్లో నటించా. దాదాపు 60 మంది హీరోయిన్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పట్లో ఆ సీన్ కాస్త రొమాంటిక్గా ఉందని నేను డైరెక్టర్తో కూడా చెప్పాను. ఇప్పుడు శ్రుతీ ఎందుకు ఇలా నాపై ఆరోపణలు చేస్తుందో అర్థం కావడం లేదు’’ అని అర్జున్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. శ్రుతీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్జున్ ఆలోచిస్తున్నారని కోలీవుడ్ టాక్. -
కావలి కాస్తా!
సముద్రతీరం నుంచి దేశం లోపలికి వచ్చే శత్రువులను అడ్డుకోవడానికి కావలి కాయనున్నారట మలయాళ స్టార్ మోహన్లాల్. ఇది ఆయన కొత్త సినిమాలో భాగంగానే. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్లాల్ టైటిల్ రోల్లో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే బహు భాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దంలో కాలికట్ ప్రాంతంలో (ఇప్పటి కేరళ) ఉన్న కుంజాలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని మాలీవుడ్ టాక్. ఇందులో మోహన్లాల్ తనయుడు ప్రణవ్ మోహన్లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ టీమ్లోకి ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి జాయిన్ అయ్యారు. కేరళ పిరవి డే సందర్భంగా ఈ సినిమా హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో స్టార్ట్ అవుతుందని టాక్. దాదాపు వంద కోట్ల బడ్జెట్తో నిర్మించనున్నారట. -
పండక్కి ప్రారంభం
క్రికెట్ ప్రాక్టీస్ను స్పీడ్ అప్ చేశారట హీరో నాని. ఎందుకంటే ఆయన మ్యాచ్ ఆడే టైమ్ దగ్గరపడుతోంది. మరి... నాని జట్టులోని సభ్యులు ఎవరు? టీమ్ కెప్టెన్ నానీనేనా? ప్రత్యర్థి టీమ్ ఎవరు? అనే ఇలాంటి బోలెడు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కాస్త టైమ్ పడుతుంది. ‘మళ్ళీ రావా’ వంటి మంచి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. ‘ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్’ అనేది ట్యాగ్ లైన్. సితార ఎంటైర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా టైమ్లో స్టార్ట్ అవుతుందని తాజా సమాచారం. అంటే నాని కొత్త సినిమా పండక్కి ప్రారంభం అన్నమాట. ఇందులో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఒక హీరోయిన్గా నిత్యా మీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. కాగా నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’ ఈ నెల 27న విడుదల కానుంది. -
నా టాప్ టెన్ మూవీస్లో ‘కురుక్షేత్రం’ ఒకటి
‘‘35 సంవత్సరాల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శక–నిర్మాతలతో పనిచేశా. స్థిరంగా కష్టపడుతూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ‘కురుక్షేత్రం’ నా 150వ సినిమా. నేను నటించిన టాప్ టెన్ మూవీస్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్ పాత్ర చేశా. మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అర్జున్ అన్నారు. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కురుక్షేత్రం’. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్ని సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్గారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. అర్జున్గారు డైరెక్టర్స్ యాక్టర్. 150 సినిమాలు చేసినా ఎక్కడా గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్లా ఉంటారు. ప్రసన్న, వరలక్ష్మి, చందన అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అర్జున్గారి 150వ సినిమా ‘కురుక్షేత్రం’ను మా బ్యానర్లో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్యాషన్ స్టూడియోస్ అధినేత ఉమేష్ రెడ్డి. ‘‘దండుపాళ్యం 3’ సినిమా తర్వాత మేం తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం ‘కురుక్షేత్రం’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ అంటే నాకు ఎంతో అభిమానం. మంచి మనిషి. మా అందరికీ ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్. నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయికృష్ణ పాల్గొన్నారు. -
‘కురుక్షేత్రం’ ప్రీ రిలీజ్ వేడుక
-
మల్టీస్టారర్లో హీరోగా..!
విలన్గా టర్న్ అయిన తరువాత ఫుల్ బిజీ అయిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, అడపాదడపా హీరోగానూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల పటేల్ సర్ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట. కొత్త దర్శకుడు అన్బరసన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్, జాకీష్రాఫ్లు కూడా హీరోలుగా నటిస్తున్నారట. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై వినాయకచవితి రోజు అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నారు ఫుల్ బిజీగా ఉన్నారు జగపతిబాబు. -
చవితికి కురుక్షేత్రం
యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్పై శ్రీనివాస్ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నాకు తెలుగు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకే.. తెలుగు రిలీజ్ కోసం ఆత్రుతగా ఉన్నా’’ అన్నారు. ‘‘దాదాపు 200కు పైగా థియేటర్స్లో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అర్జున్ 150వ సినిమాని మా బ్యానర్లో రిలీజ్ చేయడం హ్యాపీ’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేవన్నీ ‘కురుక్షేత్రం’లో ఉంటాయి. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల. -
ఊహించలేం!
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 150వ చిత్రం ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్ మీసాల మాట్లాడుతూ– ‘‘అర్జున్ ఒక భిన్నమైన పోలీసాధికారిగా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్గా ఈ సినిమా అలరించనుంది. హీరో నాని రిలీజ్ చేసిన ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్లాల్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ ‘కురుక్షేత్రం’ సినిమాని ఆసక్తిగా మలిచారు. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. వినాయక చవితి సందర్భంగా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల. -
జెంటిల్మేన్ వల్ల రెస్పెక్ట్ వచ్చింది
‘జెంటిల్మెన్’ సినిమా గురించి అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి ముందు నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో ఆ సినిమాను ‘రౌడీ పోలీస్’ పేరుతో రిలీజ్ చేశాం. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా నేనే చేసుకున్నాను. ఆ సినిమా విజయంతో మళ్లీ నేను మంచి పొజిషన్కు వచ్చాను. అంతకుముందు నేను చేసిన సినిమాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాను. అప్పుడు నేను చేసిన అప్పుల వల్ల నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఆ బాధలో ఉండి, ఇండస్ట్రీలోని ఎవ్వరినీ కలవటానికి ఇష్టపడలేదు. అప్పుడు శంకర్ నా దగ్గరికి ఓ కథ తీసుకుని వచ్చారు. ఆయన పదిసార్లు నా దగ్గరికి వచ్చినా నేను వినటానికి ఇష్టపడలేదు. ఫైనల్గా ఓ రోజు శంకర్ మా ఇంటికి వచ్చి ‘సార్ మీరు సినిమా చెయ్యొద్దు. కానీ ఓ సారి నా సినిమా కథ వినండి’ అన్నారు. అప్పుడు ‘జెంటిల్మేన్’ కథ విన్నాను. కథ విన్న వెంటనే ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా పోయింది. కథ చెప్పేటప్పుడే చిన్న చిన్న డిటెయిల్స్ కూడా చెప్పారు. అయితే కొత్త దర్శకుడు సినిమా ఎలా తీస్తాడో అనే అనుమానం ఉండేది. కానీ శంకర్ ఒక విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైమ్లో నా మార్కెట్కంటే మరో రెండు రెట్లు అదనంగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు చిత్రనిర్మాత కుంజుమోన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు కుంజుమోన్ ‘నువ్వు స్టేట్ అవార్డ్ దక్కించుకుంటావు’ అనేవారు. అది నిజమైంది. నాకైతే ‘జెంటిల్మేన్’ వచ్చి 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నటిస్తున్నానంటే కారణం హార్డ్వర్క్. అలాగే మన బిహేవియర్లో భయం, బాధ్యత ఉండాలి. ఇక్కడ భయం అంటే నా ఉద్దేశం.. ప్రొడ్యూసర్ మనపై డబ్బు పెట్టాలి అంటే, జనం మనకోసం టిక్కెట్ కొనుక్కుని వస్తున్నారంటే మనం చాలా భయంగా ఉండాల్సిందే. ఆ భయమే మనకు శ్రీరామరక్ష. ‘జెంటిల్మేన్’ సినిమా వల్ల డబ్బు కాదు.. రెస్పెక్ట్ వచ్చింది’’ అన్నారు. -
'గ్రాండ్మాస్టర్' అర్జున్
భారత చెస్లో అద్భుతం చోటు చేసుకుంది. రోజు తేడాలో ముగ్గురు భారత ఆటగాళ్లు గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సంపాదించారు. అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన 14 ఏళ్ల ఎరిగైసి అర్జున్... కేరళకు చెందిన 14 ఏళ్ల నిహాల్ సరీన్ జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ను సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇటలీలో జరిగిన స్పిలిమ్బెర్గో ఓపెన్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకటరామన్ మూడో జీఎం నార్మ్ గెల్చుకున్నాడు. ఈ క్రమంలో నిహాల్ భారత్ నుంచి 53వ గ్రాండ్మాస్టర్గా... అర్జున్ 54వ గ్రాండ్మాస్టర్గా... కార్తీక్ 55వ గ్రాండ్మాస్టర్గా అవతరించారు. అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష భరతకోటి కూడా మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. అయితే జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్కు 26 పాయింట్ల దూరంలో ఉండటంతో ఈ ఘనత అందుకోవడానికి హర్ష మరికొంత కాలం వేచి చూడనున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఊహకందని ఎత్తులు వేస్తూ... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను చిత్తు చేస్తూ... చిరుప్రాయంలోనే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆ కుర్రాడు తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసి చూపెట్టాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించి అబ్బురపరిచాడు. ఏదో సరదా కోసం చెస్ ఆడటం మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆ ఆటనే తన కెరీర్గా మల్చుకున్నాడు. ఇప్పుడు అందరూ గర్వపడేలా చేస్తూ... చెస్ క్రీడాకారుల జీవిత లక్ష్యమైన గ్రాండ్మాస్టర్ హోదాను 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయస్సులోనే సాధించి ఔరా అనిపించిన ఆ కుర్రాడే ఎరిగైసి అర్జున్. వరంగల్లోని హన్మకొండకు చెందిన అర్జున్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో బుధవారం ముగిసిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ను దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా అతనికి 17వ స్థానం లభించింది. అర్జున్ నలుగురు గ్రాండ్మాస్టర్స్ పెట్రోసియాన్ (అర్మేనియా), అహ్మద్ (ఈజిప్ట్), అమీన్ బాసెమ్ (ఈజిప్ట్), సనన్ (రష్యా)లతో జరిగిన వరుస గేమ్లను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. టోర్నీ మొత్తంలో ఒక గేమ్లో మాత్రమే ఓడిన అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి, మిగతా నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో మంగళవారమే జీఎం మూడో నార్మ్ అందుకొని జీఎం హోదా ఖాయం చేసుకున్న నిహాల్ సరీన్ 5.5 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచాడు. ఎనిమిది నెలల్లోనే... ఈ ఏడాది జనవరిలో అర్జున్ ఖాతాలో కనీసం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కూడా లేదు. కానీ ఎనిమిది నెలల్లో అర్జున్ అద్భుతమే చేశాడు. జనవరిలో జరిగిన ఐఐఎఫ్ఎల్ ముంబై అంతర్జాతీయ టోర్నీలో తొలి ఐఎం నార్మ్... ఏరోఫ్లోట్ ఓపెన్లో రెండో ఐఎం నార్మ్... మార్చిలో హెచ్డీ బ్యాంక్ వియత్నాం టోర్నీలో మూడో ఐఎం నార్మ్ దక్కించుకొని ఐఎం హోదా ఖాయం చేసుకున్నాడు. మేలో జరిగిన కోల్కతా ఓపెన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సాధించడంతోపాటు 2500 ఎలో రేటింగ్ను అందుకున్నాడు. జూలైలో సెర్బియాలో జరిగిన థర్డ్ శాటర్డే–80 టోర్నీలో రెండో జీఎం నార్మ్ను పొందిన అతను బుధవారం అబుదాబి మాస్టర్స్ టోర్నమెంట్లో చివరిదైన మూడో జీఎం నార్మ్ను సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ... వరంగల్లో కోచ్ బొల్లం సంపత్ వద్ద ఎనిమిదేళ్ల ప్రాయంలో చెస్లో ఓనమాలు నేర్చుకున్న అర్జున్ ఆ తర్వాత మరో కోచ్ సుదర్శన్ వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అనంతరం రెండేళ్లపాటు కోచ్ రామరాజు వద్ద శిక్షణ పొందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో అండర్–13 విభాగంలో స్వర్ణం నెగ్గాడు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంపికైకొరియాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నాడు. అర్జున్ నిలకడగా విజయాలు సాధిస్తుండటంతో అతని తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరావు, జ్యోతి కూడా తమవంతుగా ప్రోత్సాహం అందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ గ్రాండ్మాస్టర్ విక్టర్ మిఖాలెవ్స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్న అర్జున్... గతేడాది ఆసియా చాంపియన్ షిప్లో స్వర్ణం, ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో రజతం... కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచాడు. అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష 6.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ వర్గీకరించగా హర్షకు 13వ స్థానం దక్కింది. 9వ రౌండ్లో 18 ఏళ్ల హర్ష 42 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్మాస్టర్ లెవాన్పై... 8వ రౌండ్లో 49 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్మాస్టర్ వొకాటురో డానియల్ను ఓడించాడు. ఈ ప్రదర్శనతో హర్షకు మూడో జీఎం నార్మ్ దక్కింది. అయితే 2500 ఎలో రేటింగ్కు హర్ష దూరంగా ఉండటంతో అతనికి జీఎం హోదా రావడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ ఇటలీలో జరిగిన స్పిలిమ్బెర్గో ఓపెన్లో 6 పాయింట్లు సాధించి తొమ్మిదో ర్యాంక్ను పొందాడు. ఈ క్రమంలో మూడో జీఎం నార్మ్ కూడా పొంది జీఎం హోదా ఖాయం చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన సాంట్స్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్... ఈ ఏడాది జూన్లో భువనేశ్వర్లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నీలో రెండో జీఎం నార్మ్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎం అయిన ఐదో ప్లేయర్ కార్తీక్. ఇంతకుముందు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ఈ ఘనత సాధించారు. -
జీఎం పెట్రోసియాన్ను నిలువరించిన అర్జున్
న్యూఢిల్లీ: అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. అర్మేనియా గ్రాండ్మాస్టర్ (జీఎం) పెట్రోసియాన్ టిగ్రాన్తో శనివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను అర్జున్ 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి, రాజా రిత్విక్లు కూడా తమ ఐదో రౌండ్ గేమ్లను ‘డ్రా’గా ముగించారు. జయకుమార్ (భారత్)తో జరిగిన గేమ్ను రిత్విక్ 39 ఎత్తుల్లో... పద్మిని రౌత్ (భారత్)తో జరిగిన గేమ్ను హర్ష 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. -
అర్జున్కు రెండో గెలుపు
