ad
-
వింటేజ్ కారు ధర రూ.3,675!
మీరు చదివిన శీర్షిక నిజమే. కానీ అది 2024లో కాదండోయ్.. 1936లో సంగతి. అప్పట్లో చేవ్రొలెట్ కంపెనీ ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనను ఇటీవల కార్బ్లాగ్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్గా మారింది. అందులోని వివరాల ప్రకారం చేవ్రొలెట్ కంపెనీ 1936 సంవత్సరంలో 5 సీటింగ్ కెపాసిటీ ఉన్న వింటేజ్ కారును రూ.3,675కే ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. అలెన్ బెర్రీ అండ్ కో.లిమిటెడ్ అనే ఏజెన్సీ కలకత్తా, ఢిల్లీ, లఖ్నవూ, దిబ్రూఘర్ ప్రాంతాల్లో దీన్ని ఆ రేటుకు అందిస్తున్నట్లు పేర్కొంది. 1936లో రూ.3,675 విలువ 2024లో రూ.3,67,50,000గా ఉందని అంచనా.మరో ప్రకటనలో ఓపెన్టాప్ చేవ్రొలెట్ మోడల్ కార్ ధర రూ.2,700 అన్నట్లు ప్రకటనలో ఉంది. దీన్ని లఖ్నవూలోని ఎడుల్జీ అండ్ కో మోటార్ ఇంజినీర్స్ అండ్ కోచ్ బిల్డర్స్ కంపెనీ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 5 సీటర్ బడ్జెట్ కార్లు రూ.లక్షల్లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తుంటే డబ్బు విలువ పడిపోయి లక్షలకు విలువ లేకుండా పోతుంది. దాంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia)ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..ఈ రెండు ప్రకటనలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేనూ ధనవంతుడినే కానీ, వేరే శతాబ్దంలో ఉన్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఆ రోజుల్లో అది చాలా ఖరీదు’అని రిప్లై ఇచ్చారు. -
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్కు గూగుల్కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్లకు సంబంధించిన బిడ్ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
యాపిల్ ఫస్ట్ ఇండియన్ యాడ్ ఇదే.. చూశారా?
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ రోజు (సెప్టెంబర్ 9) లాంచ్ కానుంది. 'ఇట్స్ గ్లోటైమ్' పేరుతో కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్లో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్ను కంపెనీ చీఫ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.కంపెనీ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ను ప్రారంభించడానికి ముందే.. యాపిల్ కంపెనీ ఇంటర్నెట్లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీ నటించిన ఈ యాడ్ టెక్ ఔత్సాహికులను, అభిమానులను ఎంతగానో ఆకర్శించింది. ఈ యాడ్ గమనిస్తే.. ఇది ఒక సాధారణ కార్పొరేట్ ఆఫీసులో 1996లో జరిగిన సన్నివేశం అని తెలుస్తోంది.టీవీ1 ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గమనిస్తే యాపిల్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.Found Apple's 1st (?) Indian ad film for the Power Macintosh, apparently aired on Doordarshan in 1996 — a full twenty years before it started making India-focussed iPhone ads again in 2016. pic.twitter.com/gHx0mzYtkx— Neil (@neilshroff) November 29, 2023యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఈరోజు 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంఛ్ అవుతాయని సమాచారం. ఈ ఫోన్స్ 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు.. బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్సెట్ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!
న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్స్క్రైబర్స్కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!
Australia Job Ad: ఏ దేశంలో అయినా డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్తో పాటు వేతనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డాక్టర్లకు అద్భుతమైన శాలరీ మాత్రమే కాకుండా, అంతకు మించిన స్పెషలిటీస్ కూడా అందిస్తున్నాయి. ఇటీవల ఒక ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ. కోటికి పైగా ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వెల్లడైన జాబ్ యాడ్ పోస్ట్ ప్రకారం, ఏడాదికి రూ.1.30 కోట్లు జీతం అందిస్తామని, అంతే కాకుండా నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దినాలు, మిగిలిన 20 రోజులు సెలవులు అని తెలిపింది. ఇది జాబ్ అడ్వర్టైజ్మెంట్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ యూనియన్ ప్రముఖ జర్నల్ BMJలో ప్రచురితమైంది. ఇంకా సైన్ ఇన్ బోనస్ కింద రూ. 2.7 లక్షలు కూడా అందుతాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ మెడికల్ రిక్రూట్మెంట్ సంస్థ బ్లూగిబ్బన్ ఈ యాడ్ రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా నేషనల్ హెల్త్ స్కీమ్తో (NHS) కలిసి పనిచేయాలని వెల్లడించింది. ఇది డాక్టర్లకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వం మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే - చూసారా..!) How depressing to see this in the BMJ. It’s hard to say those figures don’t present a compelling argument. It all leads to a big question for the govt: if you don’t address doctors’ very reasonable pay concerns, alongside their conditions and wellbeing, guess where they’re going? pic.twitter.com/24oKKrgfLa — Adam Kay (@amateuradam) May 3, 2023 ముఖ్యంగా యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, ఎక్స్పీరియన్స్ వంటివి ఉన్నవారికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాలరీ కావాలనుకునే డాక్టర్లు ఆస్ట్రేలియన్ అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరేవారికి వసతి సదుపాయం కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఒక్క యాడ్తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!
యునైటెడ్ ఎయిర్లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్ట్లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది. ‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది. స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్బుక్ పోస్ట్లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్రాంతి గదిలో విగతజీవిగా.. ఏడీ అనుమానాస్పద మృతి
సాక్షి, అనంతపురం: పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎం.రాము (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల విశ్రాంతి గదిలో ఉరికి వేలాడుతుండగా సిబ్బంది మంగళవారం గమనించారు. తలుపులు తెరిచి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తన చావుకు పలువురు కారణమంటూ పేర్లు రాసి ఉన్న లేఖ లభించింది. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లాకు చెందిన ఎం.రాముకు భార్య రాణి (ప్రభుత్వ కళాశాల లెక్చరర్), కుమార్తె రిత్విక ఉన్నారు. భార్య, కుమార్తె కర్నూలులో స్థిరపడగా.. రాము మాత్రం పదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం డీఆర్డీఏ లైవ్స్టాక్ విభాగం డీపీఎంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు ముగించుకుని విశ్రాంతి గదికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పశుసంవర్ధక శాఖ కార్యాలయ డ్రైవర్ రామసుబ్బారెడ్డి విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకని మొదటి అంతస్తులోకి వచ్చాడు. చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు) అప్పటికే అక్కడ విశ్రాంతి గది తలుపులు కొంత తెరుచుకుని ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. ఫ్యాన్కు ఉరికి వేలాడుతున్న ఏడీని చూసి వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. వన్టౌన్ పోలీసులు హుటాహుటిన వచ్చి గదిని పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభించింది. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడీ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు పలువురితో సంభాషించినట్లు, గట్టిగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్వతహాగా ఏడీ స్థానికంగా ఎవరితోనూ కలివిడిగా ఉండేవారు కాకపోవడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తులు, వారి వ్యవహారాల గురించి తెలియదని పేర్కొన్నారు. డ్రైవర్ రామసుబ్బారెడ్డిని ప్రాథమికంగా విచారణ చేశారు. ఏడీ గదికి ఎవరెవరు వచ్చారో.. ఆయన ఏ సమయంలో చనిపోయారో తెలియదని సిబ్బంది తెలిపారు. అయితే తలుపులు తెరిచి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. హత్యా.. ఆత్మహత్యా.. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలుస్తామన్నారు. చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..) ఏడీ సూసైడ్ నోట్లో ఏముందంటే... ‘నా చావుకు కారణం అటెండర్ జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కోట్ల విజయ లవర్ మహేష్. వీరు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినారు. చిక్కబళ్లాపురకు చెందిన నెట్ సెర్ఫ్ వ్యాపార భాగస్వామి మునిరాం, పుట్టపర్తికి చెందిన జియోన్ మెడికల్ షాపు ఓనర్ అశోక్కుమార్, ధర్మవరానికి చెందిన మెడికల్ స్టోర్ అశ్వర్థనారాయణ, హరికృష్ణ కల్లూరు స్టాక్ తీసుకుపోయి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సెమన్ బ్యాంకులో పని చేసే డీసీ హుసేన్, అశోక్కుమార్లకు నా పేరు మీద ప్రాంసరీ నోటు రాయించి రూ.4లక్షలు ఇప్పించాను. నన్ను మోసం చేసినారు. ధర్మవరంలో 27.50 ఎకరాల భూమి పత్రాలు 925–2022 చెన్నేకొత్తపల్లి’ అంటూ అస్పష్టంగా వివరాలు రాశారు. -
సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఢిల్లీ ప్రభుత్వం హుటాహుటిన తప్పును సరిదిద్దుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్లో వాలంటీర్లుగా చేరాలనుకునేవారి కోసం ప్రకటన విడుదల చేసింది. పలు పత్రికల్లోనూ ఈ యాడ్ అచ్చయింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...) కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి ఇదే అదనుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రంగా మండిపడింది. ఈశాన్య ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసిన అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది. దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేశామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ప్రకటన సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సదరు ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవతరించింది. వారం రోజుల కిందటే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు) -
సినిమాల్లోకి కోహ్లి..?
ఈ రోజు విరాట్ కోహ్లి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటోను చూసిని దగ్గర నుంచి అభిమానుల మెదళ్లలో ‘కోహ్లి సినిమాల్లో నటిస్తున్నారా.. ఇంతకు ఏ సినిమా.. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది’ వంటి అనుమానాలు వస్తున్నాయి. అంతేకాక కోహ్లి తన షేర్ చేసిన ఫోటోతో పాటు ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్ చేశారు. పైగా రిలీజింగ్ డేట్ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్ రోల్లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. View this post on Instagram Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie www.trailerthemovie.com A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 20, 2018 at 8:30pm PDT కోహ్లి షేర్ చేసిన ఫోటోలో విరాట్ కోహ్లి ‘ట్రైలర్ ద మూవీ’ అని ఉంది. దీన్ని వాగ్న్ ప్రొడక్షన్ వారు రూపొందిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలో కోహ్లి సూపర్ హీరో అవతారంలో ఉన్నారు. అంతేకాక ‘పది సంవత్సరాల తర్వాత మరో డెబ్యూ ఇంకా వెయిట్ చేయలేను’ అంటూ కామెంట్ చేశారు. దాంతో పాటు సెప్టెంబర్ 28న విడుదల అవ్వనున్నట్లు తెలిపాడు. వాగ్న్ అనేది ఒక ప్రముఖ చెప్పుట బ్రాండ్. సో కోహ్లి యాడ్ గురించి చెప్పాడా.. లేక తన సిని ఆరంగ్రేటం గురించి చెప్పాడా అన్నది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాలి. -
ఆ యాడ్ను తొలగిస్తున్నాం..!!
కొచ్చి : ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ మేరకు తాము రూపొందించిన యాడ్ను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నందాలతో రూపొందించిన యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్ను తొలగించనున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. యూట్యూబ్లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
అమితాబ్ యాడ్పై బ్యాంకర్ల ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఓ యాడ్పై బ్యాకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో అమితాబ్తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందా కూడా నటించారు. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కల్గించేలా ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) అభిప్రాయపడింది. ఆ కంపెనీపై దావా వేయనున్నట్టు కూడా తెలిపింది. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ యాడ్ ఉందని ఆరోపించారు. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు లేఖ రాశారు. -
కూతుళ్లే ఉత్తమం; కితాబిచ్చిన మెగాస్టార్
బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే.తాజాగా బిగ్ బీ చేసిన ఒక ట్వీట్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. బిగ్ బీ కుటుంబం నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్ బీ, తన కూతురు శ్వేతా నందాతో కలిసి ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో నటించారు. ప్రకటనలో కూడా అమితాబ్, శ్వేతా ఇద్దరూ తండ్రి కూతుళ్లుగానే నటించారు. ప్రకటన బంగారు ఆభరణాల కంపెనీకి సంబంధించినదే అయినా భిన్నంగా ఉంటుందంటున్నారు కంపెనీ అధికారులు. ఈ ప్రకటనలో కూతురు శ్వేతాతో కలిసి నటించడం గురించి బిగ్ బీ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ‘టీ 2870 నాకు చాలా భావోద్వేగమైన సమయం. దీన్ని చూసిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లు బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్కు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ తండ్రి కూతుళ్ల ప్రకటనకు మంచి స్పందన వస్తుంది. ప్రకటనలో వీరిద్దరి నటనను అభినందిస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. T 2870 - Emotional moment for me .. tears welling up every time I see it .. daughters are the BEST !! pic.twitter.com/7Jes2GDPBo — Amitabh Bachchan (@SrBachchan) July 17, 2018 ప్రస్తుతం బిగ్ బీ బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం 2019, ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు సమాచారం. -
‘మీ అబ్బాయికి సెల్ఫోన్ ఇచ్చారా..?’
-
‘మీ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడా...?’
గురుగ్రామ్, హర్యానా : స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ప్రకటనలో ‘పెళ్లికి ముందే మీ కుమారుడు లేదా కూతురు ‘గే’ లేదా ‘లెస్బియనా’ అనే విషయం తెలుసుకొండి’ అంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు గుర్గావ్కు చెందిన ఓ నకిలీ వైద్యుడు. ఈ ప్రకటనను కాస్తా ఎవరో ఫేస్బుక్లో పోస్టు చేశారు. దాంతో ఈ డాక్టరు గారి కథేంటో తెలుసుకుందామని ఓ యువతి ప్రకటనలో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఆడియోలో సదరు యువతి తనకు 40 ఏళ్లని, తన కుమారుడికి 17 ఏళ్లని పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తనను తాను ‘వైద్యుడి’గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు ‘డాక్టరు’ ఆ మహిళను ఎక్కువ ప్రశ్నలేమి వేయకుండానే ఆమె కొడుకును ‘గే’ అని తెల్చేశాడు. ‘గే అంటే అర్ధం తెలుసు కదా...!’అని సదరు మహిళను ప్రశ్నించాడు. అంతేకాక ‘నీ కుమారుడికి బాగా కోపం వస్తుందా’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని సమాధానమిచ్చింది. అందుకు ఆ వైద్యుడు ‘అతడు లోపల బాధపడుతున్నాడు. మీ అబ్బాయి గే అనే విషయం అతనికే తెలియదు. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్పడం లేదు అన్నాడు.’ అంతేగాక ‘అమెరికాలో దాదాపు 40 శాతం పురుషులు ‘గే’లే’ అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఒక వ్యక్తి ‘గే’గా మారాడానికి ఈ వైద్యుడు చెప్పిన కారణం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఫోన్ సంభాషణలో భాగంగా సదరు వైద్యుడు ‘మీ అబ్బాయికి సెల్ఫోన్ ఇచ్చారా..?’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘అవున’ అన్నారు. ఇంకేముంది ఆ వైద్యుడు ‘నీ కొడుకు ‘గే’గా మారడానికి కారణం సెల్ఫోనే’ అని తెల్చేశాడు. అందుకు ఆ మహిళ ముందు ఆశ్చర్యపోయినా తరువాత అమాయకంగా ‘ఫోన్ వాడకుండా ఉంటే నా కొడుకు మాములుగా మారతాడా...?’ అని ప్రశ్నించింది. అందుకు ఆ డాక్టర్ మీరు హౌస్వైఫ్ అయ్యుంటారన్నాడు. తర్వాత ఫోన్ నుంచి విడుదలయ్యే ‘అతినీలలోహిత’ కిరణాల వల్ల పురుషులు ‘గే’ గా మారతారని చెప్పాడు. అందుకు ఆ మహిళ ‘నేనూ ఫోన్లో మాట్లాడుతున్నాను కదా...నేను ‘గే’గా మారతానా అని ప్రశ్నించగా అందుకు ఆ డాక్టర్ అలా ఏం ఉండదు ఎందుకంటే స్త్రీలలో ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా ఒక వేళ పురుషుల్లో కూడా ఈ ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉన్నట్లయితే వారు ‘గే’గా మారే అవకాశం చాలా తక్కువని వారికి పుట్టే పిల్లలు కూడా ‘గే’గా మారే అవకాశం తక్కువని తెల్చేశాడు. అంతేకాక తాను వైద్యం చేసి సదరు మహిళ కొడుకుకు నయం చేస్తానని అందుకు అతని ఫోటో కావాలని అడిగాడు. ‘గే’ నుంచి మాములు మనిషిగా మార్చడానికి కొన్ని ‘శక్తుల కషాయాల’ను ఆ మహిళ కొడుకు శరీరంలోకి పంపించాలని అందుకు ఖర్చవుతుందని తెలిపాడు.ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వరుడి కోసం ఫేస్బుక్లో ప్రకటన.. వైరల్!
న్యూఢిల్లీ : ఇన్ని రోజులు ఫేస్బుక్ అంటే ఫోటోలు, వీడియోలు షేర్ చేయడానికి మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇక మీదట ‘మ్యాట్రిమొనియల్’గా కూడా మారనుందా? కేరళకు చేందిన ఓ యువతి ఫేస్బుక్లో చేసిన పోస్టు చూస్తే నిజమే అనిపిస్తుంది ఎవరికైనా. తనకు వరడు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన చేసింది ఈ యువతి. వివారాల్లోకి వెళ్తే కేరళ మలప్పురంకు చెందిన జ్యోతి కేజీ(28) తనకు వరుడు కావాలంటు పోయిన వారం ఫేస్బుక్ మ్యాట్రిమొని హాష్టాగ్ను ఉపయోగించి చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం వైరల్ అయ్యింది. జ్యోతి చేసిన ప్రకటనలో ఉన్న వివరాలు...‘నా పేరు జ్యోతి. నా వయసు 28 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు మరణించారు. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను ముంబైలో సీనియర్ యాడ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. నేను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసాను. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే నాకు తెలియజేయండి. నేను కులం, జాతకాల గురించి పట్టించుకోను’ అని మలాయాళంలో పోస్టు చేసింది. అంతేకాక ఫేస్బుక్ నెట్వర్కలో ఫేస్బుక్ మ్యాట్రిమొనియల్ ఫీచర్ను ప్రారంభించమని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు విన్నపం చేసింది. తనలానే చాలామంది సరైన జీవిత భాగస్వామి వెతుకుతున్నారని, ఒకవేళ ఫేస్బుక్ మెయిన్ నెట్వర్క్లో ఎఫ్బీ మ్యాట్రిమొనిని ప్రారంభిస్తే తనలాంటి అనేకమంది అవివాహితులకు చాలా మేలు చేసిన వారవుతారని తెలిపింది. చాలామంది సరైన జీవిత భాగస్వామిని పొందడం కోసం మ్యాట్రిమొనిలు, మధ్యవర్తుల బారినపడి మోసపోతున్నారని అందువల్ల ఎఫ్బీ మ్యాట్రీమొనీని ప్రారంభిస్తే వారందరికీ తగిన జీవితభాగస్వామిని ఎన్నుకునేందుకు మార్గం సులువవుతుందని విన్నవించింది. జ్యోతి ఏప్రిల్ 26న చేసిన ఈ పోస్టు వైరల్ అయ్యింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6 వేల మంది దీన్ని షేర్ చేశారు. జీవిత భాగస్వామి కోసం ఇలా ఫేస్బుక్ ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కేరళకు చెందిన రంజిష్ మంజేరి అనే ఫోటోగ్రాఫర్ తనకు వధువు కావాలంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటన చేశాడు. -
నీరవ్ మోదీ స్ఫూఫ్ యాడ్ చూశారా?
-
డిజిటల్ ప్రకటనల రంగం రూ.13,000 కోట్లకు!
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ ప్రకటనలపై చేసే వ్యయాలు 2018 డిసెంబర్ నాటికి 35 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లకు చేరే అవకాశం ఉందని అసోచామ్, కేపీఎంజీ సర్వే తెలిపింది. స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతూ ఉండడం, డేటా టారిఫ్లు తగ్గిపోవడం డిజిటల్ ప్రకటనల మార్కెట్ను విస్తృతం చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. ప్రస్తుతం ఈ మార్కెట్ రూ.9,800 కోట్లుగా ఉంది. 3జీ, 4జీ సేవల విస్తృత వినియోగంతో ఈ మార్కెట్ భారీగా పెరగనుందన్న అభిప్రాయాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి. 2016 చివరికి డిజిటల్ ప్రకటనల మార్కెట్ రూ.7,500 కోట్లుగానే ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 23.5 కోట్ల మంది మొబైల్స్ నుంచి ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు తెలిపింది. -
డీఎస్ కుమారుడి ‘ప్రకటన’ కలకలం
► జనమంతా మోదీ వెంట నిలవాలని జాతీయస్థాయి ► పత్రికకు భారీ ప్రకటన ► రాజకీయంగా చర్చనీయాంశం ► ఆ ప్రకటనతో సంబంధం లేదన్న డి.శ్రీనివాస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి’’అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీ సీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటనతో డీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించా రు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహ రించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంత కాలంగా టచ్లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్షాను కలసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని అనుకోవడం లేదు’’ అని డీఎస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
విద్యుత్శాఖ ఏడీ ప్రసాద్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్శాఖ ట్రాన్స్ఫార్మర్ విభాగం ఏడీఈ ప్రసాద్ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీబీఐ వలలో ఎమ్ఎస్ఎమ్ఈ ఏడీ
రూ.3.7లక్షల నగదు, 23లక్షల ప్రామిసరీ నోట్స్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేటు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎల్ఎన్ కుమార్ను సీబీఐ వలపన్ని అరెస్ట్ చేసింది. ఖాజాగూడకు చెందిన శైలజ ఎంటర్ప్రైజెస్లో ప్రతీ ఏటా నిర్వహించే తనిఖీలకు సంబంధించి కంపెనీకి అనుకూలంగా నివేదికిస్తానని చెప్పి ఎస్ఎల్ఎన్ కుమార్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఈ నెల 20న సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ అధికారులు వలవేసి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా కుమార్ను మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు రూ.3.7లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన ప్రామిసరీనోట్లు, చెక్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీ నం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన కుమార్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవే శపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. -
ట్రంప్ను విమర్శిస్తూ ఎయిర్లైన్స్ యాడ్
అమెరికా అధ్యక్షపీఠ ఎన్నికల ఫలితాలు డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు షాకిస్తూ.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు దూసుకెళ్తున్నాయి. అంచనాలకు తారుమారుగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఊహించని రిజల్ట్స్కు ముందుగానే ప్రిపేర్ అయిన రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్ డొనాల్డ్ ట్రంప్ పై ఓ అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసింది. ఆ ప్రకటనలో ట్రంప్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించింది. ''ఒకవేళ అతను గెలిచినా, అమెరికా ప్రయాణానికి మీకు ఎప్పటికీ అనుమతి ఉంటుంది'' అని ఎయిర్లైన్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో పాటు, చికాగో, డెట్రాయిట్, న్యూయార్క్లకు విమాన రేట్ల ధరలను కూడా తెలిపింది. గత సాయంత్రం ఈ ఎయిర్లైన్ సంస్థ చేసిన ట్వీట్కు భారీ స్పందన వస్తోంది. 2,560 రీట్వీట్స్, 1,874 లైక్స్ అది సొంతంచేసుకుంది. అయితే మొదటినుంచి డొనాల్డ్ ట్రంప్ తను గెలిస్తే, ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోకి వచ్చే వలసవాదులపై కూడా తను మండిపడుతున్నారు. వారెవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనీయమని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎయిర్లైన్స్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగ, రాయల్ జోర్డానియన్, జోర్డాన్కు చెందిన విమానయాన సంస్థ. అక్కడ ఎక్కువగా ముస్లింలు ఉంటారు. -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
ట్విట్టర్లో వివాదాస్పదమైన యాడ్
ఎలెన్ డిజెనరస్ పిల్లల దుస్తులను ప్రచారం చేసేందుకు గ్యాప్ కిడ్స్ సంస్థ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పెట్టిన యాడ్ వివాదాస్పదమైంది. యాడ్ జాతి వివక్షతను చూపుతోందని పలువురు విమర్శలు కుప్పించారు. ఓ నల్లజాతి బాలిక నెత్తిపై ఓ తెల్లజాతి బాలిక కుడి మోచేతిని ఆనించినట్లుగా ఫొటో ఉండడం పట్ల అందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఆ యాడ్లో ఎక్కువ మంది తెల్లజాతీయులను పెట్టి ఒకే ఒక నల్లజాతి బాలికను చూపడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ‘బాలికలు ఏదైనా సాధించగలరనే పిల్లలను చూడండి’ అనే కాప్షన్తో, ‘పరస్పరం సాధికారత సాధించే సామర్థ్యం మా అందరికి ఉంది’ అనే ట్యాగ్లైన్తో యాడ్ సాగుతుంది. సాధికారత సాధించడమంటే ఇదేనా, తెల్లజాతి బాలిక మోచేతి బరువు మోయడమా? అని ఒకరు, నల్లపిల్ల కాకపోతే ఏమైనా సాధించగమన్న అర్థమా, నల్ల పిల్లలు కేవలం తెల్ల పిల్లల మోచేతులు మోయడానికే పనికొస్తారని చెప్పడమా యాడ్ ఉద్దేశం అంటూ మరొకరు, అసలు యాడ్లో ఒక్క నల్ల పిల్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారంటూ ఇంకొకరు విరుచుకుపడ్డారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, క్షమాపణలు చెబుతున్నామని, ఎవరని నొప్పించడం తమ ఉద్దేశం కాదని గ్యాప్ కిడ్స్ వెంటనే ఓ ప్రకటనను విడుదల చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ యాడ్ను విడుదల చేస్తామని ప్రకటించింది. నిజ జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్లనే తమ యాడ్కు ఎంపిక చేస్తున్నామని కూడా తెలిపింది. -
వారాహీమాత ఆలయం
అరుదైన శాక్తేయ ఆలయాల్లో ఒకటైన వారాహీమాత ఆలయం ఒడిశాలోని పూరీ జిల్లా చౌరాసి గ్రామంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో సోమవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం కళింగ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో వెలసిన ఈ ఆలయం ఎత్తు 15 మీటర్లకు పైబడే ఉంటుంది. లలితాసన భంగిమలో కనిపించే వారాహీమాతను స్థానికులు మత్స్యవారాహిగా ఆరాధిస్తారు. వరాహ ముఖంతో కుడిచేత మత్స్యం, ఎడమచేత కుంభం ధరించి కనిపించే వారాహిమాత మూలవిరాట్టు ఉగ్రరూపంలో కనిపిస్తుంది. తాంత్రిక పద్ధతిలో ఇక్కడ రోజువారీ పూజలు చేస్తారు. అలాగే అమ్మవారికి అనుదినం చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో రోజూ జరిగే మహానైవేద్యాలను ఈ ఆలయానికి పంపడం తరతరాలుగా ఆచారంగా కొనసాగుతుండటం విశేషం. వారాహీమాత వెలసిన చౌరాసి గ్రామం సుప్రసిద్ధ సూర్యక్షేత్రం కోణార్క్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వరకు అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడకు రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది. -
సానియా మీర్జా X షోయబ్ మాలిక్
ముంబై: భారత్, పాకిస్తాన్ ప్రపంచకప్ మ్యాచ్కు ముందు ఉన్న ఉత్కంఠను కార్పొరేట్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. తాజాగా నెస్లేసంస్థ తమ ఉత్పత్తి కోసం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, అతని భార్య (భారత టెన్నిస్ స్టార్) సానియా మీర్జాలతో కలిసి ఓ యాడ్ను రూపొందించింది. ఇందులో ఇద్దరూ తమ తమ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులే గొప్ప అంటూ వాదనకు దిగుతారు. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ గొప్పని సానియా అంటే... అక్తర్ యార్కరే గ్రేట్ అని మాలిక్ అంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పాకిస్తాన్లో ప్రసారం అవుతోంది. -
ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది. సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది. వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది. -
ఇస్లాం మక్కాలో ముహమ్మద్ జననం
అది క్రీస్తు శకం 571. ఒకనాటి రాత్రి అరేబియా దేశంలోని మక్కానగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నక్షత్రాలు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయి. ఒకవైపు కాబాగృహం. మరోవైపు అబ్దుల్ ముతల్లిబ్ ఇల్లు. రెండుచోట్లా ఒకే రకమైన కాంతిపుంజాల కనకవర్షం ప్రారంభమైంది. కాబానుండి ముతల్లిబ్ గృహం వరకు వజ్రాలు వెదజల్లినట్లుగా మార్గమంతా మెరిసిపోతోంది. సరిగ్గా తెల్లవారుజామున ఈ వెలుగులన్నిటినీ పూర్వపక్షం చేస్తూ, ఆకాశంలో ఓ అద్భుత నక్షత్రం ఉదయించింది. అరేబియా చరిత్రలో అంతకుముందు ఏనాడూ ఇలాంటి అద్భుతం జరగలేదు. ప్రజలు మరింత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇందులో ఏ విధమైన మర్మం ఉందోనని ఒకవైపున భయపడుతూనే, మరోవైపు ఏదో మహత్తర శుభసందేశమే ఉండి ఉంటుందని అనుకున్నారు. తెల్లవారుతుండగా అబ్దుల్ ముతల్లిబ్ ఇంట కోలాహలం పెరిగిపోయింది. అమ్మలక్కలతో ఆ గృహం వేడుకలా మారిపోయింది. అంతలో ఒక స్త్రీ విప్పారిన మోముతో పరుగు పరుగున వచ్చి అబ్దుల్ ముతల్లిబ్కు మనుమడు కలిగాడని శుభ వార్త అందజేసింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అబ్దుల్ ముతల్లిబ్ మదిలో అంతకు కొద్ది రోజుల ముందు చనిపోయిన కొడుకు అబ్దుల్లా జ్ఞాపకాలు సుడులు తిరిగాయి. కాని మనుమడిని చూస్తూనే ఆయన కళ్లలో కోటికాంతులు విరబూశాయి. మక్కా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అబ్దుల్ ముతల్లిబ్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అటు ఆమినా పరిస్థితి కూడా అలాగే ఉంది. భర్త జ్ఞాపకాలు ఆమె కళ్లను నిండుకుండలు చేశాయి. సజల నయనాలతోనే ఆమె తోటి మహిళల అభినందనలు స్వీకరిస్తోంది. మక్కాప్రజలంతా అబ్దుల్లా, ఆమినా దంపతులకు కొడుకు పుట్టాడని, సృష్టిలోని అందాన్నంతా కలబోసి చేసిన బంగారు బొమ్మలా, అందమైన మోముతో మెరిసిపోతున్న బాబును గురించి మక్కా పరిసరాల్లో ఒకటే చర్చప్రారంభమైంది. అబ్దుల్ ముతల్లిబ్ ఆ బాలుడికి ముహమ్మద్ అని నామకరణం చేశారు. ఈ శుభవార్తను ఆనాటి ఓ గొప్ప క్రైస్తవ పండితుడైన అయిస్కు తెలియజేయాలని అబ్దుల్ ముతల్లిబ్ ఆయన వద్దకు వెళ్లారు. క్రైస్తవ పండితుడు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ‘అబ్దుల్ ముతల్లిబ్, నీకు శుభం. పిల్లవాడి పేరేం పెట్టావు?’ అని ఆరా తీశాడు. ‘ముహమ్మద్’ అని నామకరణం చేశాను’ అన్నారు ముతల్లిబ్ విప్పారిన ముఖంతో. ‘ముహమ్మద్’ అంటూ రెండుసార్లు ఉచ్చరిస్తూ, దీర్ఘాలోచనతో ‘ముతల్లిబ్, నేను ఇంతకాలం చెబుతూ వచ్చిన బాలుడు ఇతనే’ అన్నాడు క్రైస్తవ పండితుడు నమ్మకంగా. ‘అవునా?’ అన్నారు అబ్దుల్ ఆశ్చర్యంగా. ‘అవును, నేనింత నమ్మకంగా చెప్పడానికి మూడు కారణాలున్నాయి’ ‘మూడుకారణాలా?’ ఏమిటవి?’ ‘ఒకటి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాత్రి ఓ అద్భుతమైన నక్షత్రవెలుగు మక్కాపరిసరాలను జాజ్వల్యమానం చేసింది. రెండు: బాబు జన్మించింది సోమవారం రోజు. మూడు: అతని పేరు మహమ్మద్. ఈ మూడు కారణాల వల్ల ఆ బాలుడు సామాన్యమైన బాలుడు కాదని చెప్పగలను’ అన్నాడు పండితుడు. (డిసెంబర్ 24న ముహమ్మద్ ప్రవక్త జయంతి) వచ్చేవారం ప్రవక్త జీవితంలోని మరికొన్ని ఘట్టాలు... - ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
పెళ్లా? తొందరేంటి!
పదిహేనేళ్ల క్రితం అమెరికాలో ఈ ధోరణి మీద ఏకంగా సినిమాయే వచ్చింది, జూలియా రాబర్ట్స్ నటించిన రనవే బ్రైడ్. పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లిరోజు పారిపోతుంది. పెళ్లంటే అంత కన్ఫ్యూజన్ హీరోయిన్కి. ఇప్పుడు మనమ్మాయిలు కూడా, ‘పెళ్లిలో ఏముంది.. స్వేచ్ఛను పోగొట్టుకోవడమూ, టెన్షనూ తప్ప’ అని పెళ్లిని ఆమడదూరంలో ఉంచుతున్నారు. షి హాజ్ మూవ్డ్ ఫార్ అహెడ్. ఒకప్పుడు అమ్మాయి సెటిల్ అవడం అంటే ఒక అయ్య చేతిలో పడడం. ఇవాళ అమ్మాయి సెటిల్ అవడం అంటే కెరీర్లో మగవాడికి దీటుగా లేదా బెటర్గా నిలవడం. అలాంటప్పుడు పెళ్లికి వాటిజ్ ద హర్రీ అనుకుంటున్న అమ్మాయిలకు ఇది క్లారిటీయా... కన్ఫ్యూజనా తెలుసుకుందామని... ‘వెన్ ఈజ్ ది రైట్ టైమ్ టు గెట్ మ్యారీడ్?’ అంటూ కొత్త ప్రశ్నను లేవదీసింది ‘టైటాన్ రాగా’ వాచ్ యాడ్ ! ‘ఫ్రెండ్స్కి పెళ్లి అయిపోయిందని, చుట్టపక్కాలు అడుగుతున్నారని, వాలంటైన్స్డే రోజు ఒంటరిగా గడపాల్సి వస్తుందని, చెల్లెలు పెళ్లికి లైన్లో ఉందని, మాతృత్వపు ఘడియలు మించిపోతున్నాయని... పెళ్లి చేసుకోకు... యు ఫైండ్ ఎ మ్యాన్ హూ డిజర్వ్స్ యువర్ టైమ్... అప్పుడే పెళ్లి చేసుకో’ అంటూ కత్రినాకైఫ్తో చెప్పించింది. టైటాన్ లాంటి కంపెనీ, కత్రినా కైఫ్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఈ యాడ్ని తయారుచేసిందంటే అంత ఆషామాషీ వ్యవహారం అయ్యుండదు. ఎందుకంటే పెద్ద కంపెనీలు యాడ్ చేసేముందు మార్కెట్ రీసెర్చ్ను నిర్వహిస్తాయి. అంటే పెళ్లికి కరెక్ట్ టైమ్ ఏదీ అని చెప్పించే ముందు టైటాన్ కూడా అలాంటి రీసెర్చ్ను చేసే ఉంటుంది. అంటే టైటాన్ రాగా యాడ్లో కత్రినా చెప్పిన అభిప్రాయం టైటాన్ కంపెనీ చేసిన మార్కెట్ రీసెర్చ్కి అద్దం. ‘పెళ్లి బంధంలో ఉన్న అమ్మానాన్నలు హ్యాపీగా ఉన్నారా? తనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వాళ్లకున్నాయా? పెళ్లి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నప్పుడు మూడుముళ్ల కోసం తొందరపడ్డమెందుకు? మనసును అర్థం చేసుకున్న వాడు దొరికే దాకా ఆగుదాం’.. అనుకుంటున్న అమ్మాయిల భావమే ఆ యాడ్ అయి ఉండొచ్చు! ఈ నేపథ్యంలో అమ్మాయి పెళ్లికి ఏది సరైన సమయం అంటూ సాక్షి ఫ్యామిలీ కొందరిని అడిగింది.. వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి... - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి తొందరపాటు తగదు ఏ విషయంలో తొందరపడినా సరిదిద్దుకోవచ్చేమోగానీ పెళ్లి విషయంలో తొందరపడితే మాత్రం సరిదిద్దుకోలేం. భర్త చెడు అలవాట్లు ఉన్నవాడు కావొచ్చు. ‘గే’గా రుజువు కావొచ్చు. కట్నం కోసం వేధించేవాడు కావొచ్చు. కాబట్టి మనసుకు నచ్చగానే పెళ్లి చేసేసుకోకూడదు. ఆ వ్యక్తి తగినవాడేనా అని బాగా ఆలోచించాలి. ఆ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిన టైమే పెళ్లికి రైట్ టైమ్. - జయసుధ, నటి రూలేం లేదు పెళ్లనేది వయసుతో కాదు మనసుతో ముడి పడినదని నా ఫీలింగ్. ఫలానా వయసులోనే పెళ్లాడాలని రూలేం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు తారసపడితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 18ఏళ్ల వయసులోనే మంచి జీవిత భాగస్వామి దొరికితే చేసుకోవచ్చు. 70 ఏళ్ల తర్వాత దొరికినా చేసుకోవచ్చు. నా మటుకు నాకు రైట్ పర్సన్ దొరికినప్పుడే పెళ్లికి రైట్ టైమ్. - దీక్షా సేథ్, నటి ఏళ్లు వచ్చాయని పెళ్లి చేసేసుకోవాలా? పెళ్లనేది అంత సులభంగా తీసుకొనే నిర్ణయం కాదు. పదేళ్లుగా సినీ రంగంలో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ఇక్కడ నుంచి మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతా. ఈ పరిస్థితుల్లో ప్రేమ, పెళ్లి అంటూ ఇప్పటికిప్పుడు దీన్ని వదులుకోదల్చుకోలేదు. - కంగనా రనౌత్, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘క్వీన్’ చిత్రాల హీరోయిన్ అప్పుడు పిల్లల్ని కనొద్దు అబ్బాయి కన్నా అమ్మాయి త్వరగా పరిణతి చెందుతుంది. కాబట్టి డిగ్రీ లేదా పీజీ అవగానే అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయ్యాలి. లేట్ అయితే అనారోగ్యంగా ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ పదేళ్లు ఎంజాయ్ చేశాకే పెళ్లి అనుకుంటే మాత్రం పిల్లల్ని కనకూడదు. సరికదా, అసలు పెళ్లి జోలికి వెళ్లకపోవడమే మంచిది. - స్వాతి సోమనాథ్, నృత్యకళాకారిణి నిర్ణయించుకునే శక్తి ఉండాలి తన జీవితానికి సంబంధించి తనే నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి అమ్మాయికి ఉన్నప్పుడే పెళ్లీడు వచ్చినట్టు. ఈ స్వయం నిర్ణయాధికారం ఎప్పుడు ఉంటుంది? ఆమె ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినప్పుడే కదా! - సి. వనజ, సీనియర్ జర్నలిస్ట్ పద్దెనిమిదే కరెక్ట్ నాకు 32 ఏళ్లు. వాళ్ల కన్నా నా శాలరీ తక్కువని, నేను పనిచేసే కంపెనీ చిన్నదని.. ఇలాంటి సిల్లీ రీజన్స్తో అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేశారు. ఈ ఎక్స్పీరియెన్స్ నాకో సత్యాన్ని తెలిపింది. అమ్మాయిలను ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివించకూడదు. ఇదివరకటిలాగే పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేయ్యాలి. ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ గర్ల్స్. - ఎన్. అరవింద్, సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసుకు నచ్చినప్పుడే... పెళ్లికి ఫలానా ఏజ్ అనేది ప్రాతిపదిక కాదు. అలాగే తల్లి కావడానికి బయోలాజికల్ క్లాక్నూనేను విశ్వసించను. ఈ రెండిటి ప్రాతిపదికగా పెళ్లి చేసుకొని తర్వాత నేనెందుకు ఈ పనిచేశానని బాధపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి వ్యక్తిని కలిసినప్పుడు.. ఈ వ్యక్తితో జీవితం పంచుకుంటే బాగుండు అని అనిపించినప్పుడే పెళ్లి వయసు వచ్చినట్టు. - ఉమా సుధీర్, ఎన్డీటీవీ కరెస్పాండెంట్ మెచ్యూరిటీ వచ్చాకే... మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధమున్న అంశం కాదు.. రెండు కుటుంబాలతోనూ ముడిపడ్డ తంతు. కాబట్టి ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఆడపిల్లకి ఆ ఆడపిల్ల.. ఏ జంటకు ఆ జంట యూనిక్. దీన్నర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్ అంటాన్నేను. - మాధవీలత గంజి, ఫ్యామిలీ కౌన్సెలర్, సోషల్ యాక్టివిస్ట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్.. ఈ రెండూ అమ్మాయికి తప్పనిసరి. వీటితో పాటు ఫిజికల్గా, మెంటల్గా మెచ్యురిటీ రావాలి. లైఫ్లో సెటిల్ అయ్యాను.. జీవితాన్ని పంచుకోవడానికి ఓ తోడు కావాలని అమ్మాయికి అనిపించినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్. ఆ తోడును సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా అమ్మాయికే ఉండాలి. - బిందు నాయుడు, టీవీ సీరియల్ రచయిత్రి సపోర్ట్ చేస్తా... నేనైతే టైటాన్ రాగా యాడ్లోని కత్రినా ఒపీనియన్ని సపోర్ట్ చేస్తా. నేను రెండేళ్లుగా గూగుల్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే తెలుస్తోంది. ఆస్వాదిస్తున్నాను. ఇంకో టూ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నా. నా పెళ్లికి అదే రైట్ టైమ్. అయితే పెళ్లి కొడుకును వెదికే బాధ్యత పేరెంట్స్దే. వాళ్లు చూసిన సంబంధాల్లో నాకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటా! - సుధా సురక్షిత రాణి, సాఫ్ట్వేర్ -
వర్షాల్లో వాహనాలకు యాడ్ ఆన్ రక్షణ..
ఒక మోస్తరు వర్షం కురిస్తేనే చాలు రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. మోకాల్లోతు నీళ్లల్లో మనం కదలడమే కష్టం అనుకుంటే.. ఇక వాహనం కూడా మొరాయిస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. బండిని ఎలాగోలా బైటికి తెచ్చుకున్నా దాని రిపేర్లకు తడిసి మోపెడవుతుంటుంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో కూడా పనికొచ్చేలా వాహన బీమాకి సంబంధించి యాడ్ ఆన్ కవరేజీలు ఉన్నాయి. ప్రీమియానికి కొంత అదనం చెల్లించి వీటిని తీసుకోవచ్చు. అలాంటి కవరేజీల్లో కొన్ని.. ఇంజిన్ ప్రొటెక్టర్ కవర్ వర్షాల వేళ వాహనం ఇంజిన్లోకి నీరు చొరబడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఇంజిన్లో భాగాలు, గేర్ బాక్సులు దెబ్బతిన్నా, అటు పైన లూబ్రికేటింగ్ ఆయిల్ లీకయినా.. తలెత్తే సమస్యలకు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. రోడ్సైడ్ అసిస్టెన్స్ ఒకవేళ వాహనం మొరాయిస్తే .. రిపేర్ చేయించడం కోసం సమీప గ్యారేజికి తరలించడానికి, టైర్ పంక్చర్ అయితే సరి చేయడానికి అయ్యే ఖర్చులకు ఇది పనికొస్తుంది. వాహనం పూర్తిగా బ్రేక్డౌన్ అయితే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం, తాళం చెవులు పోగొట్టుకున్నా, వాహనంలో ఇంధనం అయిపోతే అత్యవసరంగా సమకూర్చడం వంటి వాటికి కూడా ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. కన్జూమబుల్స్ కవర్ స్క్రూలు, నట్లు, బోల్ట్లు, వాషర్లు, కూలెంట్, ఇంజిన్ ఆయిల్ వంటివి మార్చాల్సి వస్తే అయ్యే ఖర్చులకు ఇది పనికొస్తుంది. -
జనాభిమానం
అభిమానం పెల్లుబికింది. ఆప్యాయత ఉప్పొంగింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జననేత ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ రోడ్షో జగన్నినాదంతో మార్మోగింది. సాక్షి, ఒంగోలు, అద్దంకి జనం అదరగొట్టారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డులో జనగర్జన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా నిర్వహించిన రోడ్షోకు భారీ స్పందన లభించింది. ఐదు మండలాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లబండ్లు, బస్సులు పెట్టుకుని మరీ స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు ఒకటీ..రెండు కాదు, ఏకబిగిన ఎనిమిది గంటల పాటు జగన్ కోసం నిలువెల్లా కనులై ఎదురుచూశారు. మిహ ళలు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు.. రైతులు, రైతు కూలీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా జగన్పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోడ్షో ఉదయం 12 గంటలకు జరగాల్సి ఉండగా... సాయంత్రం ఆరు గంటలకు జగన్ ప్రచారరథం అక్కడకు చేరింది. ఉదయం 10 గంటల నుంచే అద్దంకి నియోజకవర్గ గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని ఒక్కొక్కరుగా చేరుకున్నారు. వాహనాలకు పార్టీ జెండాలు పెట్టుకుని, తలలకు జెండాలతో పాగాలు చుట్టుకుని సంతమాగులూరు అడ్డరోడ్డులో సందడి చేశారు. గ్రామాల నుంచి వచ్చేప్పుడు భోజనం క్యారేజీలు సైతం తెచ్చుకుని.. పండగ తిరునాళ్లలో దేవుని దర్శనం కోసం వేచిఉండే చందంగా వాతావరణం కనిపించింది. హైవే జంక్షన్ జామ్ చేసిన జనాభిమానం.. నాయకుడిని ఎంచుకుని..అతన్నే ఎన్నుకోవడానికి అభిమాని ఎన్నికష్టాలైనా ఓరుస్తాడనేది బుధవారం జగన్ రోడ్షోకు గంటల తరబడి వేచిఉన్న జనాన్ని చూస్తే నిరూపితమైంది. అద్దంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల లోక్సభ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి కలిసివచ్చి ఉదయం 11 గంటలకు సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద కనిపించగానే.. సామాన్య మధ్యతరగతి జనం వారిని అప్యాయంగా పలకరించారు. అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, జె.పంగులూరు, సంతమాగులూరు మండలాలతో పాటు పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు మండల జనం కూడా బృందాలుగా వచ్చి జగన్ రోడ్షోను విజయవంతం చేశారు. పదేళ్లపాటు అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా గొడవలకు తావులేకుండా.. ప్రశాంతంగా అభివృద్ధి జరగడమే ...ఇంతటి ప్రజాదరణకు కారణమని అక్కడకొచ్చిన జనం చెప్పడం విశేషం. - చిన్నారులు వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని ఎండకు మండుతున్న హైవేరోడ్డుపై తల్లులతో కలిసి చిరునవ్వులు చిందించడం రాజకీయ పరిశీలకులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. - పాతమాగులూరుకు చెందిన పేరం వీరమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు జగన్ వచ్చేదాకా తాను ఇంటికెళ్లనంటూ.. తనకు పింఛన్ రావడం లేదని చెబుతానంటూ వేచి ఉంది. - మిన్నేకల్లు గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు కూడా ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న సద్దిమూటను స్థానిక పెట్రోలు బంకు వద్ద కూర్చొని తింటూ.. జగన్ను చూసిన తర్వాతే ఇంటికెళ్తానని చిరునవ్వుతో చెప్పాడు. బైక్ ర్యాలీలతో జనభేరికి ఘనస్వాగతం.. గుంటూరు జిల్లా వినుకొండలో బహిరంగ సభ ముగించుకుని బయల్దేరిన జగన్కు ప్రకాశం జిల్లా సరిహద్దులోని వెల్లలచెరువు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాపట్ల లోక్సభ, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ అమృతపాణి, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాగర్లమూడి రాఘవరావు, డాక్టర్ బాచినేని చెంచుగరటయ్య, ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్చైర్మన్ కోయి అంకారావు, అద్దంకి పట్టణ పార్టీ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి. మండల కన్వీనర్లు జ్యోతి హనుమంతరావు, జజ్జర ఆనందరావు, మలినేని గోవిందరావు, స్వయంపు హనుమంతరావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, కరి పరమేష్, జిల్లాఎస్సీసెల్ నాయకుడు రంపతోటి సాంబయ్య, సంతమాగులూరు నేతలు ఓరుగంటి కోటిరెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి. యమహా రాజు, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్లతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. యువత వంటికి వైఎస్ఆర్ సీపీ జెండాలు చుట్టుకుని, రంగులు పూసుకుని బైక్లపై రకరకాల విన్యాసాలు చేయడం ఉత్సాహం కలిగించింది. -
ప్రకటన.. కనిపించుట లేదు..
సావో పాలో.. బ్రెజిల్లో ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద నగరాల్లో ఇదీ ఒకటి.. జనాభా 1.2 కోట్లు.. మీరు ఈ మహా నగరం మొత్తం తిరిగి చూడండి.. ఎక్కడా ఒక్క యాడ్ కూడా కనిపించదు! కనీసం పోస్టర్ కూడా!! మనం మన ఊళ్లో రోడ్డు మీదకెక్కితే ఎక్కడికక్కడ హోర్డింగ్స్ మీద యాడ్స్, పోస్టర్లు, బస్సుల మీద.. ఆటోల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు.. ఆ సబ్బు అని.. ఈ డ్రింక్ అని.. బట్టలని.. ఇలా ఏదో ఒకదాని గురించి ప్రకటనలు. అయితే, ఇంత పెద్ద మహానగరంలో అది మచ్చుకైనా కనిపించదు. అంతా క్లీన్ అండ్ క్లియర్. ఎందుకంటే.. ఇక్కడ అవుట్ డోర్ యాడ్స్ నిషిద్ధం. 2006 సెప్టెంబర్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మేరకు చట్టం చేశారు. అది నేటికీ అమలవుతోంది. ఈ చట్టం తేవాలనుకున్నప్పుడు బిజినెస్ పడిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తర్వాతి కాలంలో అది తప్పని రుజువైంది. ఆ సమయానికి సిటీలో ఉన్న 15 వేల బిల్బోర్డులను తొలగించారు. కొందరు షాపుల ముందు యాడ్లు లాంటివి ఉంచితే.. అలాంటివారి నుంచి మొత్తం రూ.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. కొత్తలో యాడ్స్ లేకుండా సిటీ కొంచెం విచిత్రంగా కనిపించినా.. తర్వాత అక్కడి వారికది అలవాటైపోయింది. ఈ చట్టం ఎలాగుందని 2011లో సర్వే చేసినప్పుడు నగరంలోని 70 శాతం మంది దాని వల్ల మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు.