B forms
-
బీ ఫారాలు.. రూ. 95 లక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారం, ఇతర వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఈ నెల 18న కీలక సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18న జరిగే సమావేశంలో వారికి బీ ఫారాలు అందజేస్తారు. ఎన్నికల ఖర్చుల కోసం ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి పార్టీ తరఫున ఒక్కో అభ్యరి్థకి రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేస్తారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరవుతారు. భేటీ అనంతరం పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆత్మస్థైర్యం పెంచేలా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ప్రచారంలో లేవనెత్తాల్సిన అంశాలు, పార్టీ కేడర్తో సమన్వయం, ఓటు బ్యాంకును కాపాడుకోవడం తదితరాలపై సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామనే భావనతో ఉన్న ప్రజలకు మరింత చేరువయ్యేలా దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. వాగ్దానాల అమలులో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సీఎంగా కేసీఆర్ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా సూచనలు చేస్తారన్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను కూడా పార్టీ నేతలకు వివరించి వారిలో ఆత్మస్తైర్యం నూరిపోసేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే ఇప్పటికే చేవెళ్ల, అందోలులో ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఇటీవలి సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బస్సు యాత్రకు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని మరోమారు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 18న జరిగే భేటీలో కేసీఆర్ బస్సు యాత్ర, రూట్మ్యాప్పైనా చర్చించి షెడ్యూల్ ఖరారు చేస్తారు. -
RS Election: YSRCP అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు. సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ జగన్ను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం -
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీఫామ్లు మంటలు రేపుతున్నాయి. అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్వో కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్రావు దేశ్పాండే నిరసన తెలిపారు. బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్పాండే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సంగారెడ్డి బీఫామ్ను పులిమామిడి రాజుకు బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. కాగా, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్రావుకు చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. ఇప్పటికే తుల ఉమ నామినేషన్ దాఖలు చేయగా, వికాష్రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్కు, తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్రెడ్డి (యాకుత్పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్పురా), తీగల అజిత్రెడ్డి (మలక్పేట), సీహెచ్ ఆనంద్గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్తో కలసి పనిచేయాలని ఆశిష్ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
ప్రధాన పార్టీలోల్లో క్షణ క్షణం.. నిరీక్షణం
హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయడానికి ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. బీఫాం చేతికొచ్చేంత వరకు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాలుగు ప్రధాన పారీ్టల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికార బీఆర్ఎస్ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్లో ఉంచింది. నేటికీ వాటికి అభ్యర్థులనే ప్రకటించలేదు. టికెట్లు ప్రకటించిన వారిలో బీఫాంల పంపిణీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ, పాతబస్తీ పరిధిలోని చారి్మనార్, చాంద్రాయణగుట్ట, మలక్పేట, బహదూర్పురా, యాకుత్పురా, కార్వాన్ అభ్యర్థులకు ఇంతవరకు బీఫారాలను జారీ చేయలేదు. దాంతో బీఫాం చేతికందేంత వరకు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. ఇక గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం తేల్చకపోవడంతో ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి. ఎంఐఎంలో మూడు పెండింగ్ నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, బహదూర్పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్లోనూ రెండు కాంగ్రెస్ పార్టీ సైతం పాతబస్తీలోని చార్మినార్తో పాటు గ్రేటర్ పరిధిలో కలిసి ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి అభ్యర్థని వెల్లడించలేదు. బీజేపీకి జనసేనతో కిరికిరి ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సైతం నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆపార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో దానికి ఏయే సీట్లు కేటాయిస్తారోనన్న టెన్షన్తో బీజేపీ ఆశావహులున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్తోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ∙జనసేన శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలను కోరుతున్నట్లు తెలిసి బీజేపీ శ్రేణులు గందరగోళంలో మునిగాయి. ఎట్టకేలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్ను జనసేనకు వెళ్లకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపులు ఫలించినట్లు సమాచారం. వివిధ కారణాలతో నగరంలోని నాలుగు ప్రధాన పారీ్టలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయోననే చర్చ జరుగుతోంది. -
ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో?
సాక్షి, జోగుళాంబ గద్వాల: అలంపూర్ రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు బీఫామ్ ఇంకా అందలేదు. చల్లా వర్గీయుడు విజేయుడు, ఎమ్మెల్యే అబ్రహం వేర్వేరుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. మరో వైపు,తన తనయుడు శ్రీనాథ్కు సీట్ ఇవ్వాలంటూ మంద జగన్నాథ్ పట్టుబడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అటు ఎమ్మెల్యే అబ్రహం, ఇటు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు శుక్రవారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బీఫాం విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని, తనకే వస్తుందని, మహిళలు, వృద్ధులు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కిందని, తనను ఆదరించాలని ఎమ్మెల్యే అబ్రహం కోరారు. ఈమేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు ఉండవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యర్థులకు తీసిపోనట్లుగా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది. చదవండి: ‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్! -
బీ-ఫాం అందుకున్న అరూరి,చల్లా
అరూరికి బీ–ఫాం అందజేత వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ బీ–ఫాం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమవారం హైదరాబాద్లో అందుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీ–ఫామ్ అందుకున్న ‘చల్లా’ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్లో సోమవారం పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి బీ–ఫామ్ అందుకున్నారు. తనపై నమ్మకంతో బీ–ఫామ్ అందించిన కేసీఆర్కు, సహకరించిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అలంపూర్ మినహా..
మహబూబ్నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఆదివారం బీఫారాలను స్వయంగా అందజేశారు. తొలి విడతలో మధ్యాహ్నం 51, రాత్రి 18 మందికి బీఫారాలను ఇవ్వగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క అలంపూర్ స్థానానికి మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫారాలను అందించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్ను ప్రకటించినా, ఇటీవల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయుల ఆందోళన నేపథ్యంలో సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి బీఫారాన్ని అందించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిగిలిన ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు లభించడంతో పాటు మేనిఫెస్టో ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జనం గుండెల్లో కేసీఆర్ సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారు పేరు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చినందుకే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. వరుసగా మూడోసారి సీఎం చేతులమీదుగా బీఫారం అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో ఈసారి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తా. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వచ్చే ఏడాదికి పాలమూరు ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాను. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు, కేసీఆర్ ఆరోగ్య రక్ష– ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళకు నెల రూ.3 వేల భృతితోపాటు రూ.400కే సిలిండర్ మేనిఫెస్టోలో పొందుపర్చదడం సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. -
51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్లు అందజేసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ‘‘మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎన్నికల కో ఆర్డినేటర్ భరత్ కుమార్కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈ రోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో వైపు, 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదని, మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయని కేసీఆర్ చెప్పినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ అన్ని స్థానాలకు బీఫామ్లు ఇస్తారని అంతా భావించారు.. కానీ 51 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే బీఫామ్లు ఇవ్వలేదని, ఆ స్థానాలను మార్చనున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో వారిలో టెన్షన్ నెలకొనగా.. వారు ఎవరనేది ఇప్పడు హాట్ టాపిక్గా మారింది చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..! -
TS Elections: నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించడంతో.. అధికార బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ప్రచార షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. అదే రోజు బీఫామ్స్ను అభ్యర్థులకు అందజేయడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాలుగు రోజుల పాటు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో ఈ టూర్ ఖరారైంది. 15వ తేదీ బీఫామ్స్ అందజేసి.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారు కేసీఆర్. అదే రోజు.. హుస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో, అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం జడ్చర్లలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇక.. నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డిలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు వేసి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నాం కామారెడ్డికి వెళ్లి మరో నామినేషన్ వేస్తారు. ఆపై అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న ఉండనుంది. ఫలితాలు 6న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల -
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
-
సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్.. అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా
-
సీఎం జగన్ చేతుల మీదగా బీఫాం అందుకున్న రుహుల్లా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫాం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్ పాల్గొన్నారు. చదవండి: సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి ఈ సందర్భంగా రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల క్రితం అమ్మ కరీమున్నీసా మరణించారని.. సీఎం వైఎస్ జగన్ పిలిపించి ఈ రోజు బీఫామ్ ఇచ్చారని తెలిపారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నానని పేర్కొన్నారు. మైనారిటీలంతా సీఎం జగన్కి రుణపడి ఉంటారన్నారు. మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బీఫాంలు అందజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పార్టీ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూమాటి మాధవరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరికి సీఎం జగన్ బీఫాంలు అందజేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. లేనిపక్షంలో అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. చదవండి: (ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), ఇసాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప) ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పాలవలస కుటుంబంలో మూడో తరం నేత ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్గా సేవలందించారు. విక్రాంత్ డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. పేరు: పాలవలస విక్రాంత్ పుట్టిన తేదీ: 23–12–1971 చదువు: బీఈ తండ్రి: పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్ తల్లి: ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీ భార్య: గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీ పిల్లలు: సాయి గణేష్, మణికంఠ కార్తికేయ పదవులు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ రవాణా శాఖ అధికారిగా సేవలందించి.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. పేరు: దేవసాని చిన్న గోవిందరెడ్డి పుట్టినతేదీ: 23.02.1956 విద్యార్హత: ఎంటెక్, ఐఐటీ మద్రాస్ భార్య పేరు: తులసమ్మ కుమారులు: గోపీనాథ్రెడ్డి, ఆదిత్యానాథ్రెడ్డి కుమార్తె: డాక్టర్ సుష్మ, అల్లుడు రమేష్రెడ్డి, ఐపీఎస్ అధికారి మైనార్టీ నేతగా.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేరు: ఇసాక్బాషా పుట్టిన తేదీ: 4–6–1962 చదువు: బీకాం తల్లిదండ్రులు: జాఫర్ హుస్సేన్, జహ్నాబీ భార్య: రహ్మద్ బీ (గృహిణి) పిల్లలు: ఫిరోజ్ బాషా, హర్షద్ పదవులు: గతంలో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేస్తున్నారు. -
గెల్లు శ్రీనివాస్ యాదవ్కు బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
-
పెన్మత్స సురేష్బాబుకు బీఫాం అందజేత
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్బాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్బాబును అభ్యర్థిగా దించారు. సీఎం జగన్కు ధన్యవాదాలు.. మీడియాతో సురేష్బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత త్వరగా టిక్కెట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఓదార్పు యాత్రతో పాటు ప్రతి కార్యక్రమంలో నాన్నగారితో కలిసి పాల్గొన్నాను.గత ఎన్నికల్లో వైఎస్ జగన్ నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను.అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉంటున్నాను. మా తండ్రి చేసిన సేవలకు గుర్తించి తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని ’’ సురేష్బాబు తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాల జారీ
-
టికెట్ కలిపింది ఇద్దరినీ...
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు. ఇదే విషయమై లక్ష్మణ్ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు. -
డీసీసీలకు ఏ-ఫారంలు అందజేసిన టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు నగరా మోగిన వేళ.. కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మల్లు భట్టివిక్రమార్క, జనారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, దామోదర్ రాజనర్సింహలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 మంది డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ ఏ-ఫారంలు అందజేసింది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు బీ-ఫారమ్లు అందజేసే బాధ్యతను డీసీసీలకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో బరిలో నిలిచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పగించింది. అలాగే బి-ఫారమ్ పొందిన అభ్యర్థి 20 రూపాయల ప్రమాణ పత్రం ఇచ్చేలా ఒక ఆఫిడవిట్ రూపొందించి డీసీసీలకు అందజేసింది. కాగా, వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో మూడు దశల్లో 32 జిల్లాల పరిధిలోని 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు విడతల ఎన్నికల ఫలితాలను ఒకేసారి మే 27న ప్రకటించనున్నారు. -
బీఫారం పోయింది... దొరికింది
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పార్లమెంట్కు పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి చెందిన బీఫారం, ఇతర సర్టిఫికెట్లు పోవడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతం లో వేమిరెడ్డి మేనేజర్ వెంకటేశ్వర్రావు కాచిగూడ నుంచి బైకుపై బయల్దేరాడు. కాచిగూడ చౌరస్తా వద్దకు రాగానే బైకు వెనకవైపు తగిలించిన సంచి జారిపడిపోయింది. వెనుకనే మరో బైకుపై వస్తున్న హోంగార్డు ముని వెంకటరమణ ఇది గమనించాడు. ఆ సంచిని వెంకటేశ్వర్రావుకు ఇచ్చేందుకు యత్నించినా వీలు కాలేదు. డీజీపీ ఆఫీసులో పనిచేసే ముని వెంకటరమణ కార్యాలయానికి వెళ్లాక ఆ సంచీని తెరి చి చూడగా.. అందులో వేమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన బీఫారం (నకలు), నామినేషన్లకు సంబంధించిన పత్రాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఉన్నాయి. అందులో ఆధార్ కార్డులో ఉన్న నంబర్కు ఫోన్ చేసి చెప్పాడు. కాల్ రిసీవ్ చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మేనేజర్కి డీజీపీ ఆఫీసుకు వెళ్లా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన మేనేజర్ వివరాలు ధ్రువీకరించుకున్నాక మునివెంకటరమణ ఆ ఫైల్ను అడ్మిన్ ఆర్ఐ జంగయ్య సమక్షంలో అతనికి అందజేశాడు. నిజాయితీగా డాక్యుమెంట్లను ఇచ్చిన హోంగార్డును ఉన్నతాధికారులు అభినందించారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ‘బి’ ఫామ్లు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోక్సభ, శాసనసభ అభ్యర్థులకు ‘బి’ ఫామ్ల (అభ్యర్థిత్వాలను అధీకృతం చేసే పత్రాలు) పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ చేపట్టింది. 25 లోక్సభ, 175 శాసనసభ అభ్యర్థుల ‘బి’ ఫామ్లపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే సంతకాలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ సమన్వయకర్తలకు పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్రత్యేక సహాయకుల ద్వారా పంపుతున్నారు. కొందరు అభ్యర్థులు తామే స్వయంగా తీసుకువెళ్లనున్నారు. నామినేషన్ల గడువు ముగియడానికి బాగా ముందుగానే ‘బి’ ఫామ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా పార్టీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధాన క్యాంపెయినర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలతో పాటు పార్టీకి ఆకర్షణగా నిలిచే మరికొందరితో ఈ జాబితాను రూపొందించనున్నారు. ఈ నెల 17 నుంచి రోజుకు మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ జగన్ ప్రచార వేడిని రాజేశారు. ఈ నెల 25 తర్వాత రోజుకు నాలుగు సభల్లో ప్రసంగించడం ద్వారా మరింత ఊపు తీసుకురానున్నారు. విజయమ్మ, షర్మిల ఈ నెల 27 నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బిఫామ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ
-
బీజేపీలో బీ–ఫారం ట్విస్ట్
నారాయణఖేడ్: నారాయణఖేడ్ బీజేపీలో సోమవారం నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం నుంచి అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. నారాయణఖేడ్ బీజేపీ అసెంబ్లీ టిక్కెట్ను రవికుమార్గౌడ్కు ఆ పార్టీ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు బీ ఫారం అందజేసింది. కాగా ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా సంజీవరెడ్డికి కాంగ్రెస్ టిక్కెటు దక్కలేదు. సోమవారం నామినేషన్లకు చివరిరోజు. దీంతో బీజేపీ నాయకులు సంజీవరెడ్డిని సంప్రదించారు. కార్యకర్తల ఒత్తిడిమేరకు సంజీవరెడ్డి బీజేపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు. తనకు వచ్చిన బీ ఫారంను సమర్పించేందుకు రవికుమార్గౌడ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపంలో ఉదయం 9గంటలకే చేరుకున్నాడు. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు రవికుమార్గౌడ్ వద్దకు వచ్చి బీ ఫారం కావాల్సిందిగా కోరారు. దీంతో రవికుమార్గౌడ్ రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి వెళ్లి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. బీజేపీ నాయకులు ఎంతకూ ఫోన్ చేసినా ఫోన్ కలవడకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో పార్టీ నాయకత్వం హుటాహుటినా బీదర్ బీజేపీ ఎంపీ భగవంత్ కుబ్బాతో మరో బీఫారంను పంపగా సంజీవరెడ్డి మరో సెట్టును బీజేపీ అభ్యర్థిగా దాఖలు చేశారు. మొదట బీ–ఫారం సమర్పించిన రవికుమార్గౌడ్ స్థానిక కార్యకర్తలకు చిక్కకుండా వెళ్ళిపోయారు. ఈ విషయంపై సాక్షి బీజేపీ అభ్యర్థి రవికుమార్గౌడ్ను ఫోన్లో మాట్లాడగా.. పార్టీ బీఫారం ఇవ్వగా తాను నామినేషన్ వేసి బీఫారం సమర్పించినట్లు తెలిపారు. తనను ఎవ్వరూ సంప్రదించలేదన్నారు. సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసిందని, ఆయనకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇద్దరికీ బీ–ఫారం ఇస్తే.. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ ద్వారా బీ ఫారం ఇస్తే ఎలా అనే సందేహం నారాయణఖేడ్లో సోమవారం నెలకొన్న ఘటన ద్వారా చర్చనీయాంశమయ్యింది. నారాయణఖేడ్ బీజేపీ పార్టీ అభ్యర్థులుగా రవికుమార్గౌడ్, సంజీవరెడ్డిలు నామినేషన్ వేసారు. ఇలా ఇద్దరు బీఫారాలు ఇవ్వడంతో ఎన్నికల అధికారులు ఎవరికి పార్టీ గుర్తు కేటాయిస్తారన్న చర్చ హాట్టాపిక్లా మారింది. ఈ విషయంలో పలు పార్టీల కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఒక పార్టీ ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక ఏ–ఫారం, బీ–ఫారం అందజేస్తుంది. తర్వాత మొదటి వ్యక్తికి కాకుండా రెండో వ్యక్తికి ఏ–ఫారం, బీ–ఫారం జారీచేసేప్పుడే బీ–ఫారంలో ఉండే ఒక కాలంలో మొదటి వ్యక్తికి ఇచ్చిన బీ ఫారం రద్దు చేస్తున్నామని, కావునా ఈ రెండో వ్యక్తికి కేటాయించిన బీ ఫారాన్ని స్వీకరించాలని రాసి ఇస్తుంది. దీన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించిన పక్షంలో మొదటి వ్యక్తి ఇచ్చిన బీఫారాన్ని రద్దు చేసి రెండో వ్యక్తి ఇచ్చిన బీ ఫారానికి ఎన్నికల అధికారులు గుర్తును కేటాయిస్తారు. -
పొత్తు పొత్తే.. పోటీ పోటీయే..!!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజున మహాకూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అనుకున్నదానికన్నా మరో ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ 94, టీడీపీ 14, తెలంగాణ జన సమితి 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ అదనంగా మరో ఐదుగురు అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసీ.. టీడీపీ, టీజేఎస్లకు షాక్ ఇచ్చింది. టీడీపీకి కేటాయించిన 2 స్థానాల్లో, టీజేఎస్కు కేటాయించిన 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. పఠాన్చెరులో శ్రీనివాస్ గౌడ్, దుబ్బాకలో నాగేశ్వర్రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, వరంగల్ తూర్పులో గాయత్రి రవి, మిర్యాలగూడలో ఆర్ కృష్ణయ్యలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. కూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం సీటును సామ రంగారెడ్డికి కేటాయించిన టీడీపీ.. పఠాన్చెరు నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీజేఎస్కు కేటాయించిన మిర్యాలగూడ, వరంగల్ తూర్పు, దుబ్బాక స్థానాల నుంచి ఆ పార్టీ విద్యాధర్రెడ్డి, ఇన్నయ్య, చిందం రాజ్కుమార్లకు బీ ఫామ్లు అందజేసింది. అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంపై టీడీపీ, టీజేఎస్లు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహబూబ్నగర్లో అభ్యర్థిని నిలిపిన టీజేఎస్ కూటమి పొత్తులో భాగంగా మహబూబ్నగర్ను సొంతం చేసుకున్న టీడీపీ ఆ స్థానం నుంచి ఎర్రశేఖర్ను బరిలో నిలిపింది. అయితే మిత్రపక్షమైన టీజేఎస్ కూడా ఆ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మహబూబ్నగర్ స్థానానికిగానూ రాజేందర్రెడ్డికి టీజేఎస్ బీ ఫామ్ అందజేసింది. దీంతో టీజేఎస్ మొత్తంగా తొమ్మిది స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపినట్టయింది. -
టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట టీజేఎస్ బీ-ఫారం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు దేశం, తెలంగాణ జన సమితి పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్నాయి. మహాకూటమిలో భాగంగా తమ పార్టీ తరపున సీటు ఖరారైన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ-ఫారాలు ఇస్తున్నాయి. ఈ ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ 13 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. నందమూరి సుహాసిని తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారామె. ఇక తెలంగాణ జన సమితి సైతం ఎన్నిక చేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసింది. మహకూటమిలో భాగంగా టీజేఎస్కు 4 స్థానాలు కేటాయించగా, టీజేఎస్ మాత్రం 7 నియోజవర్గాల అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. మెదక్, సిద్ధిపేట, దుబ్బాక, మల్యాజిగిరి, వరంగల్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు అధ్యక్షుడు కోదండరామ్ ఫారాలు అందజేశారు. కాగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట కూడా తమ అభ్యర్థికి టీజేఎస్ బీ-ఫారం ఇచ్చింది. -
ఏ–ఫారం.. బీ–ఫారం అంటే?
సాక్షి,హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తరుచుగా ఏ–ఫారం, బీ–ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవి ఏమిటో..ఎలా ఇస్తారో తెలుసుకుందాం. ఏ–ఫారం అంటే.. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ–ఫారం అందజేస్తారు. బీ–ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ‘ఏ’ ఫారం. ఎవరిని పార్టీ ఎంపిక చేసి ఏ–ఫారం అందిస్తుందో వారికి మాత్రమే బీ–ఫారం అందిస్తారు. ఏ–ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ–ఫారంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. బీ–ఫారం అంటే... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే ‘బీ’ ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తేనే పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బీ–ఫారాన్ని అందిస్తారు. -
‘డిపాజిట్’ అంటే..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఎన్నికల్లో పోటీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని అర్హతలు నిర్దేశించింది. అభ్యర్థుల నుంచి నామినేషన్ రుసుం వసూలు చేస్తుంది. నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి ఆ రుసుం తిరిగి చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని డిపాజిట్ అని పిలుస్తారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ తో పాటుగా జనరల్, బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేల చొప్పున నామినేషన్ రుసుం(డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తేనే డిపాజిట్(నామినేషన్ రుసుం) తిరిగి ఇస్తారు. డిపాజిట్ రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో కనీసం 1/6వంతు(16.66)ఓట్లు పొందాలి. అంటే నూటికి దాదాపుగా 17ఓట్లు పొందాలి. బీ–ఫారం, ఏ ఫారం అంటే.. ఎన్నికల సమయంలో తరుచుగా ఏ ఫారం,బీ ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఇవి అవసరం. అవేమిటో.. ఎలా ఇస్తారో తెలుసుకోండి. ఏ ఫారం అంటే.. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో.. వారికీ ’బీ’ఫారం అందిస్తారు..... బీ ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ’ఏ’ ఫారం. ఎవరినైతే పార్టీ ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత బీ ఫారం అందిస్తారు. ‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ’ఏ’ ఫారం ను ఎన్నికల అధికారులకు అందిస్తారు. ’బీ’ ఫారం... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని ఇచ్చేదే ‘బీ’ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధుల ద్వారా ఈ ఫారాన్ని అందిస్తారు. -
అభ్యర్థులూ జాగ్రత్త.!
సాక్షి, రంగారెడ్డి: శాసనసభ ఎన్నికల్లో కీటక ఘట్టానికి తెర లేచింది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అయితే, అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. నామినేషన్ పత్రాలు పూర్తి చేయడం, అనుబంధ పత్రాలు జత చేసే సమయంలో ఎన్నికల సంఘం సూచనలు విధిగా పాటించాలి. లేకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈమేరకు అభ్యర్థులు పాటించాల్సిన, నామినేషన్ పత్రాలు పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నామినేషన్ పత్రాలు.. నామినేషన్ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. ప్రత్యేక బ్యాంకు ఖాతా అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా అందజేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్ వేయడానికి కనీసం 24 గంటల ముందు ప్రారంభించిన నూతన బ్యాంకు ఖాతా నంబర్ను ఆర్ఓకు అందజేయాలి. బ్యాంకు ఖాతా నంబరే కాకుండా బ్యాంకు పేరు, బ్రాంచి చిరునామా తదితర వివరాలు ఇవ్వాలి. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతి పైసా ఈ ఖాతా నుంచే ఖర్చు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్) తెరవొద్దు. అభ్యర్థి ఒక్కరి పేరుతో మాత్రమే ఖాతా తెరవాలి. అర్హతలు ఇవీ.. శాసనసభకు పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలు, అనర్హతలపై ప్రజా ప్రాతనిథ్య చట్టం 1951 లోని 3వ అధ్యాయం 11వ అధికరణం ద్వారా వివరించారు. దీని ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 25 ఏళ్లు దాటిన వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు. సెక్యూరిటీ డిపాజిట్ పోటీ చేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు చాలు. అయితే, వీరు సంబంధిత తహసీల్దార్ నుంచి తీసుకున్న కుల ధృవీకరణ పత్రం అందజేయాలి. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారు రెండు డిపాజిట్లు చెల్లించాలి. డిపాజిట్ను నేరుగా రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో అందజేయవచ్చు. ఇలా కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో లేదా ప్రభుత్వ ఖజానా (ట్రెజరీ)కు చలానా రూపంలో జమ చేయవచ్చు. వాహనాలు మూడు.. వ్యక్తులు ఐదుగురు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థి తన వెంట వాహన శ్రేణి (కాన్వాయ్)లో మూడు వాహనాల కన్నా ఎక్కువ ఉండకూడదు. వీటిని కూడా ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలిపివేసి ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినిధి ద్వారా నామినేషన్ పోటీకి దిగాలనుకునే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు నేరుగా రాలేని పక్షంలో ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది. ఈమేరకు తన ప్రతినిధుల ద్వారా రిటర్నింగ్ అధికారికి నామినేషన్లను పంపించొచ్చు. ఫారం– బీ ఎన్నికల్లోఅభ్యర్థి ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అందుకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఇచ్చే బీ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. బీ ఫారంను నామినేషన్తోపాటు ఇవ్వలేకపోయినా.. నామినేషన్ల ఆఖరు తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఇవ్వొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థి స్థానిక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకుంటే సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో పేరు, ఇతర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు ఆస్తులు, అప్పులు, కేసులు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలను ఫారం–26 ద్వారా ఆర్ఓకు అందజేయాలి. నేరుగానే కాకుండా వెబ్సైట్ ద్వారా అఫిడవిట్లు దాఖలు చేయొచ్చు. www.eci.nic.in వెబ్సైట్లో లాగిన్ అయి అడిగిన అన్ని కాలమ్స్ విధిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రింట్ రాదు. పూర్తి చేసిన అఫిడవిట్ ప్రింట్ తీసుకుని మొదటి శ్రేణి న్యాయమూర్తి లేదా నోటరీ అడ్వకేట్తో రూ.10 విలువైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్పై నోటరీ చేయించి నామినేషన్ పత్రానికి జతచేసి ఆర్ఓకు అందజేయాలి. -
ఇక నామినేషన్లు..
సాక్షి,నిజామాబాద్: ఇప్పటిదాకా ప్రచారంలో బిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఇక నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్లో ఆ పార్టీ బీ ఫారాలు అందజేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందే టికెట్లు ఖరారు చేయడంతో అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రచార కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఆదివారం మధ్యాహ్నం రాజధానిలోని తెలంగాణ భవన్కు తరలివెళ్లారు. మరో వైపు నేడు (సోమవారం) అధికార యంత్రాంగం నోటిఫికేషన్ జారీతో పాటు నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్కు ఒకరోజు ముందే బీ ఫారాలు అందుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కీలక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్లకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి నియోజకవర్గంలో సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ ర్యాలీ లు, పెద్ద ఎత్తున జన సమీకరణ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. తేలని కూటమి అభ్యర్థిత్వాలు.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పటికీ, మహాకూటమి అభ్యర్థులెవరో తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ పెరిగి పోతోంది. ఆయా స్థానాలకు ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో వారి అనుచరుల్లో అ యోమయం నెలకొంది. కూటమి పార్టీల పొ త్తులో భాగంగా టీడీపీ, టీజేఎస్లకు ఉమ్మడి జిల్లాలో ఏదైనా స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే రెండు విడత ల్లో నియోజకవర్గాన్ని చుట్టి రాగా, కూటమి అభ్యర్థులు ఇంకా తేలకపోవడతో ఆ పార్టీల శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. సోమవారం సాయం త్రం గానీ, మంగళవారం గానీ అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. అధినేత దిశానిర్దేశం.. టీఆర్ఎస్ అభ్యర్థులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నామినేషన్లలో కొత్త నిబంధనలు అమలు చేస్తుండటంతో నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రచార వ్యూహాలపై చర్చించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. -
గులా'బీ' ఫారాల పంపిణీ
టీఆర్ఎస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. తమ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా.. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నారు. కాలె యాదయ్య (చేవెళ్ల), టి.ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), ఎం.రామ్మోహన్ గౌడ్ (ఎల్బీనగర్), అంజయ్య యాదవ్ (షాద్నగర్), మంచిరెడ్డి కిషన్రెడ్డి (ఇబ్రహీంపట్నం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి)లు బీ ఫారం తీసుకున్న వారిలో ఉన్నారు. సాక్షి, రంగారెడ్డి: అసెంబ్లీని రద్దుచేసి రెండు నెలల కిందటే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం.. చివరకు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బీ– ఫారాల విషయంలోనూ అదే దూకుడును కొనసాగించింది. తొలుత కేసీఆర్ ప్రకటించిన 107 మంది అభ్యర్థుల జాబితాలో.. జిల్లాలోని 8 సెగ్మెంట్ల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులకు చోటు దక్కింది. ప్రకటన వెలువడినప్పటి నుంచే అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీ– ఫారాల అందజేతతో వీరంతా ప్రచారానికి మరింత పదును పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. డెయిలీ సీరియల్.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటయిన మహాకూటమి తర్జనభర్జనలు పడుతోంది. కూటిమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐల సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాల సంఖ్య కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో తీవ్ర ఆలస్యమవుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తామని నాలుగు రోజులుగా జరుగుతున్న వ్యవహారం డెయిలీ సీరియల్ని తలపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై దాదాపు ఖరారైనప్పటికీ.. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే 12న కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అని సందిగ్ధంగానే ఉంది. బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల ఖరారులోనూ కాస్త ముందంజలోనే ఉంది. రెండు విడతలుగా ఐదు సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ పెట్టింది. వాస్తవంగా ఆదివారం ఆ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ అయితే.. 12న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనివార్య పరిస్థితులలో ఈ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పేర్ల వెల్లడికి మరో రెండురోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విజయం మనదే...!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మినహా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం బీ ఫారాలు అందించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఒక్కరోజు ముందుగానే టీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఒక్కరోజు ముందుగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే రావాలన్న ఆదేశం మేరకు మరో అరగంట ముందుగానే ఆశావహులు తెలంగాణ భవన్లో రిపోర్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకుగాను 12 నియోజకవర్గాలకు సెప్టెంబర్ 6న అభ్యర్థులను ప్రకటించారు. చొప్పదండి విషయంలో మాత్రం సస్పెన్స్ పెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేను వదిలించుకునే ప్రయత్నం చేసింది. అందుకనే టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ పేరును తెరమీదకు తెచ్చారు. ఆదివారం 12 మంది అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసిన కేసీఆర్ చొప్పదండి విషయంలో మాత్రం ఏమీ తేల్చలేదు. 13 నియోజకవర్గాల్లో ఆదివారం నాటి వరకు ఉన్న పరిస్థితులపై వివిధ కోణాల్లో సేకరించిన సర్వే నివేదికలను కూడా కేసీఆర్ అభ్యర్థుల కళ్లకు కట్టారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన సర్వే ఫలితాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 81.64 శాతంతో ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ తదితరుల కంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 68.84శాతంతో కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఉన్నట్లు గులాబీ దళపతి కేసీఆర్ సమావేశంలో వెల్లడించారు. మానకొండూరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి 49 శాతంతో ముందుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి 48.40 శాతంతో వెనుకబడిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే పెద్దపల్లి, మంథని, వేములవాడ, రామగుండం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పరిííస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మరింత కష్టపడి పనిచేయాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. 12మంది అభ్యర్థులకు బీ ఫారాలు.. చొప్పదండిపై తేలని నిర్ణయం.. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో నిర్వహించిన సమావేశంలో గులాబీ దళపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 12మంది అభ్యర్థులకు బీ ఫారాలను అందించారు. సెప్టెంబర్ 6న తొలి విడతగా 107 మందితో జాబితా ప్రకటించిన కేసీఆర్.. ఉమ్మడిజిల్లా నుంచి 12 మంది పేర్లను ఖరారు చేశారు. మొదటగా ప్రకటించిన 12 మందికి కేసీఆర్ బి–ఫారాలను అందజేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులతో మాట్లాడిన కేసీఆర్ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని హితబోధ చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని, పలు విధాలుగా నిర్వహించిన సర్వేలు కూడా అవే చెప్తున్నాయని, ఇందుకోసం అభ్యర్థులు, పార్టీ కేడర్ అంకితభావంతో పనిచేయాలని కేసీఆర్ సూచించారు. కాగా చొప్పదండి నియోజకవర్గానికి అభ్యర్థి నియామకం విషయం ఇంకా సస్పెన్స్గానే ఉంది. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రభుత్వ మాజీ విప్ కొప్పుల ఈశ్వర్, తాజామాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలికిషన్, దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధూకర్, వొడితెల సతీష్కుమార్, కె.విద్యాసాగర్రావు, సొమారపు సత్యనారాయణ, సీహెచ్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసిన కేసీఆర్
-
బీ ఫారాలు పంపిణీ చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్ అధినేత ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ముందుగా ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు బీఫారాలు అందించిన కేసీఆర్.. నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అభ్యర్థులకు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టి రావాలని.. ఇతర పార్టీలకంటే ప్రచారంలో ముందుండాలిన అభ్యర్థులకు సూచించారు. ఈనెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థులపై చర్చ జరిగినా.. కూటమి సీట్లను ప్రకటించిన తరువాతనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
టీఆర్ఎస్లో.. బీ–ఫారాల సందడి
సాక్షి,నల్లగొండ: ముందస్తు ఎన్నికలు ఖరారైన రోజే తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఎన్నికల నోటిఫికేషన్కు ఒకరోజు ముందే బీ–ఫారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న ప్రభుత్వం రద్దు కావడం, ఆ వెంటనే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. రెండు నెలలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను పది చోట్ల టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా, కోదాడ, హుజూర్నగర్ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు విపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఇంకా టికెట్ల కసరత్తు దగ్గరే ఆగిపోగా.. టీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చే పనిలో పడింది. ఉమ్మడి జిల్లాలోని పది మంది అభ్యర్థులు ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. ఆయన ముందుగానే బీ–ఫారాలు అందిస్తారని చెబుతున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే బీ–ఫారాలు ఇవ్వనుండడంతో, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడానికి ముహూర్తాలు చూసుకునే పనిలో పడ్డారు. ఇతర పార్టీల వారి కంటే ముందుగానే నామినేషన్లు దాఖలు చేసి మరింతగా ప్రచారంపై దృష్టి పెట్టాలన్న నిర్ణయం మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రచారం చేపట్టిన టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు తర్వాత రెండో విడత ప్రచారం కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. అధినేతతో ప్రత్యేక భేటీ! టీఆర్ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే ఒకసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీ–ఫారాలు అందించేందుకంటూ ఏర్పాటు చేస్తున్న రెండో భేటీలో సైతం వివిధ అంశాలను ఆయన సమీక్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలుగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం తీరు తెన్నులను తెలుసుకుంటూ, వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అవసరమైన ప్రతి అభ్యర్థితో కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతూ ప్రచారానికి మార్గదర్శకం వహించారు. గత నెల నాలుగో తేదీన నల్లగొండ పట్టణంలో ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయా స్థానాలకు ప్రచార సామగ్రిని పంపించడంతోపాటు రోజు వారీగా ప్రచార సరళిని పరిశీలించి విశ్లేషిస్తూ అవసరమైన సూచనలు చేశారు. అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచిపోవడంతోపాటు, ఎన్నికల్లో అసలైన అంకం మొదలు కావడంతో నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్ వరకు మిగిలిన ఉన్న ఈ కాలంలో అభ్యర్థులు ఏమేం చేయాలన్న అంశాలపై చర్చిం చనున్నారని చెబుతున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత ఆయా నియోజవకర్గాల్లో తలెత్తిన అసమ్మతి వ్యవహారాలకు నెల రోజుల్లోపే చెక్ పెట్టడంతో మిగిలిన నెల రోజుల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో వారు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక, నోటిఫికేషన్ విడుదల తర్వాత అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చిస్తారని అంటున్నారు. ప్రచార సభలపై రానున్న స్పష్టత మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బహిరంగ సభల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక బహిరంగ సభను నల్లగొండలో నిర్వహించగా కేసీఆర్ పాల్గొన్నారు. అక్టోబరు నెలాఖరులో జిల్లాలోని నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు భావించినా అవి జరగలేదు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత .. ఆయన జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారని పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం నాటి కేసీఆర్ సమావేశం తర్వాత ప్రచార సభలు, నిర్వహించే తేదీలపై ఒక స్పష్టత రానుందని అంటున్నారు. అదే మాదిరిగా, ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడ, హుజూర్నగర్లపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. -
చనిపోయాకే వేలిముద్రలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫారం కోసం అపోలో ఆస్పత్రిలో అప్పటికే మరణించిన జయలలిత నుంచి వేలిముద్రలు సేకరించారని డీఎంకే వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ ఆరోపించారు. సంబంధిత ఆధారాలను జయ మరణంపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిషన్కు బుధవారం ఆయన అందజేశారు. జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించడం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. పోటీలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీఫారంలపై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయ సంతకం చేయాల్సి ఉంది. దాంతో అప్పటికే మరణించిన జయ వేలిముద్రలను బీఫారంలపై వేయించారని శరవణన్ కమిషన్ ముందు వాంగ్మూలమిచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు బాలాజీ సమక్షంలోనే జయ స్వయంగా వేలిముద్రలు వేశారని అప్పట్లో అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. జయ త్వరగా కోలుకుంటున్నారని చికిత్స రోజుల్లో అపోలో ఆస్పత్రి బులెటిన్లు కూడా విడుదల చేసింది. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి కావాలనేది జయ అభీష్టమని అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి స్వయంగా ప్రకటించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం త్వరలో అమ్మ డిశ్చార్జి అంటూ ప్రచారం చేశాయి. కానీ, జయ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలు పెరిగాయి. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నా డీఎంకే చీలిక నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం సైతం న్యాయవిచారణకు పట్టుపట్టారు. దీంతో జయ మరణంపై రిటైర్డు జడ్జి నేతృత్వంలో సర్కారు విచారణ కమిషన్ను ఏర్పాటుచేసింది. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణం వరకు జరిగిన ఘటనలపై నవంబర్ 22లోగా ప్రమాణపత్రాలివ్వాలని సంబంధిత వ్యక్తులను కమిషన్ ఆదేశించింది. జయ నివాసం పోయెస్ గార్డెన్లోని సిబ్బంది, అపోలో వైద్యులు, జయకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు, ఎయిమ్స్ డాక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు, ఉన్నతాధికారులు తదితరులకు ఈ సమన్లు ఇచ్చింది. కాగా, కమిషన్కు ఇప్పటివరకు 12 ప్రమాణపత్రాలు, 70కి పైగా అఫిడవిట్లు అందాయి. డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు..ఇలా మొత్తం ఏడుగురు ప్రమాణపత్రాలు ఇచ్చారు. -
జెడ్పీటీసీ బరిలో 121 మందే
శ్రీకాకుళం, న్యూస్లైన్: జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 121 మందే మిగి లారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు పూర్తి అయిన తర్వాత ఒక జెడ్పీటీసీ ఏకగ్రీవం కాగా.. మిగిలిన 37 జెడ్పీటీసీలకు 139 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. అయితే రంగంలో మిగిలిన కొందరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అటువంటి వాటిని తొలగించడంతో 121 మందే బరిలో ఉన్నట్లు తేలింది. ఆ మేరకు అధికారులు ప్రకటించారు. నరసన్నపేట జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు సైతం పూర్తి చేశారు. పార్టీల బీ ఫారాలు సమర్పించిన వారికి ఆయా పార్టీల గుర్తులను కేటాయించగా స్వతంత్రులకు ఉంగరం, ఎయిర్ కండిషనర్, చీపురు, బీరువా వంటి గుర్తులు కేటాయించారు. గుర్తులతో కూడిన తుది జాబితాను మంగళవారం సాయంత్రం జిల్లాపరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. కాగా జిల్లాలో బరిలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలు మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి కూడా పూర్తి స్థాయిలో జిల్లా పరిసత్ కార్యాలయానికి చేరలేదు. ఆయా మండల కేంద్రాల్లో మాత్రం తుది జాబితాలను ప్రటించారు. బుధవారం ఉదయానికి ఈ జాబితాలు జిల్లా కేంద్రానికి చేరే అవకాశం ఉంది. -
‘భీ’ ఫారాల లొల్లి
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: బీ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజు కావడంతో జెడ్పీ, ఎంపీటీసీలు పోటీ చేస్తున్న అభ్యర్థుల బీఫారాల కోసం బాహాబాహీకి దిగారు. వంగూరు జెడ్పీటీసీ స్థానం టీఆర్ఎస్ బీఫారంపై వివాదం రచ్చరచ్చ జరిగింది. జెడ్పీటీసీగా నామినేషన్ వేసిన కరాటే రాజుకు అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజుపై దాడికి యత్నించారు. బీఫామ్ నీకేంది ఇచ్చేదని తోసిపారేశారు. నన్ను చంపుతున్నారని కరాటే రాజు కేకలు వేయడంతో అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రాజును పోలీసులు టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం రాజు మాట్లాడుతూ బీఫామ్ త నకే ఇస్తానని చెప్పి నామినేషన్ వేయించారని, తీరా బీఫామ్ ఇచ్చే సమయంలో వేరే వ్యక్తికి ఇచ్చారని మండిపడ్డారు. ఓయూలో తాను చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించి... ఇప్పుడు గువ్వల బాల్రాజు మోసం చేశారని ఆరోపించారు. ఉదయం వరకు తనకే టిక్కెట్ ఇస్తానని చెప్పి... పూల్సింగ్కు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. బీఫాం చింపే ప్రయత్నం... కొత్తూర్ మండల జెడ్పీటీసీ స్థానానికి టీఆర్ఎస్ తరుఫున నామినేషన్ వేసిన సత్యయ్యకు ఇచ్చిన బీఫాంను ఏనుగ మహీందర్రెడ్డి చింపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సత్యయ్య తరుఫున ఉన్న వ్యక్తులు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి బీఫాం ఉన్న సత్యయ్యను నామినేషన్ కేంద్రంలోకి పంపించారు. ఒకే స్థానానికి ఇద్దరికి బీఫారాలు ధన్వాడ: ధన్వాడ-3 ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నీరటి నర్సింహులు నాయుడు, బోయ బాల్రాజులకు బీఫారాలు జారీ చేయడంతో ఇరువురు తమదే ఆమోదించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్తో వాగ్వివాదానికి దిగారు. నర్సింహులునాయుడుకు రెండురోజుల క్రితమే జిల్లా అధ్యక్షులు విఠల్రావు ఆర్య నుంచి పార్టీ బీఫారం పొంది ఎన్నికల అధికారికి అందజేశారు. సోమవారం శివకుమార్రెడ్డి వర్గానికి చెందిన బోయ బాల్రాజు మరో బీఫారాన్ని తెచ్చి ఎన్నికల అధికారికి ఇచ్చారు. దీంతో ఎవరిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాలో తెలియక ఎన్నికల అధికారి సందిగ్ధంలో పడిపోయారు.ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్ ‘పేట’ ఆర్డీఓ మోహన్రెడ్డి, సీఈఓతో చర్చించి...బాల్రాజుకు ఇచ్చిన బీఫారంలో సబ్స్ట్యూట్ అని సూచించలేకపోవడంతో మొదట బీఫారం తెచ్చిన నర్సింహులు నాయుడిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్రాజును స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు. -
చిత్తూరులో తెలుగు తమ్ముళ్ల గలాటా
స్థానిక ఎన్నికల సందర్భంగా చిత్తూరు నగర పాలక కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులకు చిట్ట చివరి నిమిషం వరకు బీ-ఫారాలు అందజేయలేదు. దీంతో వాళ్లు వచ్చి, తమ బీ ఫారాలతో నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం కాగా, అప్పటికే సమయం మించిపోయిందంటూ అధికారులు అందుకు అనుమతించలేదు. ఈ మొత్తం తతంగం పట్ల చిత్తూరు జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు విజయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక అభ్యర్థులెవరో ముందే నిర్ణయించుకున్నప్పుడు, బీ ఫారాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ఆమె మండిపడ్డారు. మొత్తమ్మీద కార్పొరేషన్ ఎన్నికల రంగంలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులుగా 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
ఉపసంహరణ రోజూ ‘బీ’ ఫారం ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్డ్ లేదా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల అధ్యక్షులు ఆథరైజేషన్ చేసిన నేతలు కూడా ఆ పార్టీల అభ్యర్థులకు ‘బీ’ ఫారాలను ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ అధికారిక అభ్యర్థులు ‘బీ’ ఫారాలను నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన చివరి తేదీన కూడా ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి ఆదేశాల మేరకు కార్యదర్శి నవీన్మిట్టల్ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘బీ’ ఫారాలు ఇవ్వడానికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చే ఆథరైజేషన్ ఫారం ‘ఏ’ను మాత్రం నామినేషన్ల దాఖలు చివరి తేదీన సాయంత్రం 5 గంటల్లో గా జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్లు), మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల రిటర్నింగ్ అధికారులకు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్కు ఫారం ‘ఏ’ అసలు ప్రతిని, దాని జిరాక్స్ ప్రతులను మున్సిపల్ కమిషనర్లకు పంపాలని వివరించారు. ఎవరికీ అథరైజేషన్ ఇవ్వనిపక్షంలో పార్టీ అధ్యక్షుడే ఫారం ఏ, ఫారం బీపై సంతకాలు చేసి నేరుగా రిటర్నింగ్ అధికారులకు పంపవచ్చని తెలిపారు. అభ్యర్థి ‘బీ’ ఫారంను పార్టీ అధ్యక్షుడే నేరుగా ఇచ్చినపక్షంలో ఫారం ‘ఏ’ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఒకే వార్డు/డివిజన్లో పలువురు అభ్యర్థులకు ‘బీ‘ ఫారం ఇస్తే.. మొదటగా ‘బీ’ ఫారం ఇచ్చిన వారినే అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తామని స్పష్టంచేశారు. లేని పక్షంలో ఎవరెవరి ‘బీ’ ఫారాలను రద్దు చేస్తున్నారో అధ్యక్షుడు మరో లేఖ ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అభ్యర్థి నామినేషన్ పత్రంలో ఓ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొని, గడువులోగా ఆ పార్టీ నుంచి ‘బీ’ ఫారం తెచ్చుకోలేకపోతే అతన్ని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు.