advanced technology
-
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్టైమ్లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పీక్, నాన్–పీక్ టైమ్లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్కాల్స్ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తగా 60 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్లో ఈ స్పేస్ సూట్ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్సూట్ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
6జీ రేసులో భారత్
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను అందిపుచ్చుకునే దిశగా భారత్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ బాటలో 6జీ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే గణనీయంగా పేటెంట్లు దాఖలు చేసింది. ఈ విషయంలో వివిధ అధ్యయనాల ప్రకారం భారత్ నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది. బ్రిటన్కి చెందిన యూ స్విచ్ ప్లాట్ఫాం ప్రకారం గతేడాది ఏప్రిల్ నాటికి 265 పేటెంట్లతో (6జీ) భారత్ నాలుగో స్థానంలో ఉంది. చైనా (4,604), అమెరికా (2,229), దక్షిణ కొరియా (760) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక గ్లోబల్ ఐపీ మేనేజ్మెంట్ సంస్థ మ్యాక్స్వాల్ ప్రకారం 188 పేటెంట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. (ప్రభుత్వ డేటా ప్రకారం ఈ సంఖ్య ఈ ఏడాది 200 దాటేసింది). ఈ విషయంలో బ్రిటన్ (151), జర్మనీ (84), స్వీడన్ (74), ఫ్రాన్స్ (73) కన్నా ముందుండటం గమనార్హం. 6,001 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (3,909), దక్షిణ కొరియా (1,417), జపాన్ (584), యూరోపియన్ యూనియన్ (214) వరుసగా టాప్ 5 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ ప్రధానంగా బ్లాక్చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ), 6జీ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ హార్వెస్టింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో ఎక్కువగా పేటెంట్లు దాఖలు చేసినట్లు ఫ్రాన్స్కి చెందిన ఐపీ సొల్యూషన్స్ సంస్థ క్వెస్టెల్ తెలిపింది. 10 శాతం వాటా లక్ష్యం.. 6జీ సాంకేతికతకు సంబంధించి భారత్ భారీ లక్ష్యాలనే పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయంగా 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా భారత్ 6జీ అలయెన్స్ ఆవిష్కరణ, 6జీ ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంది. పేటెంట్ల దాఖలుకే పరిమితం కాకుండా 6జీ ప్రమాణాలను ప్రభావితం చేసే దిశగా కూడా భారత్ కృషి చేస్తోంది. 160 పైగా దేశాల ప్రమాణాల సంస్థలకు సభ్యత్వం ఉన్న ఐఎస్వోలోని (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) టెక్నికల్ కమిటీలు, సబ్కమిటీల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 15 నుండి 24 వరకు భారత్లో వరల్డ్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 6జీ, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాలాంటి కీలక టెక్నాలజీల భవిష్యత్ ప్రమాణాల గురించి చర్చించేందుకు 190 పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. -
‘సరళ’జల తరంగిణి
పది గ్రామాల్లో పంట సిరుల కోసం సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవు అమెరికాకు చెందినఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. స్వాతం్రత్యానికి ముందు మొదలై.. స్వాతం్రత్యానంతరం ప్రారంభమైన ఆ సాగునీటి ప్రాజెక్టు వయసు ఏడున్నర దశాబ్దాలు.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో సంస్థానాదీశుల కాలంలో అప్పట్లో రూ.35 లక్షలతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు విశేషాలివి. – వనపర్తివనపర్తి సంస్థానాదీశుడి ఆలోచనే.. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన.. అప్పటి వనపర్తి సంస్థానా«దీశుడు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ప్రత్యేకంగా నిర్మించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతం్రత్యానంతరం అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెపె్టంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో దీన్ని పూర్తి చేశారు. 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతటవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ పరిజ్ఞానంతో ఆసియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు కాగా.. ప్రపంచంలో రెండోది కావడం విశేషం. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ను నిర్మించారు. ఒక్కొక్క సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడవు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు. నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 20 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కట్ట ఇప్పటికి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31వ తేదీన రెండోసారి కట్టకు గండిపడింది. ముంపు సమస్య పరిష్కారానికే.. వర్షం నీరు ఊకచెట్టు వాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవటం.. ఈ వాగు సమీపంలోని గ్రామాలు తరచూ వరద ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం అధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు సాగునీరందే గ్రామాలు ప్రస్తుతం మదనాపురం మండల పరిధిలో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో శంకరంపేట, దంతనూరు, మదనాపురం, తిరుమలాయపల్లి, వడ్డెవాట, చర్లపల్లి, రామన్పాడు, అజ్జకోలు, కుడికాల్వ పరిధిలో నెల్విడి నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. కాగా.. సరళాసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి సరళాసాగర్ను సందర్శించినా.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. మరమ్మతులకు ప్రతిపాదనలు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు అక్కడక్కడా ఏర్పడిన నెర్రెలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిపుణులైన ఇంజనీర్లను రప్పించి.. ఆధునిక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీరు ఆదేశించారు. ఈ మేరకు సరళాసాగర్ను సందర్శించనున్నాం. – రనీల్రెడ్డి, ఇంజనీర్, నీటి పారుదలశాఖ -
న్యూక్లియర్ బ్యాటరీ.. దీని మన్నిక 50 ఏళ్లు
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మైమరిపించేలా మ్యూజియం!
అవి శతాబ్దాల మన చరితకు చిహ్నాలు. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న వెలకట్టలేని పురాతన వస్తువులు. వీటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం మన బాధ్యత. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పురాతన వస్తువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంకి పరిమితమైన మన వాటా వారసత్వ సంపద సైతం సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి చేరుకుంటోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. సాంకేతిక సొబగులద్దుకుని సందర్శకులను ఆకట్టుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో దశల వారీగా మ్యూజియంలను అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడలోని బాపూ మ్యూజియంను విద్య, విజ్ఞాన సందర్శనాలయంగా తీర్చిదిద్దారు. 2020 అక్టోబర్ 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏలూరు, అనంతపురంలోని జిల్లా మ్యూజియంలకు నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మ్యూజియాలను అధునాతనంగా మార్చారు. మరో రూ.70 కోట్ల ప్రతిపాదనలతో ఏడు మ్యూజియంలకు కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మైలవరం(కడప), కాకినాడ, గుంటూరు, కర్నూలు, పెనుకొండ, కడప, రాజమహేంద్రవరం మ్యూజియంలకు కూడా సాంకేతిక హంగులు అద్దనుంది. మన సంపద వెనక్కి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి దక్కాల్సిన వేల ఏళ్లనాటి చారిత్రక, వారసత్వ సంపదను తీసుకురావడంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి స్టేట్ మ్యూజియంలోని సుమారు 56వేలకు పైగా పురాతన వస్తువులు, నాణేలు, చిత్రపటాలు పదేళ్లుగా హైదరాబాద్లోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చొరవతో ఏపీ పురావస్తు శాఖ అధికారులు పలు దఫాలుగా తెలంగాణ అధికారులతో చర్చలు జరిపి చివరికి పురాతన వస్తువుల విభజన ప్రక్రియను ముగించారు. త్వరలో వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురావస్తు సంపద పరిరక్షణకు పెద్దపీట విభజన తరువాత రాష్ట్రానికి స్టేట్ మ్యూజియం అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో అతిపెద్ద స్టేట్ మ్యూజియంను నిర్మించేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు రాజమహేంద్రవరం నగరాన్ని ‘హెరిటేజ్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్ల ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లతో టాయ్ మ్యూజియం నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని లక్షలాది శాసనాలు, ఎస్టేం పేజీలు (శాసనాల కాపీలు)పరిరక్షణకు ప్రత్యేకంగా ‘శాసన మ్యూజియం’ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనిద్వారా ఇప్పటి వరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. దక్షిణాదిలో తొలిసారిగా.. స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బాపూ మ్యూజియం, కొండపల్లి కోటలో అగుమెంట్ రియాలిటీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే, కియోస్్కలు, వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, డిజిటల్ వాల్బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించిన ఏలూరు, అనంతపురం మ్యూజియాల్లో కూడా అమలుచేయనున్నారు. గణనీయమైన పురోగతి ప్రజా సంక్షేమంతో పాటు మన వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యతను సీఎం జగన్ చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రపంచ స్థాయి ఏఆర్, వీఆర్ టెక్నాలజీలను ప్రవేశపెట్టాం. తద్వారా సందర్శకులకు అర్థవంతమైన భాషలో, సరళంగా వారసత్వ చరిత్ర తెలుస్తోంది. మ్యూజియంల అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తాం. త్వరలోనే స్టేట్ మ్యూజియంను కూడా నిర్మిస్తాం. – ఆర్కే రోజా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసుల శాఖ మంత్రి -
జలసిరుల సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. సీమ చరిత్రలో మేలిమలుపు ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా పూర్తి సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె ఏటా రెండు పంటలు.. గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు కల నెరవేరింది రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలను కాపాడాలి
గన్నవరం రూరల్: ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్ గుణశీలన్ రాజన్ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు. వారియర్స్ ఆఫ్ది ఫేస్ అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు. ఏవోఎంఎస్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.మణికందన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కె.వై.గిరి, ఏవోఎంఎస్ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కిరణ్కుమార్, ఏవోఎంఎస్ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్ శివనాగేందర్రెడ్డి, డాక్టర్ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
ఏ క్యారెక్టర్తోనైనా... చాట్ చేయొచ్చు!
సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే... ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ‘చాట్జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్లు, థెరపిస్ట్లతో హాయిగా సంభాషించవచ్చు. సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్ను క్లిక్చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్తో గ్రూప్ చాట్ చేయవచ్చు. ‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్డ్ చాట్బాట్లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్డ్ చాట్బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్బాట్ను సృష్టించుకోవచ్చు. ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్బాట్ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష. రియల్ చాలెంజర్... జెమిని ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ను లాంచ్ చేయనుంది. ‘జెమిని’ అనేది కన్వర్సేషనల్ టెక్ట్స్ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్ను ఆదివారం విజయవంతంగా గ్రిడ్కు అనుసంధానం చేసింది. ఈ యూనిట్ బాయిలర్ సూపర్ క్రిటికల్ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్తో 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్ను పూర్తి లోడ్తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో కూడా 800 మెగావాట్ల యూనిట్–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్టీటీపీఎస్లో కొత్త యూనిట్ ట్రయల్ ఆపరేషన్తో ఏపీ జెన్కో థర్మల్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్కు ఏపీ జెన్కో రోజూ 102 నుంచి 105 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్కో, బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
ఏవో స్మిత్ విద్యుత్ ఆదా వాటర్ హీటర్
బెంగళూరు: వాటర్ హీటింగ్ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపెనీ అయిన ఏవో స్మిత్ ‘ఎలిగెన్స్ ప్రైమ్’ పేరుతో ఓ అధునాతన వాటర్ హీటర్ను విడుదల చేసింది. ఇది విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసే ఫైవ్ స్టార్ రేటెడ్ ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది. ఇందులో రస్ట్ రెసిస్టెడ్ ఇంటెగ్రేటెడ్ డిఫ్యూజర్ టెక్నాలజీని వినియోగించినట్టు, విద్యుత్ను ఆదా చేయడంతోపాటు, నీటి వేడి కోల్పోకుండా చూస్తుందని పేర్కొంది. దీర్ఘకాలం పాటు మన్నుతుందని, కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను తీసుకురావాలన్న తమ విధానంలో భాగమే ఈ ఉత్పత్తి అని తెలిపింది. 15 లీటర్లు, 25 లీటర్ల సైజులో లభించే ఈ వాటర్ హీటర్ ధర రూ.11,400 నుంచి మొదలవుతుందని ఏవో స్మిత్ పేర్కొంది. -
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్లైన్, రెండు ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. -
5 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు చార్జ్!
వాషింగ్టన్: భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్ స్టేషన్లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్ కార్లను చార్జ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్లో కొందరు విద్యుత్ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్ ఎక్స్పరిమెంట్తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్పెట్టేందుకు ద్రవ కూలెంట్ను ముందుగా చార్జింగ్ కేబుల్ గుండా పంపించారు. ఇది కరెంట్ను మోసుకెళ్లే కండక్టర్లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్ చేయడం సాధ్యమైంది. కరెంట్ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్ల ఫ్లూయిడ్ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు. -
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
లండన్లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్ను అరెస్ట్చేశారు. తూర్పు యూరప్లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!
2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్ మ్యూజియంలో ఉన్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్ చేయడానికి ఒక లోహపు (ఐరన్ ప్లేట్) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను ట్రెఫినేషన్ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా సోషల్ మీడియాలో పేర్కొంది. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్లైన్. -
చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..
సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతోంది! లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో... చడీచప్పుడు లేకుండా బలగాలను మోహరించడం... రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు.. రాత్రికి రాత్రి డజన్ల కొద్దీ నిర్మాణాలను కూడా కట్టేస్తూ ఇబ్బంది పెట్టేస్తోంది! ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్లిష్టతరమవుతున్న సరిహద్దుల రక్షణకు... భారత ప్రభుత్వం కృత్రిమ మేధను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది!! వాస్తవాదీన రేఖకు ఆవల.. చీమ చిటుక్కుమన్నా గుర్తించేందుకు... అందుకు తగ్గట్టుగా ప్రమాదాన్ని అంచనా వేసేందుకూ మనుషుల్లా ఆలోచించే సాఫ్ట్వేర్లు 24 గంటలూ పనిచేయనున్నాయి!! సాక్షి, హైదరాబాద్: చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే... ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు ఆనుపానులు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. జంతువుల కదలికలూ గుర్తించేలా... వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా అందే సమాచారాన్ని అరుణాచల్ ప్రదేశ్లోని ‘రూపా’లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు. కృత్రిమమేధ సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈ శ్రమ వృథా పోవడం లేదు. చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దులకు అవల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అన్నది కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోగలగడం!! డీఆర్డీవో ప్రయత్నాలూ ముమ్మరం... భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్ యుద్ధాలే అన్న అంచనా రూఢీ అవుతున్న నేపథ్యంలో దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులువు. శత్రు భయంకరం కూడా. కంటికి కనిపించకుండానే శత్రువుకు విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని... అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు మిలటరీ నిపుణులు. డీఆర్డీవోకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్వర్క్లూ ఇందులో ఉన్నాయి. ఫేషియల్ రికగ్నిషన్కూ... ఏఐ! బస్టాండ్లు మొదలుకొని విమానాశ్రయాల వరకూ చాలాచోట్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్లతో కూడిన కెమెరాలు సహజంగానే ఉం టాయి. కానీ.. మిలటరీ విషయానికి వచ్చేసరికి వీటి పాత్ర పరిమితమైంందే! ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధను ఉపయోగించుకుని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇజ్రాయెల్ సంస్థ కోర్సైట్ ఏఐలు కలిసికట్టుగా కొత్త సాఫ్ట్వేర్ను సిద్ధం చేయనున్నాయి. ఈ సాఫ్ట్వేర్తో వెలుతురు బాగా తక్కువగా ఉన్న చోట్ల మాత్రమే కాదు... అతిక్లిష్టమైన కోణాల్లోంచి.. వేగంగా కదులుతున్నా, గుంపులో కొందరిని మాత్రమే కూడా గుర్తుపట్టి ఫొటోలు తీయవచ్చు. అంతేకాకుండా.. ముఖంలో సగం కప్పి ఉంచుకున్నా గుర్తించేలా ఈ కొత్త సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు. మానవ రహిత వాహనాలు డీఆర్డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది. గోడలెక్కే, నాలుగు, ఆరు కాళ్లతో నడవగలిగిన రోబోలూ రెడీగా ఉన్నాయి. యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్ వీల్చె యిర్లు, ఇంటర్నెట్ ట్రాఫిక్పై నిఘా పెట్టేందుకు నెట్వర్క్ ట్రాఫిక్ అనాలసిస్ (నేత్ర) వ్యసవ్థలను కూడా సిద్ధం చేసింది డీఆర్డీవో. గత ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన ‘డిఫెన్స్ ఎక్స్పో’లో వీటిని ప్రదర్శించారు కూడా. -
పల్లెల ప్రగతికి ‘స్వామిత్వ యోజన’
భోపాల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్ అబాదీ సర్వే, మ్యాపింగ్(స్వామిత్వ) యోజన పల్లెల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ పథకం అమలుతో ప్రజలకు వారి స్థిరాస్తులపై వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపారు. దేశంలో పల్లె సీమల ప్రగతిలో ఇదొక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో స్వామిత్వ యోజనను ప్రారంభించి 10 నెలల పూర్తయిన సందర్భంగా బుధవారం వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భూ యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ హర్దా జిల్లాలోని కొందరు ‘స్వామిత్వ యోజన’ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కమల్ 2008లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నపుడు హర్దా జిల్లాలో ‘ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ అధికార్ పుస్తికా’ పేరిట గ్రామస్థులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇలాంటి పథకం ఇదే మొదటిది. ఈ యాజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంకుల నుంచి రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. స్వామిత్వ పథకాన్ని ప్రధాని మోదీ 2020 ఏప్రిల్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా ప్రారంభించారు. గ్రామ స్వరాజ్య సాధనతోపాటు సామాజిక–ఆరి్థక సాధికారతను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా పల్లె ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో భూములను సర్వే చేస్తారు. దీంతో ప్రజలకు స్పష్టమైన భూయాజమాన్య హక్కులు లభిస్తాయి. అంతేకాకుండా లీగల్ ఓనర్షిప్ కార్డులు జారీ చేయడం ద్వారా యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ కల్పిస్తారు. గ్రామాల్లోని భూములను సమగ్రంగా సర్వే చేయడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. కేంద్ర, రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా డ్రోన్ల సాయంతో సర్వే చేస్తాయి. భూముల హద్దులను తేల్చి, యజమానులకు చట్టబద్ధమైన ప్రాపర్టీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి. -
వాతావరణ మార్పులపై సమగ్ర పోరాటం
న్యూఢిల్లీ/రియాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంపూర్ణ, సమగ్ర పోరాటంతోనే వాతావరణ మార్పులను ఎదిరించవచ్చని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం జీ20 సదస్సులో సేఫ్గార్డింగ్ ద ప్లానెట్: ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా ప్రపంచం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాల కంటే ఎక్కువే భారత్ సాధించిందని పేర్కొన్నారు. పర్యావరణంతో కలిసి జీవించాలన్న భారతీయ సంప్రదాయం స్ఫూర్తితో తక్కువ కార్బన్ ఉద్గారాల, వాతావరణ పరిరక్షణ అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. వ్యక్తి శ్రేయస్సుతోనే మొత్తం మానవాళి శ్రేయస్సు సాధ్యమని వెల్లడించారు. శ్రామికులను కేవలం ఉత్పత్తి సాధనాలుగా మాత్రమే చూడొద్దన్నారు. ప్రతి శ్రామికుడికి తగిన గౌరవం దక్కేలా చూడాలని ఉద్బోధించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనుషుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, అదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై సైతం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందన్నారు. ఒప్పందంలోని లక్ష్యాలను భారత్ సాధించిందన్నారు. భారత్లో ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ కృషితో భారత్లో పులులు, సింహాల జనాభా పెరుగుతోందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2023లో జరగనున్న జీ20 భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. యూపీలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన లక్నో: ఉత్తరప్రదేశ్లోని విద్యాంచల్ ప్రాంతం వనరులున్నప్పటికీ వెనుక బాటుకు గురైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమి కారణంగా ఈ ప్రాంతం నుంచి ప్రజలు వలసవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ న్నారు. ఆదివారం ఆయన వింధ్యాచల్ ప్రాంతంలోని మిర్జాపూర్, సోన్భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. జల్జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. -
హై స్పీడ్ ట్రైన్...అదిరే ఫీచర్స్
ముంబై : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజేక్టుల్లో బుల్లెట్ ట్రైన్ ఒకటి. జపాన్ సహకారంతో ముంబాయి-అహ్మదాబాద్ల మధ్య రూపొందనున్న ఈ ప్రాజెక్ట్లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వారి అధ్వర్యంలో బంద్రా కుర్ల కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి నవంబర్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం 108 గ్రామాలలోని 10వేల మంది నుంచి భూమిని సేకరించారు. ముంబాయి-అహ్మదాబాద్ల మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,10,000 కోట్లు కాగా ఆ మొత్తంలో 88వేల కోట్లను 0.1శాతం వడ్డీతో జపాన్ నుంచి అప్పుగా తీసుకోనున్నారు. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాలలోపు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్లో సదుపాయాలు కూడా ఆ విధంగానే ఉండబోతున్నాయని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోకంటే అత్యాధునిక సాంకేతికతను బుల్లేట్ రైలులో వినియోగించనున్నారు. తిరిగే కుర్చీలు, కాఫీ మేకర్స్తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 508 కి.మీ మార్గంలో 468 కి.మీ ఎత్తైన ట్రాక్ మార్గం, 27కి.మీ సొరంగ మార్గం, 13కి.మీ మైదాన ప్రాంతంలో నిర్మించనున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రైలు దేశంలోనే పెద్దదైన సొరంగం గుండా 21కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మరో 7కిలోమీటర్లు సముద్రం గుండా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్లను కలుపుకుని 12 స్టేషన్లను ప్రతిపాదించారు. జపాన్ టెక్నాలజీతో నిర్మితం కానున్న ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 300కిమీ వేగంతో ప్రయాణించిప్పటికి కుదుపులు ఉండవని, నిలబడి కూడా హాయిగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్లో 10కార్లు (కోచ్లు) ఉంటాయని తెలిపారు. 2033 వరకూ మరో 6కార్లను అదనంగా వీటికి జత చేయనున్నారు. ప్రసుతం ఉన్న కార్లలో 750 సీట్లు ఉంటాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 1250కి పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణ చార్జీలు బీకేసీ నుంచి థానే వరకూ రూ.250గా, బీకేసీ నుంచి విరార్ వరకూ రూ.500గా, బీకేసీ నుంచి బోయిసర్ వరకూ రూ.750గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉండబోయే 10కార్లలో ఒకటి బిజినెస్ క్లాస్ కాగా మిగితావి జనరల్ కంపార్ట్మెంట్స్. ముంబాయి - అహ్మదాబాద్ మధ్య ప్రతిరోజు 40వేల మంది బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించవచ్చని అంచనా. బుల్లెట్ ట్రైన్ను చేరుకునేందుకు 14వేల మంది తమ సొంత వాహనాలను, 6500మంది విమానం ద్వారా, మిగితావారు ఇతర రైలు మార్గాల ద్వారా చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023 వరకూ పూర్తి కానున్నట్లు అధికారులు తెలపగా, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ మాత్రం 2022, ఆగస్ట్ 15నాటికి పూర్తి చేస్తానని ప్రకటించారు. -
ముగ్గురూ ముగ్గురే!
సాగుబడి మహిళ లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం, అత్యధిక సమయాన్ని కేటాయించడంలోనే కాదు.. నిర్ణాయకపాత్ర నిర్వహిస్తూ వ్యవసాయదారులుగా భేష్ అనిపించుకుంటున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఈ ముగ్గురూ తమ తరాల మహిళలకు స్ఫూర్తినందిస్తున్న మహిళా రైతులకు జేజేలు..! ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం..’ పిట్ల చిన్నమ్మి(65) పెద్దగా చదువుకోలేదు. ప్రభుత్వం అందించిన భూములను శ్రద్ధగా సాగు చేసుకుంటూ.. భర్త సింహాచలం తోడ్పాటుతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన దళిత మహిళా రైతుగా గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలంలో అలజంగి ఆమె స్వగ్రామం. తొలుత ప్రభుత్వం ఎకరా 30 సెంట్ల భూమిని అందించింది. డా. వై.ఎస్. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఎకరా భూమిని ఆమెకు ఇచ్చారు. ఆ భూమిలో అనుదినం కాయకష్టం చేసి పంటలు పండిస్తూ కుటుంబాన్ని కుదురుగా నడుపుతున్నదామె. ఆడవాళ్లు చేసే వ్యవసాయ పనులతోపాటు దుక్కి దున్నటం, ఎడ్ల బండి తోలటం.. చివరకు ట్రాక్టరు తోలడం కూడా ఆమె నేర్చుకొని చేస్తూ ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని పొలం పనులు స్వయంగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు మరికొంత భూమిని కూడా సమకూర్చుకున్నారు. ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది. ఎకరంలో చిలగడ దుంపలు, ఎకరాలో వేరుశెనగ, ఒకటిన్నర ఎకరాల్లో అరటి, మిగతా పొలంలో వరి పండిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతుంది? ఏ పంటకు ఎకరాకు ఎంత ఖర్చవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? వంటి విషయాలను తడుముకోకుండా చెబుతారు. ఎలాంటి భూమిని అయినా సాగు చేసి పంట దిగుబడి తీయడం చిన్నమ్మి ప్రత్యేకత. కుమారులు రమేష్, రాజశేఖర్ ప్రైవేటు కంపెనీలలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. ఉత్తమ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నారు. దుక్కి దున్నుతున్న చిన్నమ్మి ఆసక్తితో సేత్తన్నా.. ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం. మా అయ్య, అమ్మ ఈ పనులు నేర్పారు. సిన్న పని నుంచి పెద్ద పని వరకు నానే సేసేదాన్ని. అన్ని పనులు నేర్చుకుని వెవసాయంలో లీనమై అన్ని పనులూ నేనే సేసుకునే దాన్ని. నా పెనిమిటి సాయం సేసేవాడు. పిల్లలకు సదువు సెప్పిద్దామనే ఆలోచనతో వారికి వెవసాయం నేర్పలేదు. పొద్దు పోయాక పొలాల్లో నీరు కట్టడం దగ్గర నుంచి బండి తోలడం వరకు అన్నీ నేర్చుకున్నాను. నా పని నానే సేసుకోవాలనుకుని పొలం పనులు నేర్చుకున్నాను..’ అంటారు చిన్నమ్మి సగర్వంగా. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా సంతోషకరం.. ‘అక్షర’ సేద్యం! బీఎడ్ పూర్తి చేసిన సేంద్రియ సాగుపై మక్కువ చూపుతున్న యువతి బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన అక్షర (దీపిక) సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ సేంద్రియ వ్యవసాయం చేస్తుండడంతో ఆమె కూడా సంతోషంగా సాగు పనులు చేస్తూ తోటి మహిళా యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ ఏంబీఏ చదువుకొని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సంతృప్తి లేక తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆరేళ్లుగా తమ సొంత భూమిలో అధునాతన, శాస్త్రీయ సేంద్రియ పద్ధతులను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ వెదిర గ్రామానికి చెందిన బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసిన అక్షరను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ వ్యవసాయ పనులపై మక్కువ పెంచుకున్న అక్షర తన భర్తతో కలిసి సాగు పనుల్లో పాలు పంచుకున్నారు. అక్షర ప్రత్యేకంగా బోడ కాకర, కాకర, వంగ, టమటా, బెండ, చిక్కుడులాంటి కూరగాయలను ఎలాంటి క్రిమిసంçహారక మందులను పిచికారీ చేయకుండా సాగు చేస్తున్నారు. – వి.రాజిరెడ్డి, సాక్షి, రామడుగు, కరీంనగర్ జిల్లా సంతోషంగా ఉంది! ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా కూరగాయలు పండించడం చాలా ఆనందంగా ఉంది. వీటిని మార్కెట్లో మంచి ధరకు అమ్ముకుంటున్నాం. చదువుకున్న యువ మహిళలు ఆధునాతన పద్ధతులలో పంటల సాగుపై దృష్టి సారించాలి. – అక్షర, మహిళా రైతు, తిర్మలాపూర్, కరీంనగర్ జిల్లా డ్రిప్ పనుల్లో మహిళా రైతు అక్షర 18 ఏళ్లుగా అన్నీ తానై..! అధిక దిగుబడులు.. ప్రశంసలు.. సత్కారాలు.. యువ మహిళా రైతు మంజుల వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రుజువు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని రాగానిపల్లి ఆమె స్వగ్రామం. శివమ్మ, మాధవరెడ్డి దంపతుల కుమార్తె అయిన మంజుల ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రికి వయసు మీద పడటంతో ఆమె చదువుకు స్వస్తిపలికి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్లుగా వ్యవసాయంలో అన్నీ తానై రాణిస్తోంది. తమకున్న పదెకరాల పొలంలో వేరుశెనగ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మల్బరీ తదితర పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ట్రాక్టర్తో భూమి దున్నడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, చీడపీడల నివారణకు స్వయంగా మందుల పిచికారీ, వ్యవసాయ పరికరాలు సమకూర్చుకోవడం, పంటలకు నీరందించడం తదితర పనులన్నీ ఈమెకు వెన్నెతో పెట్టిన విద్య. వ్యవసాయ రంగంలో తనదైన ముద్రవేసుకున్న మంజుల వేరుశెనగ, వరి, మల్బరీ పంటల్లో రెట్టింపు దిగుబడులు సాధించి అధికారుల నుంచి ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తయారైన కే–5, కే–6, కే–134 రకాలను సాగుచేసి గతంలో రెట్టింపు దిగుబడులు సాధించారు. పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మంజులను సత్కరించారు. కదిరి తాలూకాలోనే అత్యధిక ధర పలికే పట్టుగూళ్లను పండించిన ఘనత మంజులది. పంటల సాగు, చీడపీడల నివారణకు గ్రామ రైతులు మంజుల సలహాలు తీసుకుంటుంటారు. ‘మంజుల మా గ్రామ సైంటిస్ట్’ అంటూ పలువురు రైతులు కొనియాడుతున్నారు. – సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న మహిళా రైతు మంజుల -
అంతా యాప్స్తోనే..
అధునాత పరిజ్ఞానం ఉగ్రమూకలకు కలిసివస్తోంది. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన పలు మొబైల్ అప్లికేషన్స్ను రహస్య సమాచారం మార్పిడికి ముష్కర మూకల నుంచి నేరగాళ్ల వరకు తెలివిగా వినియోగించుకుంటున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్’ (ఏయూటీ) ముష్కరులు సైతం సమాచార మార్పిడికి వాట్సప్, ట్రిలియన్ తదితర యాప్స్ను వినియోగించారని వెల్లడైంది. వీరంతా వీటివైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానమే. - సాక్షి, సిటీబ్యూరో ♦ సమాచార మార్పిడికి ముష్కర మూకల వినియోగం ♦ కలిసి వస్తున్న ‘ఎండ్ టు ఎండ్’ ఎన్క్రిప్షన్ విధానం ♦ మ్యాన్ ఇన్ మిడిల్ ఎటాక్స్ తప్పించుకోవడానికే.. ♦ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న ఎన్టీఆర్వో.. చిత్తు చేస్తున్న NTRO ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న చిక్కిన జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ మాడ్యుల్, తాజాగా బుధవారం పట్టుబడిన ‘ఏయూటీ’ హైదరాబాద్ మాడ్యుల్స్ యాప్స్ను వినియోగించాయి. సిరియా/ఇరాక్లో ఉన్న తమ హ్యాండ్లర్స్తో పాటు ముఠా సభ్యులతో సమాచారం మార్చుకోవడానికి వీటినే ఆశ్రయించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ముష్కర మూకలన్నీ ఈ పంథానే అనుసరిస్తుండడంతో వీరి ఎత్తులను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) చిత్తు చేస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ నిఘా వర్గాలకు వెన్నుముక లాంటిది. ఈ సంస్థ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న ముష్కర మూకలపై కన్నేసింది. ఎన్క్రిప్టెడ్ సందేశాలతో పాటు మరింత క్లిష్టమైన విధానంలో ఉన్న వాటిని సైతం డీక్రిప్ట్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం దీనికుంది. ఆన్లైన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఐసిస్కు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా ‘ఆపరేషన్ చక్రవ్యూహ్’ పేరుతో ప్రత్యేక విధానం అవలంభిస్తోంది. ఏమిటీ ‘క్రిప్షన్స్’.. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించిన పరిజ్ఞానమే ‘ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్’. ఇటీవల వాట ్సప్ వినియోగదారులకు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’ అంటూ అప్డేట్ వచ్చింది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్కు వెళ్లే దాకా అది ఎన్క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్లో పదాలను టైప్ చేస్తే అది ఎన్క్రిప్ట్ అయ్యేసరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ’బాంబ్’ అనే పదాన్నే తీసుకుందాం. ‘ఎండీ 5’ అనే ఆన్లైన్ ఎన్క్రిప్టర్ వెబ్సైట్లో ఈ పదాన్ని టైప్ చేస్తే (e373a9be7afbfa19aa17eaa54f19af88) అనే కీగా మారిపోయింది. దీంతో ఇది ఎన్క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశాన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డీక్రిప్షన్ ప్రక్రియ పూర్తయి మళ్లీ ‘బాంబ్’ అనే పదంగా మారుతుంది. ‘ప్రయాణమంతా’ ఎన్క్రిప్షన్లోనే.. ఏదైనా యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఎన్క్రిప్షన్తో పాటు డీక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఉంటుంది. సెండర్ నుంచి సర్వీసు ప్రొవైడర్ ద్వారా సాంకేతిక రూపంలో రిసీవర్ వరకు జరిగే ప్రయాణం మొత్తం ఆ సందేశం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరుగుతుంది. ఎన్క్రిప్షన్లో ఉన్న సందేశాన్ని డీక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్లో ఉన్న ‘కీ’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కీల్లోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ కీతో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని ‘మధ్య’లో ఎవరైనా సంగ్రహించే ఆస్కారం ఉన్నా.. ప్రైవేట్ కీతో ఉండే సందేశాన్ని డీక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’ అన్నీ యాప్ను బట్టి, అందులో ఓ పదం మారే ఆల్గరిథెమ్ను బట్టి మారిపోతుంది. ఒక యాప్/సెండర్కు సంబంధించిన ఆల్గరిథెమ్ మరో యాప్/రిసీవర్ల ఆల్గరిథెమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకేలా ఉండవు. ‘ఎంఐఎం’ ఎటాక్స్కు చిక్కకుండా.. ఏదైనా ఓ సందేశం, సంభాషణ సెండర్కు రిసీవర్కు మధ్య జరుగుతుంది. ఇలాంటి వాటిలో అనుమానిత నెంబర్లు గుర్తించే నిఘా వర్గాలు ఆ సందేశాలను మధ్యలో సంగ్రహిస్తూ అధ్యయనం చేస్తుంటాయి. ఈ విధానాన్ని ‘మ్యాన్ ఇన్ మిడిల్’ (ఎంఐఎం) అటాక్గా పిలుస్తారు. సాధారణంగా కేంద్ర నిఘా వర్గాలు ఈ ఎంఐఎం ద్వారానే అనుమానిత, అవసరమైన నెంబర్లపై కన్నేసి ఉంచుతాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండే యాప్ల ద్వారా జరిగే సమాచార మార్పిడి ఎంఐఎం ద్వారా నిఘా వర్గాలు సంగ్రహించినా.. కేవలం కీ మాత్రమే తెలుసుకోగలరు. సదరు యాప్కు సంబంధించిన ప్రైవేట్ కీ అందుబాటులో ఉంటేనే ఆ కీలను వర్డ్స్గా మార్చి అందులోని సారాంశం తెలుస్తుంది. ఐటీ కారిడార్లో పోలీసు తనిఖీలు గచ్చిబౌలి/మాదాపూర్: నగరంలో ఐసిస్ సానుభూతిపరుల అరెస్టుల నేపథ్యంలో నగర శివారు పోలీసులు ఐటీ కారిడార్, మాల్స్లో గురువారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ ప్రాంతాలలోని ఐటీ సంస్థల పరిసరాల్లో ప్రతి వాహనాన్ని పరిశీలించారు. రాయదుర్గం, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలలో తనిఖీలు జరిగాయి. మాదాపూర్లోని పర్వత్నగర్, సైబర్ టవర్స్, ఇనార్బిట్ మాల్లో చేసిన తనిఖీల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పోలీస్ బృందాలు పాలుపంచుకున్నాయి. -
సంక్షిప్తంగా.. ఉచితంగా..
► కొత్తపుంతలు తొక్కుతున్న సమాచార వ్యవస్థ ► మాటల కంటే ఎస్ఎంఎస్, మెసేజ్లకు ప్రాధాన్యం ► ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్న ప్రజలు ► జిల్లాలో నెలకు రూ.2 కోట్లు విలువైన ఎస్ఎంఎస్ల వినియోగం తణుకు : క్రిస్మస్.. నూతన సంవత్సరం.. సంక్రాంతి.. దసరా.. దీపావళి.. ఏ పండగైనా.. ఏ శుభకార్యమైనా సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుకోవడం పరిపాటి. రోజురోజుకీ మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేవారు. కాలక్రమేణా అవన్నీ కాలగర్భంలోకి కలిసిపోయూరుు. అంతకుముందు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం పంపాలంటే ఫోన్ చేయడం లేదా ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు స్కూల్కు పిల్లలు వెళ్లకపోయినా.. మార్కెట్లోకి కొత్త మోడళ్లు వచ్చినా.. ఏదైనా సమావేశం జరుగుతున్నా.. ఇలా ప్రతి సందర్భంలో ఎస్ఎంఎస్లు (సంక్షిప్త సందేశాలు) అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే ఉత్తరం తర్వాత ల్యాండ్ ఫోన్ ఇప్పుడు సెల్ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఎస్ఎంఎస్లు కీలకంగా మారుతున్నాయి. వాటిలో ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజర్ వంటి యాప్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సెల్ఫోన్ వచ్చిన తొలినాళ్లలో అధిక శాతం సంభాషణలకే ఉపయోగిస్తే ఇప్పుడు మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్... అంటూ కేవలం సంక్షిప్త సందేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నీ ఉచితమే ఎస్ఎంఎస్లు కేవలం సెల్ఫోన్ ద్వారానే కాకుండా నెట్ ద్వారా కొన్ని వెబ్సైట్లలోకి వెళ్లి సమాచారాన్ని పంపవచ్చు. తరచూ ఎవరికైతే మెసేజ్లు పంపుతున్నామో ఆయా నంబర్లను నెట్లో నిక్షిప్తం చేసుకుని తర్వాత రోజుకు వంద చొప్పున ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానం ఎక్కువగా విద్యాసంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు వినియోగిస్తున్నాయి. మరోవైపు కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చిన వాట్సప్ ద్వారా నెట్ అందుబాటులో ఉంటే అపరిమితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు కలిగింది. ఆయా నెట్వర్క్ కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ఆధారంగా ఆయా కంపెనీల ద్వారా జిల్లాలో సుమారు 40 లక్షల మంది సెల్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఆయా నెట్వర్క్ కంపెనీలు ఎస్ఎంఎస్ల కోసం వినియోగదారులకు వివిధ ఆఫర్లు అందజేస్తున్నారు. మొత్తమ్మీద వీరంతా నెలకు రూ. 2 కోట్లు విలువ చేసే ఎస్ఎంఎస్లు వినియోగిస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటున్నాం గతంలో స్నేహితులతో మాట్లాడాలంటే సెల్ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు యాంత్రిక జీవనంలో మాట్లాడాలంటే కష్టమవుతోంది. దీంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఎస్ఎంఎస్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. శుభాకాంక్షలు తెలపాలన్నా, సమాచారం చేరవేయాలన్నా సమయం వృథా కాకుండా ఇవి తోడ్పడుతున్నాయి. - టి.శివశంకర్, తణుకు -
టెక్నాలజీతో పోటీతత్వాన్ని పెంచుకోవాలి..
సేవల రంగ సంస్థలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన న్యూఢిల్లీ: అత్యంత అధునాతన టెక్నాలజీలు వస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)పై పరిమితులు విధించడం వల్ల ప్రయోజనం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలతో దీటుగా పోటీపడేలా సర్వీస్ ప్రొవైడర్లు అంతర్గత సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని, ఇందుకు టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత కీలక పాత్ర పోషిస్తుందని గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద రిటైలరుకు సొంత స్టోర్ ఒక్కటి కూడా లేదు. అత్యంత పెద్ద రవాణా సంస్థకు సొంత వాహనం ఒక్కటీ లేదు. టెక్నాలజీ ఊతంతోనే ఇవి ఇంత భారీగా ఎదిగాయి’ అని జైట్లీ వివరించారు. సేవల రంగం మరింత వృద్ధి చెందాల్సి అవసరం ఉందని పేర్కొంటూ, ఇందుకు ప్రస్తుతం ఆయా వర్గాల మైండ్సెట్ మారాల్సి ఉంటుందని అన్నారు. -
టెక్నాలజీతోనే నవ భారతం
‘టెక్ ఫర్ సేవా’ జాతీయ సదస్సులో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నవభారతాన్ని నిర్మించేందుకు కార్పొరేట్లు, టెక్నోక్రాట్లు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశ నైపుణ్యానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోడైతే ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ ఇట్టే సాధ్యమవుతుందన్నారు. శనివారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్)లో సేవా భారతి, యూత్ ఫర్ సేవ సంస్థలు నిర్వహించిన ‘టెక్ ఫర్ సేవా’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసేందుకు త్రీ-ఎస్ (స్పీడ్, స్కేల్, స్కిల్స్), త్రీ-డీ (డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్), త్రీ-ఈ (ఎడ్యుకేషన్, ఈ-కామర్స్, ఈ-హెల్త్) విధానాలను అవలంబిస్తున్నామన్నారు. వివిధ భాషల అనువాద ప్రక్రియను సులువు చేసేందుకు దేశంలోని అన్ని భాషలను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో పరిచయాలను పెంచే ఉద్దేశంతోనే ‘టెక్ ఫర్ సేవా’ సదస్సు నిర్వహిస్తున్నట్లు సేవా భారతి సంస్థ తెలంగాణ యూనిట్ ప్రధాన కార్యదర్శి వీరవెల్లి రఘునాథ్ అన్నారు. డీఆర్డీవో చైర్మన్ సారస్వత్ మాట్లాడుతూ.. మనిషి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. తెలంగాణ, ఏపీల్లో 6 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ‘‘ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దేశంలో 20 క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెరో క్లస్టర్ మంజూరు చేశాం. అదనంగా ఒక్కో క్లస్టర్ మంజూరు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇద్దరు సీఎంల కోరిక మేరకు తెలంగాణలో మూడు, ఏపీలో మూడు చొప్పున మొత్తం 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ప్రసాద్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల భాగంగా కూకట్పల్లి జేఎన్టీయూ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావుతో కలసి ఆయన పాల్గొన్నారు. ‘నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్’(ఎన్ఓఎఫ్ఎన్) కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామన్నారు. దీనితో ఎలక్ట్రానిక్ ఆధారిత విద్య, వైద్యం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్ఓఎఫ్ఎన్ ఏర్పాటులో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం!
స్మార్ట్ ఫోన్స్... మరెన్నో స్మార్ట్ ఫీచర్స్.. రోజుకో కొత్త అప్లికేషన్..! నేటి హైటెక్ యుగంలో అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే ఫీచర్స కలిగిన స్మార్ట్ ఫోన్స్ను వినియోగించని యువత అరుదు. స్మార్టఫోన్స వాడే యువతరం సగటున ప్రతి పది నిమిషాలకు కనీసం ఒక్కసారైనా కీప్యాడ్-అన్లాక్ చేస్తున్నట్లు అంచనా! ఇంతలా దైనందిన జీవితంలో చొచ్చుకు వచ్చాయి స్మార్ట్ ఫోన్స్. ఇవి ఇప్పుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని,సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని సైతం అందించే అద్భుత సాధనాలుగా మారుతున్నాయి. ఆల్ఫాబెట్స్ మొదలు అత్యున్నత పోటీ పరీక్షలైన సివిల్స్, జీమ్యాట్, జీఆర్ఈ, క్యాట్, జేఈఈ వంటి ఎగ్జామ్స్కు సిద్ధం చేసే మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట ఫోన్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటే.. సమస్త విజ్ఞానం మీ అరచేతిలో ఉన్నట్లే!! ఎడ్యుకేషన్ యాప్స్తో విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనాలపై టాప్ స్టోరీ.. ఎం-లెర్నింగ్.. మొబైల్ లెర్నింగ్. అంటే అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్నే అధ్యయన సాధనంగా మార్చుకునే వీలు కల్పిస్తున్న విధానం. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఉపయోగపడే పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ను రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి పరీక్షలైన జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్, క్యాట్, సీశాట్, సివిల్స్, జేఈఈ వంటి పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందించే యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ యాప్స్ కెరీర్ గెడైన్స్ మొదలు పలు పోటీ పరీక్షల్లో సక్సెస్ టిప్స్ వరకు ఎన్నో అంశాలను తెలుసుకునే వీలు కల్పిస్తున్నాయి. వేగంగా కదిలే కాలాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు చేయూతనిస్తున్నాయి. ఈ-లెర్నింగ్న్, మూక్స్ వంటి ఆన్లైన్ లెర్నింగ్ విధానాల మాదిరిగానే ఎం.లెర్నింగ్ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్స్ పట్ల ఇటీవల కాలంలో విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆదరణ పెరుగుతోంది. 2012 నుంచి సగటున 29.3 శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. 2017 నాటికి ఇది 34 నుంచి 37 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అప్లికేషన్స్.. అనేక రకాలు ఇప్పుడు విద్య, ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సమాచారం విషయంలో మొబైల్ అప్లికేషన్స్లో పలు రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. సదరు పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మొదలు ప్రిపరేషన్ గెడైన్స్, సక్సెస్ టిప్స్, సక్సెస్ స్టోరీస్, పాత ప్రశ్నపత్రాల విశ్లేషణ వంటి అప్లికేషన్స్ రూపొందిస్తున్నారు. పరీక్ష ప్రిపరేషన్ కోణంలో సబ్జెక్ట్ వారీగా, సెక్షన్ల వారీగా మోడల్ కొశ్చన్స్, ప్రాక్టీస్ కొశ్చన్స్ అందిస్తున్నాయి. సబ్జెక్ట్ నిపుణుల లెక్చర్స్ సారాంశాన్ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తోంది. అభ్యర్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా కౌన్సెలింగ్ యాప్స్ సైతం ఆవిష్కృతమవుతున్నాయి. పరీక్ష నిర్వాహక సంస్థలు సైతం మొబైల్ యాప్స్ ద్వారా నైపుణ్యాలను అందించేందుకు ఆయా పరీక్షల నిర్వాహక సంస్థలు సైతం సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గమైన జీమ్యాట్ను నిర్వహించే జీమ్యాక్ తాజాగా జీమ్యాట్ రివ్యూ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్ను విడుదల చేసింది. ఔత్సాహిక విద్యార్థులు స్లాట్ల వారీగా పరీక్ష శైలి, ప్రశ్నల క్లిష్టత స్థాయి, అభ్యర్థులు పరీక్షలో తమ పనితీరు ఆధారంగా ఆశించదగిన స్కోర్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. జీమ్యాక్తోపాటు మన్హటన్, ప్రిన్స్టన్ రివ్యూ, మెక్గ్రాహిల్ వంటి ఇతర ప్రముఖ సంస్థలు సైతం తమ అధికారిక వెబ్సైట్స్ ద్వారా పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ను రూపొందించి డౌన్లోడ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. అధిక శాతం ఈ-లెర్నింగ్ ట్యూటర్స్ ఈ-లెర్నింగ్ వెబ్సైట్స్ ఎడ్యుకేషన్ యాప్స్ను ఎక్కువగా రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ ట్యుటోరియల్స్ పేరుతో వర్చువల్ క్లాస్రూమ్స్, రిఫరెన్స్, ఆన్లైన్ లెక్చర్స్ వంటి సేవలు అందిస్తున్న ‘ఈ-లెర్నింగ్’ సంస్థలు.. తాజాగా మొబైల్ యాప్స్ను అందిస్తున్నాయి. నామమాత్రం రుసుంకే పలు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఈ-లెర్నింగ్ సంస్థలు తమ యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్న వారికి ప్రతిరోజూ ఉచితంగా నిర్దిష్ట సంఖ్యలోని ప్రశ్నలను చూసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఐౌ్కఝౌ వెబ్సైట్ పలు పోటీ పరీక్షల సమయంలో గుడ్నైట్ టెస్ట్ పేరిట ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఉచితంగా 20 ప్రశ్నలతో కూడిన యాప్స్ సర్వీస్ను అందించింది. ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా మొబైల్ యాప్స్ను రూపొందిస్తున్న వెబ్సైట్స్ ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా వాటిని రూపొందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు, మేనేజ్మెంట్ పోటీ పరీక్షలకు వేర్వేరుగా యాప్స్ అందించే సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటవుతున్నాయి. ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్కు సంబంధించి ఇఅఖీ్కైఉఖ వెబ్సైట్ ప్రత్యేక మొబైల్ యాప్స్ను సిద్ధం చేసింది. అదే విధంగా జిప్మర్ తదితర మెడికల్ ఎంట్రెన్స్లకు సంబంధించి ఐఞౌఝౌ, జీఞటౌజ తదితర వెబ్సైట్స్ ప్రత్యేకించి ఉన్నాయి. జేఈఈకి కూడా ప్రత్యేకంగా పలు వెబ్సైట్స్ మొబైల్ అప్లికేషన్స్ను రూపొందిస్తున్నాయి. ఉద్యోగ పరీక్షలకు సైతం ఎడ్యుకేషన్ యాప్స్ కేవలం ప్రవేశ పరీక్షలకే కాకుండా నియామక పరీక్షలకు సైతం అందుబాటులో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ మొదలు బ్యాంకుల్లో కొలువులకు నిర్వహించే ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ వర కూ.. పలు పరీక్షలకు సంబంధించి ఇప్పుడు ఎన్నో సంస్థల మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం ప్రాక్టీస్ కొశ్చన్స్కే పరిమితం కాకుండా ప్రిపరేషన్ మెటీరియల్, టిప్స్ అండ్ టెక్నిక్స్ వంటి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయి. కజీజ్ఛఛౌ్ఠ, ్టఛిడౌజ్ఛీ వంటి ప్రొవైడర్స్ సీశాట్, ఐబీపీఎస్ ప్రిపరేషన్ అప్లికేషన్స్లో ముందు ఉన్నాయి. ఒక్కసారి డౌన్లోడ్తో నిరంతర అధ్యయనం మొబైల్ యాప్స్లో ప్రత్యేకత.. ఒకసారి నిర్దిష్ట సదుపాయాలు ఉన్న అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఆ తర్వాత ఇంటర్నెట్ అవసరం లేకుండానే దీర్ఘకాలం సదరు అప్లికేషన్లో పొందుపరచిన సమాచారాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. ఆన్లైన్ ట్యూటర్స్తో పోల్చితే మొబైల్ యాప్స్ ద్వారా కలిగే అదనపు ప్రయోజనం ఇదే. ఆన్లైన్ ట్యూటర్స్ వెబ్సైట్స్ సదుపాయాన్ని పొందాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. కానీ మొబైల్ యాప్స్ విషయంలో మాత్రం డౌన్లోడ్ చేసుకునే సమయంలోనే ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. మొబైల్ ఆపరేటర్స్ కూడా ఎం-లెర్నింగ్ ఆవశ్యకత, పెరుగుతున్న ఆదరణను గమనించిన మొబైల్ ఆపరేటర్స్ సైతం పలు యాప్స్ను అందిస్తున్నాయి. ఎయిర్సెల్ సంస్థ ఝజఠటఠ్జజీ పేరుతో యాప్స్ను రూపొందించింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సివిల్ సర్వీసెస్, మెడిసిన్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి సమాచారం, ప్రాక్టీస్ కొశ్చన్స్, టిప్స్, మాక్ టెస్ట్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈకి సంబంధించి అకడమిక్ ప్రిపరేషన్ విషయాలు, స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్స్, వొకాబ్యులరీ బిల్డింగ్, జీకే ట్యుటోరియల్స్ను కూడా ఝజఠటఠ్జజీ నుంచి పొందొచ్చు. ఎయిర్టెల్ సంస్థ ఝ్ఛఛీఠఛ్చ్టిజీౌ అనే ఎడ్యుకేషన్ యాప్తో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, ఆయా పరీక్షల ప్రిపరేషన్ టిప్స్ను అందిస్తోంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు మార్గంగా టాటా డొకోమో సంస్థ ఉజజీటజి ్ఛ్ఛజుజిౌ అనే మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్ను తమ ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకోవడం సులభమే. ఇందుకు కావలసిందల్లా మొబైల్ ఫోన్స్లో జీపీఆర్ఎస్, వాప్ సౌకర్యం ఉండటమే. స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్, బ్లాక్బెర్రీ యాప్ వరల్డ్, శాంసగ్ యాప్ స్టోర్ వంటి మార్గాలతోపాటు, యాపిల్ ఫోన్స్ వినియోగదారులు యాపిల్ ఐట్యూన్స్ స్టోర్స్ నుంచి అవసరమైన ఎడ్యుకేషనల్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరు సొంతంగా లాగిన్ - ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి. ఎడ్యుకేషన్ యాప్స్ను వినియోగించే క్రమంలో మొబైల్ ఫోన్స్లో వై-ఫై సదుపాయం లేదా జీపీఆర్ఎస్/డబ్ల్యుఏపీ (ఇంటర్నెట్ సదుపాయం కోసం), జావా స్క్రిప్ట్, బీటా వర్షన్స్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ టూల్స్, డేటా స్టోరేజ్ కెపాసిటీ టూల్స్ ఉండాలి. యాప్స్ ప్రయోజనాలు - స్వల్ప ఖర్చుతో విలువైన సమాచారం. - సమయం వృథా కాకుండా నిరంతరం నైపుణ్యం పెంచుకునే అవకాశం. - అకడమిక్ సమాచారాన్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే సుదీర్ఘకాలం నిక్షిప్తం చేసుకునే సదుపాయం. - కొన్ని యాప్స్లో లభించే ప్రత్యేక సదుపాయాల ఫలితంగా ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని తెలుసుకునే మార్గం. - బ్లూటూత్ సదుపాయం ద్వారా లెక్చర్స్ వినేందుకు అవకాశం. ఆయా పరీక్షల వారీగా ముఖ్యమైన మొబైల్ యాప్స్ ప్రొవైడర్స్ వివరాలు.. జీఆర్ఈ www.ets.org princetonreview.com www.manhattanprep.com www.yourteacher.com www.magoosh.com జీమ్యాట్ www.beatthegmat.com www.mba.com www.gmac.com www.kaplan.com www.veritasprep.com ఐఈఎల్టీఎస్ www.ieltstestonline.com www.britishcounsil.it www.mcmillaneducationapps.com www.freemanmobile.com www.udemy.com సీశాట్ www.minglebox.com www. prepzone.in www.tcyonline.com www.clearias.com www.wiziq.com జేఈఈ www.edusolutions.com www.toppr.com www.plancessjee.com www.edtechreview.in www.meritnation.com క్యాట్ www.catapp.in www.testfunda.com www.gradestack.com www.cat.jumbotests.com www.cat.learnhub.com అవసరాలకు సరితూగేలా మొబైల్ యాప్స్ ఎడ్యుకేషన్ విభాగంలోనూ ప్రవేశించడం ఆహ్వానించదగిన పరిణామం. నేడు యువతలో దాదాపు 50 శాతం మేర స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కొత్తగా వస్తున్న మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నెపుణ్యాలను పెంచుకోవడానికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఈ యాప్స్ను ఎంపిక చేసుకునేముందు తమ అవసరాలకు సరితూగే విధంగా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అని గుర్తించి ఎంచుకోవాలి. - జి.హేమంత్, కో-ఫౌండర్, టాపర్ డాట్ కామ్ సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు మొబైల్ ఫోన్స్ నాలెడ్జ్ రిసోర్స్గా కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. గత రెండు, మూడేళ్లుగానే ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్కు రూపకల్పన జరిగినప్పటికీ వీటిపై అవగాహన చాలా కొద్ది మందికే ఉంటోంది. ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న మొబైల్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - వంశీచంద్ రెడ్డి, డెరైక్టర్, బ్రేవ్మౌంట్ సొల్యూషన్స్ లెర్నింగ్లో సరికొత్త విప్లవం విద్యార్థుల లెర్నింగ్ కోణంలో సరికొత్త విప్లవం ఎం-లెర్నింగ్. ఇదిదినదిన ప్రవర్థమానం అవుతోంది. ఇప్పటికే డెస్క్టాప్, ల్యాప్ టాప్ల ద్వారా ఆన్లైన్ ట్యూటర్ వెబ్సైట్స్ సహకారంతో పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటూ మరింతగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. - ఆదిల్ ఉస్మాన్, బిజినెస్ హెడ్, iprof -
బ్యాంకు దోపిడీలకు కళ్లెం వేయొచ్చు
పవన్ సెక్యూరిటీ సిస్టమ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ పలమనేరు: జిల్లాలో కొన్నాళ్లుగా జరుగుతున్న బ్యాంకు దోపిడీలను పరిశీలిస్తే దొంగలు నూతన టెక్నాలజీ వాడుతున్నట్లు అర్థమవుతోంది. అదే రీతిలో బ్యాంకుల వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడకపోవడం బ్యాంకర్ల తప్పిదమే అని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలంటే బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ బ్యాంకుకు ఇన్సూరెన్స్ ఉందంటూ భద్రత గురించి బెంగపడడం లేదు. కనీసం రాత్రిపూట వాచ్మెన్ సైతం లేని బ్యాంకులు జిల్లాలో 90 శాతం దాకా ఉన్నాయంటే భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకోవచ్చు. జులాయి సినిమాలో లాగే.. మూడ్రోజుల క్రితం వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జరిగిన దోపిడీ జులాయి సినిమాలో సన్నివేశాన్ని తలపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరా వైర్లను కట్ చేయడం, గ్యాస్ కటర్లను ఉపయోగించి లాకర్లు తెరవడం, ఆపై ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లడం, ముఖాలకు మాస్క్లు ధరించడం చేశారు. ఇలా దొంగలు అన్ని విధాలా సాంకేతికంగా ముందుకెళుతున్నారు. ఇదే రీతిలో ప్రజలు లేదా బ్యాంకులు మరింత అడ్వాన్స్ టెక్నాల జీని ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. పవన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నట్లయితే.. పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ అనే గ్రామీణ శాస్త్రవేత్త దొంగలను పట్టేందుకు తయారు చేసిన సెక్యూరిటి సిస్టమ్ ఎంతో అడ్సాన్స్డ్గా ఉంది. ఇందులో దొంగ లోపలికి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా అలారం రావడం, అనంతరం ఫ్లాష్ వచ్చి కెమెరా ఫొటోలు తీయడం, యజమాని సెల్ఫోన్తో పాటు మరో ఐదుగురికి కాల్ వెల్లడం, 100 నెంబర్కు ఎస్ఎంఎస్ వెళ్లడం తదితర సౌకర్యాలున్నాయి. ఒకవేళ దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేసినా సెన్సార్లు పనిచేస్తాయి కాబట్టి ఫొటో, బెల్, కాల్ అలెర్ట్ తదితరాలతో ఆ దొంగల వివరాలు తెలుస్తాయి. అందుకే పోలీసులు సైతం సంబంధిత బ్యాం కర్లను పిలిపించి బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇకనైనా బ్యాంకుల వద్ద మరింత గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉంది. -
మీ ఇంట పూలు పూయించండి!
కొత్తగా ఆలోచించే మనసు ఉండాలే కానీ... మన ఇంటిని మనం అలంకరించినంత అందంగా ఇంటీరియర్ డిజైనర్లు కూడా అలంకరించలేరు. నిజానికి ఇంటిని తీర్చిదిద్దడానికి మనం పెద్ద కష్టపడిపోవాల్సిన పని కూడా లేదు. అందుబాటులో ఉన్న వస్తువులను మనకు నచ్చినట్టుగా మార్చుకుని అలంకరించుకుంటే సరిపోతుంది. అందుకు ఇక్కడున్న డిజైన్లే ఉదాహరణ. ఇవన్నీ దేనితో చేశారో తెలుసా! వాటర్ బాటిళ్ల అడుగు భాగాలతో! ఇన్ని అందమైన పూలను సృష్టించడానికి మనకు కావలసింది కేవలం వాటర్ బాటిళ్లు, ఓ కత్తెర/చాకు, అగ్గిపెట్టె, క్యాండిల్, జిగురు, కొన్ని రంగులు... అంతే! వాడకుండా వదిలేసిన సీసాల అడుగు భాగాలను కత్తిరించుకోవాలి. వాటికి కొవ్వొత్తి మంటతో కాస్త వేడిని తగిలిస్తే చాలు, మెత్తగా అయిపోతాయి. అప్పుడు నచ్చిన ఆకారంలో ఆకులు/రేకులు ఎలా కావాలంటే అలా కత్తిరించుకోవాలి. తర్వాత వాటికి నచ్చిన రంగులు వేసుకుని జిగురు సాయంతో కావలసిన పద్ధతిలో అతికించుకోవాలి. కావాలంటే మెటీరియల్ మెత్తగా ఉన్నప్పుడే సూదీ దారంతో కుట్టేసుకోవచ్చు కూడా (మేకింగ్ ఫొటో చూడండి). అవగాహన కోసం ఇక్కడ మీకు కొన్ని డిజైన్లు ఇచ్చాం. చూసి ప్రయత్నించండి. ఇవి మీ ఇంటికి కొత్త అందాలను తీసుకురాకపోతే అడగండి! ఈ ఐసులు త్వరగా కరగవు! తీయని చల్లని ఐస్ఫ్రూట్ని ఆరగిస్తుంటే కలిగే మజా కోసం అందరూ ఆరాటపడతారు. పెద్దలు సైతం పిల్లలతో పోటీ పడుతుంటారు. కానీ బయట కొనే ఐసుల్లో ఏం నీళ్లు వాడతారో, ఎలాంటి రంగులు వాడతారో అంటూ ఓ పక్క భయం పీకుతూ ఉంటుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే సందేహం వెంటాడుతూ ఉంటుంది. అలా ఆలోచించేబదులు చక్కగా ఈ క్విక్ పాప్ మేకర్ని కొనేసుకుంటే సరిపోతుంది. జోకు అనే కంపెనీ దీనిని తయారు చేసింది. పట్టుకు ఒకటి, రెండు, మూడు ఐసులు చేసుకునే విధంగా మూడు రకాలుగా లభిస్తోంది. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. ఐస్ మిక్స్ తయారు చేసుకున్న తర్వాత, దానిని ఈ మేకర్ ట్రేలలో వేసి, స్టిక్స్ పెట్టి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే వీటిలో ఐసులు తయారైపోతాయి. మీరు ఏ పిక్నిక్కో వెళ్తుంటే కనుక వాటిని ట్రేతో సహా బ్యాగ్లో వేసుకుని వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, వీటి తయారీకి వాడిన అధునాతన టెక్నాలజీ వల్ల ఫ్రిజ్లోంచి తీసిన కొన్ని గంటల వరకూ కూడా ఐసులు కరగవు. దాంతో తీరికగా కావాలనుకున్నప్పుడు ఎంచక్కా తీసుకుని తినవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు రేటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది కదా! రూ. 3200, రూ.2600, రూ.2100... ఇలా ఉన్నాయి రేట్లు. మీ పిల్లల్ని సంతోషపెట్టాలంటే మాత్రం రేటు గురించి ఆలోచించకూడదు మరి! -
పోస్టల్ నిర్లక్ష్యం.. హాల్టికెట్ ఆలస్యం
రెబ్బెన : ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఓవైపు పోస్టల్ సేవలు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నా.. ప్రజలకు విలువైన సేవలు అందించాల్సిన ఆ శాఖ ఉద్యోగులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఆలస్యంగా హాల్టికెట్లు అందజేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. పరీక్ష మరుసటిరోజు అందజేత రెబ్బెన మండల కేంద్రానికి చెందిన దాగం సాయిప్రియ ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి పరీక్షను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో నిర్వహించగా ఆ హాల్టికెట్ (నంబర్ 8002084725) ను పోస్టల్ ద్వారా 7వ తేదీన పంపించారు. రెబ్బెన పోస్టాఫీసుకు చేరుకున్న హాల్టికెట్ను సకాలంలో అందించాల్సి ఉండగా పోస్టల్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి 27వ తేదీన అందించారు. పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివినా పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా అంతా వృథా అయిందని బాధితురాలు సాయిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు మండల కేంద్రంలో అనేకసార్లు జరిగినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. సిబ్బందిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులురాలు తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఎర్రచందనం నిల్వకు.. అధునాతన గోదాములు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుం గలను నిల్వ చేసేందుకు తిరుపతిలో అధునాతన గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఎర్రచందనం నాణ్యతను పరిరక్షించడంతో పాటు ఇంటిదొంగల బారిన పడకుండా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరు గోదాములు నిర్మించనున్నా రు. ఇందుకు రూ.21 కోట్లను మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 351) జారీ చేశారు. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి సరిహద్దులు దాటిస్తున్న విషయం విదితమే. పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా వేసి, తనిఖీలు చేసి అడపాదడపా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న దుంగలను అటవీశాఖ కార్యాల యాల ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎండకు ఎండి.. వానకు నానడం వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యత తగ్గిపోతూ వస్తోంది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల నాణ్యత కూడా సీ-గ్రేడ్కు తగ్గిపోతోంది. అటవీశాఖలో ఇంటిదొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు అధునాతన గోదాములు నిర్మించి.. ఎర్రచందనాన్ని నిల్వ చేయాలని నిర్ణయించారు. 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో ఆరు గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ గోదాముల ఆవరణలోనే సెంట్రల్ యాక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్, సర్వీసు, సెక్యూరిటీ బ్లాక్లు, సీసీ కెమెరాలతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ, సోలార్ లైటింగ్ సిస్టమ్, వేబ్రిడ్జి, అంతర్గత రహదారులు ఏర్పాటుచేయాలని సూచించారు. దీని వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యతను కాపాడటంతో పాటు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రతిపాదించారు. వీటిపై అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆమోదముద్ర వేశారు. తొలి దశలో 4,500 టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి రూ.పది కోట్లను.. రెండో దశలో 3,500 టన్నుల నిల్వ సామర్థ్యం, అధునాతన సదుపాయాలు కల్పించడానికి మరో రూ.11 కోట్లను విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ అధునాతన గోదాము నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నెలాఖరులోగా టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
‘జన్ ధన్ ’తో ఆర్థిక సమానత
కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు జిల్లాలో పథకం ప్రారంభం విశాఖపట్నం : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించుకునే దిశగాప్రధాని నరేంద్రమోడీ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని జిల్లాలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్గజపతిరాజు అన్నారు. జిల్లాపరిషత్లో గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఆర్థిక సమానత్వాన్ని ఆకాంక్షించినా మన పాలకులంతా సుదీర్ఘ నిద్రలో మునిగిపోయారని ఆరోపించారు. ఇదే విషయమై దృష్టి సారించిన ప్రధాని మోడీ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఒక ఏడాది కాలంలో కోటి బ్యాంక్ ఖాతాలను ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకోగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం విశేషమన్నారు. ఈ బ్యాంక్ ఖాతాలు తీసుకున్న వారికి రూ.లక్ష మేరకు బీమా సదుపాయం, రూ.5 వేల ఓవర్డ్రాఫ్ట్, ఏటీఎం కార్డుల సదుపాయం ఉంటుందన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 597 బ్యాంక్ బ్రాంచీలు ఉండగా గంట వ్యవధిలో 74వేల ఖాతాలు తెరిచారన్నారు. విశాఖ ఎంపీ కె.హరిబాబు, జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయటంతో ఎస్బీఐ అగ్రగామిగా ఉందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ అశ్విని మెహతా అన్నారు. ఎస్బీఐ ఒక్క విశాఖ ప్రాంతంలోనే పదివేల ఖాతాలు ప్రారంభించిందని అన్నారు. ఎస్బీఐ డీజీఎంకె. నరసింహనాయక్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం మంత్రి అశోక్గజపతిరాజు ఇద్దరు ఖాతాదారులకు బ్యాంక్ఖాతాలు, ఏటీఎం కార్డులు అందజేశారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, నాబార్డు జీఎం కిషన్సింగ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దే.. ఐటీ టెస్టర్
అప్కమింగ్ కెరీర్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో నూతన ఉద్యోగావకాశాలు యువత తలుపు తడుతున్నాయి. వాటిలో ఒకటి ఐటీ టెస్టింట్. సాఫ్ట్వేర్లలోని లోపాలను పసిగట్టి, వాటిని సరిచేయడమే ఐటీ టెస్టింగ్. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. స్కిల్స్ పెంచుకుంటూ కష్టపడి పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, భారీ వేతనాలు అందుకొనేందుకు వీలు కల్పిస్తున్న నయా కెరీర్.. ఐటీ టెస్టింగ్. నైపుణ్యం పెంచుకుంటే అధిక ఆదాయం కంపెనీలు తమ కార్యకలాపాల కోసం కంప్యూటర్లలో ఎన్నో రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తుంటాయి. అవి సక్రమంగా పనిచేసినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్లలో లోపాలు తలెత్తితే మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ప్రధానంగా స్టాక్ ఎక్ఛేంజ్లు, బ్యాంకులు, విమానయాన సంస్థల్లో సాఫ్ట్వేర్లు సజావుగా పనిచేసేలా చూసేందుకు ఐటీ టెస్టర్లను నియమిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నా పరిజ్ఞానం, అనుభవం పెంచుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది. ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఐటీ టెస్టింగ్ను కెరీర్గా ఎంచుకోవాలంటే.. దీనికి సంబంధించిన టెక్నాలజీ, టూల్స్పై నాలెడ్జ్ పెంచుకోవాలి. దీంతోపాటు లాజికల్ అనాలిసిస్, డిడక్షన్, అబ్జర్వేషన్, రీజనింగ్, ప్లానింగ్, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, ప్రజంటేషన్ స్కిల్స్ను అలవర్చుకోవాలి. ఫంక్షనల్ డొమైన్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. కొత్త కొత్త సాఫ్ట్వేర్లు తెరపైకి వస్తుండడంతో వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మనదేశంలో స్కిల్డ్ ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ అవసరాలకు తగినంత మంది టెస్టర్లు అందుబాటులో లేరని అంటున్నారు. ఐటీ టెస్టింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు. ఔత్సాహికులు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని సూచిస్తున్నారు. అర్హతలు: ఐటీ టెస్టింగ్లో స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. ఐటీ టెస్టింగ్పై శిక్షణ పొందిన బీఎస్సీ, బీఈ, బీసీఏ విద్యార్థులను కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ అభ్యర్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. ్డ వేతనాలు: ట్రైనీ నుంచి డెరైక్టర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఐటీ టెస్టర్లకు వేర్వేరు వేతనాలు ఉంటాయి. టెస్ట్ ఇంజనీర్కు నెలకు రూ.8 వేల నుంచి రూ.13 వేలు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, టెస్ట్ లీడర్కు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, టెస్ట్ ఆర్కిటెక్ట్కు రూ.50 వేల నుంచి రూ.75 వేలు, టెస్ట్ మేనేజర్కు రూ.75 వేల నుంచి రూ.లక్షన్నర, హెడ్ టెస్టింగ్కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల వేతనం అందుతుంది. ఐటీ టెస్టింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు క్యూఏఐ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.qaiglobalinstitute.com ఎడిస్టా టెస్టింగ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: www.edistatesting.com అమిటీ సాఫ్ట్-చెన్నై వెబ్సైట్: www.amitysoft.com సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్ వెబ్సైట్: www.sqe.com ఎన్నో రంగాల్లో అవకాశాలు శ్రీరాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం మరింత విస్తరించనుంది. దేశ, విదేశాల్లోనూ మంచి కెరీర్ ఉన్న కోర్సు ఐటీ టెస్టింగ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్ రంగాలతోపాటు ఐటీలోనూ ఐటీ టెస్టింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఇది కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరేందుకు స్కోప్ ఉన్న కోర్సు. అయితే ప్రభుత్వ రంగంతో పోల్చితే ప్రైవేట్ రంగంలోనే అవకాశాలు అధికం. ఉద్యోగ అవకాశాలతోపాటు ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగేందుకు వీలుంది. ఆసక్తి ఉంటే స్నేహితులు, సహచరులతో కలిసి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చ్ణు - ఆర్.లక్ష్మణ్నాయక్, క్యాంపస్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జి, ఆర్.జి.యు.కె.టి. వైఎస్సార్ కడప జిల్లా కాంపిటీటివ్ కౌన్సెలింగ్ సివిల్స్ మెయిన్స్లో హిస్టరీ ఆప్షనల్కు ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి? - ఎస్.మేఘన సాయిశ్రీ, మలక్పేట సివిల్స్ మెయిన్సలో 250 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా హిస్టరీ ఆప్షనల్ ఉంది. అందులో పేపర్-1లో కీలకంగా చెప్పుకోవాల్సింది మ్యాప్ పాయింటింగ్. దీనికి 50 మార్కులు కేటాయించారు. గతంలో ప్రదేశాల పేర్లు ఇచ్చి వాటిని మ్యాప్లో గుర్తించమనేవారు. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు వాక్యాల వివరణ రాయాల్సి ఉండేది. ఈసారి పాయింట్లను గుర్తించిన మ్యాప్ ఇచ్చి, ఆ పాయింట్లో ఉండే ప్రాంతాన్ని కనుగొని, దానిపై వివరణ రాయమని అడిగారు. అయితే క్లూగా అది ఏ రకమైన ప్రాంతం అనే అంశాన్ని తెలిపారు. మ్యాప్పై, ఆయా ప్రదేశాలపై పూర్తి అవగాహన ఉంటేనే సులువుగా వీటికి సమాధానం రాయొచ్చు. మిగిలిన ప్రశ్నల విషయానికొస్తే గత ఆప్షనల్ ప్రశ్నలకు, ఇప్పుడిచ్చిన ప్రశ్నలకు పెద్ద వ్యత్యాసం లేదు. ప్రశ్నలన్నీ అధికంగా రాజకీయేతర అంశాల నుంచి అడిగారు. అయితే ఏ ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం లభించదు. ప్రశ్న సరళిని బట్టి అభ్యర్థి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రశ్నకనుగుణంగా మార్చి సమాధానం రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధ్యయనం సమయంలోనే ఆయా అంశాలపై ప్రశ్నలు ఏవిధంగా అడిగే అవకాశముంటుందో కొంత మేరకు ఊహించాలి. దానికనుగుణంగా పరిపూర్ణంగా సిద్ధమైతే ప్రశ్నలు ఎలా వచ్చినా అప్పటికప్పుడే సమాధానాన్ని రాయొచ్చు. గతేడాది కంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదు. బాగా సాధన చేసినవారే సమాధానాలు రాయగలిగారు. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకొంటేనే విజయం సాధ్యం. ఇన్పుట్స్: యాకూబ్బాష, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లోర్ ఇండియన్ ఫౌండేషన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ రూపొందించిన ద లెర్నింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎల్ఏటీ) పరీక్ష ద్వారా ప్రతిభావంతులను ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు గవర్నెన్స కౌన్సిల్ నుంచి కెరీర్ గెడైన్స్ను పొందే అవకాశం లభిస్తుంది. ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీ, ఎంసీఐ, యూజీసీ లాంటి సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు గవర్నెస్ కౌన్సిల్లో ఉంటారు. పూర్తి వివరాలకు www.lorefoundation.org వెబ్సైట్ను సదర్శించొచ్చు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ, జూనియర్ లెవల్ ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్, ఇంగ్లిష్ టైప్రైటింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా సెక్రటేరియల్/ కమర్షియల్ ప్రాక్టీస్లో డిప్లొమా, కంప్యూట ర్ అప్లికేషన్స్లో సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. చివరి తేది: ఆగస్టు 19 వెబ్సైట్: www.ada.gov.in. జనరల్ నాలెడ్జ భారత రాజ్యాంగ ఆధారాలు ఆధారం {Vహించిన అంశాలు భారత ప్రభుత్వ చట్టం-1935 కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానం, రాష్ర్టపతికి, రాష్ర్ట గవర్నర్లకు విచక్షణాధికారాలు బ్రిటన్ రాజ్యాంగం క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం, సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, స్పీకర్ హోదా, విధులు అమెరికా రాజ్యాంగం {పాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఉపరాష్ర్టపతి ఎన్నిక, న్యాయ సమీక్ష, రాష్ర్టపతి తొలగింపు ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, రాష్ర్టపతి ఎన్నిక కెనడా రాజ్యాంగం సమాఖ్య విధానం, బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి అవశిష్టాధికారాలు వైమర్ (జర్మనీ) రాజ్యాంగం అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు యుద్ధం జరిగిన సం॥ వివరాలు మొదటి మరాఠా యుద్ధం 1775-82 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య రెండో మరాఠా యుద్ధం 1803-05 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య మూడో మరాఠా యుద్ధం 1817-18 మరాఠాల తిరుగుబాటు మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం 1845-46 సిక్కుల తిరుగుబాటు రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం 1848-49 పంజాబ్ను ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు అంబూర్ యుద్ధం 1749 ముజఫర్ జంగ్, చందాసాహెబ్, ఫ్రెంచి గవర్నర్ డూప్లే కలిసి కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ను చంపారు వాందివాశి యుద్ధం 1760 {బిటిష్ సేనాని సర్ ఐర్ క్రూట్.. ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ,కౌంట్-డి-లాలీని ఓడించాడు నల్లమందు యుద్ధం 1856-1860 చైనీయులకు, బ్రిటిషర్లకు మధ్య జరిగింది. -
టైమ్ను మేనేజ్ చేయండి!
జాబ్ స్కిల్స్: ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకరోజులో ఉండే సమయం 24 గంటలే. కొందరు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మరికొందరి కి ఏ చిన్న పని చేద్దామన్నా సమయం సరిపోదు. ఎందుకిలా? టైమ్ మేనేజ్మెంట్ తెలియక పోవడం వల్లే ఫిర్యాదులతో కాలం గడిపేస్తుంటారు. కెరీర్లో ముందుకెళ్లలేక ఉన్న చోటే ఉండిపోతారు. సమయం అనేది అత్యంత విలువైన వనరు. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగిరాదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవారే జీవిత సమరంలో విజయం సాధిస్తారు. టైమ్ను మీరు నియంత్రించాలి కానీ, టైమ్ మిమ్మల్ని నియంత్రించకుండా జాగ్రత్త పడండి. ఆఫీస్లో చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయి, పూర్తి చేద్దామంటే టైమ్ దొరకడం లేదు అని హైరానా పడుతున్నారా? అయితే ఈ సూచనలు మీలాంటి వారి కోసమే.. క్రమశిక్షణ పాటించండి మొదట ఆ రోజు చేయాల్సిన పనులపై స్పష్టత ఉండాలి. ప్రాధాన్యతలవారీగా వాటిని విభజించుకోవాలి. పూర్తిచేయడానికి డెడ్లైన్లను పెట్టుకోవాలి. గడువులోగా కచ్చితంగా పూర్తయ్యేలా ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డెడ్లైన్ దాటకుండా జాగ్రత్తపడాలి. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి. ప్రారంభంలో కొంత కష్టంగానే అనిపించినా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే గడువులోగా కార్యాచరణ పూర్తిచేయడం సులువుగా మారుతుంది. అనుకున్న సమయంలోగా పనులు చేయలేకపోతే ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అలసిపోతారు. ఆశించిన ఫలితం రాదు, పనిపట్ల సంతృప్తి కూడా ఉండదు. ఫోన్కాల్స్కు నో చెప్పండి కార్యాలయాల్లో ఉద్యోగుల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేది.. తరచుగా మోగే సెల్ఫోన్. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్రొఫెషనల్ వరల్డ్లో ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవా లంటే ఫోన్కాల్స్ ముఖ్యమే. కానీ, చేస్తున్న పనిని వదిలేసి ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నవారికి ఇది మంచిది కాదు. టైమ్ను ఆదా చేయాలంటే అనవసరమైన ఫోన్కాల్స్కు నో చెప్పాల్సిందే. పని, సెల్ఫోన్.. దేని దారి దానిదే అన్నట్లుగా ఉండాలి. ఫోన్లో మాట్లాడడానికి కచ్చితమైన టైమ్ నిర్దేశించుకోవాలి. ఆఫీస్ నుంచి బయటి కొచ్చాక సెల్ఫోన్ స్విచ్ఛాన్ చేయడం ఉత్తమం. మార్నింగ్.. ప్రొడక్టివ్ టైమ్ ఉదయం పూట వాతావరణం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. అది ప్రొడక్టివ్ టైమ్ అని అనేక సర్వేల్లో తేలింది. అంటే ఉదయం చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. కాబట్టి ఆఫీస్లో ముఖ్యమైన కార్యాలను ఉదయమే పూర్తిచేసేలా వర్క్ షెడ్యూల్ రూపొందించు కోండి. త్వరగా పనులు జరిగితే ఎంతో టైమ్ మిగులుతుంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం లాంటి వాటిని మధ్యాహ్నం తర్వాత చేసేలా ప్రణాళిక రూపొందించుకోండి. పనిలో విరామం.. ఎంతసేపు కార్యాలయంలో సహచరులతో కలిసి కాఫీలు, టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటే తెలియకుండానే చాలా సమయం హరించుకుపోతుంది. ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టడమే మంచిది. పనిలో ఏదైనా సమస్య తలెత్తి, ఎంతసేపు ఆలోచించినా దానికి పరిష్కారం మార్గం దొరక్కపోతే.. కొంతసేపు విరామం తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి. విరామం అనేది ఎక్కువ టైమ్ను మింగేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. టెక్నాలజీని వాడుకోండి టైమ్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ చాలా కీలకం. ఒకప్పుడు సమావేశాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో సమయం ఆదా అవుతోంది. తక్కువ టైమ్లో ఎక్కువ కార్యాలు చేయగలుగుతున్నారు. టైమ్ సేవ్ కావడంతోపాటు ఆఫీస్లో ఉత్పత్తి పెరగాలంటే టెక్నాలజీని వాడుకోండి. -
మీరే... నిజం!
ఒక్కోసారి కళ్లు వునల్ని మోసం చేస్తారుు. అందుకే కళ్లతో చూసిందల్లా నిజమేనుకోకూడదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కళ్లతో చూసే దృశ్యానికి, వాస్తవానికి బోలెడంత వ్యత్యాసం ఉంటోంది. దీనికి నిదర్శనమే..augmented reality! వాస్తవానికి వర్చువల్ టెక్నాలజీని తోడు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు.. నగరవాసి హేమంత్ సత్యనారాయణ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని augmented reality లో వినియోగించి imaginate సంస్థ ఫౌండర్, సీఈవో హేమంత్ పలు రంగాలకు పనికొచ్చే యాప్స్ రూపొందించారు. ఆయన రూపొందించిన యాప్స్, వాటి విశేషాలు... ఆర్మీ శిక్షణంతా గదిలోనే (ShootAR) ఆర్మీ ట్రెయినీలకు షూటింగ్ శిక్షణ కోసం ShootAR రూపొందించారు. ట్రెయినీ కళ్లకు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కళ్లద్దాలను అమర్చుతారు. అప్పుడు ట్రెయినీకి అసలు ప్రపంచంతో పాటు వర్చువల్ వరల్డ్ కూడా కనిపిస్తుంది. అప్పుడు ట్రెయినీ డమ్మీ మనిషిని ఏ దిశలో కాల్చాడు, ఆ సమయంలో అతడి కంటి చూపు ఎలా ఉంది వంటి అంశాలన్నీ రికార్డవుతాయి. దీని ఆధారంగా ట్రెయినీలు తమ పొరపాట్లను దిద్దుకునే వీలుంటుంది. దీనిని వీడియో కూడా తీసుకోవచ్చు. మన ఆర్మీలో దీనిని వాడుతున్నారు. గైడ్ లేకుండానే టూంబ్స్ చూసేయొచ్చు... GiftAR ను ‘టూర్గైడ్’గా కూడా వాడుకోవచ్చు. ఇటీవలే ఆగాఖాన్ ఫౌండేషన్ ఈ యాప్ను కొనుగోలు చేసింది. ఈ యాప్లో ముందుగా చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని మొబైల్ యాప్లో క్రియేట్ చేసిపెట్టుకోవాలి. సెల్ఫోన్ను చారిత్రక కట్టడం ముందు ఉంచగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వివరాలు మొబైల్లో ప్రత్యక్షమవుతాయి. కులీకుతుబ్ షాహీ టూంబ్స్లో తొలిసారిగా దీన్ని ప్రారంభించేందుకు ఆగాఖాన్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది. చీర సింగారం తెరపై ప్రత్యక్షం TrialAR షోరూమ్కు వెళ్లి గానీ, ఆన్లైన్లో గానీ కచ్చితమైన కొలతలతో మనకు నప్పే దుస్తులను కొనుగోలు చేయడం కాస్త కష్టమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు TrialAR, DRES.SYవంటి యాప్స్ రూపొందించారు. వీటి సాయంతో మనకు నప్పే దుస్తులను ఎంచక్కా ఎంపిక చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడే గిఫ్ట్ (GiftAR) కోరుకున్నప్పుడే కావలసిన వారికి గిఫ్ట్ ఇచ్చేందుకు రూపొందించిన GiftAR సాయంతో సెల్ఫోన్ ద్వారానే బహుమతి అందించవచ్చు. దీనిని ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. బహుమతి ఇవ్వదలచిన వారి కోసం సెల్ఫోన్లో మెసేజ్ లేదా వీడియోను ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. బహుమతి అందుకున్న వ్యక్తి దానిని ఓపెన్ చేయాలంటే, ముందుగా మనం పెట్టుకున్న లాక్ ముందు సెల్ఫోన్ పెడితే చాలు, ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. వెంటనే మనం క్రియేట్ చేసిన మెసేజ్ లేదా వీడియో ప్రత్యక్షమై ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ యాప్ను గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. imaginate గురించి క్లుప్తంగా.. 2012లో ‘ఐబీఎం స్మార్ట్ క్యాంప్ కిక్స్టార్’, ఎంఐటీ టీఆర్ 35 ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్-2012 అవార్డ్లు . 2012లో ఐటీఏపీ ప్రొడక్ట్, స్టార్ట్అప్ ఫైనలిస్ట్, సార్ట్ అప్ చిలీ గ్లోబల్.. 2011లో దేశం నుంచి నాస్కామ్ ఎంపిక చేసిన టాప్-10 ఇన్నోవేటివ్స్లో కూడా imaginateస్థానం సంపాదించుకుంది. - శ్రీనాథ్.ఎ -
కారును పార్క్చేసే రోబో
సినిమాకో, షాపింగ్ పనిమీదనో బయటికి వెళ్లినపుడు కారు పార్కింగ్ కోసం పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదిక. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రోబో అందుబాటులోకి వచ్చేసింది. డ్రైవర్తో పనిలేకుండా... డ్రైవర్తో పోల్చితే ఈ రోబో అదే స్థలంలో 60శాతం ఎక్కువ కార్లను పార్క్ చేయగలదని దీన్ని తయారుచేసిన కంపెనీ చెబుతోంది. ‘రే’గా పిలుచుకునే ఈ అధునాతన రోబో ప్రస్తుతం జర్మనీ దేశంలోని దసెల్డోర్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిలో బిజీగా ఉంది. వెహికల్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో మనం కారును వదిలేస్తే చాలు ఇదే తన పని కానిచ్చేస్తుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్తో పనిచేసే రోబో... కారు పొడవు, వెడల్పు, ఎత్తులను స్కాన్చేసి నాలుగు ఫోర్క్ల సాయంతో కారును పెకైత్తి కారుకు సరిపోయే స్థలాన్ని ఎంపికచేసి అక్కడ పార్క్ చేస్తుంది. మనకు కారు కావాల్సినపుడు టికెట్ను ఇచ్చేస్తే దగ్గరిలోని వెహికల్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు కారును తెచ్చి వదిలేస్తుంది. -
ఏబీసీడీ
- నట్టింట్లో పాఠాలు ఆదరణ చూరగొంటున్న ఈ- లర్నింగ్ - సీడీల ద్వారా ఇంట్లోనే - విద్యాబోధనఆసక్తి చూపుతున్న విద్యార్థులు న్యూస్లైన్, కర్నూలు(విద్య), ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని నట్టింట్లోకి పాఠాలు వచ్చేశాయి. రెండు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి, బాలమిత్ర వంటి పుస్తకాల ద్వారా నీతి కథలను చదివే బాలలు నేడు ఆడియో, వీడియో రూపంలో వచ్చే సీడీ(కాంపాక్ట్ డిస్క్) ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సీడీల ద్వారా సినిమా రూపంలో పిల్లలకు తల్లిదండ్రులు నైతికవిలువలు, మానవత్వ విలువలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, చిన్న కుటుంబాలు ఏర్పడుతున్న ఈ కాలంలో చిన్నపిల్లలకు సీడీల్లో లభ్యమయ్యే నీతికథలు సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాయి. వారిలో మానసిక స్థైర్యాన్ని అందించి ధైర్యానికి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం నీతి కథలే గాకుండా ఎడ్యుకేషన్ సీడీలు సైతం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులతో పాటు, కుటుంబసభ్యులు, పెద్దలు ఇలాంటి సీడీలను బహుమతులుగా అందజేసి విజ్ఞానాన్ని పంచుతున్నారు. జిల్లాలో డిపార్ట్మెంట్ స్టోర్లతో పాటు పలు పుస్తక, సీడీల విక్రయ కేంద్రాల్లో ఇలాంటి సీడీలు అమ్మకాలు జరుగుతున్నాయి. సీడీల్లో పురాణకథలు: ఒకప్పుడు పురాణకథల గురించి తెలుసుకోవాలంటే చిన్నారులకు బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి వంటి పుస్తకాలు చదివేవారు. పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి చిన్నారులకు లేకపోవడం, ఆ స్థానం టెలివిజన్లు ఆక్రమించాయి. ఇదే సమయంలో సీడీల ద్వారా నీతికథలను అందించేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. దృశ్య, శ్రవణ రూపంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో రూపొందించిన కథలు చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రామాయణ, మహాభారత కథలు చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఉండటంతో వీటి డిమాండ్ బాగా పెరిగింది. పిల్లలకు కథలు చెప్పే ఓపిక, తీరిక లేని తల్లిదండ్రులు, పెద్దలు విజ్ఞాన, వినోదాలను అందించేందుకు ఇలాంటి సీడీలను కొని ఇస్తున్నారు. టీవీ, కంప్యూటర్లలో ఈ లర్నింగ్: ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లో నేడు టెలివిజన్తో పాటు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు కంప్యూటర్లూ కొనుగోలు చేస్తున్నారు. పురాణకథలు, కామిక్, ఎడ్యుకేషన్కు సంబంధించిన సీడీలను చిన్నారులు డీవీడీలు, కంప్యూటర్ల ద్వారా ప్లే చేస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ తరహాలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్ సీడీలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవసరమైన పాఠ్యాంశాలను నేరుగా ఉపాధ్యాయుడు బోధించినట్లు ఈ-లర్నింగ్ ఉపయోగపడుతోంది. ఎడ్యుకేషన్తో పాటు యోగా, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వంటి అంశాల సీడీలను సైతం పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందురోజు ఇంటి వద్ద పుస్తకాలు తిరగేసి సిద్ధమై వస్తాడు. వాటిని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో ప్రశ్న పూర్తి కాకముందే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు. దీంతో అవాక్కవడం ఉపాధ్యాయుని వంతవుతోంది. ఇది మార్కెట్లలో లభించే ఎడ్యుకేషన్ సీడీల పుణ్యమేనని తెలుసుకుని, టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠ్యాంశాలు బాగా అర్థమవుతున్నాయి ఎడ్యుకేషన్ సీడీలతో తరగతి గదిలో చెప్పిన పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. సైన్స్, మ్యాథ్స్, గ్రామర్ సీడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు కామిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం వంటి సీడీలు తెచ్చుకున్నాను. తీరిక వేళల్లో వీడియోగేమ్ సీడీలు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. -ఎం. శ్రీనివాస్, చాణిక్యపురికాలని, కర్నూలు యానిమేషన్ మూవీలంటే ఇష్టం నాకు యానిమేషన్ మూవీలంటే ఇష్టం. ఇటీవల బాలకృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు వంటి దేవతలపై రూపొందించిన సీడీలు బాగా చూస్తాను. వీటితో పాటు అమ్మానాన్నలు మాకు చదువుకునేందుకు అవసరమైన సీడీలు సైతం కొనిస్తున్నారు. ఇవి సైతం నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -అఖిల, కర్నూలు