-
కమలం గూటికి మున్సిపల్ చైర్పర్సన్..?
● నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం గూటికి ● పేట మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న కారు నారాయణపేట: మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ తన అనచరులతో బీఆర్ఎస్ పార్టీని వీడీ గురువారం డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2017లో చైర్పర్సన్ బాధ్యతతో పార్టీని వీడి మళ్లీ 2023లో అదే బాధ్యతతో గందె అనసూయ సొంతగూడు అయిన బీజేపీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉండగా, మరి కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉండగా.. మున్సిపల్ పాలక వర్గంలో చైర్పర్సన్ భర్త, వైస్ చైర్మన్ మధ్య విబేధాలతో కౌన్సిలర్లు చేరో దారి పడుతుండడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇది వరకు మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణభట్టడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ఇద్దరు కౌన్సిలర్లు అమీరుద్దీన్, సరితలు సైతం కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. మరో ఐదుగురు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు సైతం పార్టీ మారారు. నలుగురు కాంగ్రెస్లోకి వెళ్లగా మరొకరు బీజేపీలోకి చేరిపోయారు. 2వ వార్డు జొన్నల అనిత, 12వ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్ బస్సపురం నారాయణమ్మ, 15వ వార్డు కౌన్సిలర్ బండి రాజేశ్వరితో పాటు వారి అనుచరులు ఏపీ జితేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో వారికి కండువ కప్పి ఆహ్వానించారు. మరో కౌన్సిలర్ మెఘాశ్రీపాద్ పార్టీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరడంతో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్కు షాక్.. నెల రోజుల వ్యవధిలోనే మున్సిపాటీలోని బీఆర్ఎస్ పాలకవర్గంలో మున్సిపల్వైస్ చైర్మన్తో పాటు ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి షాక్ తగిలినట్లయ్యింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ సైతం చేరో దారిలో వెళ్లిపోతుండడంతో పార్టీకి కోలుకోని దెబ్బ అని పలువురు చర్చించుకుంటున్నారు. -
సీఎం సమక్షంలో భారీ చేరికలు
మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. రెనివట్ల ఎంపీటీసీ కన్కమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి పార్టీ నాయకులు కరుణాకర్రెడ్డి, నర్సిము లు, ప్రభాకర్రెడ్డి వీరితో పాటు మరో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్లోని సీఎం నివాసంలో పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని కోస్గి లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తిరుపతిరెడ్డి సమక్షంలో మద్దూరు, పల్లెర్ల, పర్సపూర్, రెనివట్ల, తిమ్మారెడ్డిపల్లి, చెన్వార్ తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ నాయకులు మద్దూరు మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్రెడ్డిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దికి అందరు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పార్టీ అద్యక్షుడు నర్సింహా, పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, సంజీవ్, రమేష్రెడ్డి, చెన్నాప్ప, రహీం, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీలు కాదు.. గారడీ మాత్రమే
కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్/అచ్చంపేట/గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గ్యారంటీలు కాదని.. గారడీలుగా మాత్రమేనని, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా బుధవారం కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల పట్టణాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండరని.. బీజేపీలోకి వెళ్తారని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. రైతుబంధు నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదని, బీజేపీ మత విద్వేషం తప్ప.. అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మతం పేరుతో విషం చిమ్ముతున్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు.. రిజర్వేషన్లకు చేటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు చేటు తెస్తుందని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. కల్వకుర్తిలో కేటీఆర్ నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెబుతుందని.. రాజ్యాంగం రద్దయితే, అన్ని రిజర్వేషన్లు రద్దు అవుతాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దళిత బహుజనుల జీవితాలు దుర్భరంగా మారుతాయన్నారు. దేశంలో దళిత మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకోని బీజేపీ.. అన్నామలై గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికలు పదేళ్ల నిజాయితీ కేసీఆర్ పాలనకు.. ఆరు నెలల అబద్ధాల రేవంత్రెడ్డి పాలనకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. కాగా.. ప్రచారానికి వచ్చిన కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రోడ్షోలో పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గోలి శ్రీనివాస్రెడ్డి, ఉప్పల వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్లు ఎడ్మ సత్యం, ఎడ్ల నర్సింహగౌడ్, విజితారెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిశోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందో చెప్పాలి.. నాగర్కర్నూల్ ఎంపీ రాములు పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరారని.. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికాంలోకి వస్తే, రాజ్యాంగం రద్దు చేస్తోందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు పెంచడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రవీణ్కుమార్ను ఎంపీగా గెలిపిస్తే, ఈప్రాంతానికి గౌరవం పెరుగుతుందని.. స్థానికుడైన ఆర్ఎస్పీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పథకాల అమలుకు తేదీలు మారుస్తుండ్రు రిజర్వేషన్లు రద్దు చేస్తానన్నమోదీని ఓడించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తి, గద్వాలలో రోడ్షో,అచ్చంపేటలో కార్నర్ మీటింగ్ -
వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..
నేను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశా. మెటల్ రోడ్లను తారు రోడ్లగా మార్చేందుకు రూ.778 కోట్లు మంజూరు చేయించాను. దేవరకద్ర–కృష్ణా లైన్ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచి పూర్తి చేశాం. దేవరకద్ర, మహబూబ్నగర్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయించాం. మహబూబ్నగర్–చించోళి జాతీయ రహదారి మంజూరుకు నావంతు కృషి చేశా. జాతీయ రహదారుల డివిజన్ కార్యాలయాన్ని పాలమూరుకు తీసుకొచ్చాం. ఐదేళ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద రూ.25 కోట్లు వచ్చాయి. రెండేళ్లు కరోనా కాలం కాగా.. రూ.10 కోట్లు కోవిడ్ కట్టడికి కేంద్రమే వినియోగించింది. ఇవి పోనూ రూ.15 కోట్లతో లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్లు, పాఠశాలల భవనాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాం. -
ప్రత్యర్థుల విమర్శలు అర్థరహితం..
పాలమూరు సమస్యలపై నేను లోక్సభలో నోరు విప్పలేదని ప్రత్యర్థులు విమర్శించడం అర్థరహితం. పార్లమెంట్ సమావేశాలకు 68 శాతం హాజరవడమే కాకుండా.. లోక్సభలో ఎక్కువ ప్రశ్నలు సంధించిన మూడో వ్యక్తిని నేనే. 356 ప్రశ్నలను లేవనెత్తా. స్వయంగా కేంద్రమంత్రులను కలిసి పాలమూరు సమస్యలను పరిష్కరించాలని విన్నవించా. వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ గురించి పలుమార్లు లోక్సభలో ప్రస్తావించా. ప్రస్తుతం ఆ లైన్కు సర్వే జరుగుతోంది. కాచిగూడ నుంచి మహబూబ్నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, గద్వాల, శ్రీరాంనగర్, కృష్ణా రైల్వే స్టేషన్ల సుందరీకరణ, అభివృద్ధి, వైఫై సౌకర్యాల కల్పన వెనుక నా కృషి ఉంది. పత్తి రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలమూరులో సీసీఐ రీజినల్ కార్యాలయం ఏర్పాటుపై పార్లమెంట్లో గళమెత్తి విజయం సాధించా. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించడంలో సఫలీకృతమయ్యా. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కటకట
ధన్వాడ: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కటకట ఏర్పడిందని.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయితే తాగునీరు బంద్ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం ధన్వాడ మండలంలోని హన్మున్పల్లి, కిష్టాపూర్, ధన్వాడ గ్రామాంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరుతు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాల గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తిందని, ఎన్నికలు పూర్తి అయితే అవి కూడా రాకుండా పోయాతాయన్నారు. కోయిల్కొండ వద్ద ఉన్న మిషన్ భగీరథ తాగునీటి ఫిల్టర్కు ఆరు నెలల నుంచి నిధులు రాకపోవడంతో అది పనిచేయడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడొద్దు అని ఐకేపీల ద్వారా పొలాల వద్దకే వచ్చి వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తే.. ఇప్పుడు ధన్వాడకు వెళ్లి విక్రయించాల్సి వస్తోందని, అది కూడా ఎప్పుడు కొనుగోళ్లు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మట్టి అక్రమ దందా.. ధన్వాడ ఆడ బిడ్డ అని ఎవరికి అయితే ఓటు వేశారో.. ఇప్పుడు ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఆక్రమంగా మట్టిని తరలిస్తు డబ్బులను వేనుకేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రెవంత్రెడ్డి సీఎంగా ఉండడు అక్కడ ఉత్తమ్రెడ్డి, లేదా వెంకట్రెడ్డి అయినా వస్తారని ఇంకో ఆరు నెలలు గడిస్తే మళ్లీ ఎన్నికలు వచ్చినా ఆశర్యపోవాల్సి అవసరం లేదని, ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావచ్చని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే ముందుగా వారు చేసేది రైతుల పొలాల వద్ద మీటర్లు బిగిస్తారని, ఉచిత విద్యుత్ నిలిపేస్తారని అన్నారు. ప్రజలు విటిని గుర్తించి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, సునిల్రెడ్డి, వాహిద్, మురళిదర్రెడ్డి, హున్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీవి కుయుక్తులు..
రూ.12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ కేవలం రాజకీయాలకే వాడుకుంటోంది. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పాలమూరు రైతాంగం బాధలను పట్టించుకోలేదు. అదేవిధంగా పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేదు. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు పలు పర్యాయాలు కేంద్ర మంత్రులను కలిసినా.. స్పందించలేదు. ఈ ప్రాజెక్ట్పై ఆ రెండు పార్టీలు కుయుక్తులతో విమర్శిస్తూ గెలవాలని చూస్తున్నారు. అంతేకాదు నారాయణపేటలో సైనిక్ ప్కూల్, గోకుల్ ప్రాజెక్ట్ల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏర్పాటు చేస్తామని చెబుతూ దాటవేసింది. అయినా ఏం చేయలేదంటూ కాంగ్రెస్, బీజేపీ నాపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం?. ఎవరెన్ని కుట్రలు చేసినా నేనే గెలుస్తా. -
లక్ష్యం.. బహుదూరం
● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోధాన్యం సేకరణ అంతంతే.. ● బయటి మార్కెట్లో అధిక ధర..ప్రైవేట్కే రైతుల మొగ్గు ● జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● ఇప్పటి వరకు రూ.18.95 కోట్లు రైతులకు అందజేత నర్వ: జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగి సీజన్కు సంబంధించి 1.35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్ణయించగా.. రెండు రోజుల క్రితం వరకు కేవలం 8,605 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ప్రైవేటులో అధిక ధర పలుకుతుండడంతో రైతులు బయటి మార్కెట్లోనే విక్రయానికి మొగ్గుచూపుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలో ఏప్రిల్లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ, పీఏసీఎస్ల ఆద్వర్యంలో అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ల నుంచి జిల్లాలో ఎంపిక చేసిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో యాసంగిలో కేటాయించిన లక్ష్యానికి పూర్తిగా ఆమడ దూరంలో కొనుగోళ్లు ఉన్నాయి. 107 కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో మొత్తం 107 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాసంగి లక్ష్యంగా 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 42 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 58 కేంద్రాలు, మెప్మా ద్వారా 4 కేంద్రాలు, ఇతరుల ద్వారా మరో 3 కేంద్రాలు మొత్తం 107 కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా నేటికి 8605 మె.ట ధాన్యం సేకరించారు. ఇప్పటికే చాలా కేంద్రాల్లో మెజారిటీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. దీంతో కొన్ని కేంద్రాలను ఎత్తి వేశారు. మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆద్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ.. కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు తరుగు తీత తదితర విషయాల్తో మిల్లర్లకు ఖచ్చితమైన నిబంధనలు విధించారు. దీంతో పాటు రైస్ మిల్లలను సైతం తనిఖీ చేపట్టారు. కొనుగోళ్లు వేగవంతానికి చర్యలు జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి సకాలంలో ధాన్యం సేకరించే ప్రక్రీయ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రైవేటులో సన్న రకం దాన్యానికి మెరుగైన ధర ఉండడంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దొడ్డు రకం 1010 కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయిస్తున్నారు. ఇంకా కోస్గి, ధన్వాడ, మక్తల్ మండలాల నుంచి ధాన్యం వచ్చేది ఉంది. ఈ నెలాఖరు వరకు లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. – జి.దేవదాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికార -
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
నారాయణపేట: ఎన్నికల పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారులు జి. రవినాయక్, కోయ శ్రీహర్షల ఆధ్వర్యంలో నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్ల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రెండు నియోజకవర్గాలలో 156 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు గాను రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 171 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. అనంతరం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజున ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలని ఆదేశించారు. మాక్పోల్ నిర్వహణను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల నివేదికల ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎల్డీఎం విజయ్ తదితరులు ఉన్నారు. పోలింగ్ నిర్వహణలో నిబంధనలుఅతిక్రమించవద్దు ఎన్నికల సాధారణ పరిశీలకుడుషెవాంగ్ గ్యాచో భూటియా -
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
మహబూబ్నగర్ క్రీడలు: ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి సాయి సంగీత దేశ జట్టుకు ప్రాతినిథ్యం వహించి 4గీ400 మీటర్ల రిలే పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో సాయి సంగీతను వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అభినందించి సన్మానం చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ప్రఽదానంగా నారాయణపేట, కొడంగల్, వనపర్తి, దేవరకద్ర, మక్తల్, మహబూబ్నగర్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 20 వేల వరకు వలస ఓటర్లు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేటతో పాటు ధన్వాడ, దామరగిద్ద, కోయిలకొండ ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలవాసులు భారీగానే ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్పేట మండలాల ప్రజలు అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో ముంబై, బెంగళూరు, పుణె వంటి చోట్ల స్థిరపడి ఉన్నారు. వీరందరి ఓట్లు, ఆధార్, రేషన్కార్డులు సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు ఏవైనా వలస ఓటర్లు తమదైన శైలిలో గెలుపోటముల్లో ప్రభావం చూపుతున్నారు. పంచాయతీ, స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికల్లో వీరిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. -
10న ప్రధాని మోదీ రాక
నారాయణపేట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈసందర్భంగా భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి ఎస్పీజీ డీఐజీ జియాకుమార్, ఏఎస్పీ ప్రవీణ్ నౌటియల్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎర్రమన్నుగుట్ట వద్ద హెలిప్యాడ్ స్థలం, పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్న మినీ స్టేడియాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. మినీ స్టేడియంలో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు, మీడియా పాయింట్ వద్ద బారికేడ్స్ ఏర్పాటు, పబ్లిక్ ఎంట్రన్స్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వారి వెంట డీఎస్పీ ఎన్.లింగయ్య, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, ఆర్డీఓ మధుమోహన్, సీఐలు శివశంకర్, రాంలాల్, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండురంగారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు అధికారులు -
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
నారాయణపేట: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని మాస్టర్ ట్రైనర్స్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఓలు, సహాయ పీఓల శిక్షణ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈసందర్భంగా ఈవీఎంల నిర్వహణతో పాటు వివిధ రకాల ఫారాలు నింపడంపై మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పించారు. అదేవిధంగా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే సరిచేయడం.. వీవీ ప్యాట్లో బ్యాటరీ అమరిక, మాక్ పోలింగ్ నిర్వహణ అంశాలపై పునఃపరిశీలన చేశారు. కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
నారాయణపేట: వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని.. సీఎం రేవంత్రెడ్డి షాడో అని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. అదే అరుణ గెలుపునకు నాంది పలుకుతుందన్నారు. దేశంలో పేదల కడుపు నిండుతుందంటే ప్రధాని మోదీ చలువే అని అన్నారు. సమావేశంలో రతంగ్ పాండురెడ్డి, ప్రదీప్గౌడ్, సదానందం, పి.శ్రీనివాసులు, నర్సింహులు, సిద్ది వెంకట్రాములు, రఘురామయ్యగౌడ్ ఉన్నారు. -
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక మౌలాలీగుట్టపై ఉన్న మల వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని (ఫీకల్ స్లట్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్–ఎఫ్ఎస్టీపీ) మంగళవారం సాయంత్రం సీపీహెచ్ఈఈఓ (సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్) ప్రతినిధి సంజయ్రౌత్ పరిశీలించారు. శుద్ధి చేయడానికి ఇక్కడ ఉపయోగిస్తున్న సాంకేతిక విధానాన్ని ఆస్కీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ఇంటింటికీ ఉన్న సెప్టిక్ ట్యాంకులను మూడేళ్లకోసారి క్లీన్ చేయించుకోవాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
నారాయణపేట: ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటుచేయాలని మహబూబ్నగర్ పార్టమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. మంగళవారం మక్తల్ సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మహబూబ్నగర్, నారాయణపేట అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మయాంక్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. అదేవిధంగా కృష్ణా చెక్పోస్టును తనిఖీ చేశారు. అనంతరం నారాయణపేట స్ట్రాంగ్రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ మధుమోహన్ ఉన్నారు. ● ఫారం–12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు బుధవారం సాయంత్రం 5 గంటలలోగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటనలో తెలిపారు. ఫారం–12 ద్వారా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారికి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వీలు లేదన్నారు. జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి ఒకరోజు ప్రత్యేక సెలవు సైతం ఇచ్చినట్లు తెలిపారు. -
పోలీసు ప్రజావాణికి7 ఫిర్యాదులు
నారాయణపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ యోగేష్గౌతమ్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత ఎస్ఐలకు బదిలీ చేసి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూసమస్యలు, సివిల్ కేసుల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, 112లను సంప్రదించాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం మద్దూరు: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని.. వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్ఓ వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో అవరణలో మద్దూరు వాలీబాల్ అసోసియేషన్, జిల్లా క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి వాలీబాల్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఐదేళ్లుగా ఈ వాలీబాల్ అసోసియేషన్ వారు యువతకు వాలీబాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది జిల్లా క్రీడాల శాఖను నుంచి కోచ్కు వేతనం అందజేస్తామని అయన పేర్కొన్నారు. ఈ వేసవి ఉచిత శిక్షణకు 50 మంది యువకులు హాజరవుతున్నారని ఆసోసియేషన్ ఉపాద్యక్షుడు అథిక్ తెలిపారు. కార్యక్రమంలో కోచ్ వెంకటేష్, సినియర్ ఆటగాళ్లు మహిపాల్, మహేష్, శాంతకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఓటింగ్పై చైతన్యం తీసుకురండి నారాయణపేట రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండి ఓటు హక్కు కల్గిన ప్రతీ ఒక్కరు తమ ఓటును తప్పకుండా వేయాలని.. ప్రతిఒక్కరూ ఓటు వేసేలా వారిలో చైతన్యం తీసుకురావాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో సోమవారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత సమాజంలో విద్యావంతులైన ఉపాధ్యాయులపై ఎంతైన ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను విస్మరించకుండా బద్దకాన్ని విడనాడి ఓటు వేసే విధంగా చైతన్య పర్చాలన్నారు. వృద్దులు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ సమస్యలపై పోరాటం గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలు, 2003 డీఎస్సీ టీచర్ల పాత పెన్షన్ అమలు, టెట్ లేకుండా హెచ్ఎం పదోన్నతి, సీపీఎస్ రద్దు, నాలుగు డీఏ పెండింగ్లపై రాష్ట్ర శాఖ దృష్టి సారించనుందన్నారు. మెడికల్, టీఎస్జీఎల్ఐ బాండ్ల డబ్బుల విడుదల విషయం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేర్కృష్ణారెడ్డి, నర్సింహా, రాష్ట్ర నాయకులు గుంపుబాలరాజు, మల్లికార్జున్, కిశోర్, సీతారాములు, శ్రీనివాస్రెడ్డి, తిరుపతయ్య, గుర్నాత్రెడ్డి, నర్సింగప్ప, సురేష్ పాల్గొన్నారు. సోనామసూరి ధర రూ.2,341 దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,341, కనిష్టంగా రూ.1,900 ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నారాయణపేట: లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎన్నికల్లో పీఓలు, ఏపీఓలు సహాయ పీఓ, ఓపీఓలకు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలపై జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ రోజున పాటించాల్సిన బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. అందరూ ఫారం 12ఏ ఇవ్వాలని, 17సి పై బీఎల్ఏ సంతకం తీసుకోవాలన్నారు. డబుల్ చెక్ చేసుకోవాలని, రెండు బ్యాలెట్లు ఉన్నాయని తెలిపారు. హ్యాండ్ బుక్ చదుకోవాలని, మాక్ పోల్ నిర్వహించాలన్నారు. 13 న ఉదయం 7నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుందని, ఈవీఎం నిర్వహణలో కాని, వివిధ రకాల ఫారాలు నింపడంలో కాని మరేదైనా చిన్న అనుమానం వచ్చినా ఇక్కడే మాష్టర్ ట్రైనర్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, ఏ తప్పు జరగడానికి వీలు లేదని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విధుల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ జరిగే విధానంను తనిఖి చేశారు. శిక్షణలో కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్కుమార్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, సంబంధిత అధికారులున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. సోమవారం సింగారం లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 12, 13 తేదీలలో పోలింగ్ స్టేషన్లో ఫ్లోరింగ్ టాయిలెట్స్, త్రాగునీరు, టెంట్లు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 13న ఉదయం టిఫిన్, లంచ్ ఏర్పాటు చేయాలన్నారు. వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్ ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్లోకి వెళ్లరాదన్నారు. 8 పోలింగ్ స్టేషన్లో కలిపి ఒక సెక్టోరియల్ అధికారిని నియమిస్తారన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉన్నది లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే బారికెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఆశ కార్యకర్తలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ గరీమ నరుల, ఆర్డిఓ మధుసూదన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణగా షీటీం
నారాయణపేట రూరల్: మహిళలు అత్యవసర సమయంలో తమ రక్షణకు షీ టీమ్స్ ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలని ీషీ టీం జిల్లా ఇన్చార్జి, ఏఎస్ఐ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఓపెన్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలతో ఎవరైన ఈవ్టీజింగ్, ర్యా గింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడితే వెంటనే 100, మహిళా హెల్ప్లైన్ నంబర్ 87126 70398కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్నేరాలను అరికట్టడానికి సెల్ఫోన్ వినియోగం తగ్గించాలని, అమ్మాయిలకు గుడ్, బ్యాడ్టచ్ గురించి తెలిసి ఉండాలన్నారు. అమ్మాయిలతో పాటు మగపిల్లల్లోను మార్పు రావాలన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. షీటీమ్ సభ్యులు బాలరాజు, నమీనా, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
నారాయణపేట రూరల్: పట్టణంలోని మినీ స్టేడియం పక్కన గల బాలకేంద్రంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు 41రోజుల పాటు శిక్షణ ఇస్తామని, 5 నుంచి 16 సంవత్సరాల మధ్య గల చిన్నారులకు తబల, సితార్, చిత్రలేఖనం, గాత్రం, నృత్యం, కీబోర్డ్, డ్రమ్స్, దేశభక్తి, దైవభక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. జాబ్మేళా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో పలు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో సోమవారం జాబ్మేళా నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి మొత్తం 450 మంది ఔత్సాహికులు హాజరవగా.. ఇందులో 125 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు కళమ్మ, కేశవర్ధన్గౌడ్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో సిలబస్ మార్పుపై సమీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేయడంపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఓఎస్లు, హెచ్ఓడీలతో పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పలు చర్యలు తీసుకోవాలని, రికార్డుల నిర్వహణపై జాగ్రత్త వహించాలన్నారు. -
సామాజిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిచి.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకొని సామాజిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేద్దామని రాష్ట్ర దివ్యాంగుల సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ నార నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీజేపీ దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను ఆమోదించి కేవలం 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లకు ఆమోదించినా బీజేపీ మాత్రం 4 శాతానికే పరిమితం చేసిందని, దేశంలో ఈ చట్టం అమలుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కేవలం వికలాంగులను దివ్యాంగులుగా నామకరణం చేస్తూ వీరి సంక్షేమం, సాధికారితను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగల భర్తీ, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 21 రకాల దివ్యాంగుల సుమారు 20 లక్షలు, కుటుంబాలతో కలుపుకొంటే 50 లక్షలు ఉన్నారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30– 40 వేల ఓటు బ్యాంక్ ఉందని, ఇవి గెలుపోటములను నిర్ణయిస్తుందన్నారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో పలు అంశాలను చేర్చారన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీగా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో గంగారం సుధాకర్వర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
కాంగ్రెస్లో జోష్..
వరుసగా కొత్తకోట, ఎర్రవల్లిలో జనజాతర సభలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/అలంపూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ అగ్రనేతల వరుస పర్యటనలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా శనివారం కొత్తకోటలో రోడ్షో, కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా ఎర్రవళ్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలు పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం.. సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎర్రవల్లి చౌరస్తాలో జరిగిన సభలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే.. ● భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ● అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన ● పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు -
హజ్యాత్రికులకు వ్యాక్సినేషన్
నారాయణపేట రూరల్: హజ్యాత్రకు వెళ్తున్న ముస్లింలకు ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకునే క్రమంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ వాక్సినేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యబృందం డాక్టర్ కార్తిక్, డాక్టర్ బాలాజి, హజ్ కమిటి నాయకులు అమిరోద్దిన్, ఉస్మాన్, వైద్య సిబ్బంది గోవిందరాజు, శ్రీనివాస్రెడ్డి, స్నేహ, విజయ్కుమార్, ప్రహ్లాద్, అమీనా, శివశేషమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement