Ayurvedam
-
భూటాన్లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్లో ఉన్న సమంత.. డాట్షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది. అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది. నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది. అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి -
ఎక్కువగా నిలబడి పనిచేస్తున్నారా?వెరికోస్ వెయిన్స్ నొప్పి నుంచి ఇలా ఉపశమనం
పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోయి అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీన్నే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడి పని చేసేవారిలో వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కార మార్గాలు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యోగా యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.సిరల నుంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగాసనాల ద్వారా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు, పుండ్లు పడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం శారీరక శ్రమ లేదా వ్యాయామం అనారోగ్య సిరల అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంద. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ సైకిల్ తొక్కడం ఊపిరితిత్తులు లెగ్ లిఫ్ట్లు ఇలా చేయడం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పేరుకుపోయిన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్కి చికిత్స చేయడానికి, పలచని యాపిల్ సైడర్ వెనిగర్ను వెరికోస్ వెయిన్లపై చర్మానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. లేదా గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ను కలుపుకొని తాగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. లెగ్ మసాజ్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వేరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే మసాజ్ చేసేటప్పుడు, నేరుగా సిరలపై నొక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది పెళుసుగా ఉండే కణజాలాలను దెబ్బతీస్తుంది. వెరికోస్ వెయిన్ నొప్పి నుంచి ఉపశమనం తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు: అశ్వగంధ అశ్వగంధను సాధారణంగా "ఇండియన్ జిన్సెంగ్" లేదా "ఇండియన్ వింటర్ చెర్రీ" అని పిలుస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించే సాంప్రదాయ ఔషధం. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గోటుకోలా గోటు కోలా అనేది ట్రైటెర్పెనిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెంటెల్లా ఆసియాటికా (TTFCA) అనే రసాయనాన్ని కలిగి ఉన్న ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ రసాయనం ముఖ్యంగా అనారోగ్య సిరలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాస్టిన్, కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుగ్గుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గుగ్గుల్ను ఆయుర్వేదంలో ఆర్థరైటిస్,ఊబకాయంతో సహా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.గుగ్గుల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మొటిమలు వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం త్రిఫల అనేది ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఫార్ములా. ఇది రక్తాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాలకు బలాన్ని అందిస్తుంది. మంజిష్ఠ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తప్రవాహంలో అడ్డంకులను కరిగిస్తుంది. అనారోగ్య సిరలు చికిత్సకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. మంజిష్ఠ యొక్క ఇతర ప్రయోజనాలు మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్ను నయం చేయడం. పసుపు పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వెరికోస్ వెయిన్స్ చికిత్సలో బాగా పనిచేస్తుంది. ఇది వాపు,నొప్పిని తగ్గిస్తుంది. రక్తం నుంచి హానీకరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. గమనిక: పైన పేర్కొన్ని ఆయుర్వేద మందులను వైద్యునితో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. -నవీన్ నడిమింటి -
బంగారంతో రోగాలు నయం.. డిప్రెషన్ కూడా దూరమవుతుంది
బంగారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. యుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. స్వర్ణ భస్మంలో 98శాంతం బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెయ్యి, తేనె లేదా పాలతో కలిపి స్వర్ణభస్మం పౌడర్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► స్వర్ణ భస్మం రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ► కడుపులోని ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి స్వర్ణభస్మం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది. ► స్వర్ణభస్మంలో యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. శతాబ్దాలుగా జ్వరాలకు ఆయుర్వేద చికిత్సలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ► రక్తాన్ని శుద్దిచేసి బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేసే సామర్థ్యం స్వర్ణభస్మంలో ఉంటుంది. ► లైంగిక ఆరోగ్యాన్ని స్వర్ణభస్మం మెరుగుపరుస్తుంది. ► యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెషన్ వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమిని తగ్గిస్తుంది. ► స్వర్ణ భాస్మాలో యాంటీ టాక్సిన్, యాంటీమైక్రోబయల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రారంభ దశలో టిబి కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోగలవు. ► రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ► కణితులు లేదా క్యాన్సర్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి కూడా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను స్వర్ణ భస్మం కలిగి ఉంది. - డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు -
అతివేడితో బాధపడుతున్నారా? వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే..
వేసవిలో అతివేడితో బాధపడే వారికి ఆయుర్వేద వైద్యులు సూచిస్త్ను చిట్కాలివి. వేసవి తాప నివారణకు బ్రహ్మఫల చూర్ణంతో చెక్ పెట్టేయొచ్చు. పైత్య (అతి వేడి) శరీరంతో పుట్టిన వాళ్ళు తేనె రంగు శరీరంతో వుంటారు. వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు. బ్రహ్మఫల చూర్ణం ►బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి---- 100 gr ►అతిమధురం పొడి ---100 gr ►కలకండ పొడి ---- 100 gr ►అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ►10 గ్రాముల పొడిని కుండలోని నీటిలో కలిపి మూడు పూటలా తాగాలి. ►దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి. శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు, నపుంసకత్వం నివారింపబడతాయి, అదే విధంగా.. పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు, వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని వాడితే సమస్య నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది. 2. అతి_వేడి - నివారణ ఉష్ణము ఎక్కువైతే పైత్యం ఎక్కువవుతుంది. దీని వలన రక్తపైత్యము, అధిక రక్తపోటు చర్మ రోగాలు మొదలైనవి వస్తాయి. కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి. ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి. ఆవుపాల పాయసాన్నము తినాలి. ►పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు మొదలైనవి వాడుకోవాలి. ►ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం, కొబ్బరినీళ్ళు తరచుగా వాడాలి. ►వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి. ►కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి. ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది. ►చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది. ►వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది. ఆహారం ►గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది. రక్తంలోని మలినాలు తొలగించబడతాయి. ►అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి. ►బార్లీ నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది. ►వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది. 3. వేడి_తగ్గడానికి 1.తులసి రసం ---- ఒక టీ స్పూను నిమ్మ రసం ---- ఒక టీ స్పూను అల్లం రసం ---- ఒక టీ స్పూను చక్కెర ----- ఒకటి లేక రెండు స్పూన్లు అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి, అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట మొదలైనవి నివారంప బడతాయి. దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి. చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి. 2. తులసి రసం ----- ఒక గ్లాసు నువ్వుల నూనె ---- ఒక గ్లాసు రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి సున్నితంగా మర్దన చెయ్యాలి. 4. అతి వేడి సమస్య - నివారణ అతి మధురం పొడి --- ఒక టీ స్పూను పాలు --- అర గ్లాసు కలకండ లేదా చక్కెర --- ఒక టీ స్పూను పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని వలన వెంటనే వేడి తగ్గుతుంది. ఇది ఇరవై రకాల వేడి సమస్యలను నివారిస్తుంది. అతి వేడి నివారణకు అమృతాహారం ►ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ►అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి. ►ఉల్లి ---- 50 gr ►నూనె లేక నెయ్యి ---- 50 gr ►పెరుగు ---- ఒక కప్పు ►ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని వేయించాలి. చల్లార్చి ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు. శరీరంలోని అతివేడి తగ్గడానికి తంగేడు_కాఫీ తంగేడు పూల పొడి --- 100 gr పత్తి గింజల పొడి --- 50 gr ధనియాల పొడి --- 50 gr గులాబి రేకుల పొడి ---30 gr శొంటి పొడి --- 20 gr చిన్న ఏలకుల పొడి --- 20 gr సుగంధ పాల వేర్ల పొడి --10 gr తంగేడు విత్తనాల పొడ --10 gr అన్ని పదార్ధాలను కలిపితే తంగేడు కాఫీ పొడి తయారవుతుంది. కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి, మెదడు చల్లబడుతుంది. మెదడుకు బలం చేకూరుతుంది. #అత్యుష్ణాన్నితగ్గించేపానీయం సుగంధ పాల వేళ్ళపొడి ----- అర టీ స్పూను ధనియాల పొడి ----- అర టీ స్పూను వట్టి వేర్ల పొడి ---- పావు టీ స్పూను కలకండ పొడి ----- ఒక టీ స్పూను ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి. చల్లారిన తరువాత తాగాలి. దీని వలన పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి ) తగ్గుతుంది. పిత్త సంహార ముద్ర దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు. ►బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన, ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి. ►దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా తగ్గుతాయి ►బార్లీ పేలాల పిండి చక్కెర.. రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది. ►అతి వేడి వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ ►ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి. ►శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నానం ►ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది. ►పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది. ►ఒండ్రుమట్టి 5, 10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి. ►వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి విడిగా కలిపి పెట్టుకోవాలి. వేపాకు పొడి --- రెండు స్పూన్లు తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు పసుపు పొడి --- రెండు స్పూన్లు ►బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు. ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని తగినంత నీటితో కలిపి శరీరానికి, తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి. ►దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -నవీన్ నడిమింటి -
తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం
వేసవి అంటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపించే మండుటెండలు. వేసవి అంటే మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలు. వేసవి అంటే మామిడి రుచులు, తాటిముంజెల చవులు. వేసవి అంటే నసాళానికెక్కే ఘాటైన ఆవకాయల కారాలు. వేసవి అంటే ఇవే కాదు, మల్లెల పరిమళాలు కూడా! మల్లెలు వేసవిలోనే విరగబూస్తాయి. వీథి వీథినా బుట్టలు బుట్టలుగా అమ్మకానికొస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పరిసరాలను పరిమళభరితం చేస్తాయి. ఎండ చల్లబడిన సాయంవేళ చక్కగా స్నానం చేసి, కొప్పున మూరెడు మల్లెలు ముడుచుకుంటేనే తెలుగు పడతులకు అదో తృప్తి! ఇదివరకటి కాలంలో ఆడా మగా తేడా లేకుండా అందరూ తలలో మల్లెలను అలకరించుకునే వారు. శరవేగంగా పరుగులు తీసే కాలం తెచ్చిన పెనుమార్పులతో పురుషుల అలంకరణ నుంచి మల్లెలు తప్పుకున్నాయి. అలాగని, పురుషులకు మల్లెలంటే మొహంమొత్తినట్లు కాదు. మల్లెల పరిమళాన్ని ఇష్టపడటం వల్లనే ఉద్యోగాలు చేసే పురుషులు చాలామంది విధులు ముగించుకుని ఇళ్లకు మళ్లేటప్పుడు తోవలో భార్యల కోసం మల్లెలు కొనుక్కుని మరీ పోతారు. చిరకాలంగా మల్లెలు మన సంస్కృతిలో భాగం. మల్లెలను మాలలుగా అల్లడం ఒక ప్రత్యేకమైన కళ. మల్లెల పరిమళమే లేకపోతే వేసవులు మరింత దుర్భరంగా ఉండేవి. మండుటెండా కాలంలో మల్లెల పరిమళమే మనుషులకు ఊరట! మగువల అలంకరణల్లోనే కాదు, పూజ పురస్కారాల్లోనూ మల్లెలకు విశేషమైన స్థానం ఉంది. మన సాహిత్యంలో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సాహిత్యంలో మల్లెలను ఆరాధించని కవులు దాదాపుగా లేరు. శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి మల్లెపూల దండతోనే పదాలంకరణ చేశారు. మల్లెలను సంస్కృతంలో ‘మల్ల’, ‘మల్లి’, ‘మల్లిక’ అంటారు. వేసవి మొదలయ్యే వసంత రుతువులో మల్లెలు పూయడం ప్రారంభిస్తాయి. అందువల్ల వీటిని ‘వార్షికి’ అంటారు. శీతాకాలంలో చలి పెరిగే సమయంలో మల్లెలు కనుమరుగైపోతాయి. అందువల్ల మల్లెలను ‘శీతభీరువు’ అని కూడా అంటారు. మల్లెల్లో వాటి రేకులు, పరిమాణాన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు, అడవి మల్లెలు, విడి మల్లెలు, దొంతర మల్లెలు, బొడ్డు మల్లెలు వంటివి మన దేశంలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అన్ని రకాల మల్లెలు తెల్లగానే ఉంటాయి. వీటి పరిమళంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కొన్ని చోట్ల అరుదుగా పసుపు రంగులోను, గులాబి రంగులోను పూచే మల్లెలు కూడా కనిపిస్తాయి. మల్లెల ఉత్పాదనలో భారత్, ఈజిప్టు దేశాలే అగ్రస్థానంలో ఉంటాయి. మల్లెలు సహజంగా పూచే పరిస్థితులు లేని చలి దేశాలు ఈ దేశాల నుంచి భారీ ఎత్తున మల్లెలను దిగుమతి చేసుకుంటాయి. కేవలం మల్లెలనే ఉపాధి చేసుకుని బతికేవారు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు. మల్లెలు పరిమళించే దేశాలు ప్రపంచంలోని ఉష్ణమండల దేశాల్లోని వాతావరణం మల్లెలకు అనుకూలంగా ఉంటుంది. భారత్తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను; ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో రకరకాల మల్లెలు ఏటా వేసవిలో విరివిగా కనిపిస్తాయి. అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెల్లో దాదాపు మూడువందల రకాలు ఉన్నాయి. వీటిలో 75 రకాలు భారత్లో పూస్తాయి. మల్లె మొక్కలను చాలామంది పెరటితోటల్లోను, కుండీల్లోను పెంచుకుంటారు. భూవసతి కలిగిన ఉద్యాన రైతులు వాణిజ్యపరంగా కూడా మల్లెలను సాగు చేస్తారు. మన దేశంలో వాణిజ్యపరంగా మల్లెల సాగు చేయడంలో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోను మల్లెల సాగు గణనీయంగానే జరుగుతోంది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్లో వాణిజ్యపరంగా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెలను సాగుచేసే రైతులు టోకు వర్తకులకు పెద్దమొత్తంలో మల్లెలను విక్రయిస్తారు. వీటిని టోకు వర్తకులు వినియోగం ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలకు తరలిస్తారు. వివిధ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా మల్లెలను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. వాణిజ్యపరంగా మల్లెల సాగు మన దేశంలో చిరకాలంగా సాగుతున్నప్పటికీ, మల్లెల సాగు విస్తీర్ణం, ఏటా స్థానికంగా జరిగే మల్లెల వ్యాపారం విలువ, మల్లెల ఎగుమతులు వంటి వివరాలపై గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరం. పూల రారాణి మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. ఇంగ్లిష్లో దీనికి ‘బెల్ ఆఫ్ ఇండియా’– అంటే ‘భారత సుందరి’ అనే పేరు, ‘క్వీన్ ఆఫ్ ఫ్రాగ్రన్స్’– ‘సుగంధ రాణి’ అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్ భాషలో ‘యాస్మిన్’ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లోనూ మల్లెను ‘యాస్మిన్’ అనే పిలుస్తారు. ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషల్లో ‘జాస్మిన్’ అంటారు. హిందీలో మల్లెను మోగ్రా, చమేలీ, జూహీ అనే పేర్లతో పిలుస్తారు. భారత దేశంలోను, ఇతర దక్షిణాసియా దేశాల్లోను మల్లెలను మహిళలు సిగలలో అలంకరించుకుంటారు. శుభకార్యాల సమయంలో చేసే పుష్పాలంకరణలలోను, దేవాలయాల్లోను భారీ పరిమాణంలోని మల్లెమాలలను ఉపయోగిస్తారు. మల్లెలకు అనేక ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. మల్లెలతో దేవతార్చన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మల్లెల మహిమ గురించి ‘పుష్పచింతామణి’ ఇలా చెబుతోంది: ‘మల్లికాజ్ఞా నకర్మార్థ మర్చయంతో మహేశ్వరమ్ లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం’ ఎలాంటి కోరికలు లేకుండా మల్లెలతో ఈశ్వరార్చన చేసినట్లయితే సంసార భయాలు తొలగి, పరమజ్ఞానం కలుగుతుంది. ‘మల్లికా కుసుమై రేవం వసంతే గరుడధ్వజమ్ యోర్చయే పరయా భక్త్యా దహేత్ పాపం త్రిధార్జితమ్’ వసంత రుతువులో శ్రీమహావిష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనో వాక్కాయ కర్మల వల్ల ప్రాప్తించిన పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తులకు గల ఈ విశ్వాసం కారణంగానే వైష్ణవాలయాల్లో జరిగే పూజార్చనల్లో మల్లెలను విశేషంగా ఉపయోగిస్తారు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఇతర పుష్పాలతో పాటు భారీస్థాయిలో మల్లెలను అలంకరిస్తారు. భాషా సాహిత్యాల్లో మల్లెలు మన భాషా సాహిత్యాల్లో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సామెతలు, జాతీయాల్లోనూ మల్లెల మాటలు వినిపిస్తాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, ‘బోడితలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు’ అనే సామెత ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొసగని వాటిని బోడితలకు బొడ్డు మల్లెలతో పోలుస్తారు. ‘జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా?’ అని మరో సామెత ఉంది. దుర్మార్గుల సంతానం దుర్మార్గులే అవుతారు గాని సన్మార్గులు కాలేరనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, ‘ఉల్లి మల్లె కాదు, కాకి కోకిల కాదు’ అనే సామెత కూడా మనకు వాడుకలో ఉంది. మల్లెపూల గురించి చలం అద్భుతమైన కవిత రాశాడు. ‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!/ విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను!’ అంటూనే మల్లెల గురించి ఆయన ఈ కవితలో చాలా విశేషాలే చెబుతాడు. ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు’ అని పరవశించిపోతాడు. ఎంతైనా మల్లెలను అలంకరించుకునే అలవాటు ఉన్న మహానుభావుడాయన! మల్లెల పరిమళాలు కేవలం మన సాహిత్యంలోనే కాదు, పాశ్చాత్య సాహిత్యంలోనూ అక్కడక్కడా గుబాళింపులు వెదజల్లుతూనే ఉంటాయి. ‘అద్భుతమైన మల్లె మళ్లీ పరిమళిస్తుంది/ తన సుమనోహర సుగంధంతో ఈ బీడునేల మళ్లీ వికసిస్తుంది’ అంటూ మల్లెల సౌరభాన్ని అమెరికన్ కవయిత్రి సిల్వియా ఫ్రాన్సిస్ చాన్ తన ‘వండర్ జాస్మిన్’ కవితలో వర్ణించింది. ఇక మన తెలుగు సినీ సాహిత్యంలోనైతే మల్లెల పాటలు కొల్లలుగా వినిపిస్తాయి. మల్లెలూ కొన్ని రకాలూ... వివిధ దేశాల్లో వేసవిలో సర్వసాధారణంగా కనిపించే మల్లెల్లో ‘పోయెట్స్ జాస్మిన్’ ఒక రకం. వీటి పూలు చూడటానికి నందివర్ధనం పూలలా కనిపించినా, మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ జాతి మల్లెల మొక్కలు గుబురుగా పొదలుగా ఎదుగుతాయి. ఇవి దాదాపు నలభై అడుగుల వరకు విస్తరిస్తాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే మల్లెలను ‘ఇండియన్ జాస్మిన్’ అంటారు. వీటినే సాదా మల్లెలు అంటారు. పశ్చిమాసియా, ఈజిప్టు ప్రాంతాల్లో చిన్న గులాబీల్లా కనిపించే మల్లెలను ‘అరేబియన్ జాస్మిన్’ అంటారు. విడివిడి రేకులతో వివిధ పరిమాణాల్లో కనిపించే మల్లెల్లో స్పానిష్ జాస్మిన్, ఏంజెల్ వింగ్ జాస్మిన్, అజోరియన్ జాస్మిన్ వంటివి ప్రధానమైన రకాలు. మల్లెల్లో ఎక్కువ రకాలు తెల్లగానే ఉంటాయి. అయితే, ఇటాలియన్ జాస్మిన్, షోయీ జాస్మిన్ వంటి అరుదైన రకాలు పసుపు రంగులోను; పింక్ జాస్మిన్, ఫ్రాగ్రంట్ ఫైనరీ జాస్మిన్, స్టీఫాన్ జాస్మిన్ వంటివి గులాబి రంగులోను కనిపిస్తాయి. ఆకారాలు, రంగులు ఎలా ఉన్నా, చక్కని పరిమళాన్ని వెదజల్లడం మల్లెల ప్రత్యేకత. చరిత్రలో మల్లెల సౌరభం భారత్, చైనా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల్లో పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెలను చిరకాలంగా ఉపయోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలోనే ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో తాజా మల్లెలను వేడినీటిలో వేసి, స్నానానికి ఉపయోగించేవారు. భారత్లో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచే మల్లెలను ప్రత్యేకంగా సాగుచేయడం మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. చైనాలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటి నుంచి మల్లెల సాగు మొదలైంది. చైనాను అప్పట్లో పరిపాలించిన హాన్ వంశస్థులు మల్లెల సాగును బాగా ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉన్నాయి. యూరోప్కు మల్లెలు చాలా ఆలస్యంగా పరిచయమయ్యాయి. అరబ్బుల ద్వారా క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో గ్రీస్, ఫ్రాన్స్ ప్రాంతాలకు తొలిసారిగా మల్లెలు చేరాయి. ఫిలిప్పీన్స్కు పదిహేడో శతాబ్దిలో మల్లెలు పరిచయమయ్యాయి. మల్లెలపై మనసు పారేసుకున్న ఫిలిప్పీన్స్ మల్లెపూవును తన జాతీయపుష్పంగా ప్రకటించుకుంది. ఫిలిప్పీన్స్తో పాటు ఇండోనేసియా, టునీసియా దేశాలకు కూడా మల్లెపూవే జాతీయపుష్పం కావడం విశేషం. పరిమళ ద్రవ్యాల తయారీలో... పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెల వినియోగం శతాబ్దాలుగా సాగుతోంది. మల్లెల నుంచి అత్తరులు, సెంట్లు వంటివి తయారు చేస్తారు. సబ్బులు, అగరొత్తుల తయారీలోనూ మల్లెల నుంచి సేకరించిన పరిమళ తైలాన్ని వినియోగిస్తారు. మల్లెల నుంచి ఒక కిలో సుగంధతైలం సేకరించాలంటే, వెయ్యి కిలోల మల్లెలు అవసరమవుతాయి. మిగిలిన పూల నుంచి సుగంధ తైలాన్ని సేకరించడానికి వాటిని నీటిలో ఉడికించి, ఆవిరిని సేకరించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది ఒకే దశలో జరిగే ప్రక్రియ. మల్లెల నుంచి సుగంధతైలాన్ని సేకరించడం ఒకే దశలో సాధ్యమయ్యే పని కాదు. మొదటగా తాజాగా సేకరించిన మల్లెలను వాటిని సేకరించిన చోటనే నీటిలో ఉడికించి, ఆవిరి పడతారు. తొలిదశలో పరిమళాలు వెదజల్లే మైనం వంటి పదార్థం తయారవుతుంది. దీనిని ‘జాస్మిన్ కాంక్రీట్’ అంటారు. రెండో దశలో ఈ ‘జాస్మిన్ కాంక్రీట్’ను శుద్ధి చేయడం ద్వారా దీని సుగంధ తైలాన్ని సేకరిస్తారు. ఇంతగా ఎంతో శ్రమించి సేకరించిన సుగంధ తైలాన్నే అత్తరులు, సెంట్లు వంటి పరిమళ ద్రవ్యాల తయారీలోను, సబ్బులు, అగరొత్తులు వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు. మల్లెల నుంచి సుగంధతైలం సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల మల్లెల పరిమళాన్ని వెదజల్లే అత్తరులు, సెంట్లు వంటి ఉత్పత్తుల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో... ►మల్లెలను మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలోను, చైనా సంప్రదాయ వైద్యంలోను చిరకాలంగా వినియోగిస్తున్నారు. మల్లెపూలను తలలో ధరించడం వల్ల వెంట్రుకలకు, కళ్లకు మేలు జరుగుతుందని; ►మల్లె ఆకులను దట్టంగా తలపైవేసి కట్టు కట్టినట్లయితే, కళ్లు ఎర్రబారడం, కళ్లకలకలు వంటి నేత్రవ్యాధులు నయమవుతాయని, ►మల్లె ఆకులను నూనెలో వేసి కాచిన తైలాన్ని తలకు పట్టించినట్లయినా నేత్రవ్యాధులు నయమవుతాయని; ►మల్లెల వేరు నుంచి తయారు చేసిన కషాయం వాత పైత్య దోషాలను హరిస్తుందని, రక్తదోషాలను తొలగిస్తుందని ‘వస్తుగుణ దీపిక’ చెబుతోంది. ►ఒత్తిడిని తగ్గించడంలోను, మానసిక ప్రశాంతతను కలిగించడంలోను మల్లెల సుగంధం బాగా పనిచేస్తుందని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ►చైనా సంప్రదాయ వైద్యంలో మల్లెపూవును ‘మో లి హువా’ అంటారు. ►దీనిని చర్మవ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు. ►మల్లెల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని జీర్ణకోశ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ►మల్లెపూలలో ఉండే ‘ఆర్సిటిన్’ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. -
షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం! పరగడుపున ఒక చెంచా రసం తాగితే
కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనానికై ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న చిట్కాలివి. 1.అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. 2.నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి 3. ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. 4.వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి. స్థూలకాయం తగ్గి 5. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 6. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు. తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు మేలు 7.అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాలతో కలిపి పుచ్చుకుంటే నరాలకు మేలు చేస్తాయి. 8.కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. కడుపు నొప్పి ఉంటే 9.రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది. 10.తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. పేను కొరుకుడు వేధిస్తోందా 11.దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న వాళ్లకి తక్షణం పనిచేస్తుంది. 12.ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. చుండ్రు నివారణకు 13.మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది. 14.కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. మడమ నొప్పి తగ్గాలంటే 15.చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. 16.జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉంటే 17.శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 18.రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం 19.మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. 20.ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం. పార్శ్వపు నొప్పి తగ్గటానికి 21.పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది. 22. తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్య నిపుణులు నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
పిల్లల్లో విరోచనం కాకపోతే ఏం చేయాలి? సునాముఖి ఆకుతో ఇలా చేస్తే..
చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే వీపరీతమైన పని, ఒత్తిడి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికి తెలియదు, తల్లితండ్రులకు వారిని అర్థం చేసుకునే సమయం తక్కువ! 24 గంటలూ పిల్లలనే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. ఇబ్బంది పడతారు. మరి అప్పుడేం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తోంది? 1. పిల్లలు తెలియకుండా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని తర్వాత కడుపు నొప్పి అంటూ విలవిలలాడితే? కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచు కోవాలి. మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడిలో మాదీఫల రసాయనం కలపాలి. దాన్ని చెంచాలో తీసుకుని పిల్లలకు పట్టాలి. దీని వల్ల వాంతులే కాదు వామ్టింగ్ సెన్సేషన్ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్యాల్సిన అవసరం లేదు. 2. హఠాత్తుగా విరేచనాలు మొదలయితే ఏం చేయాలి? జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, ఆ విరేచనాల ప్రాథమిక దశలోనే జాగ్రత్త తీసుకుంటే వాటి బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి. అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజుల పాటు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు ఇవ్వాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ మజ్జిగ అన్నం పెడితే మంచిది. 3. దీర్ఘకాలిక జ్వరాలకు ఏం చేయాలి? ఎప్పుడు చూసినా లో-ఫీవర్ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం. దీర్ఘజ్వరం వున్నవాళ్లు చల్ల మిరియం విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సి వుంటుంది. 4. విరోచనం కాకపోతే ఏం చేయాలి? విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని గుండుగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది. 5. పిల్లలు తరచుగా దగ్గు, రొంపకు గురయితే ఏం చేయాలి? దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయోగిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప అసలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులు ముందుగా వెచ్చ చేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ముందు ముందు రాకుండా ఉంటుంది. 6. తరచుగా ఇంజక్షన్లు చేయిస్తున్నారా? ఇవి పరిశీలనలోకి తీసుకోండి. సూది మందు వీటికి వద్దు. ►చిన్న చిన్న జబ్బులకు ►సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు ►విటమిన్ టాబ్లెట్లు ►కాల్షియం మందు ►రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్ట్రాక్ట్, ఇన్ఫెర్రాన్ లాంటివి. విటమిన్ టాబ్లెట్లు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమిన్లు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. రక్తహీనతకు ఇంజెక్షన్ల కంటే కూడా నోటి ద్వారా తీసుకునే ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి. పైగా అపరిశుభ్రమైన సూదుల ద్వారా అవసరం లేని ఇబ్బందులు, అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సినీ నటి కాజల్ అగర్వాల్ కొత్త అవతార్: అదేంటో తెలుసా?
హైదరాబాద్: ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయంలో ఉన్న ద ఆయుర్వేద కంపెనీ (టీఏసీ)..సిరీస్-ఏ రౌండ్లో సినీ నటి కాజల్ అగర్వాల్ నుంచి పెట్టుబడి అందుకుంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆయుర్వేద బ్రాండ్ తన సిరీస్ఏలో టాలీవుడ్ నటి కాజల్ పెట్టుబడి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే విప్రో కంజ్యూమర్ కేర్ వెంచర్స్ పెట్టుబడి పెట్టింది. ఈ-కామర్స్ పోర్టల్స్తోపాటు ఆఫ్లైన్లో 1,000కిపైగా కౌంటర్లలో టీఏసీ ఉత్పత్తులు లభిస్తాయి. అయుర్వేదానికి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని నిజంగా తాను నమ్ముతానని కాజల్ అగర్వాల్ చెప్పారు. అందుకే ఆయుర్వేద కంపెనీ మిషన్లో చేరానని తెలిపారు. కాగా ఈ ఏడాది అక్టోబర్లో కాజల్ ‘దశపుష్పది’ ప్రొడక్ట్ ప్రకటనల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాబోయే తరాలకు ఆయుర్వేదం అందించే ఫలాలను అందించాలనుకుంటున్నాం. ముఖ్యంగా జీవితాన్ని మార్చే అలవాట్లు, ప్రయోజనాలను పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధా సింగ్ వెల్లడించారు. మెరుగైన జీవన నాణ్యతకు ఆయుర్వేద ఉపయోగ పడుతుందన్నారు. అలాగే కాలక్రమంలో ఆయుర్వేదానికి దూరమైపోతున్న మిలీనియల్స్కు శక్తివంతమైన సాంప్రదాయ వ్యవస్థను అందించాలని శ్రీధా సింగ్ పేర్కొన్నారు. . -
Health Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి?
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జ్వరం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ బాధితుల్లో కొందరికి డెంగీ వల్ల జ్వరం వస్తోంది. అసలు వచ్చింది మామూలు జ్వరమా? లేక డెంగీ జ్వరమా తెలుసుకోవడం ఎలా అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. డెంగీ లక్షణాలు ►జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు ►తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు ►కళ్లలో విపరీతమైన నొప్పి ►శరీరంపై దద్దర్లు ►వాంతులు కావడం, కడుపునొప్పి ►నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం ►కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం డెంగీ లక్షణాలుంటే ఏంచేయాలి? ►పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలను ఇవ్వాలి ►జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి ►దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి డెంగీని నివారించడానికి అనుసరించాల్సిన ఆయుర్వేదంలో ఉన్న జాగ్రత్తలు 1. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 1015 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు. 2. బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాగిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి. 3. క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది. 4. కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది. 5. డెంగ్యూ జ్వరం కారణంగా తల నెప్పి, వాంతులు, ముక్కు, నోటి చిగుర్ల నుండి రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ►డెంగీ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జ్వరం తగ్గాక కూడా పూర్తిగా కొలుకోవడానికి ఒక నెల వరకు కూడా సమయం పట్టవచ్చు. ►డెంగీ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది. ►జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన, శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పళ్ళ రసం లాంటివి ఇవ్వాలి. ►పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో చేర్చాలి. ►పళ్లలో దానిమ్మపాళ్లు, కూరగాయలతో బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. ►మసాలా కూరలు, నూనె పదార్థాలు, బయటి వంటకాలు వీలైనంత వరకు తగ్గించాలి. ►కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీర తత్వాన్ని బట్టి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సులభంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినపుడు ప్లేట్ లెట్స్ తగ్గి తీవ్రమైన ముప్పుకు దారి తీస్తుంది. ఏ వైరస్ శరీరంలో ఏ భాగాన్ని దెబ్బ తీస్తుంది అనే అవగాహన కలిగిన డాక్టర్ను సంప్రదించాలి. అలాంటప్పుడు ప్లేట్ లెట్స్ తగ్గుదలను నిరోధించడానికి కావలసిన మందులు వాడడంతో పాటు ఇతరుల నుంచి సేకరించిన ప్లేట్లెట్లను శరీరంలోనికి ఎక్కిస్తారు. ►బొప్పాయి ఆకుల రసం ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి దోహదం చేస్తుంది. ►డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత చర్య తీసుకొవడం కంటే ముందు అది రాకుండా నిరోధించడం మంచిది. ►డెంగ్యూ జ్వరం రాకుండా అడ్డుకొనే టీకా ప్రయోగ దశలో ఉన్నది కొన్ని నెలలలో అందుబాటులోకి రానుంది. అంత వరకు డెంగ్యూ సీజన్ లో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించడం మంచిది. కూలర్లలో , పూలకుండీలలో, పాత టైర్లలో... ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకుంటే డెంగ్యూ దోమలు వీటిలో అభివృద్ధి చెందుతాయి. కిటీకీలకు తెరలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా చూడవచ్చు. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Pigmentation: బంగాళా దుంప, నిమ్మ రసం, తేనె.. పిగ్మెంటేషన్కు ఇలా చెక్! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
మన ప్రాచీన వైద్యాన్ని పునరుద్ధరించాలి
ప్రతి మనిషీ ఆరోగ్యం కోరుకుంటాడు. ఏ పని చేయాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఆరోగ్యాన్ని మాత్రమే మహా భాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు చికిత్స తప్పనిసరి. ఇప్పుడంటే ఆధునిక అల్లోపతి వైద్య విధానం రాజ్యమేలు తోంది కానీ... అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధా నంలోనే చికిత్స అందించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అటువంటి మన దేశీయ వైద్య విధానానికి ఇవ్వాళ అంతగా ప్రాముఖ్యం లభించడంలేదు. ఆయుర్వేదమే కాదు... యునాని, హోమియో వైద్య విధానాలు సైతం చౌకగా ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడు తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధానాల కన్నా అత్యంత ఖరీదైన అల్లోపతికే ప్రభు త్వాలు పెద్దపీట వేస్తున్నాయి. మిగతా మూడింటితో పోల్చినప్పుడు అల్లోపతి ఎక్కువ శాస్త్రీయమైనదని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే అల్లోపతి వైద్యవిధానంలో రోగ లక్షణాలు లేదా బాధ తొందరగా తగ్గుతుందనేది మరో కారణం. అలాగే పెద్ద పెద్ద శ్రస్త చికిత్సలు చేసి రోగులను బతికించే శాస్త్రీయ విధానంగానూ ప్రజలలో దానికి పేరున్నమాటా నిజం. చరకుడు, సుశ్రుతుని కాలం నుండి కూడా ఆయుర్వేద వైద్యం భారత ఉప ఖండంలో వ్యాపించి ఉంది. ఆయుర్వేదంలోనూ అనేక ఛేదనాల (అంగాలను తొల గించడం) రూపంలో శస్త్ర చికిత్సలు జరిగేవి. రాచ పుండ్లు (కేన్సర్లు), పక్షవాతానికీ, అనేక దీర్ఘకాలిక వ్యాధులకూ, వ్రణాలకూ అద్భుతమైన చికిత్సలు జరిగేవి. అడవులూ, పొలాలూ, పెరడులూ, వంటిళ్లూ... ఎక్కడ చూసినా ఆయుర్వేదానికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేవి. అయితే అల్లోపతి విధానం అనేక కారణాలవల్ల ప్రజల్లో ఆదరణ పొంద డంతో మన దేశీయ వైద్యం క్రమంగా పడకేసింది. అలాగే గత రెండు మూడు దశాబ్దాలుగా హోమియో వైద్య విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్లోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ హోమియో వైద్య విధానంలో వ్యక్తి శారీరక ధర్మాలను అంచనా వేసి వైద్యులు మందులను ఇస్తారు. అల్లోపతి వైద్యంతో పోల్చుకున్నపుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మొండి రోగాలను నయం చేయగలిగిన శక్తి హోమియోపతికి ఉన్నదని నమ్మకం కూడా ఇటీవల ప్రజల్లో పెరిగిపోవడంతో హోమియో వైద్యానికి గిరాకీ కూడా గణ నీయంగానే పెరుగుతున్నది. అయితే ప్రభుత్వపరంగా హోమియో, ఆయుర్వేద, యునాని వైద్యవిధానాలకు ప్రోత్సాహం అల్లోపతితో పోల్చి చూసినప్పుడు తక్కువగానే ఉందని చెప్పక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు చౌకగా చికిత్స అందించడానికి కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్’ ద్వారా మన సంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలూ అనేక ఆయుర్వేద కళాశాలలూ, వైద్యశాలలూ నెలకొల్పు తుండటం గమనార్హం. కాకపోతే అల్లోపతి వైద్య కళా శాలలు, ఆస్పత్రుల సంఖ్యతో పోల్చుకుంటే మిగిలిన వైద్య విధానాలకు చెందిన కాలేజీలు, వైద్యశాలలూ తక్కువ అనేది సుస్పష్టం. (క్లిక్: భారత్ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ముఖ్యంగా వ్యాధి మొదటి, రెండో దశల్లో ఉన్నప్పుడు అల్లోపతి డాక్టర్లకన్నా ఆయుర్వేద, హోమియో వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సులువైన వైద్యం అందుతుంది. అందుకే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో తప్పనిసరిగా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. (క్లిక్: భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం) - డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
తిప్పతీగపై తప్పుడు ప్రచారం.. ఆయుష్ మంత్రిత్వశాఖ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: తిప్పతీగ వినియోగిస్తే ఎలాంటి హానికర ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ కాలేయాన్ని దెబ్బతీస్తుందంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయుష్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో ఖండించింది. ఆయుర్వేదంలో ఉత్తమ పునరుజ్జీవన మూలికగా పేర్కొనే తిప్పతీగ సారం ఎలాంటి విష ప్రభావాన్ని కల్గించదని అధ్యయనాలు పేర్కొన్నాయని తెలిపింది. ఔషధం భద్రత ఎంత అనేది వినియోగించే అంశంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. నిపుణుడైన వైద్యుడి సూచన మేరకు ఔషధం తగిన మోతాదులో వినియోగించుకోవాలని సూచించింది. మూలికా ఔషధ మూలాల్లో నిజమైన నిధిగా భావించే తిప్పతీగ పలు రుగ్మతలను తగ్గిస్తుందని పేర్కొంది. జ్వరాలు, డయేరియా, అల్సర్, క్యాన్సర్, ఆందోళన తదితర రుగ్మతల నివారణకు వినియోగించే తిప్పతీగ కరోనా నియంత్రణకూ వినియోగించినట్లు పేర్కొంది. ఔషధ ఆరోగ్య ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొంటే తిప్పతీగ విషపూరితమని చెప్పలేమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చదవండి: (1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్న నాగార్జున) -
ఐ డ్రాప్స్ అనుమతులకు దరఖాస్తు చేసుకోండి
సాక్షి, అమరావతి: ఐ డ్రాప్స్ తయారీ, పంపిణీకి అనుమతుల కోసం డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఆదేశాలు, విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి
తిరుపతి తుడా : ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవిడ్ థర్డ్ వేవ్పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్ శ్యామ్ప్రసాద్ కోరారు. కోవిడ్–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి, పీజీ రీడర్ డాక్టర్ రేణుదీక్షిత్తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు: ఎమ్మెల్యే కాకాణి
సాక్షి, నెల్లూరు: ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ మందు పంపిణీకి సిద్ధమేనని ఆనందయ్య ప్రకటించారని.. సామాన్యులకు అందడం లేదని వచ్చే వార్తల్లో వాస్తవం లేదని కాకాణి అన్నారు. ఆనందయ్య ఎలాంటి సహకారం కోరుతున్నారో జిల్లా కలెక్టర్కి నివేదిస్తే కార్యాచరణ సిద్ధమవుతుందని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాలతో పాలనలో కొత్త ఒరవడి మొదలైందని కాకాణి అన్నారు. మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ అనవసర రాద్ధాంతం తప్ప.. నిర్మాణాత్మక పాత్ర పోషించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైందన్నారు. చదవండి: సాంప్రదాయబద్ధంగా పీఠాధిపతి ఎంపిక: వెల్లంపల్లి చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి -
నమస్కార సంస్కారం నేర్పిన కరోనా
షేక్ హ్యాండ్ ఇవ్వడం రాకపోతే చిన్నచూపు చూసిన ఆధునిక లోకం.. అదే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఛీ కొట్టే స్థితికి వచ్చింది. కషాయం అంటే కడుపులో తిప్పుతుందన్న నోటితోనే వాటిని ఇష్టంగా తాగేలా చేసింది. కరోనా కారణంగా మన ఆచార వ్యవహారాలు, ఆరోగ్యమార్గాల విలువ నవతరానికి మాత్రమే కాదు ప్రపంచానికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరవాసి వీటిని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని వచ్చి వాటిని పాఠ్యాంశాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, హైదరాబాద్: ‘మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ఒక మతానికి పరిమితం చేయడం సరైంది కాదు. అవెంత అవసరమో.. వాటిని పాటించడం అంటే మానవాళికి ఎంత మేలు కలుగుతుందో కరోనా తెలియజెప్పింది. ఇప్పుడు వాటిని భావితరాలకు అందించడమే నా లక్ష్యం’ అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ ఫౌండేషన్ నిర్వాహకులు విక్రమ్ రాజు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ ఆచార వ్యవహారాలంటే చాలా మక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే. సరళీకరణ ఓ నిర్విరామ ప్రక్రియ.. మనవైన వేదాలు రోజురోజుకూ మనకి దూరమవకుండా ఉండేందుకు మనకన్నా మన ముందు తరం వారే తగిన శ్రద్ధ వహించారు. కాలానుగుణంగా వాటిని సింప్లిఫై చేస్తూ వచ్చారు. తొలిదశలో వేదాలు అందరూ చదివగలిగేవారు. తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తర్వాత దశలో పండుగలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సంప్రదాయంగా పండుగలు ఆచరించేవారు కూడా లేరు కాబట్టి.. వాటిని భావితరాలకు ఉపకరించేలా మరింత సింప్లిఫై చేసి పాఠాల రూపంలో అందించాల్సి ఉంది. నాటి బాటే.. నేటి పాఠమై.. వేద పాఠశాలు చాలా ఉన్నా.. యోగా, ముద్ర, చక్రాస్, మెడిటేషన్లపై దేశంలో ఎవరి దగ్గరా సరైన విద్యా మెటీరియల్ లేదని నాకు అవగతమైంది. లాక్డౌన్ సమయంలో లభించిన వెసులుబాటుతో దాదాపు 25ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారితో కలిసి ఒక కర్రిక్యులం తయారు చేశా. అలాగే దాదాపు 2వేల పేజీలు ఉండే గరుణ పురాణంలోని ముఖ్యమైనదంతా కలిపి 100 పేజీల్లో కుదించి.. 18 పురాణాలూ చేయిస్తున్నాను. మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఒక్కో దేవత గురించి 2 పేజీల్లో పొందుపరచి పుస్తకాలు తెస్తున్నాం. ఈ కర్రిక్యులంని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు, కళాశాలలకు అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం. ఆయుర్వేదం సహా 150 నుంచి 200 పేజీలలో వేదాల పుస్తకాలు తెస్తున్నాం. వేదగణితం.. కాల్క్యులేటర్కి సమానం.. మన వేదిక్ మ్యాథ్స్ చాలా సింప్లిఫైడ్.. ఈ వేద గణితం నేర్చుకున్నవారు కాల్క్యులేటర్తో సమానంగా లెక్కించగలరు అంటే నమ్మాలి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10దాకా వేదిక్ సైన్స్తో పాటు వేదాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలపై కూడా పూర్తిస్థాయి సబ్జెక్టు తయారు చేశా. ఇవన్నీ రెగ్యులర్ సిలబస్తో పాటు అందించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సరిపడా స్థలం ఇస్తే ఇండియన్ వేదిక్ స్కూల్ నెలకొల్పాలని ఉంది. చిన్ననాటి నుంచే నేర్పాలి... డార్విన్ ఎవల్యూషన్ థియరీ చదువుతాం. కానీ అది ఎప్పుడో మనం దశావతారాల పేరిట మన పెద్దవాళ్లు చెప్పారనేది పిల్లలకి తెలియాలి. అలాగే మొత్తం సోలార్ సిస్టమ్ గురించి, గెలాక్సీ గురించి పురుష సూక్తంలోని నాసదీయసూక్తంలో ఉందని తెలియజెప్పాలి. అవన్నీ ఎప్పుడో కాదు ప్రతి పిల్లాడికీ వేదాలు, ఉపనిషత్తు 5వ ఏట నుంచే ఇవి పాఠ్యాంశాలు కావాలి. ఆ ఉద్ధేశ్యంతోనే మొత్తం 50 థియరీల మీద కలిపి బుక్స్ చేయిస్తున్నాను. – విక్రమ్ రాజు, వేదిక్ ఫౌండేషన్ -
నన్ను నేను తెలుసు కుంటున్నాను
‘‘మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ఆర్డర్ అని అనారోగ్యాన్ని డిజార్డర్ అని అన్నారు. డిజార్డర్ ఎందువల్లో కనుక్కోగలిగితే దాన్ని ఆర్డర్లో పెట్టడం సులువు అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కనుగొంటున్నాను’’ అన్నారు అమలాపాల్. ప్రస్తుతం ఆమె పంచకర్మ చికిత్స తీసుకుంటున్నారు. ఆయుర్వేద చికిత్సలో ఇదో భాగం. 28 రోజుల ఈ చికిత్సా ప్రక్రియలో సుమారు 20 రోజులు పూర్తి చేశారట ఆమె. ఈ ప్రయాణం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదంతో నా ప్రయాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయింది. ఈ ప్రయాణంలో ఓ పుస్తకంలో దోషాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కలసి మూడు శక్తులను సృష్టించాయి. వాటినే దోషాలంటారు. వాతా. పితా. కఫా. ఇందులో మొదటిది మన ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. రెండోది మన జీర్ణాన్ని, శారీరక చర్యలను చూసుకుంటుంది. చివరిది మన శరీరాకృతిని నిర్దేశిస్తుంది. ఆయుర్వేదిక ప్రక్రియలన్నీ ఈ మూడు దోషాలను సరైన క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేసుకోవడానికే. నెల రోజులుగా ఆయుర్వేదంలో పంచకర్మలో మునిగితేలుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన శక్తిని మనమే తెలుసుకొని స్వయంగా నయం చేసుకోగలిగే ప్రక్రియ ఇది. ఇలాంటి ప్రక్రియలో పంచకర్మ ఒకటి’’ అన్నారామె. -
ఒత్తిడి నివారణకు ఆయుర్వేద చిట్కాలివే..
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి, డిప్రెషన్ (మానసిక ఆందోళన)తో మెజారిటీ ప్రజలు బాధపడుతున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కలతో ఒత్తిడి సమస్యను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆయుర్వేదానికి గణనీయమైన చరిత్ర ఉంది. గత 2వేల సంవత్సరాలుగా అనేక జబ్బులకు ఆయుర్వేద వైద్యం దివ్యౌషదంగా పని చేసింది. అయితే ఇటీవల కాలంలో జబ్బులు నయం కావడానికి ఆయుర్వేద వైద్యం చాలా సమయం తీసుకుంటుందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోహలకు దీటుగా ఆయుర్వేద నిపుణులు చక్కటి విశ్లేషణతో దీటైన కౌంటర్ ఇస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుర్వేద వైద్యంపై విశ్లేషణ: ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి సమస్యకు నాడీ వ్యవస్థ మూలమని భావిస్తారు. మానసిక సమస్యలను దోషా అనే ప్రక్రియ నియంత్రిస్తుంది. కాగా నరాల వ్యవస్థను బలంగా ఉంచే వాత ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి సమస్యను నివారించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పరిష్కార మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాచీన కాలం నుండి హెడ్ మసాజ్ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది. అయితే తల, మెడ ప్రాంతాలను మసాజ్ చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్రతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో పాటు చర్మం, జుట్టు సమస్యను నివారిస్తుంది. కాగా మసాజ్ చేయుటకు నారాయణ తైలా, బ్రాహ్మి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగిస్తారు. సమతుల్య ఆహారం ద్వారా ఒత్తిడి నివారణ మనిషికి ఏం కావాలో శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే శరీరం కోరుకున్న సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యను నివారించవచ్చని తెలిపారు. కాగా విటమిన్ సీ, బీ, ఒమెగా, మాగ్నిషియమ్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒత్తిడి సమస్యను నివారించేందుకు క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు -
కేరళ ఆయుర్వేదం గెలిచింది!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నాటికి కరోనా వైరస్ కేరళలో అడుగుపెట్టింది. కొద్ది రోజుల్లోనే రోగుల సంఖ్య పదుల సంఖ్యకు.. ఆపై వందల్లోకి చేరింది. మహమ్మారికి కళ్లెం వేసేందుకు రంగంలోకి దిగిన కేరళ ప్రభుత్వం.. ఆయుర్వేదాన్ని ఆయుధంగా చేసుకుంది. వ్యాధిని గుర్తించేందుకు ఏం చేయొచ్చో తెలపాలని ఆయుర్వేద వైద్యులను కోరింది. దాంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఏం చేయాలన్నది రాష్ట్రం మొత్తానికి తెలియజేసింది. ఏప్రిల్ 11 నాటికి కరోనాకు సంబంధించి ఆయుర్వేద కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. రోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని, ఇందుకు తాము సూచించిన పద్ధతులను పాటించాలని కోరింది కూడా. ఆయుర్వేదం ఏం చెబుతోంది? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా కరోనాను దూరంగా ఉంచేందుకు కేరళ ప్రభుత్వం ఆయుర్వేదం ఆధారంగా పలు సూచనలు చేసింది. చిరుతిళ్లను వీలైనంత వరకు తగ్గించడం, డ్రైఫ్రూట్స్తో పాటు ఉడికించిన పచ్చి అరటిపండు (కేరళలోని నేండ్రం రకం)ను వాడాల్సిందిగా కోరింది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని.. రోజులో కనీసం ఒక్కసారైనా ముడి బియ్యంతో చేసిన గంజి తాగాలని, వీలైనంత వరకు మాంసాధారిత ఆహారాన్ని తీసుకోకపోవడం మేలని తెలిపింది. కూరలు, సూప్లు, అల్పాహారాల్లో పెసలు, పెసరపప్పు విరివిగా వాడాలని కోరింది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు యోగా చేయాలని తెలిపింది. మినుముల వాడకం తగ్గిస్తే మేలని, వేడినీటిలో శొంఠిని వేసి మరిగించిన నీటిని తాగుతుండటం, శొంఠి కాఫీకి కొంచెం పసుపు కలుపుకొని తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని, ఆవు పాల కంటే మేకపాలు మేలని తెలిపింది. కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందులు ఉపయోగించేందుకు సిద్ధమైన కేరళ ప్రభుత్వం.. చికిత్స విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధునిక వైద్యం పైనే ఆధారపడింది. నిర్ధారణ పరీక్షలు, వైద్యం అల్లోపతి ద్వారా చేపట్టారు. ఆయుర్వేద విధానం జీవనశైలి మార్పులు, రోగి శక్తి పుంజుకునేందుకు ఉపయోగపడుతోంది. కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది కరోనా కష్టకాలంలో ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం ‘కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది’ అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. స్వాస్థ్యం, సుఖాయుష్యం, పునర్జనని పేర్లతో సిద్ధం చేసిన పద్ధతులను ప్రజలకు ప రిచయం చేసింది. 60 ఏళ్లలోపు వారికి తొలి పద్ధతి ఉపయోగపడితే వృద్ధుల రక్షణకు సుఖాయుష్యం సిద్ధమైంది. పునర్జనని కరో నా రోగులు త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. రాష్ట్రంలోని ఆయుర్వేద వైద్యశాల వివరాలను ‘నిరామయ’పేరున్న పో ర్టల్కు ఎక్కించింది. కేంద్ర ప్రభుత్వపు ఆయుష్ మిషన్లో భాగంగా రా ష్ట్రమంతా ఆయుర్ రక్ష పేరుతో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రాలు కరోనా పర్యవేక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సామాజిక మాధ్యమ పేజీల్లో కరోనా నివారణకు తీ సుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన వ్యాయామాల వివరాలను ప్రజలకు అందించింది. ఏపీలోని గ్రామ వలంటీర్ల వ్యవస్థ మాదిరిగా ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థుల సాయంతో రాష్ట్రమంతటా అనుమానిత క రోనా బాధితులను గుర్తించేందుకు కృషిచేసింది. -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి) -
ఋతుగుణానికి... అనుగుణంగా
వాతావరణంలోని మార్పులను బట్టి సంవత్సరంలోని పన్నెండు నెలల్ని ఆరు ఋతువులుగా విభజించారు మన పూర్వీకులు. సంస్కృతంలో చెప్పినా, ఆంగ్లంలో చెప్పినా, ఏ మాతృభాషలో చెప్పినా ‘శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం’ ప్రకృతిలోని కాలచక్రానికి చిహ్నాలు. వీటికి అనుగుణంగా ప్రాణికోటి తమ జీవనశైలిని, ఆహారవిధానాలను సర్దుకోవలసిందే. మానవ ఆరోగ్య శాస్త్రానికి కాణాచి అయిన ఆయుర్వేదం వివిధ వ్యాధులకు చికిత్సలను వివరించడంతో పాటు ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడానికి, ఎన్నో ప్రక్రియలను ‘స్వస్థవృత్తం’ అనే పేరు మీద విపులీకరించింది. ఆహారస్వభావాలను, జీవనశైలిని.. దినచర్య, ఋతుచర్యలుగా విశదీకరించింది. శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతం అనే ఆరు ఋతువులలోనూ తదనుగుణమైన ఆహారవిహారాలను వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న హేమంత ఋతువు, రానున్న శిశిర ఋతువుల చర్యలను పరిశీలిద్దాం. హేమంతం: మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువు. ఇంచుమింగా నవంబరు నెల చివర నుంచి, జనవరి నెల చివరి వరకు ఉంటుంది. అనంతరం శిశిర ఋతువు ప్రారంభమౌతుంది. ఇది మార్చి నెలలో మూడు వారాల వరకు ఉంటుంది. ఈ రెండు ఋతువుల్ని చలికాలం అంటాం. స్వభావరీత్యా బయట చలిగాలులు వీస్తాయి. అందువలన శరీరం లోపల ఊష్మం అంటే వేడి పుడుతుంది. జఠరాగ్ని (దీపన పాచకాగ్నులు – ఆకలి కలగడానికి, అరుగుదల కావడానికి ఆధారమైనవి) గణనీయంగా వృద్ధి చెందుతుంది. మనుషులు ఎంతటి బరువైన ఆహారాన్నయినా అరిగించుకోగలరు. సమృద్ధిగా తినకపోతే రసధాతువు బలహీనపడి వాతప్రకోపం జరుగుతుంది. ఆహారవిధి: తీపి, పులుపు, ఉప్పు రుచులతో (మధుర, ఆమ్ల, లవణ రసాలు) కూడిన పుష్టికరమైన (బరువైన గుర్వాహారం) ఆహారాన్ని సేవించాలి. కొత్త బియ్యం, ఆవుపాలు, చెరకు రసం శ్రేష్ఠమని చరకాచార్యుడు స్పష్టీకరించాడు. నువ్వులనూనె (తైల), వస (ఎముకల గుజ్జులోని రసం) బలకరమని చెప్పాడు. (గోరసాన్ ఇక్షువికృతీః – వసామ్, తైలమ్ నవౌదనమ్). కనుకనే సంక్రాంతి పండుగ సమయంలో కొత్తబియ్యపు పాయసం, చెరకు రస పానం విశిష్టతను సంతరించుకున్నాయి. మినుములతో (మాష) చేసిన పదార్థాలు పుష్టికరమని వాగ్భటాచార్యుడు వివరించాడు. (... మాషిక్షుక్షీరోద్ధవికృతీః శుభాః). కారము, చేదు, వగరు (కటు తిక్త కషాయ) రుచులు కలిగిన ఆహారపదార్థాలు మంచివి కాదు. వేడివేడి సూపుల వంటి పానీయాలు, ఫలాలు, రకరకాల రుచికర వంటకాలు హితకరం. విహారం (జీవనశైలి): వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నువ్వులనూనె వంటి వాతహర తైలంతో శరీరానికి మర్దనా చేసుకోవటం, నూనెతో కూడిన దూదిని తలమీద ఉంచుకోవటం మంచిది. వస, కరక్కాయ వంటి ద్రవ్యాల చూర్ణాలకు కొద్దిగా నూనె కలిపి నలుగు పెట్టుకుని, ఆ తరవాత అభ్యంగ స్నానం చేయాలి. (శరీరానికి సరిపడేలా వేడి నీళ్లు వాడుకోవాలి. అంటే సుఖోష్ణ జలస్నానం). వెచ్చదనం కోసం ప్రత్తి లేదా పట్టు (సిల్కు) వస్త్రాలను ధరించాలి. ఎండలో నుంచి సూర్యరశ్మి శరీరానికి అందేలా కొద్ది సమయం గడపాలి. కూర్చోవటం, పండుకోవటం కోసం వెచ్చని వస్త్రాలు ఉండాలి. గమనిక: ఎటువంటి పరిస్థితులలోనూ శీతల వాయువులకు గురి కాకూడదు. తలకు, శరీర భాగాలకు వెచ్చదనం కలిగించే దుస్తులు, ఇతర ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే భూమి లోపల కూడా చిన్న గదులు నిర్మించుకుని నివసించాలని వివరించారు. ఇటువంటి ఋతుచర్యలను ఆరు ఋతువులకు కూడా ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకు, ఓజో వృద్ధి కొరకు పేర్కొన్నారు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
మినుములు–వరి మితంగా తింటే సరి
ఆహార శాస్త్రం గురించి ఆయుర్వేదం నిశితంగా పరిశోధించింది. శరీర పోషణ కోసం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఆహారంగా వివరించింది. ఆహారాన్ని తినే విధానాన్ని బట్టి, ‘పాన (తాగేవి), చోష్య (చప్పరించేవి), లేహ్య (నాకేవి), భక్ష్య (నమిలి తినేవి) అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. వండక్కర లేకుండా సహజంగా ప్రకృతి ప్రసాదించే కందమూల ఫలాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి పానీయాలు ఒక రకం. కొత్త రుచులను కనిపెడుతూ మనం తయారుచేసుకునే తినుబండారాలు రెండవ రకం. వీటిని కృతాన్నాలు అంటారు. ప్రతి ద్రవ్యానికి ఉండే పోషక విలువలు, ఔషధ గుణాలను కూడా విశదీకరించింది. వరి, గోధుమలు మన దేశంలో ప్రధాన ఆహారం. వరి బియ్యం, మినుములకు సంబంధించిన వివరాలు.. వరి: క్షేత్ర బీజ ప్రాధాన్యత, పంటకాలం (ఋతువులు) ప్రాతిపదికగా రకరకాల ధాన్యాలు మనకు చాలా కాలంగా ఉన్నాయి. వాటి రుచులు, పోషక విలువలలో కూడా తేడాలు ఉన్నాయి. శాలిధాన్యం: కండనేన వినా శుక్లా హేమంతాః శాలయః స్మృతాః (భావ ప్రకాశ) హేమంత ఋతువులో సంక్రాంతి సమయంలో పంటకు వచ్చేవి, పైపొట్టు తీయబడి తెల్లగా ఉండే బియ్యం శాలిధాన్యం. ఈ గింజల రంగు, పరిమాణాలలో చాలా భేదాలున్నాయి. సామాన్య గుణధర్మాలు శాలయో మధురా స్నిగ్ధా బల్యా... వృష్యాశ్చ బృంహణాః.... మేధ్యాః చ ఏవ బలావహాః... ఈ అన్నం తియ్యగా జిగురుగా ఉండి, రుచికరమై, బలకరమై మలమూత్ర విసర్జనకు తోడ్పడుతుంది. మేధాకరం (బుద్ధిని వికసింపచేస్తుంది), శుక్రకరం. చలవ చేస్తుంది. కొత్త బియ్యం: వాపితేభ్యో గుణైః... రోపితాస్తు నవా వృష్యాః; పురాణా లఘవః స్మృతాః... (భావప్రకాశ) కొత్త ధాన్యం నుంచి వెంటనే ఆడించిన బియ్యంతో వండిన అన్నం కొంచెం బరువుగా ఉండి, అరుగుదల మందగిస్తుంది. పాతవైతే లఘుగుణం కలిగి, తేలికగా జీర్ణమవుతుంది. ఆధునిక శాస్త్రం రీత్యా: పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పిండి పదార్థాలు అధికంగా (78 శాతం) ఉంటాయి. ప్రొటీన్లు (6.8), కొవ్వు (0.5), ఐరన్ (0.7) ఫాస్ఫరస్ (160) శాతం ఉంటాయి. పొట్టుతో (తవుడుతో) కూడిన గోధుమ రంగు ముడిబియ్యంలో పిండి పదార్థాలు కొంచెం తక్కువగా ఉండి, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. కనుక తెల్లటి బియ్యం డయా»ñ టిస్ వ్యాధికి దోహదకారి. ముడి బియ్యాన్ని వండుకుని, మితంగా పరిమిత ప్రమాణంలో తింటే నష్టం ఉండదు. కాల్షియం, కాపర్, జింక్ వంటి లవణాలు కూడా లభిస్తాయి. మినుములు: వీటిని సంస్కృతంలో మాష అంటారు. ‘‘మాషో గురుః స్వాదుపాకః... అనిలాపః‘... శుక్రణో బృంహణః... మేదః కఫ ప్రదః... శూలాని నాశయేత్ (భావప్రకాశ) తియ్యగా రుచికరంగా ఉండే బరువైన ఆహారం. శరీర కొవ్వును బరువును పెంచుతుంది. విరేచనం సాఫీగా చేస్తుంది. శుక్రాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కొంచెం వేడి చేస్తుంది. ‘ఆర్శస్ (పైల్స్), అర్ధి్దత వాతం (ముఖంలో సగభాగానికి వచ్చే ప„ý వాతం), తమక శ్వాస (ఆయాసం), కడుపులోని పుండ్లు (అల్సర్స్)... వీటిని పోగొడుతుంది. బలహీనులకు మంచి ఆహారం. క్రమశిక్షణతో వ్యాయామం చేసేవారికి చక్కటి ఆహారం. ఇడ్లీ, డోసెలలో మినుములు, వరి బియ్యం ఉంటాయి. కనుక వీటి సత్ఫలితాలను పొందాలనుకుంటే, పరిమితంగా తింటే మంచిది. పైన ఉండే నల్లని పొట్టుతోబాటు మినుముల్ని వాడుకుంటే పోషక విలువలు బాగా లభిస్తాయి. ఆధునిక శాస్త్ర వివరాలు.. (100 గ్రా.లో ఉండే పోషకాలు, గ్రాములలో) పప్పు: ప్రోటీన్లు (24), కొవ్వు (1.4), పిండి పదార్థాలు (59.6), కాల్షియం (15.4), ఫాస్ఫరస్ (385), ఐరన్ (3.8). పొట్టుతో ఉన్న మినుములలో సోడియం, పొటాషియం.. ఇవి రెండూ శూన్యం. పొట్టు తీసిన పప్పులో సోడియం నూరు గ్రాములకి 39.8 మి.గ్రా. పొటాషియం 800 మి. గ్రాములు, ఇతర లవణాలు తగినంత లభిస్తాయి. గమనిక: తెలుగువారి వంటకాలలో గారె విశిష్టమైనది. దీనిని కేవలం మినుములతోనే చేస్తారు. కొందరు బియ్యాన్ని కూడా కలిపి నానిన తరవాత పిండి రుబ్బుతారు. దీనివలన నూనెలో వేగినప్పుడు నూనె ఎక్కువగా పీల్చదని పరిశీలన. పెరుగు వడ కూడా చేస్తుంటారు. తగురీతిలో వ్యాయామం చేస్తూ, ఇవి మితంగా సేవిస్తే ప్రయోజనం మెండు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
బెల్లం మధురౌషధం
ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు. మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)... ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం. చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. గుణాలు: తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది. (ఇక్షో రసో యస్సపక్వో జాయతే... సగుడౌ... వృష్యో గురుః స్నిగ్ధో వాతఘ్నో మూత్ర శోధనః‘ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః) కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్) పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం). లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్ పిత్తఘ్నో మధురో వృష్యో వాతఘ్నో అసృక్ ప్రసాదనః ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్)ని తగ్గించడానికి మంచి మందు. మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం. (మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా) ఆధునిక జీవరసాయన పోషక వివరాలు: తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు »ñ ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4, కొవ్వులు 0.1, మినరల్స్ 0.6 శర్కరలు (కార్బోహ్రైడ్రేట్స్) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64, కేలరీలు 383 ఉంటాయి. తయారీలో – ఆసక్తికర అంశాలు: రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్ (బేకింగ్ సోడా, కాల్షియం కార్బొనేట్/సున్నం పొడి, జింక్ ఫార్మాల్ డిహైడ్ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్థక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి. కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్ సుగర్లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
గోధుమ అవతారాలు
ఆయుర్వేదం ఆహారధాన్యాలను ఐదు రకాలుగా విభజించింది. శాలి, పష్టిక (వ్రీహి), శూక, శింబీ, తృణ. రంగు, రూపం, పరిమాణం, ఎంతకాలం లో పంట పండుతుంది వంటి అంశాలను బట్టి వీటికి నామకరణం చేసి, గుణధర్మాలను వివరించారు. యవలు, గోధుమలను శూక ధాన్యాలుగా వర్ణించారు. ఈ గింజలకు ఒక వైపు చిన్న ముక్కు ఆకారంలో సూదిగా ఉంటుంది. గోధుమలు: పరిమాణంలో కొంచెం పెద్దగా ఉన్నవాటిని మహా గోధుమలనీ, చిన్నగా ఉన్నవాటిని మథూలీ గోధుమలనీ, శూకము లేకుండా పొడవుగా ఉన్నవాటిని దీర్ఘ గోధుమలనీ అన్నా రు. వీటినే నందీముఖ గోధుమలని కూడా అంటారు. గుణాలు: (భావప్రకాశ): గోధూమో మధురః శీతో వాతపిత్తహరో – గురుః జీవనోబృంహణో, వర్ణ్యః, వ్రణరోపకః, రుచ్యః స్థిరకృత్’ – రుచికి తియ్యగా ఉంటాయి. కొంచెం జిగురుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతాయి. బరువు ఆహారం, బలకరం, శుక్రకరం, ధాతు పుష్టికరం, జీవనీయం, చర్మకాంతిని పెంపొందిస్తుంది. గాయాలను మాన్చటానికి ఉపయోగపడుతుంది. కొత్తగా పండిన గోధుమలు కఫాన్ని కలిగిస్తాయి, బరువైన ఆహారం. పాతబడిన గోధుమలు తేలికగా జీర్ణమై, శరీరంలోని కొవ్వుని కరిగించి, బరువుని తగ్గిస్తుంది. మెదడుకి మంచిది (మేధ్యము). నీరసాన్ని పోగొడుతుంది. శుక్రకరం కూడా. అడవి గోధుమల్ని ఆయుర్వేదం గవేధుకా అంది. ఇవి తీపితో పాటు కొంచెం కారంగా ఉంటాయి. కొవ్వుని, కఫాన్ని హరించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: గోధుమ పైపొరను బ్రాన్ అంటారు. లోపల జెర్మ్, ఎండోస్పెర్మ్ అనే పదార్థాలుంటాయి. గ్లూటెన్ అనే అంశ వలన గోధుమపిండి జిగురుగా ఉంటుంది. అన్నిటికంటె జెర్మ్లో ప్రొటీన్లు, కొవ్వు, పీచు, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భాగాలతో కూడిన గోధుమల్ని ఆహారంగా సేవించడం శ్రేష్ఠం. బ్రాన్లో పీచు అధికంగా ఉంటుంది. జెర్మ్ నుంచి మొలకలు తయారవుతాయి. గోధుమగింజలో ఎండోస్పెర్మ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ (శర్కర) మాత్రమే ఉంటుంది. ఇతర పోషకాలేవీ ఉండవు. 100 గ్రా. సంపూర్ణ గోధుమలో 346 కేలరీలు ఉంటాయి. బొంబాయి రవ్వ: ఇది మనం చేసుకునే ఉప్మాకు ప్రసిద్ధి. దీనిని సంపూర్ణ గోధుమను కొంచెం సంస్కరించి తయారుచేస్తారు కనుక పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. మైదా: ఇది అతి తెల్లని, అతి మెత్తని పిండి. దీనిని గోధుమలోని ఎండోస్పెర్మ్ని బ్లీచింగ్ చేయటం ద్వారా తయారుచేస్తారు. బ్రాన్, జెర్మ్లను సంపూర్ణంగా తొలగిస్తారు. కనుక మైదాలో ఎక్కువ సాంద్రతలో స్టార్చ్/శర్కర మాత్రమే ఉండటం వలన గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కనుక మధుమేహరోగులకు మంచిది కాదు. పీచు ఉండకపోవటం వలన మల బంధకం కలుగుతుంది. శరీర బరువును పెంచుతుంది. బ్లీచింగ్ చేయటం కోసం కలిపే కెమికల్స్ క్లోరిన్ బెంజాయిక్, కాల్షియం పెరాక్సైడ్, ఎంజోడై కార్బనమైడ్ ప్రధానమైనవి. ఎండోస్పెర్మ్ తో జరిపే రసాయనిక చర్య వలన ఎలోగ్సిన్ అనే మరో కెమికల్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేసి డయాబెటిస్ను కలిగిస్తాయి. పూరీలు, నిమ్కీన్స్, పునుగులు, చల్ల బూరెలు, బొబ్బట్లు, బ్రెడ్, రకరకాల కేకులు, సమోసాలు, పేస్ట్రీలు మొదలైనవి మైదా వంటకాలలో ప్రధానమైనవి. పాలకోవా, బర్ఫీలలో వ్యాపారార్థమై మైదాను కలిపేస్తారు. జాగ్రత్త: పై విషయాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవటం అవసరం. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
అనుదిన ద్రవ్యాలు అమోఘ గుణాలు
తెలుగువారి పండుగలు, ఆచారాలు, ధార్మిక సంస్కృతితో సమ్మిళితమై ఉంటాయి. దైవ కైంకర్యంలో నైవేద్యానిది ప్రధాన పాత్ర. చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర వంటి ప్రసాదాలు మనకు అతి సాధారణం. వీటన్నింటిలోనూ సామాన్య ద్రవ్యం ‘వరి అన్నమే’. ఇతర పదార్థాలలో నెయ్యి, బెల్లం/శర్కర; పెరుగు, నిమ్మకాయ/చింతపండు’ ప్రధానమైనవి. ఇవి మనకి అతి సామాన్యంగా కనిపిస్తాయే గాని వాటి పోషక విలువలు, గుణధర్మాలు అమోఘం. వీటి ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో సుస్పష్టంగా కనిపిస్తాయి. నెయ్యి ఘృతం, ఆజ్యం, సర్పి మొదలైనవి నెయ్యికి సంస్కృత పర్యాయపదాలు. ఆయుర్వేదంలో ఆవు నేతికి విశిష్టత ఉంది. గుణధర్మాలు: మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాత కఫ శ్యామకం, చలువ చేస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్త ధాతు పుష్టికరమై క్షమత్వ వర్థకం). లావణ, కాంతి, తేజోవర్థకం. ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిలపరుస్తుంది. ఆయు వర్థకం. మంగళకరం. కంటికి మంచిది. గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృషం, అగ్నికృత్.... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం ►ఆవు నెయ్యిని హోమం చేస్తే వచ్చే పొగ విషహరం, క్రిమిహరం, వాతావరణ కాలుష్య హరం. ►ఆవు పెరుగు: కొంచెం పులుపు. ఎక్కువ తీపి కలిగితే రుచిలో నుంచి ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి, గుండెకు కూడా శక్తినిస్తుంది. నాడీవ్యవస్థను పటిష్ఠపరుస్తుంది (వాత హరం). అందువలననే దీనిని చాలా పవిత్రమని వర్ణించారు. గవ్యం దధి విశేషేణ... రుచిప్రదం, పవిత్రం, దీపనం, హృద్యం, పుష్టికృత్, పవనాపహం... గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన బరువైన ఆహారంగా చెప్పబడింది. కఫకరం, స్రోతస్సులలో అవరోధం కలిగిస్తుంది. రక్తాన్ని దూషిస్తుంది. శుక్రకరం. రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). పెరుగును వేడి చేయకూడదు. మితిమీరిన పరిమాణంలో పెరుగును సేవించకూడదు. బెల్లం చెరకు రసం నుంచి తయారుచేసిన బెల్లం తియ్యగా, జిగురుగా ఉండి శుక్రవర్థకంగా ఉపకరిస్తుంది. దేహంలో కొవ్వుని పెంచుతుంది. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది కాని శర్కరంత చలువచేయదు. బలవర్థకమే కాని, కఫాన్ని క్రిములను పెంచుతుంది. పాతబెల్లం (పురాణ గుడం) చాలా మంచిది (పథ్యం). వేడిని తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. (కాని ఈనాడు బెల్లం తయారీలో చాలా కెమికల్స్ని కలిపి, కల్తీ చేస్తున్నారు. ఇది హానికరం). శర్కర ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన శర్కర చాలా విశిష్టమైనది. దాని తయారీ వేరు. ఈనాడు చేస్తున్న పంచదార తయారీలో పోషక విలువలు శూన్యం. పరిపూర్ణంగా కెమికల్స్ మయం. చాలా అనర్థదాయకం. చింత చింతకాయ చక్కటి పులుపు కలిగి వాతహరంగానూ, కించిత్ పిత్తకఫాలను పెంచేదిగానూ ఉంటుంది. బరువుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతుంది. పక్వమైనది (చింత పండు) ఆకలిని పెంచి, విరేచనం సాఫీగా అవటానికి సహకరిస్తుంది (సుఖరేచకం). ఉష్ణవీర్యమై వాతకఫహరంగా ఉంటుంది. ‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి. చింతకాయ/పండునకు సంస్కృత పర్యాయపదాలు నిమ్మ నింబు, జంబీర అను పర్యాయపదాలున్నాయి. కఫవాత శ్యామకం. దప్పికను తగ్గిస్తుంది. (తృష్ణాహరం). రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూత్రకరం. జ్వరహరం. కంఠవికారాన్ని తగ్గిస్తుంది. నేత్రదృష్టివర్థకం. బాగుగా పరిపక్వమైనది (పండు) వాడుకుంటే మంచిది. ఇంగువ (హింగు) ఉష్ణవీర్యం, ఆహారపచనం బాగా చేస్తుంది. కడుపునొప్పి, కడుపులోని వాయువు, క్రిములను పోగొడుతుంది. వాతకఫహరం. పసుపు (నిశా, హరిద్రా) ఇది కడుపులోకి సేవించినా లేక బయటపూతగా వాడినా కూడా క్రిమిహరం. రక్తశోధకం, జ్వరహరం, మధుమేహ హరం. శరీర కాంతిని పెంచి చర్మరోగాలని దూరం చేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
తియ్య గుమ్మడి తిని తీరాలి
సనాతన భారతీయ వైద్యమైన ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, పువ్వులు, మూలికల పోషక విలువలు, ఔషధ గుణాల గురించి ప్రాచీన ఆచార్యులు వివరించారు. పచ్చి మిరప, టొమాటో వంటి కొన్ని ద్రవ్యాలు మాత్రం మన దేశపు పురాతన పంటలలోకి రావు. అవి విదేశాల నుండి మనకు సంక్రమించినవే. ‘తియ్య గుమ్మడి’ కూడా అలాంటిదే. దక్షిణ అమెరికా దీనికి కాణాచి. మన దేశానికి ఇది అక్కడి నుంచి వలస వచ్చినదే. బూడిద గుమ్మడి (కూష్మాండ), కర్బూజ (కూష్మాండీ), త్రపుస (దోస) మొదలైనవి మన దేశపు వారసత్వ శాకఫలాలే. అయితే ‘కూష్మాండీ’ ని తియ్య గుమ్మడి జాతి భేదంగా పరిగణించారు మన ప్రాచీన శాస్త్రజ్ఞులు. కూష్మాండీ: దీనికే ‘కర్కారు’ అనే పేరుంది. వృక్షశాస్త్రంలో దీని పేరు ‘కుకుర్బిటా మేక్జిమా’, ‘పెపా’. ఇది దేహాన్ని చల్లబరచి (శీతలం) రక్త స్రావాలని అరికడుతుంది (రక్తపిత్తహరం). బాగా పండినదైతే కొంచెం ఉప్పగా, చిరు చేదుగా ఉంటుంది. పుష్టికరం. ఆకలి కలిగిస్తుంది (అగ్నిదీపకం). కఫవాత రోగాల్ని తగ్గిస్తుంది. భావప్రకాశ: ‘‘కూష్మాండీ... కర్కారుః... శీతా రక్తపిత్తహరా, గురుః , పక్వా తిక్తాగ్ని జననీ సక్షారా కఫవాతనుత్’’ తియ్య గుమ్మడి: ఇది శీతాకాలంలో అధికంగా లభిస్తుంది. దీనిని కాయగానూ, పండుగానూ కూడా పిలుస్తుంటారు. భారతీయ వివాహాలలో దీనికి మంగళప్రదమైన స్థానం ఉంది. మన నిత్య వంటకాలలో దీనిని కూరగా వండుతుంటారు (నువ్వుల పొడి కూర, మెంతి పొడి కూర మొదలైనవి). పులుసులో ముక్కలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పండులోని గింజలను... పై పొరను తొలగించి తినటం ఆనవాయితీ. కృశించినవారికి బలకరం. ఎక్కువగా బరువున్న వారికి (స్థూలురకు) కొవ్వు కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: 100 గ్రాముల తియ్య గుమ్మడిలో 7 గ్రా. పిండిపదార్థాలూ, 1 గ్రా. ప్రొటీన్లూ, 0.1 గ్రా. కొవ్వులూ ఉంటాయి. 26 కేలరీలు ఉంటాయి. సోడియం, కొలెస్టరాల్ చాలా నామమాత్రంగా ఉంటాయి. ‘విటమిన్ – ఎ’ (170 శాతం), విటమిన్ సి (15 శాతం), బి – 6 (5 శాతం), క్యాల్షియం (20 శాతం), ఐరన్ (4 శాతం) మెగ్నీషియం (3 శాతం) లభిస్తాయి. కాపర్, మెగ్నీషియం కూడా కొద్దిగా లభిస్తాయి. విటమిన్ – ఇ, ఫోలేట్స్, ఒమేగా – 3 ఫాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. స్టార్చ్ అధికం. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ప్రయోజనాలు: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. కంటి ఆరోగ్యానికి, చర్మ కాంతికి, గుండె బలానికి దోహదకారి. అధిక బరువుని తగ్గించటానికి ఉపయోగకరం. కాన్సరు వంటి క్లిష్టమైన వ్యాధులను నివారించటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించటానికి ఉపకరిస్తుంది. ఇది ఎంత తిన్నా మంచిదే. నూటికొక్కరికి సరిపడక ఎలర్జీలు కలిగించవచ్చు. అలాంటివారు దీనిని తినకూడదు గాని, దీనిని ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యకరం. దీనిని పండ్లు తినే రీతిలో పచ్చిగా తినరు. వండుకుని కూరగాను, పులుసులో ముక్కలుగా (ఉడికించి) ను సేవించాలి. చిన్న మాట నిమ్మచెక్కతో చాలా వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. కూరలు తరిగిన ప్లాస్టిక్ బోర్డు మీద అలాగే డైనింగ్ టేబుల్ మీద నిమ్మ చెక్కతో రుద్ది, పదిహేను నిమిషాల తరవాత కడిగితే మురికితో పాటు క్రిములు కూడా మటుమాయం అవుతాయి. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
పొట్లకాయ పుష్టికరం
అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకైనా, వ్యాధి చికిత్సకైనా ఔషధం కన్నా ఆహారవిహారాలకు అధిక ప్రాధాన్యం ఉంది. మూలికా ద్రవ్యాలతో బాటు ఆహార పదార్థాలను కూడా విశ్లేషిస్తూ ‘భావమిశ్రుడు’ ఒక సంహితనే రూపొందించాడు. ∙‘....చిచిండో వాత పిత్తఘ్నో బల్యః పథ్యో రుచి ప్రదః‘ శోషణోతి హితః కించిత్ గుణైః న్యూనః పటోలతః‘‘ పొట్లకాయ సంస్కృత నామం ‘చిచిండః’. దీనికే ‘సుదీర్ఘ, గృహకూలక, శ్వేతరాజి మొదలైన పర్యాయ పదాలున్నాయి. వృక్షశాస్త్రపు పేరు Trichosanthes cucurmerina మరియుT. Anguina. ►ఇది శరీరానికి మిక్కిలి బలకరం, పథ్యం (హితకరం), రుచికరం. కొవ్వును కరిగించి బరువుని తగ్గిస్తుంది. వాతపిత్త దోషాలను పోగొట్టి మేలు చేస్తుంది. ►చేదు పొట్ల (పటోల) అనే మరొక శాకం ఉంది. దీనిని ఔషధంగా మాత్రమే వాడతారు, ఆహారంలో ఉపయోగించరు. పైన చెప్పిన గుణ ధర్మాలు దీనికి మరీ అధికంగా ఉంటాయి. ►దీని ఆకులు, వేళ్లు, కాయలోని గింజలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ►పొట్లకాయను కోడిగుడ్డుతో కలిపి తింటే వికటిస్తుందని కొన్ని ప్రాంతాలవారి నమ్మకం. ఆధునిక శాస్త్ర విశ్లేషణ పొట్లకాయలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు తగుపాళ్లలో ఉంటాయి. కొలెస్ట్రాల్ శూన్యం. పొటాషియం అధికంగా (359 శాతం), సోడియం తక్కువగా (33 శాతం) ఉంటుంది. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి అంశాలు తగినంత లభిస్తాయి. నీరు అధిక శాతంలో ఉంటుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నొప్పులు, వాపులు తగ్గటానికి ఉపకరిస్తుంది. జీర్ణాశయ కృత్యాల్ని పెంపొందించి దేహపుష్టి కలిగిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహ వికారాలలో గుణకారి. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. బరువును తగ్గించడం, నిద్ర కలిగించే గుణాలు ఉన్నాయి. ►విటమిన్ ఎ, బి 6, సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి. ►పొట్ల కాయల రసాన్ని తల మీద పైపూతగా రాస్తే, చుండ్రు తగ్గి కేశవర్థకం గా పనిచేస్తుంది. చర్మకాంతిని మెరుగు పరుస్తుంది. ►తేలికగా జీర్ణమై నీరసం తగ్గిస్తుంది కనుక ఎటువంటి అనారోగ్యం ఉన్నవారికైనా ఇది పథ్యంలా పనిచేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
డాక్టర్ సారంగపాణికి మలేసియా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మలేసియాలో జరిగే వర్మ, ఆయుర్వేద, సిద్ధ, యోగా అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన డాక్టర్ ఎస్. సారంగపాణికి దక్కింది. ఈ మేరకు మలేసియా సొసైటీ ఆఫ్ ఆయుష్ మెడిసిన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సెలంగొర్లోని మహసా యూనివర్సిటీలో ఈనెల 6 నుంచి 8 వరకు జరిగే సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ఆయుర్వేదం ద్వారా అందిస్తున్న వివిధ చికిత్సా పద్ధతులు, వాటి ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనల పురోభివృద్ధి గురించి ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగాలు ఉంటాయి. ఆయుర్వేదంలో సుశృతునిచే చెప్పబడిన క్షారసూత్ర, క్షార కర్మ, రక్తమోక్షణ, జలగ చికిత్సలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా ఎలా నిరూపించబడ్డాయో ప్రపంచ దేశాలకు వైద్యులకు తెలియజేసే అవకాశం ఈ సదస్సు ద్వారా కలుగుతుందని డాక్టర్ సారంగపాణి అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభం ఉన్న ఆయన డాక్టర్ బీర్ఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం సీసీఐఎం ఎడ్యుకేషన్ కమిటీకి గతంలో మార్గదర్శకుడిగా, వైస్ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. -
ఆదివాసీల స్థితిగతులపై పరిశోధన
సాక్షి,ఆదిలాబాద్రూరల్ : మండలంలోని చించుఘాట్ గ్రామంలో ఆదివాసీల స్థితిగతులు, ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లపై మధ్యప్రదేశ్లోని అమరకంఠన్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రొఫెస ర్లు ఆదివారం పరిశోధన చేశారు. ఆదివాసీల జీవన విదానం, తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రానురానూ గోండి భాష కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. పుట్టుక నుంచి చావు వరకు దేవతలను పూజించడం, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన పాటలు, తదితర వాటిని రికార్డింగ్ చేసుకున్నామని ప్రొఫెసర్లు వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ల బృందంలో వినయ్కుమార్ తివారీ, బిరేంద్ర ప్రతాప్సింగ్, సౌరభ్ కుమార్, హేమంత్రావు, గ్రామ పెద్దలు లింగు, అనిల్కుమార్, బిపిన్కుమార్, హర్షన్రావు, తదితరులు ఉన్నారు. -
పాలు – మురిపాలు
సంస్కృతి సాంప్రదాయాలకు, సనాతన సదాచారాలకు భారతావని కాణాచి అనే విషయం జగద్విదితం. ఆహార ద్రవ్యాలలోను, పవిత్ర పూజా ప్రక్రియలలోను ‘పాలు’ ప్రధాన పదార్థం. గోమాతకు దైవత్వం సిద్ధించడానికి ముఖ్య కారణం గోక్షీరపు విశిష్టతే. ఆయుర్వేద పరిభాషలో ఏ విశేషణమూ వాడకపోతే క్షీరం అంటే గోక్షీరమే. తైలం అంటే నువ్వుల నూనే. అదేవిధంగా నవనీతం, ఘృతం (వెన్న, నెయ్యి) కూడా ఆవు పాలకు సంబంధించినవే. నవ జాత శిశు పోషణలో మాతృ స్తన్యం తర్వాత అతి ముఖ్య పాత్ర మేక, ఆవు పాలదే. ఎన్నో ఓషధుల్ని శుద్ధి చేయటానికి ఆవు పాలను వాడతారు. అన్ని వయసుల వారికీ ఆవు పాలు ఉత్తమ రసాయనంగా (సప్తధాతు పుష్టికరంగా) ఉపకరిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. తద్వారా ఓజోవర్థకంగా పనిచేస్తాయి. ఆవుపాల గుణగణాలు: (సుశ్రుతుడు)‘‘స్వాదు శీతం మృదు స్నిగ్ధం బహలం శ్లక్ష్య పిచ్ఛిలంగురు మందం ప్రసన్నం చ గవ్యం దశ గుణం పయః’’(చరకుడు): ‘‘తదేవ గుణమేవ ఓజః సామాన్యాత్ అభివర్థయేత్ ప్రవరం జీవనీయం క్షీర ముక్తం రసాయనం’’చిక్కగా, జిడ్డుగా, మృదువుగా ఉంటాయి. (గేదె పాలతో పోలిస్తే పలచగా ఉంటాయి). తియ్యగా ఉండి, శరీరానికి చలవ చేస్తాయి. ఆలస్యంగా జీర్ణమై, ఆకలిని తీర్చి, మనసుకి ప్రసన్నంగా, బలవర్థకంగా పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జీవనీయ’ గుణ ప్రధానంగా ఉంటాయి. వాత హరంగా, పిత్త హరంగా, ఉండి, రక్త స్రావాలను అరికట్టే లక్షణం కలిగి ఉంటుంది. తక్షణ శుక్రకరం, వీర్య వర్థకం. గేదె పాలు: ‘మహీషీణాం గురుతరం గవ్యాత్, శీతతరం పయ: స్నేహాన్యూనం అనిద్రాయ హితం అత్యగ్నియేచ తత్’’ఆవు పాల కంటె అధిక గుణాలు కలిగి, నిద్రాజనకంగా పనిచేస్తాయి. అత్యాకలిని అరికట్టి తృప్తినిస్తాయి. మేక పాలు: (చరకుడు) ‘‘ఛాగం కషాయం మధుర శీతం గ్రాహి పయాలఘురక్తపిత్త అతి సారఘ్నం క్షయ కాస జ్వరాపహం’’ (చరకుడు)తీపితో పాటు కొంచెం వగరుగా ఉండి తేలికగా జీర్ణం అవుతాయి. రక్త స్రావం, విరేచనాలు, దగ్గు, జ్వరాలను అరికడతాయి. గాడిద పాలు (భావ మిశ్రుడు):శ్వాస వాతహరం స అమ్లం లవణం, రుచి దీప్తి కృత్కఫకాస హరం, బాల రోగఘ్నం గార్ధభీ పయఃదీనికి ఔషధ గుణాలు ఎక్కువ. వయసుని బట్టి పావు చెంచా నుండి ఐదు చెందాల వరకు మాత్రమే సేవించాలి. వాతహరంగా పని చేసి ఉబ్బసం వంటి ఆయాసాలను తగ్గిస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. శిశువులకు కలిగే అన్ని రోగాలకూ ఇది ఉత్తమ ఔషధ తుల్యం.ఈ విధంగా ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు శరీర పోషణకు ఉపకరిస్తాయి. నేరుగా పాలు తాగటం, పాయసాలు తయారు చేయటం, శాకపాకాలలో వాడటం వంటి వివిధ పద్ధతుల్లో సేవిస్తుంటాం. గాడిద పాలను కేవలం ఔషధ పరంగా వాడుతుంటాం. పాల మీగడ చాలా ఎక్కువ స్నిగ్ధంగా ఉండి, అతి చిక్కగా, మృదువుగా గురుతరంగా శరీర పోషణకు ఉపకరిస్తుంది. పెరుగును చిలకడం ద్వారా వెన్న లభిస్తుంది. దీనినే సంస్కృతంలో నవనీతం అంటారు. అతి మృదువుగా ఉండి, కొవ్వుని కరిగించే గుణం కలిగి ఉంటుంది. అందుకే ఇది స్థౌల్య హరం. అంటే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. వెన్నను మరిగించి నెయ్యి (ఘృతం) తయారు చేస్తారు. ఇది అగ్నివర్ధకం. పిత్తహరం. గమనిక: పచ్చ గడ్డి, తెలగ పిండి, చిట్టు, తౌడు, ఆహారంగా సేవించే దేశీ ఆవుల పాలు, వాటి ఉత్పత్తులు మాత్రమే ఆరోగ్యకరమని గుర్తుంచుకోవాలి. ఈనాడు జెర్సీ ఆవులు, వాటికి ఇచ్చే విచిత్ర ఆహారాలు, అధిక పాల కోసం వాటికి ఇచ్చే కెమికల్ ఇంజక్షన్లు... వీటి వల్ల పేరుకి ఆవు పాలైనా అనర్థాలే అధికం అని శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కనిపిస్తోంది. ఆధునిక జీవ రసాయనిక శాస్త్రం రీత్యా:పాలు మంచి బలవర్థక సమీకృత ఆహారం. ఇందులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు సమతుల్యంగా ఉంటాయి. డి, బీ 12, బీ6, బీ2 విటమిన్లు లభిస్తాయి. ఎ, డీ లు కూడా కొంతవరకు లభిస్తాయి. సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియమ్లు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలకు, ఇతర ధాతువులకు బలాన్ని కలుగచేస్తాయి. స్థూలకాయులు, మధుమేహ రోగులు కూడా పాలు సేవించవచ్చని, చెడు కాదని పరిశోధకుల పరిశీలన. ఒకవేళ పాలలోని లాక్టోజు ( ్చఛ్టిౌట్ఛ) పడకపోతే మాత్రం వాంతులు, విరేచనాల వంటివి కలుగుతాయి. వైద్యుని సంప్రదించడం, పాలు సేవించడం మానెయ్యటం వంటి జాగ్రత్తలు అవసరం.గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య సారాంశం:భూరి రసధాతు సారంబె క్షీరమనగశుభము బల్యంబు మేధ్యంబు శుక్రకరముసప్తధాతు పుష్టికర రసాయనంబుదేశియావు పాలకు సదా తిరుగు లేదు.పాల మీగడ వెన్నలున్ పరమ బలముకూర్మి సేవింప నవనీత గుణము జూచిస్థూలకాయంబు తగ్గును శోష లేకభతర భూమికి గోమాత వరము సుమ్ము! డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
ఆయుర్వేద వైద్యం.. అంతులేని నిర్లక్ష్యం !
నాలుగేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాలను చేసినట్లే వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఆస్పత్రి.. అదే నవ్యాంధ్రలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి... విజయవాడలోని ఆచంట ఆయుర్వేద ఆస్పత్రి. మందుల కొరత, అరకొర సౌకర్యాలు, వైద్యుల లేమి వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఏడాదిన్నర కిందట బందరు కాలువ ఒడ్డున ఉన్న కళాశాలను ఖాళీ చేయాలంటూ ఇరిగేషన్ శాఖనోటీసులు ఇవ్వగా, ప్రత్యామ్నాయంపై పాలకులు దృష్టి సారించడం లేదు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశీయ ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదానికి పూర్వ వైభవం తీసుకు వస్తామంటున్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ఆయుర్వేద కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించలేని దుస్థితి నెలకొంది. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధన చేసేందుకు సైతం ప్రొఫెసర్లు అందుబాటులో లేని దుస్థితి. ఈ విషయమై అనేక మార్లు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రులు బందరు కాల్వ ఒడ్డున ఉండటంతో వాటిని ఖాళీ చేయాలని ఏడాది కిందట ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక కళాశాల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం వరంగల్, హైదరాబాద్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రానికి చెందగా, విజయవాడలోని నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల ఒక్కరే నవ్యాంధ్రలో మిగిలింది. దానికి అనుబంధంగా ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాలలో ప్రతిఏటా బీఏఎంఎస్లో 60 సీట్లు భర్తీ చేస్తుండగా, పోస్టు గ్రాడ్యుయేషన్ నాలుగు విభాగాల్లో 20 మంది చేరుతున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అరకొర సౌకర్యాలు.. ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రికి నిత్యం 150 నుంచి 200 మంది అవుట్పేషెంట్స్ వస్తుంటారు. మరో 60 నుంచి 80 మంది వరకూ ఇన్పేషెంట్స్ చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవలు అందించేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. నాల్గవ తరగతి ఉద్యోగులు, స్టాఫ్నర్సులు ఉద్యోగ విరమణ చేస్తుండగా, కొత్తవారిని పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత నెలకొంది. రోగులకు సేవలు అందించేందు సిబ్బంది లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు బయటే.. ఆయుర్వేద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు రక్తపరీక్షలు అవసరమైతే బయటే చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని లేబొరేటరీ అలంకారప్రాయంగానే ఉండడంతో పరీక్షలన్నీ వైద్యులు బయటకే సిఫారసు చేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో పేద రోగులు వందలాది రూపాయలు చెల్లించి పరీక్షలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఫార్మశీ తెలంగాణకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో మందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులు బయటకే రాస్తున్నారు. మందులు లోకల్గా కొనుగోలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా లేకపోవడంతో ఏమి చేయలేని దుస్థితి నెలకొంటుంది. కళాశాలను అభివృద్ధి చేయాలి నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆయుర్వేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. నాల్గవ తరగతి సిబ్బందిని భర్తీ చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలి. ఆయుర్వేద ఫార్మశీని ఏర్పాటు చేసి, మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆయుర్వేద కళాశాల ఏర్పాటు, వన మూలికలు, పరిశోధనలకు ప్లాంటేషన్ అభివృద్ధికి ఐదెకరాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. పంచకర్మ వైద్యానికి మంచి డిమాండ్ వున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆ విభాగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, నిపుణులైన సిబ్బందిని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం వుంది. – డాక్టర్ మెహబూబ్ షేక్, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు -
ఆరోగ్య ధన్’వంతరి
ఆయుర్వేదంలో ఎవరైనా మంచి హస్తవాసి గల వైద్యులుంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు. ఆయుర్వేదమనే కాదు, వైద్యులందరూ కూడా ధన్వంతరికి వారసులేననడంలో తప్పులేదు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. ప్రస్తుతం దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకుంటున్న ధన్తేరస్ పండుగలో ధన్ అనేదానికి ధనమనే చెప్పుకుంటున్నాం కానీ, «నిజానికి అది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరిని సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశగా చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ధన్వంతరి పేరుతో అనేక వైద్య, సేవాసంస్థలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో తెలుసుకుందాం.. దేవతలూ, రాక్షసులూ కలసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం ఉద్భవించింది. లోకాలను దహించివేసే ఆ హాలాహలాన్ని ఉండగా చేసుకుని, పరమేశ్వరుడు దానిని భక్షించి, గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని, విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. అప్పటినుంచి దేవవైద్యుడు ఆయనే. ఆయుర్వేదానికి, సమస్త ఔషధాలకు మూలపురుషుడు ఆయనే. లక్ష్మీదేవి, ధన్వంతరి ఒక్కరోజే ఉద్భవించినప్పటికీ, ధన్వంతరి విషయం ఎవరూ అంతగా పట్టించుకోరు. ఎందుకంటే, ఆరోగ్యం కన్నా, అందరికీ ధనమే ముఖ్యం అయిపోయింది కదా మరి! అందుకే ధన్తేరస్ నాడు కేవలం లక్ష్మీపూజ... అదీ కాదు... విలువైన వస్త్రాభరణాలు, ఖరీదైన వస్తుసామగ్రుల కొనుగోలులో మునిగి తేలుతుంటారు. లక్ష్మీపూజ చేయడంలో, వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడంలో తప్పు లేదు కానీ, ఆరోగ్యం కూడా సంపదే! అందుకే కదా, అష్టలక్ష్ములలో ఆరోగ్యం కూడా లక్ష్మీస్థానం సంపాదించుకుంది. కనీసం ఈ విషయం తెలిస్తే అయినా ఈ పర్వదినాన వైద్యనారాయణుడైన ధన్వంతరిని స్మరించుకుంటారని... – డి.వి.ఆర్. -
’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’
సిద్ధిపేట: ఆయుష్ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతి-జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన టీఎన్జీవోస్ భవనంలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అల్లోపతి వైద్యానికి దీటుగా ఆయుష్ వైద్యాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నదని చెప్పారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొనారు. -
ఆయుర్వేదం అన్నాడు.. అల్లోపతి ఇస్తున్నాడు!
►అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి ►నర్సింగ్హోం సీజ్, నిందితుడి అరెస్ట్ కౌడిపల్లి: ఆయుర్వేద డాక్టర్ అని చెప్పుకుంటూ.. అల్లోపతి వైద్యం చేస్తున్న వ్యక్తి కటకటాలపాలయ్యాడు. గతంలో రెండుసార్లు ఇతగాడి ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసినా.. దర్జాగా మరోచోట దందా నడిపిస్తున్నాడు. కౌడిపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు... కౌడిపల్లిలోని అందుగులపల్లికి చెందిన సుధాకర్ కొన్నాళ్లుగా శ్రీనివాస మమత నర్సింగ్హోంను నిర్వహిస్తున్నాడు. అయితే, ఇక్కడ ఎక్కువగా అపెండిక్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని డీఎం అండ్ హెచ్ఓ బాలజీపవర్కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన పోలీసులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డాక్టర్గా చలామణి అవుతున్న సుధాకర్కు ఎలాంటి విద్యార్హతలు లేవని గుర్తించారు. నర్సింగ్హోంకు వస్తున్నట్టు చెబుతున్న ఎంబీబీఎస్ డాక్టర్ నాగరాజు ఎప్పడూ ఆస్పత్రికి రాలేదని, అతనికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా లే వని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్లో ట్రాక్టర్ పరికరాలు ఉండటంతో వారు ఖంగుతిన్నారు. పోలీసులు ఆస్పత్రిని సీజ్చేసి నిందితుడిని అరెస్టుచేశారు. -
ఆయుర్వేదానికి జన్యు ఆధారం!
సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడి సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వెల్లడించారు. ఈ విషయంపై సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ ఆవిష్కరణ వ్యక్తిగత వైద్య చికిత్సా విధానానికి మార్గం సుగమం చేస్తుందని.. భారతీయ సంప్రదాయ వైద్యవిధానంపై మరిన్ని పరిశోధనలు జరిగేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. ఈ ప్రపంచం, ప్రాణికోటి పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయని సనాతన భారతీయులు నమ్మేవారని, ఆయుర్వేదంలోని మూడుదోషాలు కూడా వీటి మధ్య సమతౌల్యానికి సంబంధించిందేనని మోహన్రావు పేర్కొన్నారు. అత్యాధునిక పద్ధతులలో పరిశీలించి.. త్రిదోషాలు కేవలం అంచనా మాత్రమేనా లేదా కణస్థాయిలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకే తాము ఈ పరిశోధన చేపట్టామన్నారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు. వీరి జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు దాదాపు 52 జన్యువుల్లో నిర్దిష్టమైన తేడాలు ఉన్నట్లు తెలిసిందని మోహన్రావు వెల్లడించారు. జీర్ణక్రియతోపాటు మెటబాలిజమ్ (జీవక్రియ)లో పీజీఎం1 జన్యువు పాత్ర ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపితమైందని... పిత్తదోష ప్రభావమున్న వారిలో ఈ జన్యువు చురుకుగా పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎం.ఎస్.వలియత్తన్, ఇతర శాస్త్రవేత్తలు కొందరు త్రిదోషాలకు, జన్యుక్రమానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారని... అందుకు తగ్గట్టుగా సీసీఎంబీ నేతృత్వంలో తాము ఆరేళ్ల క్రితం ఈ పరిశోధన చేపట్టామని ఆయన వివరించారు. మణిపాల్ యూనివర్సిటీ, ఉడిపిలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆయుర్వేద కళాశాల, పుణెలోని సిన్హద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరుకు చెందిన ఫౌండేషన్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్స్, యూనివర్సిటీ ఆఫ్ పుణెలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నట్లు వివరించారు. -
అడకత్తెరలో ఆయుర్వేదం
డా. వీఎల్ఎన్ శాస్త్రి అనేకమైన మొండిరోగాల ఆటకట్టించాలం టే ఆయుర్వేదం అవసరం. ఏ వ్యాధినీ దరికి రానీయకుండా వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకొంటూ, ఓజస్సును సంతరిం చుకుంటూ, అఖండమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వే దం తప్ప వేరే మార్గం లేదంటే అతిశయోక్తి కానేకాదు. ‘వాతావరణ (పంచమహాభూతాల) కాలుష్యం, తిండిపదార్థాల కల్తీ, మానసిక ప్రశాంతతను మట్టుపెడు తున్న ఒత్తిడి, గతి తప్పిన జీవనశైలి నేటి ప్రధాన సామాజిక సమస్యలు. ఇవన్నీ మానవుని ‘ప్రజ్ఞాపరాధం’ ఫలి తమేనని చెబుతూ వాటికి సరైన సమాధానాల్ని పొందుపరిచింది ఆయుర్వేదం. ఇంతటి మహత్తర సనా తన శాస్త్రాన్ని సమగ్రంగా అధ్య యనం చెయ్యాలంటే, 5 1/2 సంవత్సరాల బీఏఎంఎస్ కోర్సు, 3 ఏళ్ల ఎండీ కోర్సు అవసరమని నిర్ణయించింది. ‘భారతీయ వైద్య కేంద్ర మండలి (సీసీఐఎం). ఈ కోర్సులను నడిపే కళాశాల, ఆసుపత్రి ఒకదానికొకటి దగ్గరగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటేనే, సరైన ప్రమాణాలతో కూడిన ఆయుర్వేద వైద్యులు ఉత్పన్నమవుతారు. అట్టి ఆసుపత్రులు లేని కళాశాలలు ‘వేద పాఠశాలల’తో సమానమవు తాయే తప్ప ప్రజాసేవకు పనికొచ్చే ‘ఆయుర్వేద కళాశాలలు’ కానేరవు. గత పదిహేనేళ్లుగా ‘రాష్ట్ర ప్రభుత్వపు ఆయుష్’ విభాగం ఎంతో సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘దినదినగండం దీర్ఘాయుష్షు’గా కాలం గడుపుతోంది. ఇంకా వెనుకకు వెళితే హైదరాబాద్లో గల డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు, బోధనా ఆసుపత్రికి సొంత భవనాలు లేక, స్వయం ప్రతిపత్తిలేక, విల విలలాడిన విషాదగాథలున్నాయి. ఈ కళాశాల ఇంతవరకు కనీసం 30-40 అద్దె భవనాలు మార్చిందన్నది నగ్న సత్యం. ఎట్టకేలకు దివం గత సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి హయాంలో కొంత ఉపశమనం లభించింది. ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు పది ఎకరాల స్థలం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి నిర్మా ణానికి కేటాయించారు. మాకు జాగా దక్కింది కాని కట్టడాలకు నిధుల కొరత అలానే ఉంది. అప్పుడు కేంద్ర సహాయాన్ని కోరుతూ కాళ్లరిగేలా తిరిగాం. అరకొరగా ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర నిధులను కలుపుకుంటూ ఇప్పుడు కన్పిస్తున్న భవనాలను నిర్మించుకున్నాం. అదీ ఒక్కసారి గాదు దఫదఫాల్లో. అయినప్పటికీ కావాల్సిన సంఖ్యలో వైద్యులు, అధ్యా పకులు లేరంటూ, అడ్మిషన్లకు అనుమతి నిరాకరిస్తూ, ప్రతి సంవత్సరం తాఖీదులు జారీ చేస్తూనే ఉంది కేంద్ర మండలి. నేటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల 20 సంవత్సరాల్లో ఆయుర్వేద కాలేజీకి, ఆస్పత్రికి ఒక సొంత భవనం, అదీ ఒకే ప్రాంగణంలో ఉండబట్టి, కొంత వరకు ప్రజా దరణకు నోచుకుంటోంది. ప్రభుత్వం దృష్టిలో ఆలోచిస్తే, ‘ఏముంది? ఇక్కడి నుంచి, ఇంకోచోటుకి మారుస్తున్నాం. వేరే భవంతులిస్తాం, మీకా హక్కుంది కదా’ అంటారు. వాదనకు ఇది బాగున్నా, క్రియాశీల కంగా ఆయుర్వేదం దెబ్బతింటుంది. కళాశాలని నడపటం కష్టమవు తుంది. అలవాటుపడ్డ ఆసుపత్రి సేవల్ని ప్రజలకందిస్తూ గాడిలో పడ టం ఇబ్బందవుతుంది. కారణం ఇది వృత్తి విద్యాకళాశాల, అందులోనూ ఆస్పత్రితో సంబంధం ఉన్న విద్య. గత 50 ఏళ్లలో ఎంతో మంది ఆయుర్వేద ప్రభుత్వ వైద్యాధికారు లు, ఆయుర్వేద అభిమానులు, ప్రజాప్రతినిధులు, ఆయుర్వేద సేవా సంఘాలు సమష్టిగా చేసిన పెద్ద కృషికి దక్కిన చిన్న ఫలితమే ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల. వికసించే పథంలో ఉన్న మొగ్గల్ని కత్తిరిం చవద్దు. ఆయుర్వేద కుసుమాలను వికసింపనీయండి. అలాగే పక్కనే ఉన్న యునానీ సౌధాన్ని కూడా పరిరక్షించండి. దానిమీదకు కూడా దృష్టి పోనీయకండి. ఎర్రగడ్డలో గల నాటితరం ముఖ్యమంత్రి పేరు మీద వర్థిల్లుతున్న డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను, దానికి అనుసంధానమైన బోధనా ఆస్పత్రిని అక్కడే ఉంచాలి. మరిన్ని నిధులు మంజూరు చేసి వాటిని మరింత అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాం. కేంద్రమండలి నిర్దేశించిన ప్రమాణాలను సమకూరుస్తూ, ప్రతి సంవత్సరం అడ్మిషన్ల సమయంలో ఆవహిస్తున్న భీతిని శాశ్వతంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. వ్యాసకర్త విశ్రాంత అదనపు సంచాలకులు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ (ఆయుర్వేద), డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మొబైల్ : 9963634484 -
ఆయుఃవేదవాక్కు
ఆయుర్వేదం కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు... ఒక సమగ్ర జీవనశైలి. మిగతా వైద్య ప్రక్రియలు చాలావరకు చికిత్సలను మాత్రమే పేర్కొంటాయి. కానీ... సమగ్ర జీవన విధానం ఎలా ఉండాలో చెబుతూ... తద్వారా వ్యాధుల నివారణకూ ప్రాధాన్యమిస్తుందీ శాస్త్రం. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూనే దైనందిన వ్యవహారాలనూ, ఆహార విహారాలనూ, పథ్యాపథ్యాలనూ వాటి ప్రయోజనాలనూ విడమరచి వివరిస్తుందీ వేదం. ఆచరిస్తే కడవరకూ ఉక్కుపిండంలా ఉండేలా చూస్తుంది. ఉగాది మన తెలువారందరికీ సంవత్సరాది. ఈ ఏడాది ఆది నుంచీ ఆరోగ్యంగా ఉండటం మొదలుపెడితే... ఇక నిత్యం ఆరోగ్యభోగమే! ఆ వైభోగభాగ్యం కోసమే ఈ ప్రత్యేక కథనం... ఆయుర్వేదం... అంటే? ఆయుర్వేదం కేవలం ‘వైద్యగ్రంథం’ మాత్రమే కాదు. అందులో వైద్యం కూడా ఒక ప్రధాన అంతర్భాగం. ‘‘వేదం’’ అంటే జ్ఞానమని అర్థం. దీనినే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఆయువు అంటే జీవితం. ఆ విధంగా అది జీవితానికి సంబంధించిన ఒక సమగ్ర శాస్త్రం. భారతీయ వేదాంత విషయాలు, హైందవ వైదిక విలువలు, మన దేశ ప్రాచీన సంస్కృతి, విశ్వసృష్టికి సంబంధించిన దార్శనిక తత్త్వజ్ఞానం వంటి అంశాలను ఆయుర్వేదంలో కూలంకషంగా చర్చించారు. జీవితానికి పరమార్థం ‘మోక్షం’. దీన్ని సాధించడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో ప్రధాన సోపానాలు మూడు. అవే ధర్మార్థకామాలు. వీటిని అధిగమించడానికి, బ్రతికినంత కాలం మనిషికి కావలసింది, ఉండవలసింది- ‘‘ఆరోగ్యం’’. అట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాదుర్భవించిందే ‘‘ఆయుర్వేదం’’. కనుకనే ఆయుర్వేదం ఒక సమగ్ర జీవనవేదం. మనిషి మనుగడకు ఆధారమైన దినచర్య, ఋతుచర్య, స్వస్థవృత్తం, సద్వృత్తం వంటి వివరాలను సూచిస్తూ, జీవనశైలికి దిశానిర్దేశం చేసే సజీవనాదం. ఆహార విహారాల స్వరూప స్వభావాల్ని, ఆరోగ్యంలోనూ, ఆయుఃవృద్ధిలోనూ వాటికున్న ప్రాశస్త్యాన్ని శాస్త్రీయ దృక్కోణంలో చూపే నిలువుటద్దం. ఇది అధర్వణ వేదానికి ఉపవేదం. ఆయుర్వేదంలో అసలు సూత్రం ‘‘మిథ్యాహార విహారాభ్యాం సర్వేషామేవరోగాణాం, మూలకారణం’’ శాస్త్రోక్తమైన ఆహార, విహారాలను ఉల్లంఘించడమే సమస్త రోగాలకు మూలకారణం. ‘‘స్వశరీరస్య మేధావీ కృత్యేషు అవహితోభవేత్’’ జ్ఞానవంతుడు తన ఆరోగ్యం విషయంలో అప్రమత్తుడై ఉండాలి. శృంగారం- విశిష్టత ‘‘స్మృతి మేధా ఆయురారోగ్య పుష్టీంద్రియశోబలైః అధికా మందజరసో భవంతి స్త్రీషు సంయతాః॥ క్రమశిక్షణతో కూడిన శృంగారం వల్ల ఆయువు పెరుగుతుంది. యౌవనంతో ఉండే కాలవ్యవధి పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం పాటు వయసు పైబడదు. ఫలితంగా అన్ని ఇంద్రియాలూ పుష్టిగావుండి, తెలివితేటలు పెరిగి, శక్తిమంతులై, ధీమంతులై ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఆహారం తినాలి? దేహపోషణార్థం మనం సేవించే ఏ పదార్థమైనా ‘‘అన్నమే’’. వరి, గోధుమ, బార్లీ, రాగులు వంటి ఏ ద్రవ్యంతో చేసినా లేదా వంటతో సంబంధంలేని కందమూలాలు, ఫలాలైనా; ఘనద్రవాలవంటి ఏ రూపంతో ఉన్నా; భక్ష్య, చోష్య, పాన, లేహ్య విధానాల్లో ఎలా సేవించినా అది ఆహారమే. సృష్టిలోని వివిధ పదార్ధాల్లోంచే ఆహారం లభిస్తుంది. కనుకనే పంచభూతాత్మకమైన ఆహారం పంచభూతాత్మకమైన శరీరాన్ని పోషిస్తుంది. దీనినే సుశ్రుతాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా వివరించారు. ‘‘పంచభూతాత్మకే దేహేతి ఆహారః పాంచభౌతికః విపక్వః పంచధా సమ్యగ్గుణాన్ స్వానభివర్ధయేత్॥ ఆహారం శరీరానికి మనసుకి శక్తినిచ్చి ఓజస్సుని వృద్ధి చేస్తుంది. ఆహార వర్గీకరణ నాలుకకు కలిగే రుచిని బట్టి, ఆహారాన్ని ఆయుర్వేదం ఆరురకాలుగా విభజించింది. ప్రధాన రసం, అనుబంధ రసం అనేవి సాంకేతిక విశ్లేషణ క్రిందకు వస్తాయి. షట్స్రాలు ఈక్రింది విధంగా ఉన్నాయి. ‘‘మధుర (తీపి), అమ్ల (పులుపు), లవణ (ఉప్పు), కటు (కారం లేక తీక్ష్ణం), తిక్త (చేదు), కషాయ (వగరు).’’ ⇒ వాటి గుణకర్మల్ని బట్టి ‘‘లఘు, గురు, శీతల, ఉష్ణ, రూక్ష (పొడిపొడిగా ఉండేవి), స్నిగ్ధ (జిగురుగా ఉండేవి)’’ మొదలగు రకాలుగా విభజించింది. ⇒ మనసు మీద చూపే ప్రభావాన్ని బట్టి, ‘‘సాత్వికాహారం, రాజసాహారం, తామసికాహారం’’గా చెప్పారు. సమీకృతాహారం (ఆయువర్ధకం): పైన పేర్కొన్న ఆరు రసాలను అలవాటు చేసుకోవడం ఉత్తమం. కొంచెం మధుర రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం సాత్మ్యంగా (సరిపడేదిగా), హితకరంగా (నచ్చినదిగా), లఘు, ఉష్ణ, స్నిగ్ధకరంగా ఉంటే శ్రేష్ఠం. ఇలాంటి ఆహారాన్ని ఆయుఃవర్ధకంగా చెప్పారు. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఆరు రసాలలోనూ ఉప్పు (లవణం)ని ఎక్కువ వాడవద్దని హెచ్చరించింది ఆయుర్వేదం. దాంతో బాటే పిప్పళ్లు మరియు క్షారం (ఉప్పు సాంద్రత కలిగినవి)లనూ నిషేధించింది. దాని దుర్గుణాలను కూడా చరకాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా చెప్పారు. ‘‘అథఖలు త్రీణి ద్రవ్యాణి నాతి ఉపయుంజీతాధికం అన్యేభ్యోద్రవ్యేభ్యః తద్యథా - పిప్పలీః, క్షారం, లవణమితి’’ ‘‘అతి లవణ సాత్మ్యాః పురుషాః తేషామపి ఖాలిత్య, ఇంద్రలుప్త, పాలిత్యాని తథా వలయశ్చాకాలే భవంతి’’ ⇒ ఉప్పును అధికంగా తీసుకునేవారికి బట్టతల, వెంట్రుకలూడటం, నెరిసిపోవడం, చర్మం ముడతలు పడటం... ఇవి తరుణ వయసులోనే సంభవిస్తాయి. ఎంత ప్రమాణం తినాలి? ‘మితం’గా తినాలి. అంటే శిశువులు, యువకులు, వృద్ధులు తమ వయసును బట్టి తగినంత తిని తదనుగుణంగా వ్యాయామం చెయ్యాలని ఆయుర్వేదం చెబుతోంది. వృత్తిని బట్టి సుకుమారులు, కాయకష్టం చేసేవారు, మానసిక శ్రమకి గురయ్యేవారు తమకు అనుగుణంగా తమ ప్రమాణాల్ని మార్చుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాంశాలున్న ఆహారాన్ని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏమిటంటే ‘అగ్ని’ (అరిగించుకునేశక్తి) బలాన్ని బట్టి ప్రతిఒక్కరూ ఆహార ప్రమాణాన్ని సరిచూసుకోవాలి. మితిమీరి తింటే అజీర్ణవ్యాధి కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. తినవలసినవి తాగవలసినవి ఇవి తినండి: ⇒ మొలకెత్తిన గింజలు (పెసలు నిత్యం లభ్యమౌతాయి) ⇒ నానబెట్టిన వేరుశనగపలుకులు ⇒ పచ్చికొబ్బరి ⇒ గ్రీన్సలాడ్లు (ఖీరా, టమాటా, కేరట్, బీట్రూట్ మొదలైనవి) తాజా ఫలాలు: బొప్పాయి, జామ, సపోటా, సీతాఫలం, అరటి, బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష మొదలైనవి. ఎండిన ఫలాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి. ⇒ ముడిబియ్యంతో వండిన అన్నం, గోధుమపిండి లేదా మల్టీగ్రైన్ పిండ్లతో చేసిన పుల్కాలు. ⇒ ఆకుకూరలలో తోటకూర చాలా శక్తినిస్తుంది. పాలకూర, బచ్చలికూర, మెంతికూర మొదలైనవి నిత్యం తినవచ్చు. ⇒ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చాలా మంచివి. ⇒ శాకాహారంలోని కాయగూరలన్నీ మంచివే. ఉడికించి తినడం అలవాటు చేసుకోవాలి. చేమదుంప శక్తినిస్తుంది. ⇒ నువ్వులు (పచ్చిపప్పు), బెల్లం రోజూ 3 చెంచాలు నమిలి తినడం మంచిది. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి తాగండి ⇒ రోజూ కనీసం 3-4 లీటర్ల మంచినీరు తాగటం మంచిది. (ఒకేసారి కాకుండా, నియమిత విరామాలతో తాగాలి. తినడానికి ముందుగాని, తిన్న తర్వాత గాని 45నిమిషాల పాటు నీరు తాగవద్దు) ⇒ వారానికి రెండుసార్లు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. ⇒ స్వచ్ఛమైన చెరకు రసం తాగితే మంచిది. ⇒ అప్పుడప్పుడు, ఉదయం ఒకగ్లాసు బార్లీ తాగితే మంచిది. రాగుల జావ కూడా శక్తికరం. ⇒ పండ్లరసాలు, పచ్చికూరల జ్యూస్లు చాలా మంచిది. ⇒ తేనె ఎంత తిన్నా చాలా మంచిది. బలకరం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం లభించే ఆహారపదార్థాలలో మంచివేవి...? తినే ఆహారం ఏదైనా ఆ భారాన్ని తట్టుకోవలసింది ‘‘మహాకోష్ఠమే’’ (అంటే నోరు మొదలుకొని మలవిసర్జన మార్గం వరకు). ఆహారాన్ని అరిగించాల్సిన బాధ్యత జీర్ణాశయానిదైతే, ఆ సారాన్ని తగు మార్పులతో మన శరీరంలోని కణాలకు అందించే బాధ్యత కాలేయానిది. దీనినే ఆయుర్వేదం ‘యకృత్’ అని చెప్పింది. ధాతు పరిణామ ప్రక్రియ దీని ధర్మం. ఇంతటి విలువైన ఈ అవయవాన్ని (యకృత్అంటే లివర్ను) కాపాడుకోవలసిన బాధ్యత మనదే. దీనిని మనం రక్షించుకుంటే చాలు... మన దేహాన్ని అది రక్షించుకుంటుంది. నేటి రోజుల్లో ఆరోగ్యానికి, ఆయువృద్ధికి...? దినచర్య: తెల్లవారుజామున నిద్రలేవాలి: సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు సమయాన్ని బ్రాహ్మీమూహూర్తమంటారు. ఆ సమయంలో నిద్ర నుండి మేల్కొనడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెంది, అగ్ని, క్షమత్వం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయి. ‘‘బ్రాహ్మేముహూర్తే ఉత్తిష్ఠేత్ జీర్ణాజీర్ణోనిరూపయన్ రక్షార్థమాయుషః స్వస్థో’’ (అష్టాంగ సంగ్రహం, సూత్రస్థానం) దంత ధావనం: మలవిసర్జనానంతరం దంతధావనం (పళ్లు తోముకోవడం)చేసుకోవాలి. దీనికోసం వేప, కానుగ వంటి చేదు, కారం, వగరు గల పుల్లలను మెత్తగా నమిలి ఉపయోగించుకోవాలి. చిగుర్లను గాయపర్చకుండా పళ్లు తోముకోవాలి. ఈప్రక్రియను ఆహారం తిన్న తర్వాత కూడా అమలుపరచాలి. ‘‘.....ప్రాతః భుక్త్వాచ మృద్వగ్రం కషాయ కటు తిక్తకమ్, భక్షయేత్ దంతధావనం దంతమాంసాని అబాధయన్’’ (అష్టాంగ హృదయం) వ్యాయామం: వ్యాయామం వల్ల దేహం తేలికగా, శక్తిమంతంగా తయారవుతుంది. జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. కొవ్వు కరగడం వల్ల స్థూలకాయం ప్రాప్తించదు. మంచి దేహసౌష్ఠవం ప్రాప్తిస్తుంది. చిన్నపిల్లలూ, వృద్ధులు, అజీర్ణరోగులు వ్యాయామం చెయ్యరాదు. ‘‘లాఘవం, కర్మసామర్ధ్యం దీపోర్తగ్నిః మేదసఃక్షయః విభక్త ఘన గాత్రత్వం వ్యాయామాత్ ఉపజాయతే’’ ‘‘...వాతపిత్తమయీ బాలోవౄద్ధో అజీర్ణీచతంత్యజేత్.’’ యోగసాధన: యోగసాధన వల్ల (ఆసనాలూ, ప్రాణాయామం, ఆత్మజ్ఞానసముపార్జన) మనిషికి ఆరోగ్యసిద్ధి (మానసిక, శారీరక, ఆత్మానుగత) లభిస్తాయి. ‘‘యోగేన చిత్తస్యపదేన వాచాం మలం శరీరస్యతువైద్యకేన యోపా కరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి- రానతోస్మి’’ (చరక సంహిత) శరీరానికి నలుగు పెట్టుకోవడం, స్నానం : కొన్ని చూర్ణాలతో శరీరానికి చేసే మర్దనను (నలుగు పెట్టడాన్ని) ‘‘ఉద్వర్తనం’’ అంటారు. దీని వల్ల కఫం హరించుకుపోయి, స్థౌల్యం (స్థూలకాయం) తగ్గి, చర్మం ప్రకాశిస్తూ, అంగసౌష్ఠవం కలుగుతుంది. (ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేసినా ప్రయోజనకరమే) ‘‘ఉద్వర్తనం కఫహరం మేదసః ప్రవిలాయనం స్థిరీకరణం అంగానాం త్వక్ ప్రసాదకరం పరం’’ ⇒ నిత్యం స్నానం చేయడం వల్ల అగ్నిదీప్తి, శుక్రవృద్ధి, ఓజస్సు, బలం, ఆయువృద్ధి సిద్ధిస్తాయి. శరీరం మలిన రహితమవుతుంది. దురద, చెమట, కునికిపాట్లు, దప్పిక, మంట హరించుకుపోతాయి. వ్యాధిగ్రస్తునికి సైతం తాను రోగిననే భావన దూరమవుతుంది. ‘‘స్నానం దీపనం ఆయుష్యం వృష్యం ఊర్జాబలప్రదం కండూ మలశ్రమస్వేద తంద్రా తృట్ దాహ పాప్మజితం’’ నిత్యం తలకు నూనె రాసుకోవడం వల్ల: ప్రతిరోజూ తలకు నూనె రాసుకుంటే శిరశ్శూల, బట్టతల, వెంట్రుకలు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. కపాలానికి బలం చేకూరుతుంది. కేశ మూలములు దృఢంగా ఉంటాయి. కేశాలు నల్లగా, పొడవుగా అవుతాయి. శిరస్సునకు తైలమర్దనం చేసుకోవడం వల్ల ఇంద్రియ నైర్శల్యం, చక్కటి చర్మకాంతి, సుఖ నిద్ర కలుగుతాయి. ‘‘నిత్యం స్నేహార్ద్ర శిరసః శిరఃశూలం నజాయతే నఖాలిత్యం నపాలిత్వం నకేశాః ప్రపతంతి చ, బలం శిరః కపాలానాం విశేషేణ అభివర్ధతే దౄఢమూలాశ్చ దీర్ఘాశ్చ కౄష్ణాః కేశాభవంతి చ, ఇంద్రియాణి ప్రసీదంతి సుత్వక్ భవతి చామలమ్ నిద్రాలాభః సుఖంచ స్యాత్ మూర్ధ్ని తైల నిషేవణాత్’’ ఏయే వేళల్లో తినాలి? మధ్యాహ్నం, సాయం సంధ్యవేళల్లో తినటం ఉత్తమం. భోజనానికి, అల్పాహారానికి మధ్య కనీసం నాలుగైదు గంటల వ్యవధి ఉండాలి. ఆకలి కానప్పుడు, తిన్నది జీర్ణం కానప్పుడు మళ్లీ తినకూడదు. అదేపనిగా ఉపవాసాలూ చెయ్యకూడదు. ప్రతిరోజూ నియమిత వేళల్లోనే తినాలి. వారానికొకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అన్నాన్ని సేవించడం ‘అశనం’ అంటారు. పథ్యా పథ్యాల్ని గమనించి సేవించడం ‘సమశనం’ అంటారు. అతిగా తినడాన్ని ‘అధ్యశనం’గా చెప్పారు. అధిక ప్రమాణంగాని, అల్ప ప్రమాణంగాని వేళకాని వేళల్లో తింటే ‘విషమాశనం’గా వర్ణించింది ఆయుర్వేదం. వీటివల్ల అజీర్ణ వ్యాధి కలగడమే కాకుండా, అతిదారుణమైన వ్యాధులూ సంభవించవచ్చు. కాలానుగుణంగా ఆహారంలో మార్పు (రుతువులను బట్టి): శిశిరం (ఫిబ్రవరి, మార్చి)- తీపి, పులుపు, ఉప్పు రుచులు, వేడిగా, స్నిగ్ధంగా ఉండాలి వసంతం (మార్చి, ఏప్రిల్, మే): చేదు, కారం, వగరుగా ఉండేవి, పొడిపొడిగా, వేడిగా ఉండాలి గ్రీష్మ (మే, జూన్, జూలై): తీపి, చల్లవిగా ఉండే స్నిగ్ధ (జిడ్డుగా) పదార్థాలను, ద్రవాహారాన్ని సేవించాలి వర్ష (జూలై, ఆగస్టు, సెప్టెంబర్): తీపి, పులుపు, స్నిగ్ధ పదార్ధాలు, వేడివేడిగా శరత్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్): తీపి, చేదు, వగరు, రూక్ష (పొడిగా ఉన్నవి - అంటే జిడ్డులేనివి), చల్లగా ఉండాలి హేమంత (నవంబరు, డిసెంబరు, జనవరి): తీపి, పులుపు, ఉప్పు, స్నిగ్ధ, ఉష్ణ పదార్థాలు. ‘పథ్యం’ అంటే?: సరిపడేది, హితకరం అని అర్థం. దీనికి వ్యతిరేకం ‘అపథ్యం’. ఇది శరీర స్వభావాన్ని బట్టి, అగ్నిబలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి, వాడే ఔషధాన్ని బట్టి తినగదినవి, తినకూడనివి అయిన ఆహార పదార్థాల్ని వివరించింది ఆయుర్వేదం. ఉదా: అజీర్ణంలో తేలికయైన (లఘు) ఆహారం తీసుకోవాలి. జ్వరంలో కూడా; మధుమేహవ్యాధిలో - మధుర, స్నిగ్ధ ఆహారం అపథ్యం; చేదు పదార్థాలు పథ్యం. ‘‘పథ్యాన్ని సక్రమంగా పాటిస్తే ఔషధమే అవసరముండదు. పాటించకపోతే ఔషధం పనిచేయదు’’ - అని వాగ్భటాచార్యులు నొక్కి చెప్పారు. నిషేధాలు ⇒ ప్రధానంగా కొవ్వు పదార్ధాలను విసర్జించాలి. అంటే నూనె, నెయ్యిలతో వండిన వంటకాలన్న మాట. శరీరానికి కావలసిన కొవ్వులు మనకి ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్ధాలలో (ఉదా: పాలు, పెరుగులలో) లభిస్తాయి. నువ్వులనూనె, ఆవునెయ్యి - వీటిని కొంచెం ప్రమాణంలో నెలకు రెండుసార్లు సేవిస్తే మంచిది. అవి హానికరం కావు. మనం చేసే శారీరక శ్రమ, వ్యాయామాన్ని బట్టి వీటి ప్రమాణాలను సరిచేసుకోవాలి. ⇒ ఐస్క్రీములు, శీతల పానీయాలు, చాక్లెట్లు, బేకరీ సరుకులు, ఫాస్ట్ఫుడ్స్ల వల్ల పోషకవిలువలు శూన్యం. ⇒ సాత్వికాహారమైన శాకాహారం అత్యుత్తమం. అలవాటుంటే మత్స్యమాంసాలను అరుదుగా మాత్రమే తినడం శ్రేయస్కరం. ⇒ రోడ్డుపక్కన లభించే పళ్లరసాలు, చెరకురసాలు సేవించడం ప్రమాదకరం. ఇన్ఫెక్షన్ల వల్ల మహాకోష్ఠం దెబ్బతింటుంది. అలాగే బజ్జీలు, దోసెల లాంటివి కూడా. నూనెలను పదేపదే మరిగించడం చాలా హానికరం. ⇒ ఆహార నియమాలను ఉల్లంఘిస్తూ, వేళాపాళా లేకుండా ఇష్టానుసారంగా తినడం వల్ల లివర్ దెబ్బ తింటుంది. నిద్ర నిద్ర: మనసు బడలికనొందగనే ఇంద్రియాలు కూడా అలసిపోయి తమతమ నిర్ణీత కర్మల నుంచి దూరమవుతాయి. దాంతో మనిషికి నిద్రవస్తుంది. ఒక్క వేసవికాలంలో తప్ప పగటి నిద్ర నిషేధం. ‘‘యదాతు మనసి క్లాన్తే కర్మాత్మానః క్లమాన్వితాః విషయోభ్యో నివర్తంతే తదా స్వపితి మానవః’’ (చరక సంహిత) మద్యనిషేధం: మద్యాన్ని తయారుచేయడం, విక్రయించడం, తాగడం, ఇతరులకు ఇవ్వడం శస్త్రనిషేధం. ‘‘సర్వధా ఈక్షేత్ న ఆదిత్యం, న భారం శిరసావహేత్ నఈక్షేత ప్రతతం సూక్ష్మదీప్తా మేధ్యాప్రియాణిచ మద్య విక్రయ సంధాన దానపానానిన ఆచరేత్’’ దీంతో పాటు సూర్యకాంతిని నేరుగా చూడవద్దు. తలపై అధికభారం మోయవద్దు. అత్యంత సూక్ష్మం, అత్యంత తీక్షణమైనవీ, మనసుకి అప్రియాలైన వస్తువులను తదేక దృష్టితో చూడకూడదు. మన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం సూచించిన పైన పేర్కొన్న అన్ని నియమాలనూ క్రమం తప్పక పాటిస్తే నిండు నూరేళ్ళూ ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. నిర్వహణ: యాసీన్ -
కేరళ పంచకర్మ చికిత్సతో.. వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిపెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
వెన్నునొప్పి అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేిపీ రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుంటాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి, రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్స, బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. పెయిన్ కిల్లర్స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీనపడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprosad.6600@gmail.com -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
కొన్ని వ్యాధులు ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చివేస్తాయి. వెన్నునొప్పి, సయాటికా, మెడనొప్పి సమస్యలు కూడా ప్రాణాలేమీ తీయవు. కానీ జీవితాన్ని నరక తుల్యం చేస్తాయి. సమస్యను ముందే గుర్తించి వైద్య చికి త్సలు తీసుకుంటే వెన్నునొప్పి తగ్గడమే కాదు జీవితం పునః శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ సకాలంలో నెరవేరేది కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సల వల్లే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు పి.కృష్ణప్రసాద్. వెన్నునొప్పి, జలుబు అంతే సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పి కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. ఈ వెన్నునొప్పి శరీరాన్ని కుంటుపడేలా చేయడమే కాదు మొత్తం జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పైగా ఈ సమస్యలు ఏదో 5 - 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవి కూడా కాదు. ఏళ్ల పర్యంతం మంచాన పడి ఉండేలా చేస్తాయి. వెన్నునొప్పి కండరాల మీదో, వెన్ను మీదో కాదు మొత్తం శరీర వ్యవస్థ మీదే దుష్ర్పభావం కలిగేలా చేస్తుంది. మూలస్తంభం లాంటి వెన్నెముక దెబ్బతినే ఈ సమస్య మనిషిని ఇంటాబైటా ఏ పనికీ కొరగాకుండా చేస్తుంది. సమస్యలు ఒకటా రెండా...? వెన్నెముక అనేది పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడ వీటన్నింటినీ స్థిరంగా నిలబడేలా చేస్తుంది. పలు కారణాల వల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్నుభాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో పలు సమస్యలు తలెత్తడంతో పాటు సమస్య ఇంకా అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి. ఎవరికైనా వెన్నుపూసలోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా గురవుతాయి. సర్జరీతో ఒరిగేదేమిటి...? వెన్నునొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడితే... అప్పటికి నొప్పి నుంచి ఉపశమనం మాత్రమే పొందవచ్చు. కానీ నొప్పి రావడానికి గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్ దెబ్బతినడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యల బారిన పడ డం జరగవచ్చు. సర్జరీ దాకా వెళితే పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందంటే.. అదీ చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది...? ముందుగా వెన్నునొప్పి రావడానికి గల ఆ ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం.. ముందు కనిబెడుతుంది. ఆిస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్నునొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివరించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తుంది. ఈ చికిత్సలో మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని దాన్ని సమూలంగా తగ్గించివేస్తుంది. అందుకే కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీ చరక, కేరళ ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ పి.కృష్ణప్రసాద్ ఎండీ., ఆయుర్వేద, ఫ్లాట్ నంబర్ 225/1, బిసైడ్: ఎస్బీహెచ్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్నెంబర్ 17. వివరాలకు.. Ph: 040 - 65986352 9030013688, 9440213688 e-mail: krishnaprasad.6600@gmail.com -
ఆరోగ్యవంతమైన జీవనం
వివేకం ‘ఆరోగ్యం’ అనే పదం, ‘అంతా’ అనే పదం నుండి వచ్చింది. మీ శరీరం, మీ బుద్ధి, మీ భావోద్వేగాలు, మీ ప్రాణశక్తి అన్నీ ఒకదానితో ఒకటి సరిగా అనుసంధానమై ఉన్నప్పుడు, మీ లోపల మీరు ఒక పరిపూర్ణత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు అనుభూతి చెందేది అప్పుడే! వైద్యపరంగా ‘ఆరోగ్యవంతులు’ అని పరిగణింపబడే వాళ్లతో సహా, ప్రపంచంలో ఎక్కువ మంది వ్యక్తులు అనారోగ్యవంతులే! వారికి మందుల అవసరం లేకపోవచ్చు. కానీ వాళ్ల జీవన క్రియకు సంపూర్ణత అనేదే తెలీదు. శాంతి, ఉల్లాసం అనే అనుభవమే వాళ్లలో ఉండదు. మీరు ఒక నిర్ణీత స్థాయి కన్నా తక్కువగా ఉంటేనే అనారోగ్యంగా ఉన్నామని మీరు భావిస్తారు. కానీ, మీరు ఉల్లాసంతో తొణికిసలాడుతూ లేకపోతే, మీరు అనారోగ్యవంతులే! మీరు అనబడే మీ అంతర్గత నిర్మాణంలో, సంపూర్ణత అనేదే లేదు కనుక మీరు అనారోగ్యవంతులే! సంపూర్ణత పట్ల మీరు ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. అందువల్లనే ఇలా జరిగింది. ప్రతిదానిని బయటినుంచి సరి చేయడానికి ప్రయత్నించే ఈ దృక్పథమే అసలు పోవాలి. ఏ డాక్టర్ గానీ, ఏ మందు గానీ మీకు అనారోగ్యాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. మీరు అనారోగ్యం బారిన పడినప్పుడు, వాళ్లు మీకు సహకరిస్తారు, కొంతవరకు సహాయపడతారు. కానీ, ఆరోగ్యం మాత్రం, మీ లోపలనే ఏర్పడాలి. ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. ఈ రోజున ఉన్న ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెప్తోంది, మానవుడు సైకోసొమాటిక్ అని. మనసులో కలిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో కలిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన ప్రాథమిక మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు ఎంత క్రమబద్ధంగా ఉన్నాయి అనేవన్నీ మన ఆరోగ్యంలో తప్పనిసరిగా ఉండే భాగాలు. అంతర్గతంగా సంపూర్ణత భావన కలగాలంటే తప్పనిసరిగా కొంత ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి మనం. మన శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, మనం తప్పనిసరిగా సృష్టించుకోవాలి. అందరూ ఉదయం పూట, ఒక్క ఇరవై అయిదు, ముప్ఫై నిమిషాల కాలాన్ని వెచ్చించాలి తమ అంతర్గత శ్రేయస్సు కోసం. వీటి ద్వారా తమ శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. అప్పుడు ప్రతి మనిషీ ఆరోగ్యంతో చక్కగా జీవించగలరు. సమస్య - పరిష్కారం ఎన్నో రకాల మందులూ, చికిత్సలూ లభ్యమవుతున్నాయి. అల్లోపతి, సిద్ధ, ఆయుర్వేదం, యునాని, ఆక్యుపంక్చర్ లాంటివి... మానవ శరీరానికి ఏది ఉత్తమమైనది? - జి.కిషన్రావు, హైదరాబాద్ సద్గురు: ఈ విషయం వ్యాధిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి మందులు అవసరం లేదు. వ్యాధికే మందులు కావాలి. మీకున్న వ్యాధిని బట్టి, దానికి అనుగుణంగా చికిత్స జరగాలి. మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, అల్లోపతికి మించింది లేదు. అత్యవసరానికి అల్లోపతే మంచిది. కానీ మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే, అల్లోపతి అంత మంచిది కాదు. మీకు కోలుకోవడానికి సమయం ఉన్నప్పుడే, మీరు ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్లండి. మీ సమస్యలు కొనసాగుతూ, రకరకాలుగా మార్పుచెందుతూ ఉంటే అప్పుడు ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలు చాలా సమర్థవంతమైన మార్గాలు. ఈ రోజుల్లో అల్లోపతి డాక్టర్లు మీకు మందులు ఇవ్వరు. వాళ్లు కేవలం ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. కానీ ప్రాచ్య వైద్య విధానాలు వ్యక్తిగతమైనవి. మందు మాత్రమే ముఖ్యం కాదు. ఆ మందును ఎవరిస్తున్నారనేది కూడా ముఖ్యమే. ఆయుర్వేదం అనేది కేవలం కాలేజీకి వెళ్లి మనుషులకు వైద్యం చేయడం నేర్చుకునే విధానం కాదు. ఆయుర్వేద వైద్యాన్ని చేయాలనుకునేవాళ్లు దాంతో నిరంతరం లీనమై ఉండాలి. -
కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?
నా వయసు 42. గత రెండేళ్లుగా కడుపులో మంట, పుల్లని తేన్పులు, అజీర్ణం, అప్పుడప్పుడు కడుపుబ్బరం, గ్యాస్ లక్షణాలతో బాధపడుతున్నాను. హైపర్ అసిడిటీ అని చెప్పి డాక్టర్లు సూచించిన ఎన్నో మందులు వాడాను. కానీ ఫలితం కనపడలేదు. దీని సంపూర్ణ నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - కె. భానుప్రకాశ్, ఆదిలాబాద్ మీకు ఉన్న సమస్యను ఆయుర్వేదంలో ‘ఆమ్లపిత్తం’ వ్యాధిగా చెబుతారు. నియమ నిబంధనలకు భిన్నంగా ఆహారవిహారాలు జరిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురిచేసే వృత్తివ్యాపారాలు కూడా మరొక ముఖ్యకారణం. ఈ కింది సూచనలు పాటించండి. రెండుమూడు నెలల్లో మీకు గణనీయంగా సత్ఫలితం లభిస్తుంది. ఆహారం : అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానేయండి. తీపిపదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్సలాడ్స్ కూడా తీసుకోండి. భోజనంలో మసాలాలు లేని శాకాహారం మంచిది. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మొదలైనవాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. బయటి తినుబండారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, శీతలపానీయాల వంటివి అస్సలు పనికిరావు. అరటిపండ్లు మంచిది. విహారం : నియమతి వేళల్లో రాత్రిపూట నిద్ర అత్యంతావశ్యకం. జాగరణ చేయవద్దు. ధూమపాన, మద్యపానాల వంటి అలవాట్లు వ్యాధిని మరింత ఉద్ధృతం చేస్తాయి. దుఃఖం, చింత, శోకం, భయం వంటి ఉద్వేగాలను దూరంచేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వ్యాయామం వల్ల... ముఖ్యంగా ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మీ సమస్య కుదుటపడుతుంది. మందులు లఘుసూతశేఖరరస (మాత్రలు) :ఉదయం 2, రాత్రి 2 అవిపత్తికర చూర్ణం : మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో) శూక్తిన్ (మాత్రలు ) : ఉదయం 1, రాత్రి 1 గమనిక... అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది. మా పాప వయసు 5 నెలలు. గత పది రోజులుగా పాపకి మలమార్గం చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా కమిలిపోయినట్లు, ఒరిసినట్లుగా ఉంది. తాకితే పాప ఏడుస్తోంది. పరిష్కారం సూచించండి. - ఎమ్. నిర్మలమ్మ, తణుకు శిశువు విసర్జించిన మలం ఎక్కువసేపు ఆ ప్రాంతానికి తగులుతూ ఉంటే, అక్కడి చర్మం ఆ విధంగా తయారవుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘గుదకుట్ట లేదా అహిపూతనా’ అనే పేర్లతో వివరించారు. మలమూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే అలవాటు మంచిది. శిశువు పక్కబట్టలను ఎప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపువేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి, అనంతరం ‘మహామరిచాదితైల’ అనే మందును దూదితో ముంచి, ఒరిసిన చర్మం మీద నాజూగ్గా రాయాలి. ఇది బయటి పూతకు మాత్రమే. ‘అరవిందాసవ’ అనే ద్రావకాన్ని అర చెంచా ఉదయం, అరచెంచా రాత్రి తేనెతో శిశువుకు తాగించండి. దీనివల్ల చంటిపిల్లలకు అరుగుదల, బలం చక్కగా ప్రాప్తిస్తాయి. ఎన్నో వ్యాధులకు నివారకంగా కూడా పనిచేస్తుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
కండ్లకలక తగ్గడం ఎలా...?
నా వయసు 55. ప్రతి ఏడాదీ శీతకాలంలో నాకు కండ్లకలక వస్తుంటుంది. పుసులు కట్టి కండ్లు అంటుకోవడం, ఎర్రబడటం, సూర్యరశ్మి చూడలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. దీని నిర్మూలనకు ఆయుర్వేద సూచనలు ఇవ్వండి. పి. రాధాస్వామి, చిత్తూరు కండ్లకలక (కంజెక్టివైటిస్)ను ఆయుర్వేదం ‘అభిష్మంద’ వ్యాధిగా వర్ణించింది. దోష ప్రాబల్యాన్ని బట్టి ఇది ‘వాత, పిత్త, కఫ, రక్త’ భేదాలుగా వర్గీకృతమైంది. వైరస్, బాక్టీరియా వంటి సూకా్ష్మంగ క్రిములు, అలర్జీ (అసాత్మ్యత) దీనికి ప్రధాన కారణాలు. ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి. సాధ్యమైనంత వరకు కంటిని అపరిశుభ్ర వాతావరణానికి దూరంగా ఉంచాలి. చేతివేళ్లతో కళ్లు నులుపుకోవడం వంటివి చేయకూడదు. ప్రతివ్యక్తికి ఉండే క్షమత్వశక్తినీ, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను బట్టి ఈ వ్యాధి సోకడమనేది ఆధారపడి ఉంటుంది. ఈ రోగం ఉన్న వ్యక్తులకు కాస్త దూరంగా మెలగాలి. శుభ్రభస్మం (ఏలం/పటిక) నీళ్లలో మరగబెట్టి, చల్లార్చి, పరిశుభ్రంగా పదిలపరచుకొని, రెండేసి చుక్కలు రెండు కళ్లలోనూ వేసుకోవాలి. ఇది కంటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. అభిష్యందవ్యాధి ఉన్న రోగులు, గోరువెచ్చని నీళ్లతో కండ్లను శుభ్రపరచుకొని మెత్తటి, శుభ్రమైన రుమాలుతో తుడుచుకోవాలి. ‘ఆఫ్తాకేర్, ఐటోన్’ వంటి ఆయుర్వేద కంటిచుక్కలు మందుల షాపుల్లో లభిస్తాయి. రెండేసి చుక్కల చొప్పులన రెండు కళ్లలోనూ మూడుపూటలా వాడాలి. ‘గంధకరసాయన మరియు లఘుసూతశేఖర రస’ మాత్రలను పూటకు రెండేసి చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తక్కువగా తీసుకుంటూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. నా వయసు 62. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. డాక్టర్లు పరీక్ష చేసి షుగరు వ్యాధి లేదన్నారు. కానీ ప్రోస్టేట్ గ్రంధి వాపు వల్ల ఈ సమస్య కలిగిందన్నారు. ఇది తగ్గడానికి మందులు తెలియజేయ ప్రార్థన. - ఆర్. బసవలింగం, అనంతపురం ప్రోస్టేట్ గ్లాండ్ను ఆయుర్వేద పరిభాషలో ‘పౌరుషగ్రంధి’ అంటారు. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది కొద్దిగా పరిమాణం పెరగడం సహజం. దానివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్రం మాటిమాటికీ వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రంధికి ఇన్ఫెక్షనూ సోకవచ్చు. కొందరిలో ఈ వాపు క్యాన్సరుగా పరిణమించవచ్చు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ దిగువ సూచించిన మందుల్ని రెండు నెలల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. సప్తవింశతి గుగ్గులు (మాత్రలు) --- ఉదయం 2, రాత్రి 2 చంద్రప్రభావటి (మాత్రలు) --- ఉదయం 2, రాత్రి 2 చందనాసవ (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి. నా వయసు 23. తరచూ తలలో పేలు బాధిస్తున్నాయి. దీనికి మందు చెప్పండి. - కె. అంజనీబాయి, కరీంనగర్ శిరోజాలలో మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంటే తలకు పేలుపట్టే పరిస్థితి రాదు. ప్రతిరాత్రి ‘నింబతైలం’ (వేపనూనె) తలకు రాసుకుని, మరుసటిదినం కుంకుడుకాయ చూర్ణంతో తలస్నానం చేయండి. సీతాఫలాల్లోని గింజల్ని ఎండబెట్టి, పొడిచేసి, ఆ చూర్ణాన్ని నీళ్లలో ముద్దగా చేసి రోజు విడిచి రోజు శిరోజాలకు పట్టించండి. పదిరోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ‘కుమార్యాసవ’ ద్రావకాన్ని ఉదయం, రాత్రి నాలుగేసి చెంచాలు... సమానంగా నీళ్లు కలిపి ఒక నెలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
నవజాత శిశువుకు కామెర్లు... ఏం చేయాలి?
నాకు పదిరోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. మూడు కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది. పుట్టిన మూడో రోజున పాపకు జాండిస్ కనిపించింది. అదే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. దీనికేమైనా ఆయుర్వేద మందులు అవసరమా? నాకు పాదాల మీద కొద్దిగా వాపులున్నాయి. వీటికి సరియైన సలహాలను సూచింప ప్రార్థన. -మీనాక్షి, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్. జాండిస్ను ఆయుర్వేదంలో ‘కామల’ అంటారు. వాడక భాషలో పచ్చకామెర్లు అని అంటారు. నవజాత శిశువునకు పుట్టిన రెండో రోజుల తర్వాత వచ్చే కామలను ప్రాకృతంగానే పరిగణిస్తారు. కాలేయం క్రియాసామర్థ్యం పరిపక్వతకు చేరుకునే సమయంలో శిశువు బాహ్యవాతావరణానికి సర్దుబాటు కావలసిన పరిస్థితిలో కనిపించే తాత్కాలికమైన మార్పు మాత్రమే ఈ కామల. ఒకటి రెండు వారాల్లో క్రమేణా తగ్గిపోతుంది. ప్రత్యేకమైన మందులేమీ అవసరం లేదు. అదేగాని పుట్టిన 48 గంటలలోపు కామల కనబడితే దాన్ని వ్యాధిగా గుర్తించి పరీక్షలు జరిపి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని జన్మగత వైకల్యాలు కారణం కావచ్చు. ఉదాహరణకు, కాలేయం నుంచి ‘బైలురుబిన్’ బయటకు వచ్చే నాళం మూసుకుని ఉండటం లేదా అధికస్థాయిలో ఎర్రరక్తకణాల విధ్వంసం మొదలైనవి. కాబట్టి మీరేమీ గాబరా పడవద్దు. శిశువునకు మీ పాలను తాపిస్తూ ఉండటం, సాధారణంగా చేసే శిశురక్షణ ప్రక్రియలను పాటిస్తే సరిపోతుంది. ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, ధాత్రి (నర్సు) తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి. సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠోర పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్లో నిల్వ చేసిన పదార్థాలు మొదలైనవి మంచివి కావు. తాజాగా వండిన వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీ నీళ్లు, ఆవు మజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, తగురీతిలో తినడం మంచిది. అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత... బాలింత కాఢ నెం. 2 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి. శిశువునకు : అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదునిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి. గమనిక : శిశువుతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా సున్నితంగా, నాజూకుగా వ్యవహరించాలని ఆయుర్వేద ప్రాచీన శిశువైద్యనిపుణుడు ‘కశ్యపుడు’ స్పష్టీకరించాడు. కొంతమంది మంత్రసానులు, నాటువైద్యులు, శిశువుల కాళ్ళు, చేతులు అతిగా వంకరలు తిప్పుతూ వ్యాయామాలు చేయిస్తుంటారు. అది ప్రమాదకరమని గుర్తుంచుకోండి. అలాంటివి చేయించి శిశువును క్షోభకు గురిచేయవద్దు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
చికెన్పాక్స్కు నివారణ, చికిత్స చెప్పండి...
మా బాబు వయసు రెండున్నరేళ్లు. ప్రస్తుతం జలుబు విపరీతంగా ఉంది. మా పక్కింటి బాబుకు ఇలాగే జలుబు చేసి, చికెన్ పాక్స్గా వ్యక్తమయ్యింది. కాబట్టి దీని నివారణకు, చికిత్సకు ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - నేమాని సుబ్బారావు, మణికొండ ‘చికెన్పాక్స్’, ‘మీజిల్స్’ వ్యాధులను ఆయుర్వేదంలో ‘లఘు మసూరిక’, ‘రోమాంతికా’ అనే పేర్లతో వివరించారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి ప్రాప్తించే సాంక్రమిక వ్యాధులు. ఇవి రావడం, రాకపోవడం అన్న అంశం వారి వారి క్షమత్వ శక్తిపై ఆధారపడి ఉంటుంది. నివారణకైనా, చికిత్సకైనా ఈ కింది జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇంట్లోనూ, పరిసరాల్లోనూ పరిశుభ్రత ముఖ్యం. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. సాంబ్రాణి ధూపం రెండుపూటలా వేస్తే మంచిది. వేపకొమ్మలను ఇంటి ద్వారానికి తోరణంగా కడితే చాలా రకాల క్రిములను అవి లాగేసుకుంటాయి. క్రిమిహరణంగా పనిచేస్తుంది. స్నానానికి పసుపుకలిపిన వేడినీళ్లు మంచివి. అనంతరం బాలునికి కూడా సాంబ్రాణి ధూపం వేయవచ్చు. పరిశుభ్రమైన బట్టలను ప్రతిరోజూ మారుస్తుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నీరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మంచి బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ద్రవాహారం కూడా ఎక్కువగా ఉండాలి. బాదంపప్పు, జీడిపప్పు, ఖర్జూరం, బత్తాయి, కమలాపండ్ల రసాలు చాలా మంచిది. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు మజ్జిగ ప్రయోజనకరం. మందులు తులసీరసం, తేనె ఒక్కొక్క చెంచా కలిపి, రెండుపూటలా నాకించండి. లేదా తేనెలో రెండు చుక్కల వెల్లుల్లిరసం కలిపి ఇవ్వవచ్చు. దాల్చినచెక్క చూర్ణం రెండు చిటికెలు, పసుపుముద్ద ఒక చిటికెడు తేనెతో కలిపి రోజుకొక్కసారి తినిపించవచ్చు. ఆమలకి (ఉసిరిక) రసం ఒక చెంచా రెండుపూటలా ఇవ్వవచ్చు. బజారులో లభించే మందులు అరవిందాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో. చందనాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో. లక్షణాలను బట్టి ప్రత్యేక ఔషధాలు జ్వరానికి: ఆనందభైరవీరస (మాత్రలు... ఉదయం 1, రాత్రి 1 చర్మంపై పొక్కులు: ‘మహామరిచాది తైలా’న్ని కొంచెం దూదితో, మెల్లగా చర్మంపై పూయాలి. గమనిక ఒకవేళ ఈ వ్యాధులు సోకితే, తగ్గిన అనంతరం అశ్రద్ధ చేయకూడదు. వీటి ఉపద్రవాలు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బయటపడవచ్చు. కాబట్టి క్షమత్వ వర్ధకానికై ‘అగస్త్యహరీతకీ రసాయనం’ (లేహ్యం) అనే మందును ఒక చెంచా మోతాదులో రెండు పూటలా, రెండుమూడు నెలల పాటు తినిపించడం మంచిది. సాంప్రదాయికంగా ఈ జబ్బుల్ని ‘ఆటలమ్మ, అమ్మవారు’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. వీటికి మందులు వాడకూడదని నమ్ముతుంటారు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు కనుక వాటికి మందులక్కర్లేదనడం వాస్తవమే అయినా, మూఢవిశ్వాసాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ వ్యాధి సోకే ముందుగాని, లక్షణాలు బయటపడ్డప్పుడు గాని రోగికి చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఆయా లక్షణాలను బట్టి శమన చికిత్స కోసం మందులు వాడటం తప్పనిసరి. అదేవిధంగా ఎక్కువ నీరసం ఉంటుంది కాబట్టి బలకర ఔషధాలు కూడా తప్పనిసరి. వీటి ఉపద్రవాలను నివారించడం కోసం ఆయుర్వేదోక్త రసాయన ద్రవ్యాలను చాలాకాలం వైద్యుని పర్యవేక్షణలో వాడటం అత్యంతావశ్యకమని గుర్తుంచుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
బాబుకు బ్రాంకైటిస్... తగ్గడం ఎలా?
మా బాబు వయసు ఆరేళ్లు. గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ జ్వరం, కొద్దిపాటి కళ్లె కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ‘బ్రాంకైటిస్’గా నిర్ధారణ చేసి మందులిచ్చారు. అయినా పెద్దగా ఫలితం కనబడటం లేదు. పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేద చికిత్స సూచింప ప్రార్థన. కె. రాధిక, సిరిసిల్ల మీరు చెప్పిన లక్షణాలను బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘పిత్తజ కాస’గా పరిగణించవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అసాత్మ్యత (అలర్జీ) కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించే చాక్లెట్లు, నూడిల్స్, లాలీపాప్స్ ఐస్క్రీములు, కూల్డ్రింక్స్ వంటి చిరుతిళ్లను పూర్తిగా నిషేధించాలి. బయటి తిండిని మానేయాలి. ఇంట్లో వండే వంటకాలలో వాడే నూనెలు, రంగులు మొదలైనవాటిల్లో కల్తీ లేకుండా చూసుకోవాలి. బలకరమైన ఆహారంతో బాటు బాదం, జీడిపప్పు వంటి ఎండుఫలాలను తినిపించండి. పాలు, పెరుగు తగు రీతిలో సేవించాలి. ఈ కింద వివరించిన మందుల్ని ఒక నెలపాటు వాడి ఫలితాన్ని సమీక్షించండి. రస పీపరీ రస (మాత్రలు) ... ఉదయం 1, రాత్రి 1. అతిమధురం చూర్ణం రెండు గ్రాములు, ప్రవాళ పిష్ఠి ఒక చిటికెడు కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి. వాసారిష్ట (ద్రావకం) ... ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి, రెండు లేక మూడు పూటలా తాగించాలి. నా వయసు 68. శీతాకాలంలో చర్మం పొడిగా మారి దురదలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద సూచనలీయగలరు. - ఎస్. మేరీ, విశాఖపట్నం ఆయుర్వేద సూత్రాల రీత్యా ‘రూక్షత్వక’ (పొడిచర్మం)ను నివారించడానికి ఈ కింది విధానాలను పాటించండి. రోజుకి నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఆహారంలో ఆకుకూరలు, మునగకాడలు విరివిగా వాడండి. రోజూ రెండు చెంచాలు నువ్వుల పప్పు (పచ్చిది) నమిలి తినండి. ఉప్పు, కారం తగ్గించాలి. స్నానం కోసం సబ్బులేమీ వాడవద్దు. ముఖాలంకరణకు పౌడర్లు, క్రీములు వాడవద్దు. చెమటపట్టేటట్టు తేలికపాటి వ్యాయామం అవసరం. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం ఉపయోగకరం. స్వచ్ఛమైన నువ్వులనూనెతో శరీరమంతా అభ్యంగనం చేసుకొని, అనంతరం సున్నిపిండి లేదా శనగపిండితో నలుగుపెట్టుకొని, పిదప గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్రక్రియ రోజు విడిచి రోజు చేసినా సరిపోతుంది. ముఖానికి: పాలమీగడ, శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపిన ముద్దను పూసుకొని, 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ‘కుమార్యాసవం, శారిబాద్యాసవం’ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్ల్లు కలిపి, రెండుపూటలా తాగాలి. నా వయసు 73. మలబద్దకానికి ‘త్రిఫలాచూర్ణం’ వాడవచ్చా? - సిద్ధప్ప, అనంతపురం ‘కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ’... ఈమూడింటిని విడివిడిగా చూర్ణం చేసి సమానంగా కలుపుకుంటే త్రిఫలాచూర్ణం తయారవుతుంది. దీంతో కషాయం కాచుకుని రాత్రి పడుకునేప్పుడు 30 మి.లీ. తాగండి. రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. ఈ ఔషధం గుండెకు, కంటికి, రక్తనాళాలకు, కాలేయానికి, మెదడుకు బలం కలిగించే చక్కటి రసాయనంగా ఆయుర్వేదం వర్ణించింది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
ఆరోగ్యం ఆయుర్వేదం 14th Oct 2013
-
వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం
30 ఏళ్ల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంతానం కలిగి ఉండడం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈకాలం చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం - మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వలన మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో ‘త్రి ఉపస్తంభాలు’ అనే ఒక ఆరోగ్య రహస్యం మహర్షులు చెప్పారు. అవి - ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. మానవులు ఆరోగ్యకరమైన (సమతుల్య ఆహారం) అహారం, సరియైన సమయంలో తగు ప్రమాణంలో ( 6 గం. - 8గం.) నిద్రపోవడం, అలాగే బ్రహ్మచర్యం పాటించడం (అనగా ప్రాకృతిక నియమాలు) ఉదా: దినచర్య / ఋతుచర్యలను పాటించడం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా భారతీయులను కూడా ఈ సమస్య పీడిస్తోంది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. అది తిరిగి మానవులకే హాని కలిగిస్తుంది. తద్వారా పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గటాన్ని ‘ఓలిగో స్పెర్మియా’ అని, అసలు కణాలు లేనట్లయితే ‘ఆజోస్పెర్మియా’ అని, కదలిక సరిగా లేనిచో ‘అస్తినోస్పెర్మియా’ అని, కణాల స్వరూపం మార్పులు ఉన్నట్లయితే ‘టెరిటో స్పెర్మియా’ అని అంటారు. ఆయుర్వేద శాస్త్రంలో శుద్ధ శుక్రకణాల యొక్క వివరణలు, అలా శుక్ర కణాల దోషాల గురించి అతి విస్తారంగా చరక, సుశ్రుత, వాగ్భట మహర్షులు చర్చించారు. చరక మహర్షి పురుషులలో సంతానలేమికి నాలుగు ప్రధాన కారణాలు చెప్పారు. 1. బీజోపఘాతం (వీర్యకణాలలో సంఖ్య, కదలికల్లో నాణ్యత లోపాలు) 2. శుక్ర సంక్షయ (వీర్య ప్రమాణంలో తగ్గుదల) 3. ధ్వజోపఘాత (అంగ స్తంభన సమస్యలు) 4. జరా (ముసలితనం) పై కారణాలలో బీజదోషం గురించి, ఇంకా సమగ్రత గురించి చర్చించారు. వాటిని శుక్ర దోషాలుగా వర్ణించారు. అవి సంఖ్యాపరంగా చూసినట్లయితే 8 విధాలుగా చెప్పవచ్చు. వాతదోషం వల్ల 3 సమస్యలు - నురుగుతో కూడిన వీర్యం, పలుచగా ఉండే వీర్యం, రూక్షత (dryner) కలిగిన వీర్యం అనేవి. ఈ వాత దోషంచే నొప్పితో కూడిన వీర్యం స్వల్పంగా వెలువడుతుంది. పిత్తదోషం వల్ల 2 సమస్యలు - దుర్గంధయుక్త వీర్యం (pus cell), వివర్ణత (సహజవర్ణం మారుట) అనేవి. ఇక్కడ పిత్తదోషంచే మంటతో కూడిన వీర్యం వెలువడుతుంది. కఫదోషం వల్ల అతి జిగురు కలిగిన వీర్యం (viscosity పెరుగుట) అనే సమస్య. ఇక్కడ వీర్యం చల్లగా వెలువడుతుంది. రక్తదోషంచే వీర్యంలో ఎర్ర రక్తకణాలు వెలువడతాయి. అలాగే - వాత కఫ దోషాలచే వీర్యం త్వరగా ద్రవ స్వభావాన్ని పొందదు. అందుకే ఆయుర్వేదంలో శుద్ధ శుక్ర లక్షణాల గురించి ఈవిధంగా చెప్పారు. ‘స్ఫటికాభం, ద్రవం స్నిగ్ధం మధురం మర్మ గన్ధిచ’ అనగా స్వచ్ఛమైన శుక్రం, పారదర్శకంగా (స్ఫటికంలా), ద్రవత్వాన్ని, స్నిగ్ధత (viscosity)ని, మర్మరం (ph. value 7.2-7.7), గా ఉండాలని ఆచార్యులు చెప్పారు. ఈ లక్షణాలతో కూడిన వీర్యాన్ని కలిగిన పురుషులకు ఎలాంటి సందేహం లేకుండా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇందుకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక అద్భుత చికిత్సా విధానాలు, రసాయన, వాజీకరణ చికిత్సా విభాగంలో మహర్షులు వివరించారు. ముఖ్యంగా శుక్ర రేచకములు (vericocel) లాంటి సమస్యలు శుక్ర శోధకాలు (ఇన్ఫెక్షన్ను తగ్గించేవి), శుక్ర జనకాలు (కణాల వృద్ధికి, నాణ్యతకు)అనే ఔషధాలను ఆచార్యులు వివరించారు. ఇది చూర్ణ రూపంలోనూ, అస్ఫ/అరిష్ట రూపంలోనూ, వటి రూపంలోను, లోహ రూపంలో, భస్మ రూపంలో అనేక అద్భుత ఔషధాలు, అతి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే హార్మోన్ల సమస్యలలో తక్రధార, శరీర .... విరేచనం, వస్థి, ఉత్తరవస్థి లాంటి అనేక ప్రత్యేక చికిత్సా విధానాలలో ఈ శుక్రకణాల సమస్యలను అధిగమించి సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సరైన దినచర్య, ఋతుచర్య ఇత్యాది విషయాలలో కూడా ఆయుర్వేద వైద్యుల సూచనలు పాటిస్తే పురుషులలో ‘సంతానలేమి’ని జయించవచ్చు. - డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ఫోన్ : 7416 107 107, 7416 109 109 www.starayurveda.com -
ఆరోగ్యం ఆయుర్వేదం 9th Sept 2013