Bharatanatyam
-
‘రికార్డు’ స్థాయి నాట్యం
శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): మూడు వేల మంది చిన్నారులు.. నర్తించిన వివిధ నృత్య రూపకాలు నాలుగు రికార్డులను నమోదు చేశాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతాస్ఫూర్తి కేంద్రం ఇందుకు వేదిక గా మారింది. సమతాకుంభ్–2025 తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘంటసాల పవన్కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం చే సిన నాట్యం ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల చిన్నారులు వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య గోల్డెన్ స్టార్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి చిన్నారులకు మంగళశాసనాలు అందజేశారు. -
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!
శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్సెటర్గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్ గురువు సరోజ్ వైద్యనాథన్. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు. రామా వైద్యనాథన్ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్ స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది. ఎదిరిస్తూ నిలుస్తూ..పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్ క్లాసుల కోసం సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు. యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి. నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది. --రామా వైద్యనాథన్(చదవండి: రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!) -
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షిణి కి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు. గురువు హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన 16వ ఏట వర్షిణి భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమంకు ఉపక్రమించింది. ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిధులు ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ.. భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు. రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని అన్నారు. సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ.. ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు. అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా భరతనాట్యం రంగప్రవేశం గావించిన వర్షిణి నాగంను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి వర్షిణి నాగంకు ప్రశంసా పత్రం ను ప్రదానం చేశారు. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా అభినందిస్తూ "సిలికానాంధ్ర సంపద" కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల విడుదల అభినందనాపత్రాన్ని "సంపద" అనుసంధానకర్త శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణికి అందజేశారు.ఈ కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువు హేమ భరతనాట్య శిక్షణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ చలంచర్ల ఏడుకొండలు, కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి విడుదల అయిన ప్రశంసా పత్రాలను వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు.అంతకు మునుపు స్థానిక హారిస్ సెంటర్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి వర్షిణి ప్రేక్షకులకు కనువిందు చేసింది. స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్ శిష్యురాలైన వర్షిణి భరతనాట్యంలో రంగప్రవేశం ప్రదర్శన చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు ఐదు వందలకు పైగా స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు హాజరై వర్షిణి ని అభినందించారు. విశ్రుత్ నాగం ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది. వర్షిణి తల్లిదండ్రులు వాణి - వెంకట్ నాగం ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గురుహేమ సత్యనారాయణ్కు సత్కారం చేశారు. వర్షిణి నాగం సోదరుడు చిరంజీవి. విశ్రుత్ నాగం ఈ సందర్భంగా వేదికపై ఏకదంతాయ వక్రతుండాయ, ఆనందామృతకర్షిణి, అన్నమయ్య కీర్తన "శ్రీమన్నారాయణ" మూడింటినీ భావయుక్తంగా ఆలపించాడు. విశ్రుత్ నాగం 15 ఏండ్ల వయస్సులో 2018లో విజయవాడలో కర్ణాటక సంగీతంలో రంగప్రవేశం చేసిన విషయాన్ని ఆహుతులు గుర్తుచేసుకున్నారు. ఒకే ప్రవాసాంధ్ర కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు వేర్వేరు విభాగాలలో ఆరు,ఏడు ఏళ్లల్లోనే రంగప్రవేశం చేయడం విశేషం అన్నారు. ఈ స్పూర్తితో ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుందని అన్నారు. (చదవండి: అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు) -
13 ఏళ్లకే అరంగేట్రం... చైనా బాలిక రికార్డు!
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయలకు ఎంతో గౌరవం ఉంది. మన ఆచార వ్యవహారాలను ఎంతగానో ఇష్టపడతారని ఎన్నోసార్లు తేటతెల్లమయ్యింది. అది తాజాగా బీజింగ్లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో నిజమని తేలింది. చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజింగ్లో చైనా బాలిక లీ ముజి (13) అరంగేట్రం (Arangetram) ప్రదర్శన సంచనలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా 'అరంగేట్రం' ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్చార్జ్ టీఎస్ వివేకానంద్ మాట్లాడుతూ..చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిన 'అరంగేట్రం' ఇది అన్నారు. ఇక్కడ లీ చైనీస్ ఉపాధ్యాయులచే చైనాలోనే ఈ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ప్రదర్శించడం విశేషం. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ షాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేగాదు లీ ప్రదర్శనం కోసం చెన్నై నుంచి విమానంలో సంగీత విద్వాంసుల బృందం తరలి వచ్చింది. కాగా, లీ ఈ నెలాఖారున ఆమె చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది. అరంగేట్రం అంటే?భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు.(చదవండి: తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!) -
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. వారి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని.. 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో ఖ్యాతి సంపాదించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. -
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్రెడ్డి -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా కెరీర్ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Actress Sreeleela: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు..ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్
శ్రీలీల పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యాన్సుల వల్ల ఈమెని ట్రోల్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కనబెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలలో మళ్లీ పాత అమ్మాయి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక సినిమాల్లోకి వచ్చిన క్లాస్ డ్యాన్సులు పక్కనబెట్టి మాస్ డ్యాన్సులు చేయడం షురూ చేసింది. దీంతో పాత శ్రీలీలని చాలామంది మిస్ అయ్యారు. తాజాగా హైదారాబాద్లో సమతా కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్స్టాప్గా ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో దిగువనే ఉంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) After a long time, Sreeleela Bharatanatyam classical dance performance at #SamathaKumbh2024 That charm, elegance and expressions 😍✨ Literally got chills watching this I'M SO PROUD OF YOU @sreeleela14 🫡#Sreeleela ♥️🙏🏼 pic.twitter.com/xysonVncVP — Mighty Mate (@MightyMate118) March 2, 2024 -
అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్లో నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్నాథ్ కోల్కతాకు చెందినవారు. పీహెచ్డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు. My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening. Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood. Well the reason , accused details everything are not revealed yet or perhaps no one… — Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024 అమర్నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. Deep condolences to family & friends of deceased Amarnath Ghosh in StLouis, Missouri. We are following up forensic, investigation with police & providing support. @IndianEmbassyUS @MEAIndia — India in Chicago (@IndiainChicago) March 1, 2024 -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
గిఫ్టెడ్ ఆర్టిస్ట్ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు
-
పెళ్లికి ముందే వరుణ్కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరై సందడి చేసింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఎక్కడా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా.. స్పందించలేదు. చివరకు ఎంగేజ్మెంట్ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటకు వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఇటలీలో జరుగబోతుందట. (చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లికి ముందే వరుణ్కి ఓ కండీషన్ పెట్టిందట లావణ్య. ఆ కండిషన్ కు ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత కూడా భరతనాట్యం చేయాలనేది ఆమె కోరిక. ఇదే విషయాన్ని వరుణ్కు చెప్పిందట. పెళ్లి తర్వాత ఏదైనా స్టేజ్పై భరతనాట్యం చేసే చాన్స్ వస్తే వదులుకోనని తేల్చి చెప్పిందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా.. ప్రొడక్షన్స్ వైపు వెళ్తానని చెప్పిందట. లావణ్య కండీషన్స్కి వరుణ్తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. -
Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు
భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు.... ‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి. చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది. డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్లో ‘రాగమాల డ్యాన్స్ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది. ‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి. ‘రాగమాల ట్రైనింగ్ సెంటర్’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు. ‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి. పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది. ‘క్రియేటివ్ పర్సన్ లేదా ఆర్టిస్ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి. భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం. డీప్ లవ్, డెడికేషన్, డిసిప్లిన్. ‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం... ‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్ ఇన్ వాటర్’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు వచ్చింది. ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు. ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు. నోట్స్ రెడీ ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్లు నోట్స్తో రెడిగా ఉన్నారు. -
Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!
‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది. ఒక డాక్టర్ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు చూరగొనడమే డాక్టర్ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సినీగీతాల భరతనాట్యం! ‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్కు అంతరాయం రానిచ్చేది కాదు. నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్ అది. ఆ రోజు అక్టోబర్ 29. అందుకే 29 పాటల థీమ్ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్ఫ్మార్మెన్స్ చిరంజీవి గారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. అమ్మాయి పుడితే బహుమతి! డాక్టర్గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్ ప్రీతి. సమాజానికి తిరిగి ఇవ్వాలి! గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్ ప్రీతి ‘బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె. –వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి వైద్యయోగం! యోగసాధన దేహాన్ని, మైండ్ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్ నెర్వస్ సిస్టమ్తోపాటు పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్కి రిలాక్సేషన్నిస్తూ కామ్గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది. – డాక్టర్ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ -
సింగపూర్లో ఒంగోలు తెలుగు తేజం భరతనాట్య అరంగేట్రం
సింగపూర్: ప్రకాశం జిల్లా మైనంపాడుకు చెందిన గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్లో ఘనంగా జరిగింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి నృత్యాభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఐదేళ్ల ప్రాయం నుంచే నాట్యం అభ్యసించిన సాయి తేజస్వి అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాల్లో అవార్డులను, 2019లో త్యాగయ్య టీవీ కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందారు. సోదరి ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమంలో సాయి గురువు శ్రీలిజీ శ్రీధరన్ రూపకల్పన చేసిన నృత్యాలతో తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను అలరించారు. శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను అందుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు శ్రీమతి పద్మజా రెడ్డి సాయితేజస్వి ని ఆశీర్వదించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి శ్రీ వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిధులుగా విదూషి డా.ఎం.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త శ్రీమతి సునీత రెడ్డి హాజరై సాయి తేజస్వికి దీవనెలు, అభినందనలు అందించారు. ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు. హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం భావితరానికి స్ఫూర్తిదాయకమనీ, భారతీయ కళలకు గర్వకారణమని సభికులు ప్రశంసించారు. -
వావ్.. అంకుల్ స్టెప్పులిరగదీశాడు కదా..!
సరదాగానో, ఇంట్లో ఎవరు లేనప్పుడో, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో డ్యాన్స్ చేయడం కామన్. కానీ సంప్రదాయ నృత్యం చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భరత నాట్యం, కూచిపుడి వంటి డ్యాన్స్లు చేయడం చాలా కష్టం.. అది కూడా ఆ నృత్యాలకు సంబంధించిన వస్త్రాలు ధరించి. కానీ ఇక్కడ ఉన్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యతో నోరు వెళ్లబెడతారు. మాములుగా భరతనాట్యం డ్రెస్ ధరించి.. డ్యాన్స్ చేయడానికి ఆడవారే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ పురుషుడు భరతనాట్యం డ్రెస్ ధరించి.. ఎంతో అందంగా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పైన చొక్క, కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఉన్నాడు. ఇక అతడు ఎంతో అద్భుతంగా.. చాలా సులభంగా.. అందంగా భరతనాట్యం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతో అందంగా, క్లియర్గా చేశారు.. అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
చిన్న విరామం
‘‘లాక్డౌన్ వల్ల భరతనాట్యం నేర్చుకునే వీలు కుదిరింది’’ అంటున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. లాక్డౌన్ వల్ల తన రోజులు ఎలా గడుస్తున్నాయన్న విషయంపై ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘లాక్డౌన్ను ప్రకటించగానే ముందు నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే నేనెప్పుడూ పనితో బిజీగా ఉండాలనుకుంటాను. గతంలో క్లాసికల్ డ్యాన్స్లో ప్రావీణ్యత సంపాదించాలని ప్రయత్నించాను. అప్పట్లో కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల వల్ల నాకు కొంత ఖాళీ సమయం దొరికింది. దీంతో నేను ఎప్పుట్నుంచో కలలు కంటున్న భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇందుకోసం కొన్ని వారాలుగా ప్రతిరోజూ రెండు గంటలు ఆన్లైన్ క్లాసులను ఫాలో అవుతున్నాను. కానీ కాస్త బ్యాక్పెయిన్ రావడంతో ప్రాక్టీస్కు చిన్న విరామం ఇచ్చాను. ఈ నొప్పి తగ్గాక సాధన ప్రారంభిస్తాను. ఇంకా ఈ లాక్డౌన్ సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను థియేటర్లో చూడలేకపోయిన సినిమాలను ఇప్పుడు చూస్తున్నాను. టీవీ సీరియల్స్ను కూడా ఫాలో అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. -
అరివీరమణివణ్ణన్
మగధీరులకు మాత్రమే పరిమితమైన సిలంబమ్ యుద్ధకళలో ఇప్పుడు నారీమణులూ తమ ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. ఐశ్వర్యా మణివణ్ణన్ అనే కేరళ యువతి ఆ ప్రావీణ్యానికి ఒక ప్రతీకాత్మకశక్తిలా నిలిచారు! గులాబీ బోర్డరున్న నెమలి కంఠం రంగు చేనేత చీర కట్టుకుందామె. సంప్రదాయబద్ధంగా పేరంటానికి వెళ్తుందేమో అనిపించేలా ఉంది ఆహార్యం. చూపరుల అంచనాను తలకిందులు చేస్తూ ఒకచేతిలో కర్ర, మరో చేతిలో బరువైన కత్తి పట్టుకుని బరిలో దిగింది. భరతమాత, తెలుగుతల్లిలాగానే యుద్ధమాత పాత్ర పోషిస్తోందేమో అనుకుంటే పొరపాటే. ఆమె ఆ పాత్రలో నటించడం లేదు, ఆ పాత్రలో జీవిస్తోంది. ఆమె కేరళకు చెందిన ముప్పై ఏళ్ల ఐశ్వర్యా మణివణ్ణన్. మీసాలను వంచింది! బరిలో మగవాళ్లతో పోటీపడి యుద్ధం చేస్తోంది ఐశ్వర్య. ఒక చేతిలో కంబు (కర్ర), మరో చేతిలో వాల్ (కత్తి) గాలిని చీలుస్తూ విన్యాసాలు చేస్తున్నాయి. వాటికి దీటుగా ఐశ్వర్య దేహం నేల మీద నుంచి రెండడుగుల పైకి లేచి ప్రత్యర్థి దాడిని తిప్పి కొడుతోంది. జానపద కథలో యువరాణిని తలపిస్తోందామె. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమె చేస్తున్న యుద్ధకళ పేరు సిలంబమ్. అది మూడు వేల ఏళ్ల నాటి కేరళ యుద్ధవిద్య. ‘ఇంతటి నైపుణ్యంతో యుద్ధం చేయడం మగవారికి మాత్రమే సాధ్యం’ అనుకుంటూ వచ్చిన సంప్రదాయపు భ్రాంతిని చీల్చి చెండాడుతోంది ఐశ్వర్య. ఆమెను చుట్టుముడుతూ మగ సిలంబమ్ వీరులు ఒక్కొక్కరుగా బరిలోకి వస్తున్నారు. వారందరినీ ఏకకాలంలో ఎదుర్కొంటోందామె. ఆమె ఛేదించింది మగవారికి పరిమితం అనుకున్న యుద్ధవిద్యా వలయాన్ని మాత్రమే కాదు, శౌర్యానికి, వీరత్వానికి ప్రతీకగా మగవాళ్లు మెలితిప్పుకున్న మీసాలను కూడా ఆమె తన కత్తి మొనతో కిందకు వంచింది. భరతనాట్యం నుంచి ఐశ్వర్య మొదట్లో భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమె గురువు కవితా రాము సిలంబమ్ సాధన చేయమని సూచించడంతో ఐశ్వర్య ఇలాంటి మలుపు తీసుకుంది. నిజానికి కవితా రాము సిలంబమ్ సాధన చేయమని చెప్పిన ఉద్దేశం వేరు. సిలంబమ్ సాధన ద్వారా దేహదారుఢ్యం ఇనుమడించి, శరీరాకృతి చక్కగా తీరుతుంది, కాబట్టి భరతనాట్య సాధన సులువవుతుందనే ఉద్దేశంతో చెప్పారామె. గురువు చెప్పినట్లుగానే సిలంబమ్ సాధన మొదలు పెట్టిన తర్వాత భరతనాట్యం కంటే సిలంబమ్ సాధన చేయడాన్ని బాగా ఎంజాయ్ చేయసాగింది ఐశ్వర్య. అప్పటి నుంచి పూర్తి స్థాయి సిలంబమ్ యుద్ధకళకే అంకితమైంది. ‘ఇది ఓ సముద్రం, ఈదుతూ సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మరిన్ని మెళకువలు ఒంటపడతాయి. భరతనాట్యం ఎంతోమంది చేస్తారు. సిలంబమ్ సాధన అమ్మాయిలు చేయరు. అయితే ఇది ఆత్మరక్షణనిచ్చే కళ. అమ్మాయిలకు చాలా అవసరం కూడా. ఈ విషయాన్ని ప్రచారం లోకి తీసుకురావాలి. ఈ కళకు ప్రాచుర్యం కల్పించాలన్నదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’ అన్నారు ఐశ్వర్య. – మంజీర పతకాల రాణి మలేషియాలో 2016లో జరిగిన ఏషియన్ సిలంబమ్ చాంపియన్ షిప్ పోటీల్లో వివిధ కేటగిరీలలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించింది ఐశ్వర్య. ‘‘సిలంబమ్ యుద్ధకళ దేహ దారుఢ్యాన్ని మాత్రమే కాదు మానసిక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ధ్యానం వంటిది. దేహం, మెదడు ఏకకాలంలో దృష్టిని కేంద్రీకరిస్తూ సాధన చేయాలి. రెండింటి మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. సిలంబమ్ సాధనలో ఈ సమన్వయం మెరుగవుతుంది. సిలంబమ్ సాధనకు వయసు పరిమితులేవీ ఉండవు. ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడానికి వర్క్షాప్లు నిర్వహిస్తున్నాను. చాలా స్కూళ్లు వాళ్ల కరికులమ్లో సిలంబమ్ మార్షల్ ఆర్ట్ను చేర్చడానికి సిద్ధమవుతున్నాయి’’ అన్నారు ఐశ్వర్య. -
నృత్యగాన చైతన్యం
సామాజిక సమస్యలపై స్పందించే గుణం లేకుంటే కళాకారులెలా అవుతారని ప్రశ్నించే సంధ్యామూర్తి (65) .. భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలిచిన శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ఎంతోమందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతూనే మహిళాభ్యుదయ సాధన కోసం స్త్రీ చైతన్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ∙ బుడిబుడి అడుగులతోనే నా మూడేళ్ల ప్రాయం నుండే మా నాన్నగారు పీఎస్ శర్మ నన్ను నాట్య ప్రవేశం చేయించారు. నేను అనంతపురంలోనే పుట్టి పెరిగాను. మా నాన్న అప్పట్లో లలితకళాపరిషత్తు సెక్రటరీగా ఉండేవారు. మైసూరు నుండి అనంత కొచ్చిన నాట్యకోవిదులు వరదరాజఅయ్యంగార్ వద్ద భరతనాట్యం, కూచిపూడిలో పార్వతీశం వద్ద కూచిపూడి నేర్పించారు. చెన్నైకు చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూకైలాస్ నాటకంలో బాల వినాయకునిగా నటించాను. దేవదాసీలనేవారు మా చిన్నప్పుడు మహిళలు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో సభ్యసమాజం భావించేది. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. మా నాన్నగారికి కళపై ఉన్న అభిమానంతో నాకు పద్నాలుగేళ్లు వచ్చేవరకు చెప్పించి ఆ తర్వాత మానిపించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆనాటి సమాజానికి భయపడడం వల్ల ఇక నా నాట్యం ఆగిపోయిందనే భావించాను. అప్పట్లో భరతనాట్యమే నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో శాస్త్రీ నృత్యమంటే భరత నాట్యమే. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవారు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ పట్టింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లందరూ రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. వారి స్ఫూర్తి కారణంగానే నేను రంగస్థలంపై ప్రయోగాలు చేయగలిగాను. తొలి నాట్య పాఠశాల 1969లో మేము శ్రీ నృత్య కళానిలయం స్థాపించాము. బహుశా జిల్లాలోనే తొలి సంగీత, నాట్య పాఠశాల అదే కావొచ్చు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు కళానిలయంలో శాస్త్రీయ నృత్యాలు నేర్చుకున్నారు. ఎంతో మంది నాట్య గురువులుగా కూడా మారారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మీ ‘విదూషీ’ శిక్షణ పొందారు. విదేశాలలో ప్రదర్శనలు నాకు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాలు తిరిగాము. అక్కడ కూడా నేను నాట్యం నేర్పించేదాన్ని. అనంతకొచ్చేసిన తర్వాత మా శిష్యబృందంతో న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు, కోల్కతా, ఒడిశా లాంటి అన్ని ప్రధాన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి పలు దేశాలలో ప్రదర్శనలిచ్చాము. పరాయి రాష్ట్రాలలోనూ అనంత కీర్తి మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలల కంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరత నాట్యం నేర్పించాను. ఇప్పటికీ అక్కడి నా శిష్యులు నన్ను పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నాను. సమస్యల పట్ల స్పందించాలి ప్రస్తుత సమాజం గందరగోళంగా మారుతోంది. అడుగడుగునా బాలికలకు భద్రత లేకుండా పోతోంది. అవగాహన లేని వయసులో అర్థం పర్ధం లేని ప్రేమలతో కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. వీటన్నిటికి పరిష్కారమార్గం కళలు చూపిస్తాయి. సమాజంలో సమస్యలు వచ్చినపుడు.. మహిళా సమస్యలపై కళాకారులు స్పందించాలి. వారైతేనే సమస్యను సున్నిత కోణంలో వివరించగలరు. మేము బాలికలకు ఇదే విషయమై రోజూ కొంత సమయమైనా కేటాయించి మాట్లాడుతుంటాం. – గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం -
యునెస్కోలో భరత నాట్య ప్రదర్శన
లండన్: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పరిశోధకురాలు బాలాదేవీ చంద్రశేఖర్ తన ప్రదర్శన ద్వారా చరిత్ర సృష్టించనున్నారు. గురువారం ఆమె పారిస్లోని యునెస్కో(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి)లో వివిధ దేశాలకు చెందిన 100 మంది సమక్షంలో ‘బృహదీశ్వర’ అంశంపై భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘ఇది చాలా అరుదైన ప్రదర్శన. భారతీయ ప్రాచీన కట్టడాలపై ఆసక్తి కలిగించేందుకు, మన దేశం, సంస్కృతులపై అవగాహన పెంచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది’ అని బాలాదేవి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా ‘బృహదీశ్వర’ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. -
సన్నీలియోన్ వద్దు.. భరతనాట్యం ముద్దు!
సాక్షి, బెంగళూరు : బాలీవుడ్ నటి సన్నీలియోన్కు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. బెంగళూరులో నిర్వహించే న్యూఇయర్ వేడుకల్లో సన్నీలియెనపాల్గొనాల్సి ఉంది. సన్నీలియోన్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో వివాదాలకు దారితీసింది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం సన్నీలియోన్ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందూ అతివాద సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నీలియోన్ రాకను వ్యతిరేకిస్తూ.. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కొద్ది రోజుల నుంచి ఉద్యమాలను నిర్వహిస్తోంది. సన్నీలియోన్ రాకవల్ల కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని రక్షణ వేదిక పేర్కొంటోంది. న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి కర్ణాటక రక్షణ వేదికకు అనుకూలంగా స్పందించారు. సన్నీలియోన్ పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అయితే సన్నీలియోన్ ప్రోగ్రాం స్థానంలో భరతనాట్యం, ఇతర సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించడం విశేషం. సన్నీలియన్ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని కర్ణాట రక్షణ వేదిక ప్రకటించింది. కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆమెను ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేసిన విషయం విదితమే. -
ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం
న్యూయార్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే వారం న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ఐరాస తరఫున కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మహిళాదినోత్సవం రోజున ఐరాసలో నృత్యంచేసే అవకాశంరావడం గర్వంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ నాట్య ప్రదర్శన చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం ఆమె తనదైన రీతిలో రిహార్సల్ చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్ సతీమణి అయిన ఐశ్వర్య ఇటీవల ‘స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్: ద స్టోరీ ఆఫ్ ఏ గర్ల్ అమాంగ్ ది స్టార్స్’ అనే పుస్తకం రాశారు. -
నటరాజ పున్నమి
యామిని యామిని కృష్ణమూర్తి (76) నాట్యకళాకారిణి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో.. నిండు పున్నమినాడు జన్మించిన యామిని తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. అక్కడే నాట్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ‘యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్’ నాట్యాచార్యురాలిగా బోధనాంశాలలో నిమగ్నమై వున్నారు. యామిని అసలు పేరు పూర్ణతిలక. నాట్యంలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. పద్మవిభూషన్ గ్రహీత కూడా. ఇటీవల ‘నటరాజ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ’ వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. యామినితో ముచ్చటించింది. ఆ విశేషాలు: యామిని తండ్రి కృష్ణమూర్తి కూతుర్ని కూడా తనలా పండితురాలిని చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేశారు. అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం... ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థాన గురించి చెప్పడ మొదలుపెట్టారు యామినీ. తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్ కళాక్షేత్రకు తీసుకువెళ్లారు. యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు. పండుగలన్నీ నాట్య వేదిక మీదే! భరతనాట్యం నేర్చుకునే సందర్భంలోనే కూచిపూడి నాట్యం వైపు యామిని మనసు మళ్లింది. ఆ తర్వాత కూచిపూడి వైభవానికి ఆమె పాటుపడ్డారు. అది చాలా చిత్రంగా జరిగింది.తర్వాత ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు కేలూచరణ్ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యం అభ్యసించారు. ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ... ఒక్కోటి గంట సేపు ప్రదర్శించేదాన్ని. మరొక విషయం చెప్పాలి. నాకు పండుగలన్నీ నాట్యవేదిక మీదే జరిగేవి. ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో నా నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం’’ అని చెప్పారు యామిని. ఆలయాలు తొలి నాట్యాలయాలు యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చెన్నైలోని చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గర కావడంతో, దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటూ వివరించారు యామిని. – డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ ‘యామిని ఉందా?’ ►ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘‘యామిని ఉందా’’ అని అడిగేవారు. ∙నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ‘క్షీరసాగరమథనం’ నృత్యరూపకం ప్రదర్శించడం ఒక మధురానుభూతి. ►కలకత్తా ప్రజలను చూస్తే ‘ఆర్ట్ ఈజ్ ఇన్ దెయిర్ హార్ట్స్’ అనిపిస్తుంది. ►నేను లోన్లీ పర్సన్ కాను, ఎలోన్గా ఉంటాను, డిలైటెడ్గా ఉన్నాను. ∙విమర్శించాలనుకునేవారు... సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు అని – సూర్యుడిని కూడా విమర్శిస్తారు. బందిపోట్ల కోసం నాట్యం! ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు. నాట్యం నేర్పింది ‘రైతు బిడ్డ’ వేదాంతం రాఘవయ్య గారి ‘రైతు బిడ్డ’ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది. -
నృత్యాభిషేకం
తిరుమల : తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన రత్నమాల శర్వణన్lబందం కళాకారులు మహాభారతంలోని పలు ఘట్టాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారులకు నాదనీరాజనం సిబ్బంది లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
భద్రాచలంలో నృత్యాభిషేకం సందడి
-
నృత్య మార్గదర్శిక
భారత సంప్రదాయ కళలపై సృష్టి బదోరి రాసిన పుస్తకం... ‘నృత్య మార్గదర్శిక’. నాట్యరంగ ప్రముఖులు వీఎస్ రామమూర్తి, మంజులా రామస్వామి శిష్యురాలైన సృష్టి భరతనాట్య కళాకారిణి. శ్రీరామ నాటక నికేతన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు పుస్తకావిష్కరణ ఉంటుంది. కళ, విద్యారంగ ప్రముఖులు హాజరువుతారు. -
నాట్యోపాసనం
అద్భుతం.. అమోఘం.. అపూర్వం! ఇదేంటిలా అంటున్నారు? అనుకుంటున్నారా! మంజుల రామస్వామి శిష్యబృందం నగరంలో ప్రదర్శించే వైవిధ్యమైన భరతనాట్య ప్రదర్శనను తిలకిస్తే, ఎవరైనా ఇలా అనక మానరు. ఎంతోమంది ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొన్నా.. కొన్నింటికి కొందరే లెజెండ్స్. ప్రజల హృదయాల్లో వారి స్థానం సుస్థిరం. భరతనాట్యం అనగానే తెలుగు, తమిళులకు గుర్తుకు వచ్చేది మంజులా రామస్వామే. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే మంజులను ముందుగా ఇటీవల నగరంలో ఓ అవార్డు అందుకొన్న సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలుకరించింది. శ్రీరామ నాటక నికేతన్... భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాల్లో ప్రాచుర్యం పొందిన విశిష్ఠ పక్రియ భరతనాట్యం. అలాంటి దైవికమైన నృత్యం మద్రాసు రాష్ట్రంలో కొన ఊపిరితో ఉండగా, దానికి ప్రాణం పోసి, దీర్ఘాయుష్షు కల్పించేందుకు పుట్టిన సంజీవిని శ్రీరామ నాటక నికేతన్. నృత్యగురువు ‘దండయార్థపాణీ పిళ్లై’ దానికి ప్రాణం పోశారు. ప్రముఖ భరతనాట్య గురువు వీఎస్ రామమూర్తి (మా నాన్నగారు)దానిని అందిపుచ్చుకున్నారు. మా స్వస్థలం తంజావూరు. 1970లో ఇక్కడికి వచ్చాం. అప్పుడే సికింద్రాబాద్లోని అల్వాల్లో నృత్య పాఠశాల స్థాపించారు. నమస్కరిస్తా... భాషా సాంస్కృక శాఖకు చేతులెత్తి నమస్కరిస్తా. ఎందుకంటే రాష్ట్రం విడిచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాం. మా నాన్నను, నన్ను, నా శిష్యులను అభిమానించి అక్కున చేర్చుకున్నారు. వెన్నుదన్నుగా నిలిచారు. పరాయి రాష్ట్రంవాళ్లమన్న భావనతో ఏనాడూ చూడలేదు. తల్లిలాగా ఆదరించిది హైదరాబాద్ నగరం. అలాంటి తెలుగు ప్రజల సహృదయత వర్ణించటానికి మాటలు సరిపోవు. ఇప్పుడు మేము తెలుగు బిడ్డలమే. నాన్ననే ఫాలో అవుతా... నాన్న ప్రిన్సిపుల్స్ ఉన్న వ్యక్తి. నేను ఆయననే ఫాలో అవుతా. దేశంలో, విదేశాల్లో నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే.. అందుకు కారణం నాన్నగారే. ఆయనెప్పుడూ ఒక్కటే చెప్పేవారు ‘పిల్లలు’ (శిష్యులు)తెచ్చే అవార్డులేమనకు అవార్డులు, రివార్డులు. వాటి కోసం పరితపించకూడదు’ అని. ఆయన చెప్పిన మాటలు, చూపిన దారే నాకు ముఖ్యం. డ్యాన్స్తో పాటు హార్డ్వర్క్, విలువలు, కమిట్మెంట్ ప్రామాణికంగా శ్రీరామ నాటక నికేతన్ ముందుకు సాగుతుంది. మేం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం డ్యాన్సే. ఒక గంట క్లాస్లో ఉన్నామంటే అన్నీ మరచిపోతాం. కావాల్సిన ఎనర్జీ వస్తుంది. రెండో ఇల్లు... పిల్లలకు రెండో ఇల్లులాంటిది శ్రీరామ నాటక నికేతన్. ఏడేళ్లుదాటిన పిల్లలను చేర్చుకొంటాం. నృత్యం నేర్చుకోవడం వల్ల సహనం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయి. ‘దీపతరంగిణి’ని తొలుత దేవదాసీలు చేసేవారట. 1966లో మా నాన్నగారు ‘ప్లేట్ అండ్ ప్లాట్’ నృత్యాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ‘దీపతరంగిణి చేస్తే మంజులా రామస్వామి శిష్యులే చేయాలి’ అని ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఈ నృత్యం చేసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. - కోన సుధాకర్రెడ్డి -
మయూర మీనాక్షి
మీనాక్షి శ్రీనివాస్! మోడర్న్ ఇండియన్ ఉమెన్కి ప్రతీక. ఆర్కిటెక్ట్గా పురాతన కట్టడాలకు ప్రాణం పోస్తూనే.. కాలికి అందెలు కట్టుకుని భరతనాట్యంలో ప్రావీణ్యం చూపుతున్నారు. దానికి సృజనాత్మకతను, ప్రయోగశీలతను జోడించి, శాస్త్రీయ నృత్యాన్ని నవతరానికి చేరువ చేస్తున్నారు. హేమ అరంగమ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన ఆమె... సిటీప్లస్తో ముచ్చటించారు. ..:: కోన సుధాకర్ రెడ్డి మాది చెన్నై. అమ్మ స్ఫూర్తితోనే నాట్యం నేర్చుకున్నా. పద్మవిభూషణ్ అలర్మేల్ వల్లీ దగ్గర శిక్షణ పొందాను. ఆమెను ఎప్పటికీ మరువలేను. ట్రెడిషినల్ ఆర్ట్ ఫామ్ ద్వారా సమాజానికి చాలా చేయవచ్చు. నా శ్వాస ఉన్నంత వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూనే ఉంటాను. జీవన నృత్యం.. భరతనాట్యం ఒక సంప్రదాయ నృత్యం. ప్రేక్షకులను సమ్మోహితులను చేయడమే దాని లక్ష్యం. ఒత్తిడి దూరం చేసే దివ్య ఔషధం. ఆర్ట్తోనే ధ్యానం చేయవచ్చు. తాళానికి అనుగుణంగా కదిలించే పాదాలు, భావాన్ని కురిపించే నేత్రాల ద్వారా నృత్యం చూసే ప్రేక్షకుల ఆత్మను మన అధీనంలోకి తెచ్చుకుని వారిలోని నెగటివ్ శక్తిని తొలగించి, పాజిటివ్ శక్తిని నింపవచ్చు. ఆ శక్తి నాట్యానికి ఉంది. ఇది బాగా సాధన చేస్తున్న వారికే సాధ్యం. ఈ ఎలిమెంట్ పట్టుకున్న ఎవరైనా పెద్ద నృత్యకారులు అవుతారు. నాట్యంపై నిబద్ధతతో పాటు కుటుంబసభ్యుల మద్దతు ఉండటం వల్లే.. నా వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. చదువు విజ్ఞతను నేర్పింది. నాట్యం జీవన గమనాన్ని చూపింది. దేశవిదేశాల్లో... దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అంతర్జాతీయంగా యూరోప్, సింగపూర్, ఉత్తర అమెరికా, మలేసియాలో నృత్య ప్రదర్శనలు నిర్వహించాను. చాలా అవార్డులొచ్చాయి. అందులో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అందుకోవడం మరచిపోలేని అనుభూతి. హైదరాబాద్తో అనుబంధం.. హైదరాబాద్ సంస్కృతి విలక్షణమైనది. అది చరిత్రే కాదు.. వర్తమానం కూడా. సౌత్ ఇండియాలో హైదరాబాద్ కల్చర్ చాలా గొప్పది. 2000 సంవత్సరంలో తొలిసారి శిల్పారామంలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చాను. ఇది ఈ నగరంలో నా రెండో ప్రదర్శన. సిటీతో ఈ అనుబంధాన్ని మరచిపోలేను. ఇక్కడ అద్భుతమైన నర్తకీమణులు ఉన్నారు. -
ఉల్లాసంగా... ఉత్సాహంగా
కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని క్లబ్లో నిర్వహిస్తున్న జాతీయ బాలోత్సవ్-14కు రెండోరోజు సుమారు ఎనిమిది వేల మంది చిన్నారులు హాజరై తమ ప్రతిభను చూపారు. జానపదనృత్యాలు, తొలిసారిగా పేరిణినృత్యం, వివిధ అంశాల్లో చిన్నారుల ప్రదర్శనలు అద్భుతంగా కనువిందు చేశాయి. హోరెత్తించిన జానపదాలు... జానపదం అంటేనే జనపదం.. జనం గుండెల్లోనుంచి పుట్టుకొచ్చిన జానపదానికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ బాలోత్సవ్లో జానపద పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు అదేస్థాయిలో తమ సత్తా చాటారు. ‘కోయిలో కోయిల’ అంటూ హన్మకొండకు చెందిన తరుణి కరావ్ చేసిన నృత్యం హుషారెత్తించింది. ‘ఈలవేసిండు పోరగాడు’.. అంటూ వరంగల్కు చెందిన చందన చేసిన నృత్యం ప్రతీ ఒక్కరిచేత ఈల వేయించింది. ‘ఆటోరిక్షా తోలేటోడా’.. అంటూ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన సుమన చేసిన నృత్యానికి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ‘నా అందం చూడు బాబయ్యో’... అంటూ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన సాహితి చేసిన నృత్యానికి స్టేడియంలో ఉన్న విద్యార్థులు కూడా నృత్యం చేశారు. ‘కారనమ్మ కారణం’... అంటూ విజయవాడకు చెందిన నిఖితశ్రీ చేసిన నృత్యం ఎంతగానో అలరిచింది. తొలిసారిగా పేరిణి నృత్యం... తెలంగాణ నృత్యంగా పేరుగాంచిన పేరిణి నృత్య పోటీలను తొలిసారిగా బాలోత్సవ్లో ఈ సారి చేర్చారు. దీంతో తెలంగాణలోని పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఈ పోటీలు తొలిసారి కావడంతో 26 మంది విద్యార్థులు ఈ విభాగంలో ప్రదర ్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన దత్తు, పాల్వంచకు చెందిన వరుణ్, సూర్యాపేటకు చెందిన వినయ్లు ప్రదర్శించిన పేరిణి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడిలో చిన్నారుల ప్రదర్శనలు ఔరా అనిపించాయి. భరతనాట్యం జూనియర్స్ విభాగంలో 170 మంది, కూచిపూడి జూనియర్స్ విభాగంలో 150 మంది ప్రదర్శన ఇచ్చారు. సంప్రదాయ నృత్యాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యార్థులు సైతం అదే రీతిలో పాల్గొని అబ్బురపరిచారు. రెండోరోజు 8 వేల మంది హాజరు... రెండో రోజైన శనివారం జరిగిన పోటాలకు సుమారు 8వేల మంది చిన్నారులు హాజరయ్యారు. కథారచన జూనియర్స్ విభాగంలో 260 మంది, సీనియర్స్ విభాగంలో 260, భరతనాట్యం జూనియర్స్లో 170, కూచిపూడి జూనియర్స్లో 150, తెలుగు పద్యాలులో 180 మంది, జానపద నృత్యాల్లో 175 మంది, ఫ్యాన్సీడ్రెస్ (వితౌట్ సెట్టింగ్)లో 120 మంది, విత్సెట్టింగ్లో 180 మంది, ఎలక్యూషన్ తెలుగు జూనియర్స్లో 250 మంది, ఎలక్యూషన్ ఇంగ్లిష్ జూనియర్స్లో 225 మంది, ఎలక్యూషన్ తెలుగు సీనియర్స్లో 270 మంది, ఎలక్యూషన్ ఇంగ్లిష్ సీనియర్స్లో 240 మంది, ఫోక్డాన్స్ సీనియర్స్లో 150 మంది, లేఖారచన (తెలుగు)లో 240 మంది, పేరిణి నృత్యంలో 26 మంది, వ్యర్థంతో అర్థం జూనియర్స్లో 121 మంది, సీనియర్స్లో 118 మంది పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు.. పిల్లల పండుగైన బాలోత్సవ్కు పిల్లలే కాదు పెద్దలు కూడా భారీగానే తరలివచ్చారు. పిల్లల ప్రదర్శనలు చూస్తూ ఆనందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు తోడుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తరలివ చ్చారు. గతంలో ఒక పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులతో గైడ్లు మాత్రమే వచ్చేవారు. కానీ ఈ సారి మాత్రం చిన్నారుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రదర్శనలు తిలకించేందుకు రావడం గమనార్హం. అంతేకాక పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాగా వారితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. -
26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014
సాక్షి, బెంగళూరు : నగరానికి చెందిన నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి నగరంలో డ్యాన్స్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. ‘నిత్య నృత్య-2014’ పేరిట నిర్వహించనున్న ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఈనెల 26 నుంచి 28 వరకు కొనసాగుతుందని నూపుర స్కూల్ ఆదివారమిక్కడ ఓ ప్రకటన లో వెల్లడించింది. నగరంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రవీంద్ర కళాక్షేత్ర, చౌడయ్య మెమోరియల్ హాల్లో ఈ డ్యాన్స్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు తెలిపింది. భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఆట్టం తదితర నృత్యరీతులను ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో తిలకించేందుకు కళాప్రియులను అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ నృత్యకారులు గోపికా వర్మ, మధులిత మహాపాత్ర, గాయత్రీ శ్రీరామ్, రుక్మిణీ విజయ్కుమార్లు ఈ డ్యాన్స్ ఫెస్ట్లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని వెల్లడించింది. -
అలరించిన నాట్యోత్సవం
కూచిపూడి, న్యూస్లైన్ : తానీషా యువ నాట్యోత్సవ్ ముగింపు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. కూచిపూడిలోని కళావేదికపై అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులనుంచి నిర్వహిస్తున్న ఈ నాట్యోత్సవాల్లో కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను ఘనంగా సత్కరించారు. ఆయనకు రూ. 5,116లు నగదు, దుశ్శాలువ, మెమెంటోను అందించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడితో పాటు సోదర నాట్యాలైన భరతనాట్యం, మణిపురి, మోహినీఆట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చెన్నైకు చెందిన భరతనాట్య కళాకారిణిమురుగ శాంకరీ శంకర శ్రీగిరి...అంటూశివతాండవం (హంసనందిని) ను నర్తించింది. తంజావూరులోని బృహదీశ్వరుని స్తుతిస్తూ మనవి చేసుకొనరాదా చక్కని స్వామి (శంకరాభరణం), పట్టాభిరాముని ప్రార్థిస్తూ నే మాటలే మాయనురా (పూర్వకల్యాణి) అంశాలను ప్రదర్శించారు. కలకత్తాకు చెందిన మణిపురి నాట్యకళాకారుడు సుదీప్ ఘోష్ తొలి అంశం బసంత రాసలీలలులో చూపిన హావభావాలు ఆకట్టుకున్నాయి. శ్రీ కృష్ణునిపై భక్తి భావాలుగల ఈ అంశంలో 108 మంది గోపికలతో మహరాస్, బసంతరాస్ (హోళీ) కుంజరాస్, దిబారాస్, నృత్తరాస్లను నర్తించారు. వీటిల్లో ఈ నృత్యాచార్యుడుబసంత్రాస్ ప్రత్యేకతను తన ప్రదర్శన ద్వారా చూపారు. రెండవ అంశంలో అభినయ్లో రాధాకృష్ణుల శృంగార, ప్రణయ సన్నివేశాలను ప్రదర్శించారు. నర్తకుడు ఆ రెండు పాత్రలు తనే అయి సంచార భావంలో హావభావాలు ప్రదర్శించారు. తర్వాత దశావతారాల్లో శ్రీ కృష్ణుని అవతారానికి బదులు బలరామావతారంతో మిగిలిన తొమ్మిది అవతారాలను ప్రదర్శించారు. బెంగుళూరుకు చెందిన రేఖారాజ్ మోహిని ఆట్టం నృత్యాలను ప్రదర్శించారు. నృత్తానికి, పాదాభినయానికి ప్రాధాన్యత నిచ్చిన చొళ్లుకట్టు (జతిస్వరం)కు ప్రేక్షకుల కరతాళధ్వనులు లభించాయి. అమీర్ కళ్యాణ్ రాగంలో తాం..దితితాం....అంటూ జతుల తోనే ప్రదర్శించారు. నల, దమయంతుల మధ్యగల ప్రేమ, శృంగారంలకు చెందిన ప్రాణ ప్రియనానానళవై ఓర్టెన్ (శుద్ధసన్యాసి)ను, స్వాతి తిరునాళ్ కీర్తన చెలియ కుంజ నమో....(బృందావన సారంగ) అంటూ రాధాకృష్ణుల ప్రణయాన్ని సంచార భావం ద్వారా వెల్లడించారు. అయ్యప్ప భక్తి గీతం హరివరాసనం-విశ్వమోహనం (మధ్యమావతి)లో ఆమె చూపిన హస్త, భావ, పాద విన్యాసాలు కార్యక్రమానికే తలమానికం. రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యాంశాలైన ఆనంత తాండవ మాడే ..శివుడు (రాగమాలిక), శ్రీ గణపతిని సేవింపరారే-త్యాగరాజ కీర్తన, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన జాయతే వనమాలిలను నర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన పండిట్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారీ కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ ప్రదర్శించిన నాట్యాంశాలు సంప్రదాయ రీతిలో సాగాయి. ఈయన నర్తించిన అంశాలకు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి నట్టువాంగం చేయగా గాత్రంపై వీవీ దుర్గాభవాని, మృదంగంపై పసుమర్తి హరనాథశాస్త్రి, వయోలిన్పై పాలపర్తి ఆంజనేయులు సహకరించి జీవం పోశారు. వీరికి అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో ముఖ్యఅతిథి జ్ఞాపికలనందించారు. తొలుత బందరు పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణరావు జ్యోతి ప్రజ్వలనచేశారు. ఎస్బీఐ మేనేజర్ రమణారావు, టూరిజం శాఖ మేనేజర్ జి. రామలక్ష్మణరావు, ఇంజినీర్ ఎన్. శివన్నారాయణ, రిటైర్డ్ ఆంధ్యా బ్యాంక్ ఉన్నతాధికారి వెహైచ్ రామకృష్ణ, నాట్యాచార్య చింతా రవిబాలకృష్ణ, వేదాంతం రత్తయ్యశర్మ, సర్పంచి కందుల జయరామ్ పాల్గొన్నారు. -
బ్రేక్ అడిగింది...ఓకే అన్నారు..!
ప్రపంచంలో చాలా దేశాలకు... అమెరికా నచ్చదు, అందాలపోటీలూ నచ్చవు. దెన్, ‘మిస్ అమెరికా’ నీనా మాత్రం ఎందుకు నచ్చాలి? నచ్చాలి. నచ్చింది కూడా! ఎందుకంటే - నీనా... మన అమ్మాయి అని కాదు. నీనా... అమెరికా అమ్మాయిల్ని బీట్ చేసిందని కాదు. నీనా... పోటీల కోసం బరువు తగ్గిందని కాదు. పాశ్చాత్య అందాల వేదికపై - తనను కాకుండా, తన దేశ సౌందర్యాన్ని ప్రదర్శించింది నీనా! తనకు కాకుండా, భారతీయ సంస్కృతికి, భారతీయ తత్వజ్ఞతకు... కిరీటం పెట్టించుకుంది నీనా! కథక్ డాన్సర్గా... ఆమె ఇచ్చిన రెండిషన్కు క్వశ్చన్కు ఆన్సర్గా... ఆమె ఇచ్చిన డెఫినిషన్కుఅమెరికా ఫ్లాట్ అయిపోయింది. పాతికేళ్లయినా లేని ఈ అంతస్సౌందర్యరాశికి ఇంతటి పరిణతి ఎక్కడిది? ఆమెను మలిచిన పెంపకం ఎలాంటిది? ఇదే ఈవారం మన ‘లాలిపాఠం’. అందానికి నిర్వచనం ఏమిటి? అమెరికా వేదిక మీద నీనా దావులూరి చెప్పిన సమాధానమే అసలైన అందం. అందాన్ని కొలిచే కొలమానం ఉందా? ఉందనే అనుకుంటున్నాయి ఈ పోటీలను నిర్వహించే సంస్థలు. అంతటితో ఆగకుండా గీటుపెట్టి నిర్ణయిస్తామంటూ ప్రశ్నావళిని కూడా తయారుచేశాయి. మానసిక స్థయిర్యం, కృషి, పట్టుదల, విశాలదృక్పథం, సమయస్ఫూర్తి, మాటతీరు, మానసిక వికాసం... ఇలా ఎన్నో అంశాల సుమహారమే అసలైన అందం అన్నారు నిర్వహకులు. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయంటూ ముందడుగు వేసింది నీనా దావులూరి. భారతీయ మూలాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని కొనసాగిస్తూ పాశ్చాత్య భావజాలం మధ్య పెరిగిన అమ్మాయి నీనా. ఆమెలో ఆత్మవిశ్వాసం ఉండాల్సినంత ఉంది. ఇందుకు మిస్ అమెరికా పోటీలో అందాన్ని విశ్లేషిస్తూ ఆమె చెప్పిన సమాధానమే గీటురాయి. ఈ అమ్మాయిని ఎలా తీర్చిదిద్ది ఉంటారు ఆ అమ్మానాన్నలు? నీనా అమ్మ షీలారంజని, నాన్న ధనకోటేశ్వరచౌదరి పిల్లల పెంపకంలో పాటించిన విలువలేంటి? ఈ వివరాలను విజయవాడలో ఉన్న నీనా అమ్మమ్మ కోటేశ్వరమ్మ, పెద్దమ్మ డాక్టర్ శశిబాల ఇలా చెప్తున్నారు. మా చెల్లి కోరినట్లే..! ‘‘మా చెల్లి, మరిది గారు అమెరికాలో స్థిరపడ్డారు. నీనా అమెరికాలోనే పుట్టింది. అయితే రెండవ నెల నుంచి రెండేళ్లు నా దగ్గరే ఇండియాలో పెరిగింది. మా చెల్లెలు పిల్లల పెంపకం విషయంలో కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. పిల్లల్ని ఏటా ఇండియాకి పంపిస్తూ ‘వీళ్లకు ఈ వెకేషన్లో కూచిపూడి, భరతనాట్యం వంటివి నేర్పించు, మన నేటివిటీ తెలిసేలా చెయ్యి’ అని చెప్పేది. తాను కోరినట్లే పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నేర్పించాం’’ అని శశిబాల చెప్తుండగా కోటేశ్వరమ్మగారు మాట్లాడుతూ ‘‘ఇక్కడ మొదలు పెట్టిన డాన్సుని ఇక్కడితోనే వదిలేయలేదు మా మనుమరాళ్లు. అమెరికా వెళ్లి అక్కడ స్కూల్ ప్రోగ్రాముల్లో లంబాడీ డాన్సు వంటివి ప్రదర్శించారు. మా చిన్నమ్మాయి పిల్లల్ని సాయంత్రం డాన్సు క్లాసులకు తీసుకెళ్లేది. తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యేది. పిల్లలిద్దరూ అమెరికాలోనే పియానో, క్లారినెట్ కూడా నేర్చుకున్నారు. గుజరాతీ వాళ్ల దగ్గర కథక్ కూడా నేర్చుకుంది నీనా. మిస్ అమెరికా పోటీల్లో వేదిక మీద ప్రదర్శించింది కథక్ బాణీనే. మనవాళ్ల పెళ్లిళ్లలో నాట్యం చేసేది. నీనాకి డాన్సంటే అంత ఇష్టం. మిస్ అమెరికా పోటీల్లో ఇష్టమైన కళ ఏదంటే డాన్స్ అనే చెప్పింది. అందుకే నాట్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చారు’’ అన్నారు. ఒక్క ఏడాది టైమిస్తే..! ఈ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఈ నేపథ్యంలో పిల్లలకు నేర్పిన విలువల గురించి శశిబాల మాట్లాడుతూ... ‘‘చిన్నప్పటినుంచి మీనా, నీనా ఇద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు చేశాం. ఏ విషయాన్ని అయినా నిశితంగా, లోతుగా అధ్యయనం చేస్తారు. వీళ్లలో తాము తెలుసుకున్న విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టగలిగిన నేర్పు కూడా ఉంది. వాళ్లతో ఏ టాపిక్ చర్చించినా పరిణితితో మాట్లాడుతారు. పెద్దమ్మాయి మీనాకి ఎంతటి భూతదయ అంటే... ‘ఒక ప్రాణిని చంపే హక్కు ఎవరిచ్చారు’ అంటుంది, మాంసాహారం తినదు. పిల్లల్ని ఇలా తీర్చిదిద్దడంలో మా చెల్లి పాత్ర ఎక్కువనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు మా చెల్లి కూడా చాలా చురుగ్గా ఉండేది. అదే పిల్లలకూ వచ్చింది. దానికి తోడుగా వాళ్లు పెరిగిన పెద్ద ప్రపంచం చాలా దోహదం చేసింది. ఒక వ్యక్తిలో పరిణతి, వ్యక్తిత్వ వికాసం వంటివి వారి పరిసరాలు, ఎక్స్పోజర్ను మీద ఆధారపడి ఉంటాయి. అమెరికాలో స్కూళ్లలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. ప్రతి విద్యార్థీ పాల్గొనేటట్లు చేస్తారు. మీనా కూడా పీజంట్ పోటీల్లో పాల్గొని గెలిచింది. తర్వాత తను పూర్తిగా చదువులోనే నిమగ్నమైంది. నీనా మాత్రం ఒక ఏడాది టైమిస్తే ఈ పోటీల్లో పాల్గొని ఆ తర్వాత మెడిసిన్ చేస్తానని అడిగింది వాళ్ల అమ్మానాన్నల్ని. సరదా పడుతోంది కదా అని సరేనన్నారు మా చెల్లి, మరిదిగారు’’ అన్నారు. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ! పాశ్చాత్య సమాజంలో పిల్లల్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర, తల్లిదండ్రుల నడవడి గురించి చెబుతూ ‘‘అక్కడ పేరెంట్స్ మీట్కి పేరెంట్స్ తప్పనిసరిగా హాజరవుతారు. చదువు, విద్యేతర కార్యక్రమం గురించి ‘ఫలానా వస్తువు పంపించాల’ంటే పంపించి తీరుతారు. అంత క్రమశిక్షణ పాటిస్తారు తల్లిదండ్రులు. అదే పిల్లలకూ అలవాటవుతుంది’’ అన్నారు కోటేశ్వరమ్మ. కుటుంబం ప్రభావమే ఎక్కువ! పిల్లలు ఏ సమాజంలో పెరిగినా మొదటగా ప్రభావం చూపించేది కుటుంబమేనంటారు కోటేశ్వరమ్మ. ‘‘అమెరికాలో ఉన్న భారతీయులు ప్రార్థనలు, సత్సంగాలు నిర్వహిస్తుంటారు. మా చిన్నమ్మాయి ఆ కార్యక్రమాలకు పిల్లల్ని కూడా తీసుకెళ్లేది. వీళ్లంతా అనాథలకోసం భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్లి పాటలు పాడి వాళ్లకు వినోదాన్ని పంచడం కూడా అలాగే అలవాటైంది నీనాకి. అలాగని ఆధ్యాత్మికమే జీవితంగా పెరిగారని కాదు. డైలీ రొటీన్ అక్కడి సమాజంలో ఉన్నట్లే’’ అన్నారామె. నీనా మిస్ అమెరికా పోటీ కోసం ఆహారపు అలవాట్లు మార్చుకోవడాన్ని చెప్తూ ‘‘బరువు తగ్గిన మాట వాస్తవమే కానీ విపరీతమైన లావు లేదు. నీనాకు చాక్లెట్లు చాలా ఇష్టం. బరువు తగ్గడం కోసం పట్టుబట్టి మరీ చాక్లెట్లు మానేసింది. వాళ్ల అమ్మ కూడా బరువు పెరగనివ్వని వంటలనే చేసేది’’ అన్నారు కోటేశ్వరమ్మ. తనకు తానుగానే..! మిస్ అమెరికా పోటీలలో గెలవడానికి నీనా తనకు తానే అన్నీ సమకూర్చుకున్నదంటారు శశిబాల. ‘‘డ్రస్లు డిజైన్ చేసుకోవడంలో వాళ్ల అమ్మ, అక్క సహాయం చేశారు. పేరెంట్స్ చేసిందల్లా నీనాకి కావల్సిన వనరులు సమకూర్చడం, మోరల్ సపోర్టుతో ప్రోత్సహించడమే. అభిరుచిని కూడా క్రమశిక్షణతో చేయాలనుకోవడమే నీనా విజయరహస్యం’’ అన్నారు శశిబాల. ఇరవై నాలుగేళ్ల అమ్మాయి... ‘సౌందర్యం అంటే పై మెరుగులతో వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చిన దానిని యథాతథంగా స్వీకరించడమే అని, అంతర్లీనంగా ఉన్న మానసిక పరిణితే అసలైన సౌందర్యం’ అనీ న్యాయనిర్ణేతలకు చెప్పింది. పదాలు వేరైనా ఇదే భావాన్ని మన జ్ఞానులు చెప్పారు. డాక్టర్ శశిబాల, కోటేశ్వరమ్మ చెప్పిన మాటలు వింటే భారతీయ తత్వజ్ఞానాన్ని అగ్రవేదిక మీద ప్రకటించగలిగిన ఆత్మవిశ్వాసం నీనాకు తల్లిదండ్రుల పెంపకంలోనే వచ్చిందనిపించింది. - వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి ఫొటోలు: ఎం. ఆర్. మోహన్, విజయవాడ నీనా గురించి...మిస్ అమెరికా అంతకుముందు... మిస్ న్యూయార్క్, మిస్ సెరిక్యూజ్. మిస్ అమెరికా అవుట్స్టాండింగ్ టీన్ - 2007 పోటీలో రెండవస్థానం -
పిల్లలే జీవితం అవ్వాలి...
మూడో ఏట... డ్రాయింగ్ ఐదో ఏట... భరతనాట్యం. ఆరో ఏట... కర్ణాటక సంగీతం. ఏడో తరగతిలో... ఎన్.సి.సి., అలాగే యోగా! ఇంకోటి... ఇంకోటి... టెన్త్కి వచ్చేసరికి మనోజ్ఞ చుట్టూ... కుప్పలు తెప్పలుగా కప్పులు, మెప్పులు! ఇప్పుడా అమ్మాయి... మెడిసిన్ చదువుతోంది. చదువు దారి చదువుదే. అవార్డుల దారి అవార్డులదే! ‘యు హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్ చైల్డ్ టు ది నేషన్’. మనోజ్ఞ తల్లికి భారత ప్రధాని ప్రశంస. ఎలా సాధ్యం... ఇంతలా తీర్చిదిద్దడం?! సాధ్యమే అంటున్నారు అనిత. లాలపోసే వయసు నుంచీ బిడ్డ ఐక్యూకి సానబెడుతూ వస్తున్న ఆ తల్లి అనుభవాలే ఈవారం మన ‘లాలిపాఠం’. తేజస్విని మనోజ్ఞ... చక్కటి తెలుగమ్మాయి. ఈ అమ్మాయి ఒక రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ కనిపించింది. మరో రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డునందుకుంటూ కూడ. ఇదే అమ్మాయి సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు ఎన్సిసి యూనిఫాంలో మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. భరతనాట్య ప్రదర్శనతో అభినందనలు అందుకుంది. ఉన్నట్లుండి మరోరోజు యోగసాధన భంగిమలో దర్శనమిస్తుంది. అప్పుడప్పుడూ స్వరంలో సరిగమలు పలికిస్తూ కర్ణాటక సంగీతాన్ని సాధన చేస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె వయసు 20లోపే, వేళ్ల మీద లెక్కించే వయసే కానీ, సాధించిన విజయాలను లెక్కించడానికి మాత్రం వేళ్లు చాలవు. సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇన్నిరంగాల్లో ప్రతిభావంతురాలు కావడం చిన్న విషయం కాదు. అమ్మాయిలో అంతటి ఐక్యూ ఉండడం దేవుడిచ్చిన వరమైతే, దానిని ఒకక్రమంలో పెట్టడంలో ఆమె తల్లిదండ్రులు సఫలమయ్యారు. ఆ వివరాలను మనోజ్ఞ తల్లి అనిత సాక్షితో పంచుకున్నారు. పాపకు ఓ వ్యాపకం కోసం... ‘‘మా వారు మధుసూదన శర్మ బ్యాంకు ఉద్యోగి, నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పాప స్కూలు నుంచి వచ్చి ఒంటరిగా బాల్కనీలో కూర్చుని ఉండేది. పాపను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేయడం మంచిదనిపించింది. ఉదయం కొన్ని డ్రాయింగ్లు ఇచ్చి, సాయంత్రం నేనొచ్చేటప్పటికి పూర్తిచేయమని చెప్పేదాన్ని. పాపకు ఐదేళ్లు వచ్చిన తర్వాత భరతనాట్యం నేర్పిద్దామని సికింద్రాబాద్లో చేర్చాం. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పాపను డాన్సు క్లాసుకు తీసుకు వెళ్లేదాన్ని. పాప ఇంట్లో ఉన్నంత సేపూ నా చుట్టూ తిరుగుతూ నేను పాట పాడేటప్పుడు గొంతు కలుపుతూ ఉండేది. తనకు ఆసక్తి ఉంది కదా అని ఆరేళ్లు వచ్చిన తర్వాత కర్ణాటక సంగీతంలో చేర్పించాం. రోజూ సాయంత్రం డాన్సు, సంగీతం క్లాసులతోనే సరిపోయేది. దాంతో హోమ్వర్క్ ఉదయం పూట చేయించడం అలవాటు చేశాను. మనోజ్ఞకు నాలుగింటికి లేచి చదువుకోవడం కూడా అలాగే అలవాటైంది. డాన్సు ప్రదర్శన పూర్తయి ఇంటికి వచ్చి నిద్రపోయేటప్పటికి ఒక్కోసారి పన్నెండయ్యేది. అలాంటప్పుడు కూడా తెల్లవారి నాలుగు గంటలకు లేపితే బద్దకించకుండా లేచేది. ఇదిలా ఉండగా సెవెన్త్ క్లాసులో ఉన్నప్పుడు ‘ఎన్సిసిలో చేరుతాను’ అని అడిగింది. నేను కూడా ఎన్సిసి క్యాడెట్నే. దాంతో తనని నిరుత్సాహపరచలేదు. వీటితోపాటు స్కూల్లో యోగా క్లాసులుండేవి. ఈ యాక్టివిటీస్ అన్నింటిలోనూ తరచుగా కాంపిటీషన్లు జరుగుతుండేవి. పాపను వాటికి తీసుకెళ్లడం నాకు అదనపు బాధ్యత. మధ్యాహ్నం కాంపిటీషన్ ఉంటే నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వెళ్లేదాన్ని. మనోజ్ఞ పోటీలో పాల్గొన్న తర్వాత తిరిగి స్కూల్లో దించి నేను ఆఫీస్కెళ్లేదాన్ని. పాప టెన్త్క్లాస్కి వచ్చాక ఫుల్టైమ్ జాబ్ వదిలి ఫ్రీలాన్స్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇలా నా టైమంతా పాప చుట్టూనే...’’ అన్నారామె. గురితప్పని షూటర్! మనోజ్ఞ ఏకకాలంలో ఇన్ని కళలను సాధన చేస్తూ శిఖరాగ్రాలకు చేరడం గురించి అనిత... ‘‘దేనిలో అడుగుపెట్టినా పీక్కు వెళ్లాలనే తపనతో శ్రమిస్తుంది. పిల్లల్లో ఆ తత్వం ఉండడమే పెద్ద వరం. తనలో ఆ క్వాలిటీ ఉండబట్టే ఇన్ని విజయాలు సాధించింది. అన్నింటినీ బాలెన్స్ చేసుకోగలిగిన మానసిక స్థిరత్వం కూడా ఉంది. ఎన్సిసి శిక్షణలో టీచర్లు ‘నువ్వు రైఫిలంత బరువు కూడా లేవు, ఎలా షూట్ చేస్తావు’ అనేవారట. వాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ రైఫిల్ షూటింగ్లో టాపర్ అయింది. ఇవన్నీ చేస్తూ టెన్త్క్లాస్ 94 శాతంతో పాసైంది’’ అన్నారు. చదువు, పరీక్షలు, ప్రదర్శనలు, ఎన్సిసి క్యాంపులు... ఒక టైమ్టేబుల్తో మరొకటి ఓవర్లాప్ అయిన సందర్భాలను వివరిస్తూ... ‘‘అన్నింటికంటే పెద్ద చిక్కుముడి ఇంటర్లో పడింది. ప్రీఫైనల్స్ సమయంలో ప్రధానమంత్రి నుంచి అవార్డు తీసుకోవాల్సి వచ్చింది. కాలేజ్ వాళ్లు ససేమిరా అన్నారు. ఏదయితే అదవుతుందని ఢిల్లీ వెళ్లిపోయి, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తూ ఇంటర్మీడియట్ బోర్డు డెరైక్టర్గారే మాట్లాడారు. ఆయనకు పరిస్థితి చెప్పగానే... ‘మన రాష్ట్ర క్యాడెట్ ప్రధానమంత్రి అవార్డుకి ఎంపిక కావడం 16 ఏళ్ల తర్వాత ఇదే. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. పరీక్ష మళ్లీ రాయవచ్చు’ అని భరోసా ఇచ్చారు’’ అన్నారు అనిత. ప్రధాని ప్రశంస! జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘మనోజ్ఞ ప్రైమ్ మినిస్టర్ మెడల్ అందుకున్న రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ ‘యు హావ్ గివెన్ ఎ వండర్ఫుల్ చైల్డ్ టు ది నేషన్’ అన్నారు. ఆ ప్రశంస... మనోజ్ఞ కోసం నేను పడుతున్న శ్రమను, చేస్తున్న ఖర్చును తప్పుబడుతూ బంధువులు, ఇతరులు అన్న మాటలకు సమాధానం అనిపించింది. అలాగే మరో సంఘటన... చిన్నప్పుడోసారి మనోజ్ఞ డాన్సు క్లాసుకు వచ్చే పిల్లలను చూస్తూ ‘వాళ్లలా నేను కారులో వచ్చేది ఎప్పుడమ్మా’ అని అడిగింది. అప్పుడు నేను ‘బాగా చదువుకో, డాన్సు నేర్చుకో, అప్పుడు కారే నీ దగ్గరకు వస్తుంది’ అన్నాను. మనోజ్ఞ ‘మిస్ ఆంధ్రా తెలుగు గర్ల్’ పోటీలో బహుమతిగా నానోకారు అందుకున్నప్పుడు అప్పటి సన్నివేశం కళ్ల ముందు మెదిలింది’’ అన్నారు అనిత. సమాజమే పెద్ద బడి! పరిణతితో వ్యవహరించే నేర్పు గురించి చెబుతూ... ‘‘కొత్తిమీర కట్ట కొనడానికి వెళ్తున్నా కూడా పాపను నాతో తీసుకెళ్లేదాన్ని. ఎంత ఎక్కువగా సమాజాన్ని, ప్రపంచాన్ని చూస్తే అంత ఎక్కువ పరిజ్ఞానం వస్తుంది, ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియెన్సే. ఇలాంటి అనుభవాలతో బయటి దేశాలకు ఒక్కతే వెళ్లాల్సి వచ్చినప్పుడు తను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మనోజ్ఞలో మరో మంచి లక్షణం ఏమిటంటే... మీడియా అటెన్షన్ ఎంత వస్తున్నా తనలో అహం పెరగలేదు. దానికి భరతనాట్యం, ఎన్సిసి క్రమశిక్షణ, యోగసాధన, ధ్యానం... ఇలా ప్రతిదీ కారణమే. పోటీల్లో పాల్గొనేటప్పుడు ‘నువ్వు నీలోని నైపుణ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రదర్శించు, ఫలితం గురించి ఆలోచించకు’ అని ప్రోత్సహించేదాన్ని. గెలిచి తీరాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. తను నా శ్రమను చూస్తూ పెరిగింది. కాంపిటీషన్లు పూర్తయి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చి వంట చేసుకుని భోజనం చేసిన రోజులూ తనకు తెలుసు. మా వారు మాకు సెలైంట్ సపోర్టర్. పాప కోసం చేస్తున్న ప్రయత్నాలను కాదనేవారు కాదు. ఆయన ట్రాన్స్ఫర్లతో రెండేళ్లకోసారి బయటి ఊర్లకు వెళ్తుంటే మనోజ్ఞ కోసం నేను హైదరాబాద్లోనే ఉండేదాన్ని. ఇదేమీ త్యాగం కాదు. బాధ్యతను నిర్వర్తించడమే. పిల్లలను కన్న తర్వాత వాళ్లకోసం జీవించాల్సిందే’’ అన్నారు అనిత. కన్నబిడ్డ పెంపకాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్న మాతృమూర్తి అనిత, ఆమె ప్రయత్నానికి అండదండగా నిలుస్తున్న తండ్రి మధుసూదన్. పిల్లలను కనడం, పెంచడం కాదు. వారిని జాతి గర్వించే పౌరులుగా తయారు చేయడానికి ఎంత శ్రమ అవసరమైతే అంతగా శ్రమించి తీరాలి, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలంటున్న ఈ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నా కష్టం ఫలించింది మనోజ్ఞ యుఎస్, యుకె, యూరప్, అరబ్ ఎమిరేట్స్, సింగపూర్తోపాటు అనేక ఆసియా దేశాల్లో ప్రదర్శనలిచ్చింది. ఐదారు దేశాల అధ్యక్షులు, ప్రధానుల నుంచి పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఇన్నేళ్లపాటు బస్టాపుల్లో ఎండకు ఎండి, వానకు తడిసిన సందర్భాలు, ఆటోలో తీసుకెళ్తూ పాపకు జడలు వేసి, టిఫిన్పెట్టిన సంఘటనలు గుర్తొస్తుంటాయి. - అనిత, మనోజ్ఞ తల్లి తేజస్విని మనోజ్ఞ విజయాలు కొన్ని... -ఇండియన్ యూత్ ఎక్స్లెన్సీ అవార్డు (ఎన్.సి.సి.) -సార్క్ యంగ్ అచీవర్స్ మెడల్ -యుఏఈ ‘ఇండియన్ ఉమెన్ అచీవర్స్’ ట్రోఫీ -ఇండియా బెస్ట్ క్యాడెట్(ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ) ట్రోఫీ (ప్రధానమంత్రి నుంచి) -రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రెసిడెంట్ చేతులమీదుగా పురస్కారం -బెస్ట్ షూటర్ (రైఫిల్ షూటింగ్) -లీడ్ ఇండియా కంటింజెంట్ కమాండర్ -సమైక్య భారత్ గౌరవ్ సత్కార్ పురస్కార్ -ఎపి గవర్నర్ నుంచి గౌరవ పురస్కారం -వైఎస్ఆర్ చేతులమీద ‘బాలరత్న అవార్డు’ -క్రియేటివ్ చైల్డ్ విభాగంలో రాష్ట్రపతి పురస్కారం -మిస్ ఆంధ్రా తెలుగు గర్ల్ 2012 బ్రెయిన్ అండ్ బ్యూటీ కాంటెస్ట్లో విజేత ఇంకా... -స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలల ఆరోగ్యం, విద్య, బాలకార్మికుల నిర్మూలన కోసం సేవ -సేవ్ ద గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్ -1500 పైగా భరతనాట్య ప్రదర్శనలు, చారిటీ షోలు