Aam Admi Party
-
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఇక ‘ఆప్’ప్లాన్ ఏంటి? సిసోడియా ఏమన్నారు?
న్యూఢిల్లీ: ఢ్లిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు ఘోర పరాభవం ఎదురయ్యింది. పార్టీలోని పెద్ద నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో వారంతా దక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్ జాతీయ కన్వనీర్ అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. పార్టీ ఓటమి పాలయిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నకు సిసోడియా సమాధానమిచ్చారు.మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై తమ నేత కేజ్రీవాల్ అందరితో చర్చించారని, తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, తాము ఏవిధంగానైతే ఢ్లిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోరాటం సాగించామో, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలోనే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు, చీరలు, చివరికి మద్యం కూడా పంపిణీ చేశారని, ఎన్నికల వ్యవస్థను దురుపయోగం చేశారని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో జరిగిన ఎన్నికల్లో పోటీ అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ ఆప్ తన పోరాటాన్ని ఆపలేదన్నారు.ఓటమి పాలయిన నేతలకు అరవింద్ కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారని.. వారు పోటీ చేసిన ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల అనంతరం నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగన్న ఆప్కు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం -
ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రాజధానిలో 27 ఏళ్ల తరువాత అధికారం చేపట్టబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ఓటమిపై పలువురు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి, అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. వీటిని చూసినవారు క్రియేటర్లను మెచ్చుకుంటూ.. ఈ మీమ్స్ను చూసి, నవ్వకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. आ बैल मुझे मार #DelhiElectionResults #दिल्ली_विधानसभा #ArvindKejriwal pic.twitter.com/BOFClk02Sk— Amit Singh 𝕏 (@RockstarAmit) February 8, 2025మళ్లీ జైలుకే..వైరల్ అవుతున్న ఒక మీమ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రజలతో మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీరంతా కమలం బటన్ నొక్కితే నేను మరోమారు జైలుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడేమి జరుగుతుందో మీరే చూడండి’ అనడం కనిపిస్తుంది.😂😂😂#DelhiElectionResults pic.twitter.com/lSGXnWGwZP— Lala (@FabulasGuy) February 8, 2025డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లోఈ మీమ్లో ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంతో డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లోకి దిగుతాడు. అయితే ఊహకందని విధంగా అత్యంత సులభంగా ఓటమి పాలవుతాడు. ఈ ఓడిన వ్యక్తిపై కేజ్రీవాల్ మాస్క్, గెలిచిన వ్యక్తిపై ప్రధాని మోదీ మాస్క్ ఉంటాయి. 😹😹😹#DelhiElectionResults pic.twitter.com/mT4MnAeAVr— Byomkesh (@byomkesbakshy) February 8, 2025వెనక్కి కాంగ్రెస్ పరుగుఈ మీమ్లో ఒక రేసులో పాల్గొన్నవారంతా ఒక దిశలో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ మాత్రం వెనక్కి తిరిగి పరిగెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు చూడవచ్చు. దీనిని చూసినవారంతా తెగ నవ్వుతున్నారు.Social Media is Brutal 🤣🤣#DelhiElectionResults pic.twitter.com/uOZxhPs7kB— Kashmiri Hindu (@BattaKashmiri) February 8, 2025జీరో చెక్ చేసుకోండి సార్ఈ మీమ్లో పెట్రోల్ పంప్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి రాహుల్గాంధీ మాస్క్ ఉంటుంది. ఈ ఫొటోపై ‘జీరో చెక్ చేసుకుని తీసుకోండి సార్’ అని ఉంటుంది.రాజు ఎప్పటికీ ఒంటరిగా ఓడిపోడుమరో మీమ్లో ఆప్ అభ్యర్థి ఓఝా ఫొటో ఉంటుంది. క్యాప్షన్లో ‘రాజు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో ఓడిపోడు. పార్టీనంతా ముంచుతాడు’ అని ఉంది. राजा कभी अकेले चुनाव नहीं हारता , पूरी पार्टी को ले डूबता है। ❣️#DelhiElectionResults pic.twitter.com/LB3upbpvCt— खुरपेंच (@khurpenchh) February 8, 2025ఇది కూడా చదవండి: ఈ ఏడుగురిలో ఢిల్లీ సీఎం ఎవరు? -
Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు: పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు.2. నాయకత్వ అస్థిరత: కేజ్రీవాల్ అరెస్టు.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్: వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ బలహీనపడింది.4. అంతర్గత కలహాలు- రాజీనామాలు: పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం: ఆప్పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. -
Delhi Election 2025: 12 ఏళ్ల ‘ఆప్’ ప్రస్థానం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత, ఈరోజు(ఫిబ్రవరి 8)న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన పలువురు నేతల కుటుంబాలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ మూడు పార్టీల నేతలు తమ కుటుంబ సభ్యులను, బంధువులను ఎన్నికల బరిలోకి దింపడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల నేతలు తాము బంధుప్రీతికి వ్యతిరేకమని చెబుతూనే తమ కుటుంబ సభ్యులను ఎన్నికల రణరంగంలోకి దించారు. ఈ కేటగిరీలో మొత్తం 22 మంది అభ్యర్థులున్నారు. ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది? ఏ పార్టీ ఎందరు నేతల బంధువులకు టిక్కెట్లు ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే..మీడియాకు అందిన డేటా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజకీయ వారసుల జాబితాలో 11 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ కేటగిరిలో ముగ్గురు అభ్యర్థులకు బీజేపీ అవకాశం ఇచ్చింది.కాంగ్రెస్న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి సందీప్ దీక్షిత్(Sandeep Dixit) పేరు ఈ జాబితాలో ముందుగా వస్తుంది. ఆయన ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు.మరో పేరు మాజీ ఎంపీ జై ప్రకాష్ అగర్వాల్ కుమారుడు ముదిత్ అగర్వాల్, అతను చాందిని చౌక్ స్థానం అభ్యర్థి.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు ఆదర్శ్ శాస్త్రిని కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. అతనికి ద్వారక అసెంబ్లీ స్థానం టికెట్ ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగత్ రామ్ సింఘాల్ కుమారుడు శివంక్ సింఘాల్ ఆదర్శ్ నగర్ నుండి పోటీకి దిగారు.ఫరీదాబాద్ మాజీ ఎంపీ(కాంగ్రెస్) అవతార్ సింగ్ భదానా కుమారుడు అర్జున్ భదానాకు హర్యానా సరిహద్దులోని బదర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై జంగ్పురా స్థానం నుంచి ఫర్హాద్ సూరికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ తాజ్దర్ బబ్బర్ కుమారుడు.కాంగ్రెస్ పార్టీ అరిబా ఖాన్ కు ఓఖ్లా స్థానం టికెట్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ కుమార్తె.ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలీ మొహమ్మద్ను ముస్తఫాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఆయన మాజీ ఎమ్మెల్యే హసన్ మెహందీ కుమారుడు.ఆమ్ ఆద్మీ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ కూడా బంధుప్రీతిని కనబరిచింది. ఈ జాబితా కింద పార్టీ మొత్తం ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇంతే కాకుండా ఆప్ తమ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల భర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 11 మందికి ఆప్ ఈ కేటగిరీ కింద టిక్కెట్లు ఇచ్చింది.ఆప్ పార్టీ మతియా మహల్ స్థానం నుంచి ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమారుడు అలే ఇక్బాల్ను బరిలోకి దింపింది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.కె. బగ్గా కుమారుడు వికాస్ బగ్గాకు కృష్ణ నగర్ సీటు టికెట్ ఇచ్చారు.ఆమ్ ఆద్మీ పార్టీ చాందినీ చౌక్ స్థానం నుండి ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నిని పోటీకి దింపింది.సీలంపూర్ స్థానం నుండి, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ కుమారుడు చౌదరి జుబైర్ అహ్మద్ను అభ్యర్థిగా నిలబెట్టింది.ఆప్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మహాబల్ మిశ్రా కుమారుడు వినయ్ కుమార్ మిశ్రాకు ద్వారక స్థానం నుంచి టికెట్ ఇచ్చింది.ప్రస్తుత ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్కు బదులుగా ఈసారి ఆప్ ఆయన భార్య పోష్ బల్యాన్కు టికెట్ కేటాయించింది.బీజేపీబీజీపీ ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే, బంధుప్రీతి కాస్త తక్కువే చూపినట్లు కనిపిస్తోంది.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.మోతీ నగర్ స్థానం నుండి హరీష్ ఖురానాను పార్టీ నిలబెట్టింది. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్లాల్ ఖురానా కుమారుడు.ఈ జాబితాలో మూడవ పేరు ఢిల్లీ కాంట్ బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్. ఆయన మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వర్ కుమారుడు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్కు చుక్కలే.. -
నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు. -
Exit Polls: ఢిల్లీలో అంచనాలు తప్పేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్ మాత్రం ‘హ్యాట్రిక్’ విజయంపై ధీమాతోనే ఉంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls)ను ఆప్ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్పోల్స్ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.‘‘ఈ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్పోల్స్ నివేదికలతో ఫుల్ జోష్లో ఉంది. బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్(Weepresie), మైండ్ బ్రింక్లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్పోల్స్పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.అధికారంపై బీజేపీ ఆశలు1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ఢిల్లీలో కమల వికాసం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా సున్నా చుడుతుందని స్పష్టం చేశాయి. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని రెండు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే మొగ్గు మాత్రం బీజేపీవైపేనని తెలిపాయి. ఆప్ గెలుస్తుందని మరో రెండు చెప్పుకొచ్చాయి. బీజేపీకి 51 నుంచి 60 దాకా రావచ్చని, ఆప్ 10 నుంచి 19కి పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. కాంగ్రెస్ సున్నా చుడుతుందని చెప్పింది. బీజేపీకి 40–44, ఆప్కు 25–29, కాంగ్రెస్కు 2 సీట్లొస్తాయని పీపుల్స్ ఇన్సైట్ చెప్పింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈసారి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. అందరి కళ్లూ 8వ తేదీన వెలువడబోయే ఫలితాలపైనే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. విజయానికి 36 సీట్లు కావాలి. ప్రస్తుత అసెంబ్లీలో ఆప్కు ఏకంగా 62 సీట్లున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చగా బీజేపీ నేతలు విజయంపై ధీమా వెలిబుచ్చారు. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘనవిజయం సాధించింది. -
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
కయ్యాలతో కాలం గడిపిన ఆప్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జంగ్పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. -
Delhi Election: ఆ సీట్లలో ఆప్కు చుక్కలే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఢిల్లీలోని 70 స్థానాలకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఢిల్లీలోని ఐదు స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాలను ఆప్ అతికష్టం మీద గెలుచుకుంది. ఆప్ అభ్యర్థులు బీజేపీని చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఆ సీట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.1. బిజ్వాసన్గత ఎన్నికల్లో నైరుతి ఢిల్లీలోని బిజ్వాసన్ స్థానంలో ఆప్ అభ్యర్థి భూపిందర్ సింగ్ జూన్ బీజేపీకి చెందిన సత్ ప్రకాష్ రాణాను కేవలం753 ఓట్ల తేడాతో ఓడించారు. భూపిందర్ సింగ్ జూన్కు 57,271 ఓట్లు, సత్ ప్రకాష్ రాణాకు 56,518 ఓట్లు వచ్చాయి. ఈ సీటును రెండుసార్లు గెలుచుకున్న సత్ ప్రకాష్ రాణా, 2015లో మొదటిసారి, 2020లో రెండవసారి ఈ సీటును కోల్పోయారు. ఈసారి ఆప్ సురేంద్ర భరద్వాజ్కు, బీజేపీ కైలాష్ గెహ్లాట్కు, కాంగ్రెస్ దేవేంద్ర సెహ్రావత్కు బిజ్వాసన్ టికెట్ ఇచ్చింది.2. కస్తూర్బా నగర్ఆగ్నేయ ఢిల్లీలోని కస్తూర్బా నగర్ సీటులో ఈసారి కూడా గట్టి పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన రవీంద్ర చౌదరికి 33,935 ఓట్లు, ఆప్ నేత మదన్ లాల్కు 37100 ఓట్లు వచ్చాయి. మదన్ లాల్ కేవలం 3,165 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ రమేష్ పెహ్ల్వాన్ను బరిలోకి దింపింది. బీజేపీ నీరజ్ బసోయాకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ అభిషేక్ దత్ను నిలబెట్టింది.3. ఛతర్పూర్2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కర్తార్ సింగ్ తన్వర్ కూడా దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని 3,720 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కర్తార్ సింగ్ కు 6,9411 ఓట్లు, బీజేపీకి చెందిన బ్రహ్మ సింగ్ తన్వర్ కు 6,5691 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ స్థానంలో అభ్యర్థుల్లో మార్పు జరిగింది. ఆప్ బ్రహ్మ సింగ్ తన్వర్ను, బీజేపీ కర్తార్ సింగ్ను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర తన్వర్కు టికెట్ ఇచ్చింది.4. ఆదర్శ్ నగర్ఉత్తర ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్థానంలో గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పవన్ శర్మకు 46,892 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ భాటియాకు 45,303 ఓట్లు వచ్చాయి. వారిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1,589 మాత్రమే. ఈసారి ఆప్ ముఖేష్ గోయల్ కు టికెట్ ఇవ్వగా, బీజేపీ రాజ్ కుమార్ భాటియాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ శివంక్ సింఘాల్ను ఎన్నికల్లో పోటీకి దింపింది.5. పట్పర్గంజ్మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సీటును సిసోడియా అతికష్టం మీద దక్కించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియాకు 70,163 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేత రవీంద్ర నేగికి 66,956 ఓట్లు వచ్చాయి. మనీష్ సిసోడియా 3,207 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆప్ అవధ్ ఓజాకు టికెట్ ఇచ్చింది. బీజేపీ రవీంద్ర నేగిని, కాంగ్రెస్ అనిల్ కుమార్ను బరిలోకి దింపాయి.ఇది కూడా చదవండి: వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది -
ప్రధాని మోదీ మిత్రుడంటూ.. ‘ఆప్’కు టీఎంసీ ఎంపీ ప్రచారం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలతో వివిధ పార్టీల ప్రచారపర్వం ముగియనుంది. గత నెల 20 నుంచి సాగుతున్న ఈ ప్రచారంలో పలు వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, నటులు ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం సాగించారు. ప్రధాని మోదీని తన స్నేహితుడని అంటూనే ఆయనను ‘ప్రచార మంత్రి’అని అభివర్ణించారు. ఆయన(ప్రధాని) రోజూ 10 నుండి 12 గంటలు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. నటుడి నుండి రాజకీయ నేతగా మారిన సిన్హా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఆతిశీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్’ (ఐఎన్ఐ)లో భాగస్వాములు. శత్రుఘ్న సిన్హా తన ప్రసంగంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ‘మా గౌరవనీయ ప్రచార మంత్రి అంటే..ప్రధానమంత్రి అంటూ.. ఆయన నాకు స్నేహితుడు.. మనకి ప్రధానమంత్రి కూడా.. అని వ్యంగ్యోక్తి విసిరారు. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెబుతారని, అయితే ఆయన ఆ 18 గంటల్లో 10 నుండి 12 గంటలు ప్రచారానికే కేటాయిస్తారని, కౌన్సిలర్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పార్లమెంటరీ ఎన్నికలైనా.. ఎక్కడికైనా మన గౌరవనీయ ప్రధానమంత్రి ఖచ్చితంగా అక్కడికి వెళతారు’అని సిన్హా విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. కోటి మొదలైన హామీలను ఇచ్చిన మోదీ వాటిని నెరవేర్చలేదని సిన్హా అన్నారు.ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ -
ఢిల్లీ ప్రచారానికి... నేటితో తెర
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అగ్రనేతలంతా ఢిల్లీ ప్రచారంలోనే ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్లు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ సాగుతోంది. ప్రధాని మోదీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డుపడుతోందంటూ దుయ్యబడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మొదలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ, హరియాణా సీఎం నయాబ్సింగ్ సైనీలు భారీ బహిరంగ సభలతో పాటు, మూడేసి నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందంటూ ప్రచార సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంగా పేరొందింన ఆప్ మరోసారి ఢిల్లీ పీఠం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరెన్ని హామీలు ఇచ్చినా, గెలిచేది మాత్రం తామేనంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆప్కు మద్దతుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో మమేకం అవుతూ.. పదేళ్లలో ఆప్ ఇచ్చిన ప్రతి వాగ్థానాన్ని అమలు చేసిందని గుర్తు చేస్తూ, మరోసారి ఆప్కు అవకాశం ఇవ్వాలని భగవంత్మాన్ అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నడుంబిగించారు. పదేళ్లలో ఢిల్లీ అభివృద్ధి చెందలేదని, బీజేపీ వచ్చినా అభివృద్ధి సూన్యమేనంటూ ప్రచారసభల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మాత్రమే ఢిల్లీ అభివృద్ధిలో పరుగులు తీసిందని గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.సోషల్ మీడియాలో హోరాహోరీబీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుంటుందని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు ఆప్ నేతలు ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చే వరకూ బలహీన వర్గాల వారిని పట్టించుకున్న వారు లేరని, ఢిల్లీ లాంటి మహానగరంలో పాఠశాలల రూపురేఖలు మార్చి ప్రైవేటుగా ధీటుగా విద్యను అందిస్తున్నామంటూ ఆప్ బదిలిస్తుంది. మెట్రో, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీలో జరిగిందని కాంగ్రెస్ చెప్పుకుంటుడగా.. బీజేపీ, ఆప్లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ బీజేపీ ఆరోపిస్తుండగా.. అంతుపట్టని అవినీతి, ఈవీఎంల ట్యాంపరింగ్, మతకల్లోహాలకు బీజేపీ కేరాఫ్ అంటూ ఆప్, కాంగ్రెస్లు సోషల్ మీడియా ద్వారా ప్రతిఘటిస్తున్నాయి. నేటితో ఆఖరు5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సొమవారంతో ప్రచారం పర్వం ముగియనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలకనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్లకు చెందిన పార్టీల నేతలంతా వారి వారి బాధ్యతలలో నిమగ్నమైయ్యారు. సుమారు 50కి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరీ ఎన్నికల హీట్ను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు 8న వెల్లడవుతాయి. -
ఆప్,కాంగ్రెస్లపై ప్రధాని ఫైర్
న్యూఢిల్లీ:బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను కూడా తొలగించబోమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మురికివాడల్లో కూల్చివేతల విషయంలో ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. ఆదివారం(ఫిబ్రవరి2) ఢిల్లీ ఆర్కేపురం ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్,కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘ఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా తొలగించం. మేం మాటలు చెప్పే వాళ్లం కాదు మాటకు కట్టుబడే వాళ్లం. బడ్జెట్లో రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయించి ఇది రుజువు చేశాం. మేం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు అందుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం వచ్చాక ఆపబోము. బిహార్,పూర్వాంచల్ నుంచి ఢిల్లీకి వచ్చి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటాం.కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే.కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీపై పడ్డ అవినీతి మచ్చ ఎప్పటికీ పోదు.స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుతో ఆప్ ఢిల్లీ యువతను మోసం చేసింది’అని ప్రధాని విమర్శించారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. -
బీజేపీలో చేరిన ఆ 8 మంది ఎమ్మెల్యేలు
-
బీజేపీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయి: కేజ్రీవాల్ కొత్త ట్విస్ట్
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే యమునా నది నీటి విషయమై రెండు పార్టీల నేతలు వాదనలకు దిగారు. ఇక, తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఆప్ ఓడిపోతే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మూతపడతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి.ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నేను ఒక బీజేపీ కార్యకర్తను కలిశాను. ఈ క్రమంలో అతడు నాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఏం చేస్తారని అడిగారు. దీనికి మీకు సమాధానం తెలుసుకోవాలి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే.. ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అన్నీ ఆగిపోతాయి. #WATCH | #DelhiElection2025 | In a video message, AAP National Convenor Arvind Kejriwal addresses BJP supporters, he says, "A few days back I met a 'kattar' BJP supporter, he asked Arvind ji, what if you lose? I also smiled and asked, what will happen to you if I'll lose? I asked… pic.twitter.com/3NFDpL7UZq— ANI (@ANI) February 1, 2025బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుంది. అంతేకాక.. మీకు నెలకు రూ.25 వేల ఖర్చు పెరిగిపోతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో, 24 గంటల కరెంటు ఉందో, లేదో మీకు తెలుసు. బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా.. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. బీజేపీ వీడతారా, లేదా అనేది మీ ఇష్టం. కానీ, ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. యమునలో విషం కలిపారని ఆప్ నేతలు కామెంట్స్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనికి బీజేపీ నేతలు ఆప్కు కౌంటరిచ్చారు. దీంతో, ఎన్నికల్లో యమునా నది విషయం కొత్త చర్చకు దారి తీసింది. ఇక, మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
Delhi Elections: ఆప్కు భారీ షాక్..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది.కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్ -
మోదీ నమస్కారం వైరల్.. ఎవరీ రవీందర్?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్క్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీలో బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి.. మోదీ పాదాలకు నమస్కరించడంతో ప్రతిగా మర్యాదతో ప్రధాని కూడా మూడుసార్లు నమస్కరించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రవీందర్ సింగ్ నేగి ఎవరూ అనే చర్చ మొదలైంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రవీందర్ సింగ్ నేగి.. పట్పర్గంజ్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆప్ అభ్యర్థిగా యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా పోటీలో నిలిచారు. ఇదే స్థానం నుంచి ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా 2013 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం సిసోడియా జంగ్పురా నుండి పోటీ చేస్తున్నారు. ఇక, రవీందర్ సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్గంజ్ నియోజకవర్గంలో భాగమైన వినోద్ నగర్ నుంచి కౌన్సిలర్గా కొనసాగుతున్నారు.यह बड़प्पन है हमारे पीएम नरेंद्र मोदी का नहीं चाहते कि कोई भी उनके पास छुए*BJP candidate Ravindra Negi touches PM Modi's feet.* फिर PM Modi did it thrice. pic.twitter.com/KFtyHBqPHm— Srivatsan (@kj_srivatsan) January 29, 2025ఇదిలా ఉండగా.. రవీందర్ సింగ్ నేగి అప్పట్లో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. అయితే, ఢిల్లీలో దుకాణాలకు తమ సొంత పేర్లను ఏర్పాటు చేయాలని నేగి సూచించారు. హిందువులు అయితే కాషాయ జెండాను దుకాణాలపై ఎగురువేయాలని కోరారు. అంతేకాకుండా.. నవరాత్రి రోజుల్లో, పండుగలకు ముందు రోజు హిందూ భావాలను గౌరవిస్తూ మటన్, చికెన్ షాపులను మూసివేయాలని దూకాణాదారులను ఆయన కోరారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్టోబర్ 2024, జనవరి 2025లో సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో, హిందువుల గురించి ఆయన పలు కార్యకక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, ఢిల్లీలో వరద నీరు నిలిచిన సమయంలో నీటిలో బోట్లు వేసుకుని తిరిగారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కార్యక్రమాలు వైరల్గా మారాయి.This is BJP Councillor Ravinder Singh Negi.When you mistake an inflatable boat for the rowing machine in the gym. 😭pic.twitter.com/lJ00VoiyEK— @UrbanShrink 🌻 (@UrbanShrink) June 28, 2024మరోవైపు.. రవీందర్ సింగ్ నేగి బీజేపీ నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఆయన మనీష్ సిసోడియా చేతిలో కేవలం 2 శాతం తేడాతో ఓడిపోయారు. 2022 ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో, వినోద్ నగర్ స్థానం నుండి ఆప్ అభ్యర్థిని 2,311 ఓట్ల తేడాతో ఓడించారు. This is Ravindra Singh Negi, a BJP councilor in Delhi. He is pressuring Muslim vendors into writing their names on their stalls to identify themselves. He is also placing Bhagwa flags on the outlets of Hindu business owners. Life has become an absolute hell for Indian… pic.twitter.com/puV6LVOJsW— Darab Farooqui (@darab_farooqui) December 8, 2024 -
ధనవంతులకు బీజేపీ.. నేరస్తులకు ఆప్.. టిక్కెట్ల లెక్కలివే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ నాల్గవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్లు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 699 మంది అభ్యర్థులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి.పార్టీల పరంగా చూస్తే నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టిక్కెట్లు కేటాయించింది. దీని తరువాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 132 మంది అభ్యర్థులు (19శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. 81 మంది అభ్యర్థులు (12శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో రూ. 3.2 కోట్లు ఉండగా, అది నుండి 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
Delhi Elections: ఆప్-బీజేపీ మధ్య చైనీస్ సీసీటీవీల జంగ్
న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ స్థానం నుండి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటున్నారని, మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అలాగే పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని, వారు ఆప్ కార్యకర్తలుగా మారి, వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. తాజాగా అమృత్సర్ నుండి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా భద్రతా దృక్కోణం నుండి చూస్తే కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని, వాటిలోని వస్తువులను తనిఖీ చేయడం లేదని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతోపాటు ఇతర వస్తువులు ఢిల్లీకి వస్తున్నాయన్నారు.అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేల నిధిగా ఉన్న రూ.30 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. న్యూఢిల్లీలో ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదని, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయడానికి బదులు.. పంజాబ్ మాఫియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని కేజ్రీవాల్ కలలు కంటున్నారని ప్రవేశ్వర్మ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని అన్నారు. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి ఖాయమని ప్రవేశ్వర్మ జోస్యం చెప్పారు. -
Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం
ఫిబ్రవరి(2025)లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. అయితే అటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్.. ఈ పార్టీల కళ్లన్నీ దళిత ఓటర్లపైనే ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో దళితుల ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. వీరి మద్దతు ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. అయితే దళితుల ఆధిపత్యం 20 సీట్లలో కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ మూడు పార్టీలు దళితులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని 70 సీట్లలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేశారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 17 శాతం మంది దళితులున్నారు. వీరిలో 38 శాతం మంది జాట్లు, 21 శాతం మంది వాల్మీకి సమాజానికి చెందినవారు.ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 12 మంది దళిత అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువమంది దళిత అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాయి. బీజేపీ జనరల్ స్థానాల నుండి ఇద్దరు దళిత అభ్యర్థులను నిలబెట్టింది. వారు మాటియా మహల్ నుండి దీప్తి ఇండోరా, బల్లిమారన్ నుండి కమల్ బాగ్డి. కాంగ్రెస్ కూడా నరేలా జనరల్ స్థానం నుండి దళిత అభ్యర్థి అరుణ కుమారిని నిలబెట్టింది.ఎస్సీ సీట్లపై ఆధిపత్యం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు2020: ఆప్ 12 సీట్లు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది2015: ఆప్ 12 సీట్లు గెలుచుకుంది.2013: ఆప్ 9 సీట్లు గెలుచుకుంది.2008: కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది.2003: కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది.1998: కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంది.1993: బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.ఈ లెక్కలను అనుసరించి చూస్తే ఈసారి కూడా అధికారానికి షెడ్యూల్డ్ కులాల ఓట్లు కీలకంగా మారనున్నాయనే అంచనాలున్నాయి. అందుకే వివిధ పార్టీలు షెడ్యూలు కులాల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ, వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 20 దళిత ప్రాబల్య స్థానాల విషయానికి వస్తే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 56 శాతం ఓట్లతో 19 సీట్లను సొంతం చేసుకుంది. నాడు బీజేపీ ఖాతాలోకి ఒకే ఒక సీటు వచ్చింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు(Scheduled Castes) రిజర్వ్ చేసిన 12 నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ స్థానాల్లో రెండు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. ఢిల్లీలోని 12 సీట్లలో దళిత సమాజ ఓటర్లు 17 నుండి 45 శాతం వరకు ఉన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి -
Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా 40 మంది ఆప్ నేతల పేర్లు ఉన్నాయి.ఈసారి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో పాటు మంత్రులు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఢిల్లీ, పంజాబ్ మంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ ప్రచారకర్తల జాబితాలో మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, హర్భజన్ సింగ్, మీట్ హయర్, దిలీప్ పాండే, రాంనివాస్ గోయల్, గులాబ్ సింగ్, రితురాజ్ గోవింద్ ఉన్నారు.మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది, ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ఖాజీ నిజాముద్దీన్, దేవేంద్ర యాదవ్, అశోక్ గెహ్లాట్, హరీష్ రావత్, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుఖ్వీందర్ సింగ్ సుఖుతో సహా మొత్తం నలభై మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. Aam Aadmi Party announces the list of 40-star campaigners for the #DelhiAssemblyElection2025 AAP National Convenor Arvind Kejriwal, his wife Sunita Kejriwal, Delhi CM Atishi, Manish Sisodia, Sanjay Singh, Punjab CM Bhagwant Mann's names are included in the list of star… pic.twitter.com/glRzUwuT6N— ANI (@ANI) January 19, 2025ఇదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన స్టార్ ప్రచారకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, గిరిరాజ్ సింగ్ సహా 40 మంది నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. బీజేపీ జాబితాలో నలుగురు సినీ ప్రముఖులు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా కనిపించనున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా.. -
బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.పేద మహిళలకు గ్యాస్ సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయంఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటుఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్), బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ముక్కోణపు పోరు ఉండబోదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆప్ ప్రధాన స్కీమ్లను ప్రకటించింది. నెలనెలా మహిళలకు నగదు ఇచ్చే స్కీమ్తో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పూర్తి ఉచితంగా వైద్యం లాంటి జనాకర్షక పథకాలను ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రమేష్బిదూరి సీఎం అతిషితో పాటు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రమేష్ బిదూరి కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘సుప్రీంలో ‘ఆప్’ సర్కారుకు ఊరట -
Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి సత్తాను సమకూర్చుకుంటున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి చిన్న రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లతో పూర్తిస్థాయిలో పోటీపడేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే బడా పార్టీలకు ఛోటా దళాలు షాకివ్వనున్నాయనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 10కిపైగా ముస్లిం ప్రాబల్య స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది.మరిన్ని ర్యాలీలకు మాయావతి సిద్ధంమీడియాకు అందిన వివరాల ప్రకారం బీఎస్పీ, ఏఐఎంఐఎంలు ఎన్నికల ప్రచారంలో బడా నేతలను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒకవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ర్యాలీలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ర్యాలీలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని చిన్న రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బడా పార్టీలకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతున్నాయి. ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో వివిధ సమస్యలను పరిష్కరించడం, అవినీతిని అరికట్టడం, సుపరిపాలన అందించడం లాంటి పలు వాగ్దానాలను ఆ పార్టీలు చేస్తున్నాయి.‘ఆప్’కు పోటీ ఇస్తామంటున్న బీఎల్పీబడా పార్టీలతో పోటీపడుతున్న చిన్న పార్టీలలో భారతీయ లిబరల్ పార్టీ (బీఎల్పీ) కూడా ఉంది. దీనిని ఇటీవల అమెరికాకు చెందిన డాక్టర్ మునీష్ కుమార్ రైజాదాతో పాటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న పలువురు కలిసి స్థాపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీష్ కుమార్ రైజాదా మీడియాతో మాట్లాడుతూ తాను ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగమయ్యామని, కానీ ఇప్పుడు ‘ఆప్’కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దాదాపు 15 నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చిన రైజాదా, న్యూఢిల్లీ స్థానం నుండి ఆప్ అధినేత కేజ్రీవాల్పై పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మ కూడా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సందీప్ దీక్షిత్ కు టికెట్ ఇచ్చింది.ఢిల్లీలో బీఎల్పీ అధికారంలోకి వస్తే, తాము చేసే మొదటి పని అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఏర్పాటు చేయడమేనని రైజాదా అన్నారు. కాగా దళితులు, వెనుకబడిన వర్గాల్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీఎస్పీ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో మాయావతి మరిన్ని ర్యాలీలు నిర్వహించే ప్రణాళికపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై ఏఐఎంఐఎం దృష్టిహైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఢిల్లీలోని 10 నుంచి 12 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముస్తఫాబాద్ నుండి తాహిర్ హుస్సేన్, ఓఖ్లా నుండి షఫా ఉర్ రెహ్మాన్ పోటీ చేస్తారని తెలిపింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వీరిద్దరూ నిందితులు. ఢిల్లీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షోయబ్ జమాయ్ మీడియాతో మాట్లాడుతూ, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు బలమైన అభ్యర్థులను పార్టీ ఇప్పటికే నిలబెట్టిందని తెలిపారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై పార్టీ దృష్టి సారించిందన్నారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’