న్యూఢిల్లీ: అబుదాబి మాస్టర్స్ చెస్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువతార ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. బుధవారం అబుదాబిలో జరిగిన రెండో గేమ్లో అర్జున్ 36 ఎత్తుల్లో భారత్కే చెందిన రక్షితపై గెలుపొందాడు. తొలి రౌండ్లో అర్జున్ 34 ఎత్తుల్లో దుష్యంత్ శర్మను ఓడించాడు. తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి, రాజా రిత్విక్ విశేష ప్రతిభ కనబరిచారు. తొలి రౌండ్లో మిచెల్లి కాథరీనాపై రాజా రిత్విక్ గెలిచి... రొమేనియా గ్రాండ్మాస్టర్ కాన్స్టన్టిన్తో జరిగిన రెండో గేమ్ను ‘డ్రా’గా ముగించడం విశేషం. మరోవైపు మూడో జీఎం నార్మ్ సాధించాలనే పట్టుదలతో ఉన్న హర్ష తొలి రౌండ్లో లియోన్ ల్యూక్ను ఓడించి... అర్మేనియా గ్రాండ్మాస్టర్ గాబ్రియేల్ సర్గాసియాన్తో జరిగిన రెండో గేమ్ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ లలిత్ బాబు తొలి గేమ్లో వంతిక అగర్వాల్పై గెలిచి... రాహుల్తో జరిగిన రెండో గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. -
రాయ్లక్ష్మీ కౌగిలించుకోమంది
తమిళసినిమా: నటి రాయ్లక్ష్మి భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యాన్నిచ్చిందని వర్ధమాన నటుడు అర్జున్ పేర్కొన్నాడు. ఎక్స్ వీడియోస్ చిత్రంలో నెగెటివ్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడీయన. ఈయన తొలి తమిళ చిత్రం పుళల్ అట. ఆ తరువాత ఆర్య, బాబీసింహా హీరోలుగా నటించిన బెంగుళూర్ డేస్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. అందులో నటి రాయ్ లక్ష్మి లవర్గా నటించాడు. చాలా మంది నటనపై మోహంతో సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. అర్జున్ రంగప్రవేశమే వేరే మాదిరిగా జరిగిందట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే. నాకు స్వతహాగా బిడియం ఎక్కువ. నా స్నేహితులు కెమెరా ముందు నిలబడి నటిస్తే బిడియం పోతుందని చెప్పి మోడలింగ్ రంగంలోకి పంపారు. ఆ సమయంలోనే విష్ణు అనే మిత్రుడి ద్వారా పుగళ్ చిత్రంలో నటించడానికి డాన్స్, నటన తెలిసిన వారు కావాలన్న విషయం తెలిసి ప్రయత్నించగా అవకాశం వచ్చింది. తరువాత ఎంబీఏ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో ట్రైనింగ్ కోసం రిసెప్షన్లో పనికి జాయిన్ అయ్యా. అలాంటి సమయంలో అక్కడ నటుడు సూర్య చిత్ర షూటింగ్ జరిగింది. అందులో నటించిన రమ్య అనే నటి ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బెంగుళూర్ డేస్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అలా ఆ చిత్ర అసోసియేట్ సజో సుందర్తో స్నేహం ఎక్స్ స్టూడియోస్ చిత్రంలో నటించడానికి కారణమైంది. బెంగుళూర్ డేస్ చిత్రంలో బిడియ స్వభావం కలిగిన నాకు నటి రాయ్లక్ష్మీతో రొమాన్స్ చేసే సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను సంశయించడంతో రాయ్లక్ష్మీనే భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యం చెప్పింది. అంత కంటే కష్టమైన విషయం ఆ చిత్రంలో బాబీసింహతో ఫైట్ సన్నివేశంలో నటించడం. అందుకు చాలా టేక్స్ తీసుకున్నా. ఆ చిత్రాల అనుభవమే ఎక్స్ వీడియోస్ చిత్రంలో కొత్త వాడిగానే తెలియలేదు అనే ప్రశంసలు అందించాయి. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను అని అర్జున్ పేర్కొన్నారు. -
‘కురుక్షేత్రం’ మూవీస్టిల్స్
-
ఊహించని మలుపులు
తెలుగులో ఈ ఏడాది రిలీజైన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అభిమన్యుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యాక్షన్ హీరో అర్జున్. అరుణ్ వైధ్యనాథన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘నింబునన్’. ఉమేష్, సుదన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మించారు. ప్రసన్న, వరలక్ష్మీ శరత్కుమార్, సుమన్, సుహా సిని, వైభవ్, శ్రుతి హరిహరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. అర్జున్ కెరీర్లో ఇది 150వ సినిమా కావడం విశేషం. ‘కురుక్షేత్రం’ ట్రైలర్ను హీరో నాని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని ఆకాంక్షించారాయన. ‘‘డిఫరెంట్ పోలీసాఫీసర్గా అర్జున్ నటించారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. -
నాని చేతుల మీదుగా ‘కురుక్షేత్రం’...
యాక్షన్ కింగ్ అర్జున్ 150వ చిత్రంగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కురుక్షేత్రం. అర్జున్ సోలో హీరోగా సక్సెస్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఎక్కువగా సహాయ పాత్రలు చేస్తున్న అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా బిజీగా ఉన్నారు. మళ్లీ సోలో హీరోగా ట్రై చేస్తోన్న చిత్రం కురుక్షేత్రం. ఇటీవల అభిమన్యుడు సినిమాలో నెగెటివ్ రోల్ చేసి ప్రశంసలు అందుకున్నారు అర్జున్. ఈ సినిమా సక్సెస్లో అర్జున్ నటన ముఖ్య పాత్ర పోషించింది. అర్జున్ హీరోగా నటిస్తోన్న కురుక్షేత్రం సినిమా ట్రైలర్ను రేపు (జూన్ 27) సాయంత్రం నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. -
దైవశక్తా? దుష్టశక్తా?
బేబి రసజ్ఞ టైటిల్ రోల్లో, శ్రీరాజ్ గౌడ్, పూజ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమ్మో అమ్మోరు’. టి.రాము దర్శకత్వంలో మనీష్ గౌర్ సమర్పణలో బిఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్ని హైదరాబాద్లో లాంచ్ చేశారు. ముఖ్య అతిథి, నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సంగీత దర్శకుడు అర్జున్గారు నా తొంభై సినిమాలకు సంగీతం అందించారు. ‘అమ్మో అమ్మోరు’ చిత్రానికి కూడా తను మంచి పాటలిచ్చారు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయవంతం అవ్వాలి’’ అన్నారు. ‘‘దేవుడికీ, దుష్ట శక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాటలున్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతానికీ ప్రాధాన్యం ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘రాము మంచి కథతో ఈ సినిమా తీశాడు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత బియన్ రెడ్డి. బేబి రసజ్ఞ, నిర్మాత సాయి వెంకట్, శ్రీరాజ్ గౌడ్, పూజ, దర్శకులు హరిబాబు, అళహరి పాల్గొన్నారు. -
నిజమైన ఆనందం అదే
‘‘అభిమానులే కాదు, విమర్శకుల నుంచి కూడా ‘అభిమన్యుడు’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. నా కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు హ్యాపీగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం’’ అన్నారు హీరో విశాల్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్, సమంత, అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఇరంబు దురై’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకాలపై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో జి. హరి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్తో విడుదలైంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం ఇంకా సక్సెస్ఫుల్గానే ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్లో విశాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్కు ప్లాన్ చేశాం. కానీ సోలోగా రావాలని తెలుగులో జూన్ 1న రిలీజ్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా ‘అభిమన్యుడు’ నిలిచింది. మిత్రన్ ఇంటిలిజెంట్గా సినిమాను తెరకెక్కించారు. అర్జున్ బాగా నటించారు’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ ముఖాల్లో ఆనందం కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మిత్రన్కు దక్కుతుంది. ఈ సినిమాతో రియల్ లైఫ్ హీరోగా విశాల్ ప్రూవ్ చేసుకున్నారు. హరి సినిమాను చాలా ప్లాన్డ్గా ప్రమోట్ చేశారు’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. దర్శకుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. విశాల్గారు, నిర్మాత చాలా కష్టపడ్డారు. వైట్ డెవిల్గా అర్జున్ యాక్టింగ్ సూపర్’’ అన్నారు. ‘‘మా ‘అభిమన్యుడు’ చిత్రాన్ని బ్లాక్బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు డబ్బుతో పాటు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు నిర్మాత కావడం గర్వంగా ఉంది. వారం రోజుల్లోనే 12 కోట్లు రాబట్టింది. విశాల్గారు రియల్ హీరో’’ అన్నారు హరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ఇద్దరు జీఎంలను నిలువరించిన అర్జున్
ముంబై: మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్లో గ్రాండ్మాస్టర్ (జీఎం) రాసెట్ జియాత్దినోవ్ను ఓడించిన అర్జున్... ఐదు, ఆరు రౌండ్లలో ఇద్దరు గ్రాండ్మాస్టర్స్తో తలపడి ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను 75 ఎత్తుల్లో... తువాన్ మిన్ త్రాన్ (వియత్నాం)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత అర్జున్ ఐదు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తెలంగాణకే చెందిన రాజా రిత్విక్ ఐదో రౌండ్లో ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ నెవ్రోవ్పై 76 ఎత్తుల్లో సంచలన విజయం సాధించగా... ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. రిత్విక్ ఖాతాలోనూ ఐదు పాయింట్లున్నాయి. -
విదేశీ గ్రాండ్మాస్టర్కు అర్జున్ షాక్
మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. ముంబైలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ అతను విజయం సాధించాడు. రెండో రౌండ్లో (ఎఫ్ఎం) ఫిడే మాస్టర్ హోదా ఉన్న అర్జున్ ఏకంగా విదేశీ గ్రాండ్మాస్టర్ (జీఎం)కే చెక్ పెట్టాడు. అమెరికాకు చెందిన రసెట్ జియటెడినోవ్ను అర్జున్ 43 ఎత్తుల్లో ఓడించాడు. అంతకుముందు తొలి రౌండ్లో అర్జున్ 34 ఎత్తుల్లో శాంతారామ్ (భారత్)పై, మూడో రౌండ్లో 49 ఎత్తుల్లో సంజీవ్ నాయర్ (భారత్)పై నెగ్గాడు. -
అభిమన్యుడు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను
విశాల్, సమంత జంటగా అర్జున్ ముఖ్య పాత్రల్లో పీయస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరంబుదురై’. తెలుగులో ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ‘ఇరంబుదురై’ నిలించింది. తమిళంలో సక్సెస్ సాధించినట్టే ఇక్కడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా ‘అభిమన్యుడు’. తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మే 11న చాలా తెలుగు సినిమాలు ఉండటంతో రిలీజ్ చేయలేకపోయాం. ► నా సినిమా జీవితం అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. ఆయనతో కలిసి యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అర్జున్గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి. ► ‘అభిమన్యుడు’ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్మీ వాళ్లకు రేషన్ కార్డ్ ఉండదు. రైతులకు బ్యాంక్ లోన్లు ఇవ్వరు అనే విషయాలు తెలిశాయి. ఇలాంటి విషయాలు సినిమాలో డైలాగుల రూపంలో పెట్టాం. ► అందరూ డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిమాణాలు ఉంటాయి అని ఈ సినిమాలో చూపించాం. డిజిటల్ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ఎండ్ చేశాం. పార్ట్ 2 కూడా రూపొందిస్తాం. ► టీమ్ అంతా బాగా కుదిరింది. సమంతతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. మంచి కో–స్టార్. కెమెరా జార్జ్ సీ విలియమ్స్, సంగీతం యువన్ శంకర్ రాజా అన్నీ కరెక్ట్గా కుదిరాయి. అందరం దర్శకుడిని నమ్మాం. ► సినిమా రిలీజ్కు ముందు టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. బయటవాళ్ళ అభిప్రాయాలను తీసుకొని నాలుగుసార్లు ఎడిట్ చేశాం. బయటవారి ఒపీనియన్ తీసుకోవడం మంచిదని తెలిసింది. ► క్రైమ్కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. సోషల్ అవేర్నెస్ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ► నెక్ట్స్ ‘టెంపర్’ రీమేక్లో యాక్ట్ చేస్తున్నాను. కొత్త స్క్రీన్ప్లేతో చేయబోతున్నాం. మురగదాస్ అసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ‘అభిమన్యుడు’ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మిత్రన్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్ సినిమా. డిజిటలైజేషన్కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. పాటనో ఫైట్నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్ అందుకున్నాను. ఇన్ఫర్మేషన్ థెప్ట్ గురించిన అవేర్నెస్ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్ మేడ్ మూవీ ఇది. మిత్రన్ ఫస్ట్ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో. అలాగే అన్సక్సెస్ఫుల్ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్ఫుల్ హీరో’’ అన్నారు అర్జున్. ఈ సినిమాకు సంగీతం:యువన్ శంకర్ రాజా. -
అర్జున్కు శాట్స్ చైర్మన్ అభినందన
సాక్షి, హైదరాబాద్: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో రాణించిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్లో మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కోల్కతాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 పాయింట్లకుగానూ 7 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. ఇందులో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాళ్లపై విజయాలు సాధించి తొలి జీఎం నార్మ్ను సాధించాడు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ను కలిసిన అర్జున్... మెరుగైన టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. అతని వినతిపై శాట్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. -
అర్జున్కు ఐదు... హర్షకు ఆరు...
కోల్కతా: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ఎరిగైసి అర్జున్ ఐదో స్థానంలో, హర్ష భరతకోటి ఆరో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో అర్జున్ ఖాతాలో తొలి జీఎం నార్త్ చేరింది. నిర్ణీత 9 రౌండ్లు ముగిశాక అర్జున్, హర్ష మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ద్వారా ర్యాంకింగ్ను వర్గీకరించగా... అర్జున్కు ఐదో ర్యాంక్... హర్షకు ఆరో ర్యాంక్ లభించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్లో హర్ష 52 ఎత్తుల్లో గ్రాండ్మాస్టర్ సందీపన్ చందాను ఓడించగా... ఇంగ్లండ్ గ్రాండ్మాస్టర్ నైజెల్ షార్ట్తో జరిగిన గేమ్ను అర్జున్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
అర్జున్ సంచలనం
కోల్కతా: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ సంచలనం సృష్టించాడు. గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబుపై అద్భుత విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్లో తెల్లపావులతో ఆడిన 15 ఏళ్ల అర్జున్ కేవలం 23 ఎత్తుల్లో లలిత్ బాబు ఆట కట్టించి ఈ టోర్నీలో ఆరో విజయం నమోదు చేశాడు. మరో గేమ్లో తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి 49 ఎత్తుల్లో ఆరాధ్య గార్గ్ను ఓడించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో... హర్ష 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నేడు చివరి రౌండ్ గేమ్లు జరుగుతాయి. -
హంతకుడులో అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కన్నడలో కథానాయకునిగా నటిస్తున్న ఆయన తెలుగు, తమిళ భాష చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇటీవల విడుదలైన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్కి తండ్రి పాత్రలో కనిపించారాయన. తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుంబు దురై’ సినిమాలోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర చేశారు. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. విజయ్ ఆంటోనీ హీరోగా నూతన దర్శకుడు ఆండ్రు ‘కొలైక్కారన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. అంటే.. హంతకుడు అని అర్థం. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకి అర్జున్ని సంప్రదించాయట చిత్రవర్గాలు. మరి.. హంతకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
అభిమన్యుడు వస్తున్నాడు
విశాల్, సమంత జంటగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుంబుదురై’. యాక్షన్కింగ్ అర్జున్ కీలక పాత్ర చేశారు. రీసెంట్గా తమిళనాడులో విడుదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఎం. పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలాఖర్లో రిలీజ్ కానుంది. ‘‘తమిళంలో విడుదలైన ‘ఇరుంబుదురై’ చిత్రం భారీ ఓపెనింగ్స్తో విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ‘రంగస్థలం, మహానటి’ వంటి సూపర్హిట్ చిత్రాల్లో నటించిన సమంతకు ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుంది. తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరి. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా. -
‘ఇండియా కావాలి.. ఇచ్చెయ్’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో బన్నీ క్యారెక్టరైజేన్ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్లో సినిమాలోని ఇతర కీలక పాత్రధారులని పరిచయం చేశారు. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్కుమార్, బొమన్ ఇరానీ, నదియాలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో మరోసారి ఘనవిజయం సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. -
సస్పెన్స్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ కుదిరింది. కానీ.. ఎవరు? ఎవరితో? దేనికోసం? కాంట్రాక్ట్ కదుర్చుకున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. అర్జున్ హీరోగా సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు్తన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. కన్నడ నటి రాధికా కుమారస్వామి కథానాయిక. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి విలన్ పాత్రధారి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ ఈ సినిమాతో సౌత్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక–నిర్మాత సమీర్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. టాకీపార్ట్తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి అయింది. ఓ పాటను మహారాష్ట్రలో, రెండు పాటలను థాయ్లాండ్లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. కెమెరా: అమీర్లాల్. -
తెలంగాణ చిన్నారి... థాయ్లాండ్లో మెరిశాడు
ఆసియా యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలుడు ఆదిరెడ్డి అర్జున్ అద్భుత ప్రదర్శన చేశాడు. థాయ్లాండ్లో జరిగిన ఈ పోటీల్లో ఎనిమిదేళ్ల అర్జున్ అండర్–8 బాలుర విభాగంలో చాంపియన్గా అవతరించాడు. నిర్ణీత ఏడు రౌండ్లకుగాను అర్జున్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో గేమ్లో ఓడిపోయాడు. అండర్–12 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు డి. గుకేశ్ ఏడు పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. -
ఎప్పటికైనా ఫస్ట్ హీరో మాత్రం నాన్నే..
అమ్మాయిలకు చాలామంది రోల్ మోడల్స్ ఉండొచ్చు కానీ ఎప్పటికైనా ఫస్ట్ హీరో మాత్రం నాన్నే. నాన్నే సూపర్ హీరో. నాన్న నడిచిన బాటలో వెళ్లడమే కాకుండా ఇప్పుడు నాన్నతో కలిసి నటిస్తున్నారు కొందరు కూతుళ్లు. నటిగా బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ల నాన్నతో కలిసి యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు కొందరైతే, నడక నేర్చుకున్నాక తండ్రితో కలిసి నటిస్తున్నవారు మరికొందరు. ఆన్ స్క్రీన్ కూడా ‘డాడ్ అండ్ డాటర్స్’గానటిస్తున్నవారు కొందరైతే.. కూతురి కోసం స్పెషల్ రోల్స్ చేస్తున్నవారు మరికొందరు. ఆ డాడ్ అండ్ డాటర్స్ గురించి తెలుసుకుందాం. నాన్న కూచి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా నిరూపించుకోకముందే ‘ముద్ద పప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ అయిన నిహారిక ఇటీవల డాడ్ నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో వీళ్లిద్దరూ డాడ్ అండ్ డాటర్గా నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను చూపించడమే కాకుండా కూతురు లవ్ స్టోరీ – తండ్రి లవ్స్టోరీ అంటూ రెండు ట్రాక్స్ వేసి, డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఆన్లైన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ను నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్పై నిర్మించారు. నిహారిక, నాగబాబు తొమ్మిదేళ్లకుతండ్రికి కూతురిగా... కమల్హాసన్ విలక్షణ నటుడు. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోయగల సామర్థ్యం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమేనా? కథా రచయిత, దర్శకుడు, గాయకుడు.. మొత్తంగా మల్టీ టాలెంటెడ్ పర్శన్. మరి ఆయన రక్తం అంటే ఎలా ఉంటుంది? సేమ్ ఆయన లక్షణాలే పుణికి పుచ్చుకుని ఉంటారు కదా. శ్రుతీహాసన్ కూడా సేమ్ తండ్రిలాగే మల్టీ టాలెంటడ్. చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్హాసన్ ‘హే రామ్’ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది శ్రుతి. అలాగే కమల్ నటించిన ‘దేవర్ మగన్’కి ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడింది. పెద్దయ్యాక ఏకంగా తండ్రి నటించిన ‘ఈనాడు’ సినిమా ద్వారా సంగీత దర్శకురాలిగా మారింది. మరి.. చిన్నప్పుడు ‘హే రామ్’లో నటించారు కదా.. పెద్దయ్యాక ఎప్పుడు నటిస్తారు? అనే ప్రశ్నకు ‘శభాష్ నాయుడు’తో ఫుల్స్టాప్ పెట్టారు శ్రుతి. కథానాయికగా ఇండస్ట్రీలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత తండ్రి కమల్తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘శభాష్ నాయుడు’లో కమల్, శ్రుతి రీల్ లైఫ్లో కూడా తండ్రీ కూతుళ్లులా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కమల్, శ్రుతి కూతురి లవ్స్టోరీకి నాన్న సపోర్ట్ చిన్నప్పుడు నాన్న ఎన్నో కథలు చెబుతాడు. వాటిలో కొన్ని రియల్ లైఫ్ స్టోరీలై ఉండచ్చు. ఏమో పేర్లు మార్చి చెప్పిన లవ్స్టోరీలు ఉండొచ్చు. అలా సోనమ్ కపూర్కి ఆమె తండ్రి అనిల్ కపూర్ బోలెడన్ని కథలు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు కూతురి లవ్స్టోరీకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది రీల్ లవ్స్టోరీ. ‘సావరియా’ అనే బ్యూటిఫుల్ లవ్స్టోరీ మూవీతోనే ఇండస్ట్రీకు వచ్చిన సోనమ్ పదేళ్ల తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాకే తండ్రి అనిల్ కపూర్తో కలిసి నటిస్తున్నారు. ‘1942 ఎ లవ్ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్ కపూర్ పాడిన ఫేమస్ సాంగ్ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా...’ టైటిల్తో షెల్లీ చోప్రధర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనే తండ్రి అనిల్కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు సోనమ్. ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్ టైమ్ మా నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను. మీకు ‘ఆన్ స్క్రీన్ డాటర్’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్గా ఉన్నాను’’ అని సోనమ్ ట్వీటర్లో పేర్కొంటే ‘‘మనిద్దరం కలిసి యాక్ట్ చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్గా రిజెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కలిసి యాక్ట్ చేయబోతున్నాం. నీకు ఎగై్జటెడ్గా ఉందేమో. నాకు మాత్రం చాలా నెర్వస్గా ఉంది’’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు అనిల్కపూర్. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. సోనమ్, అనిల్ కపూర్ నాన్న తోడుగా... దెబ్బ తగిలితే ఎవరైనా అమ్మా అంటారు. కానీ పాము కనిపిస్తే మాత్రం చిన్నతనంలో మోస్ట్లీ నాన్ననే పిలుస్తారు. కానీ నాన్నే పాము మనిషి ఐతే ?? నాన్న చేయి పట్టుకోవడానికి తోడుగా వెళ్లడానికి కొంతమంది మాత్రమే రెడీగా ఉంటారు. ఈ లిస్ట్లోనే ఉన్నారు హీరోయిన్ వరలక్ష్మీ. 2012లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి రోల్స్ చేస్తున్న వరలక్ష్మీ ఫస్ట్ టైమ్ తండ్రి శరత్ కుమార్తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. శరత్కుమార్ ముఖ్య పాత్రలో ఏ. వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పాంబన్’. ఈ సినిమాలో తండ్రితో కలిసి వెండితెరను పంచుకోబోతున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ఇందులో సగం శరీరం పాములా మారిన వ్యక్తి పాత్రలో కనిపించ నున్నారు శరత్కుమార్. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టారై్టంది. ఇందులో వరలక్ష్మీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శరత్కుమార్, వరలక్ష్మి డాటర్ లవ్కు నాన్న డైరెక్షన్! కూతురికి ఎవరైనా లవ్లెటర్ రాస్తే తండ్రి ఊరుకుంటారా? ఉహూ.. కొత్త అవతారం చూపించి లెటర్ రాసిన కుర్రాడి కాళ్లు విరగ్గొడతాడు. కానీ యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం అందరిలా కాదు. డిఫరెంట్ ఫాదర్. అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకొని తన కోసం అర్జునే ఓ లెటర్ రాసి ఇచ్చాడు. నచ్చలేదంది, ఇంకోటి రాశాడు. ఇది చాలా బావుందని నవ్వేసింది. ఇంకో అడుగు ముందుకేసి ఎందుకైనా మంచిదని సీన్లోకి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. కానీ ఇదంతా రీల్ లైఫ్లోనే.. ‘ప్రేమ బహార’ అనే సినిమా కోసం అన్నమాట. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించి, తన కుమార్తె ఐశ్వర్యను కన్నడ పరిశ్రమకు పరిచయం చేస్తూ తీసిన సినిమా ‘ప్రేమ బహార’. ఈ సినిమా కోసం మూడు లవ్స్టోరీలు రాసి, తన కుమార్తెకు వినిపించారట అర్జున్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టోరీ నచ్చలేదన్నారట. చివరికి మూడో స్టోరీ నచ్చి నటించటానికి ఒప్పుకున్నారట. ఈ టైటిల్ను కుడా అర్జున్ పాత సినిమా ‘ప్రతాప్’లోని ఒక పాటలో నుంచి తీసుకున్నారట. ఇటీవల రిలీౖజñ థియేటర్స్ వద్ద డీసెంట్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అర్జున్, ఐశ్వర్య -
జున్నూతో నానీ
‘‘మా దొంగ రాస్కెల్ బర్త్డే ఇవాళ (గురువారం). జున్నుగాడి ఫస్ట్ బర్త్డే ఇది’’ అంటూ నానీ ఈ ఫొటోను షేర్ చేశారు. జున్ను అసలు పేరు అర్జున్. ఇంతకీ జున్ను అని చదవగానే ‘హలో’ సినిమా గుర్తొస్తోంది కదూ. అందులో హీరోయిన్ కల్యాణి ముద్దు పేరు జున్ను అని గుర్తుండే ఉంటుంది. -
సోషల్ మీడియాలో హీరో ఫన్నీ కామెంట్
నేచురల్ స్టార్ నాని తనయుడికి ఫస్ట్ బర్త్డే విషెస్ తెలియజేస్తూ క్యూట్ పిక్ షేర్ చేశాడు. నాని కుమారుడు అర్జున్ ఈరోజు తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో కొడుకుని ముద్దాడుతూ ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘ఈ రోజు నా చిట్టి రాస్కెల్ తొలి పుట్టిన రోజు. దొంగ నా కొడుకు.. జున్ను గాడు’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. 2012 అక్టోబర్ 27న నాని, అంజనాతో ఏడడుగులు వేశాడు. ఈ ఏడాది ఎమ్సీఏ చిత్రంతో వచ్చి మంచి హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక అక్కినేని నాగార్జునతో ఓ మల్టీస్టారర్ చిత్రంలోనూ నటిస్తున్నారు. This little rascal turns one today ! Donga naa koduku ❤️ Junnu gaadu pic.twitter.com/JzRYocNK8p — Nani (@NameisNani) March 29, 2018 -
కోలీవుడ్కు హీరోగా అర్జున్ బంధువు
తమిళసినిమా: నటుల వారసులు, బంధువులు సినీ రంగప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. అలా తమ ప్రతిభను నిరూపించుకున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా యాక్షన్కింగ్గా ముద్రవేసుకున్న నటుడు అర్జున్ బంధువు చిరంజీవి సార్జా ఇప్పుడు హీరోగా కోలీవుడ్కు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నటిస్తున్న చిత్రానికి సీజర్ అనే టైటిల్ను నిర్ణయించారు. పరూల్ యాదవ్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో వి.రవిచందర్, ప్రకాశ్రాజ్, నాగినీడు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు కథ, దర్శకత్వం బాధ్యతలను వినయ్కృష్ట నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది ఒక నేరం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కథ, కథనాలు జెట్ స్పీడ్లో సాగుతూ ఉత్కంఠతను రేకిస్తాయని తెలిపారు. తృతీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను బెంగళూర్, మైసూర్ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను శబరిమలైలో ఇంతవరకూ ఎవరికీ అనుమతించని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇలా పలు విశేషాలతో, భారీ తారాగణంతో రూపొందిస్తున్న సీజర్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. సీజర్ చిత్రం తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనికి అంజి, రాజేశ్ కట్టాల ద్వయం ఛాయాగ్రహణం, శాంతన్శెట్టి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు వినయ్కృష్ణ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారన్నది గమనార్హం. -
పీసీసీ అధికార ప్రతినిధిగా అర్జున్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధికార ప్రతినిధిగా బానోతు అర్జున్ బాబు నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నాతండాకు చెందిన అర్జున్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా క్రియాశీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు కృతజ్ఞతలు తెలిపారు.