Car prices
-
కార్ కొనేవారికి అలర్ట్.. మారుతి సుజుకి ధరల పెంపు
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki) ధరలను పెంచింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా పలు మోడళ్లలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల (Car Prices) పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు సెలెరియో మోడల్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని ధర రూ. 32,500 వరకు పెరుగుతుందని ఎక్స్ఛేంజీలకు మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావం వల్ల ధరలు పెరిగాయని మారుతి సుజుకి వివరించింది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మోడళ్లపై ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.ముడిసరుకు, లాజిస్టిక్స్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీదారులు అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ సప్లయి చైన్లో అంతరాయాలు, పెరుగుతున్న డిమాండ్లే ముడిసరుకు ధరల పెరుగుదల కారణమని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబల్ అభిప్రాయపడింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సుంకాల అవకాశం కూడా అనిశ్చితిని జోడించింది. ఇది పరిశ్రమలో ఖర్చు ఒత్తిడిని మరింత పెంచుతుంది.ఏ కారు ఎంతెంత పెరుగుతాయి?సెలెరియో అత్యధికంగా రూ. 32,500 వరకు, ఇన్విక్టో రూ. 30,000 వరకు, గ్రాండ్ విటారా రూ. 25,000 వరకు పెరుగుతాయి. ఇక బాలెనో ధర పెంపు రూ. 20,500 వరకు ఉంటుంది. ఆల్టో కె10 ధర రూ. 19,500 వరకు పెరుగుతుంది. ఎర్టిగా ధర రూ.15,000 వరకు, ఎస్-క్రాస్ ధర రూ.12,500 వరకు, ఎక్స్ఎల్6 ధర రూ.11,000 వరకు పెరగనుంది.డిజైర్ రూ. 10,550 వరకు, సూపర్ క్యారీ రూ. 10,000 వరకు, బ్రెజ్జా రూ. 9,000 వరకు, వ్యాగన్-ఆర్ రూ. 8,000 వరకు పెరగనున్నాయి.అదే సమయంలో, ఇగ్నిస్ రూ. 6,000 వరకు, ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో రెండూ రూ. 5,000 వరకు పెరగనున్నాయి. సియాజ్, జిమ్నీ స్వల్పంగా రూ. 1,500 వరకు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. -
కార్ల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్ను మారుతీ విక్రయిస్తోంది. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్సీ మోడల్ ధర రూ. 2 లక్షల వరకు, టాప్ ఎండ్ మెర్సిడెస్–మేబాక్ ఎస్ 680 లగ్జరీ లిమోజిన్ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏటా డిసెంబర్లో జరిగేదే.. ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు. సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ మహాజన్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. -
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
వాహన ప్రియులకు షాక్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు!
దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ 'ఇయర్ ఎండ్ 2023' ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి. ఇన్పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
ఏకంగా రూ. 3 లక్షలు పెరిగిన ఎక్స్1 ప్రైస్ - కొత్త ధరలు ఇలా!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) 2023 ప్రారంభంలో ఎక్స్1 లగ్జరీ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన కేవలం మూడు నెలలకే కంపెనీ ఈ మోడల్ ధరలను భారీగా పెంచేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కొత్త ధరలు: 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1 డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు డీజిల్ వేరియంట్ ధరలు రూ. 3 లక్షల వరకు పెంచింది. కావున X1 sDrive 18d M Sport ధర రూ. 50.90 లక్షలు. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 47.50 లక్షలు. ఇక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, sDrive 18i xLine ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఇది రూ. 45.90 లక్షలకే అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కార్లను బుక్ చేసుకున్న వారికి కొద్ద ధరలు వర్తించవు. రానున్న రోజుల్లో బీఎండబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ కొనాలనుకునేవారు ఈ కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజైన్: దేశీయ మార్కెట్లో 2023 BMW X1 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ కొంత పెద్దదిగా ఉంటుంది. బంపర్ బ్రష్డ్ సిల్వర్ ఇన్సర్ట్లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అట్రాక్టివ్ హెడ్ల్యాంప్, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, 18-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక LED టెయిల్ ల్యాంప్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్ప్లస్ ట్యాబ్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?) ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్: కొత్త ఎక్స్1 ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే చూడచక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్లు, కొన్ని ఫిజికల్ బటన్స్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, ADAS టెక్నాలజీ ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 136 హెచ్పి పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 150 హెచ్పి పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటాయి. BMW X1 పెట్రోల్ వెర్షన్ కేవలం 9.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, డీజిల్ ఇంజిన్ కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.03 కిమీ మైలేజ్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ లీటరుకు 19.23 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రత్యర్థులు: కొత్త 2023 ఎక్స్1 దేశీయ విఫణిలో మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి క్యూ3, మినీ కంట్రీమ్యాన్, వోల్వో ఎక్స్సి 40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
టైగన్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంచిన ఫోక్స్వ్యాగన్
ఫోక్స్వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఫోక్స్వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. ఫోక్స్వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) ఫోక్స్వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్, 1750 ఆర్పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడింది. ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి పవర్, 1500 ఆర్పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్బాక్స్తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది. (తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!) అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్డ్రైవింగ్ ట్రాక్టర్) -
1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!
మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం. 1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!) ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు. -
Jeep Grand Cherokee: మొన్న విడుదలైంది, అప్పుడే కొత్త ధరలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ భారతదేశంలో ఆధునిక ఉత్పత్తులను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇటీవల గ్రాండ్ చెరోకీ ఎస్యూవీ ధరలను కంపెనీ లక్ష వరకు పెంచింది. దేశీయ విఫణిలో విడుదలై నాలుగు నెలలు పూర్తి కాకుండానే ఇది మరింత ఖరీదైన కారుగా అవతరించింది. 2022 నవంబర్లో విడుదలైన గ్రాండ్ చెరోకీ ప్రారంభ ధర రూ. 77.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరల పెరుగుదల తరువాత ఈ SUV రూ. 78.50 లక్షలకు చేరుకుంది. ధరలు పెరిగినప్పటికీ గ్రాండ్ చెరోకీలో ఎటువంటు అప్డేట్స్ లేకపోవడం గమనార్హం. కావున ఇది అదే డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ పరంగా కూడా ఎటువంటి మార్పులు లేదు, కాబట్టి 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్, సాండ్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధునిక ఫీచర్స్, కొత్త హంగులతో రానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ.. వివరాలు) జీప్ గ్రాండ్ చెరోకీ సెవెన్ స్లాట్ గ్రిల్తో పాటు సొగసైన ఎల్ఈడీ హెడ్ల్యాంప్ కలిగి, దానికి కింది భాగంలో సెంట్రల్ ఎయిర్ ఇన్టేక్లతో చంకీ రియర్ బంపర్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.2 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 'ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ'కి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్రూఫ్, వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. -
వోల్వో అభిమానులకుషాకిచ్చిందిగా!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మైల్డ్ హైబ్రిడ్ మోడళ్లపై 2 శాతం వరకు ధర పెంచింది. ఫలితంగా మోడల్ని బట్టి 50వేల రూపాయల నుంచి 2 లక్షల దాకా భారం పడనుంది. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ సవరించిన నేపథ్యంలో పెరిగిన ముడిసరుకు వ్యయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం ఎక్స్సీ40, ఎక్స్సీ60, ఎస్90,ఎక్స్సీ90 వేరియంట్ల ధరలు అధికం కానున్నాయి. బెంగళూరు ప్లాంటులో ఈ మోడళ్లను కంపెనీ అసెంబుల్ చేస్తోంది. (ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్:లడ్డూ కావాలా నాయనా..కస్టమర్కి దిమ్మ తిరిగిందంతే!) ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్పుట్ ఖర్చులు పెరిగిన ఫలితంగా హైబ్రిడ్ల ధరలు స్వల్పంగా పెరిగాయని వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం, సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్స్ సుంకం 30 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్చార్జి (SWS) రద్దు అయింది. -
మారుతి లవర్స్కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్లో 32,563 యూనిట్లకు పెరిగాయి. -
‘ఆడి’ లవర్స్కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్బ్యాక్, RS 5 స్పోర్ట్బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్లను ప్రారంభించింది. -
ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను పెంచుతున్నట్లు లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ ఇండియా వెల్లడించింది. రేట్లను రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల శ్రేణిలో పెంచినట్లు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి పాత రేట్లే వర్తింపచేస్తామని, ఆ తర్వాత బుకింగ్స్కు కొత్త రేట్లు వర్తిస్తాయని వివరించింది. తాజా మార్పులతో ఎక్స్సీ40 వంటి మోడల్స్ రేటు 3 శాతం పెరిగి రూ. 44.5 లక్షలకు, ఎక్స్సీ60 ధర 4 శాతం పెరిగి రూ. 65.9 లక్షలకు, ఎక్స్సీ90 రేటు 3 శాతం పెరిగి రూ. 93.9 లక్షలకు (అన్నీ ఎక్స్–షోరూం) చేరింది. ఈ ఏడాది తొలినాళ్లలోనే వోల్వో కార్ల రేట్లు పెంచింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, రవాణా వ్యయాలు .. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా మళ్లీ ధరల పెంపు తప్పలేదని సంస్థ పేర్కొంది. చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు
పండుగ సందడి ముగిసిన వెంటనే.. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనదారులకు షాకిచ్చింది. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల అమలు జనవరి 19 (బుధవారం నుంచి) వర్తిస్తుందని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాహనాలపై సగటున 0.9 శాతం పెంపుదల బుధవారం నుంచి వర్తిస్తుందని పేర్కొంది. వేరియెంట్, మోడల్ను బట్టి ధరల నిర్ధారణ ఉంటుందని తెలిపింది. జనవరి 18(ఇవాళ), అంతకంటే ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ స్పష్టం చేసింది. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతోందని, ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ను అనుసరించి.. ప్రత్యేకించి కొన్ని వేరియెంట్ల మీద పది వేల రూ. దాకా తగ్గింపు కొనసాగుతుందని ప్రకటించి ఊరట ఇచ్చింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఆటోమేకర్.. టియాగో, పంచ్, హర్రియర్ లాంటి మోడల్స్తో దేశీయ మార్కెట్ను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కిందటి నెలలోనే కమర్షియల్ వాహనాలపై రేట్లు పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ పైనా రేట్లు పెంచింది. ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ప్రకటన చేసింది. రీసెంట్గా మరో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 4.3 శాతం దాకా వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. చదవండి: వారెవ్వా టాటా ! ‘డార్క్’ దద్దరిల్లిపోతుందిగా !! -
కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అన్ని ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టలేషన్ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పుడు వేగవంతం చేస్తుంది. అదనంగా నాలుగు ఎయిర్ బ్యాగులను ఇన్ స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.9,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎయిర్ బ్యాగ్ ధర రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉండవచ్చు అని తెలిపారు. ఇప్పుడు ఆ మేరకు కార్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనే దీనికి ఎయిర్ బ్యాగుల తప్పనిసరి అనే నిబందనకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అన్ని కార్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా నాణ్యమైన ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో ఆయా వాహనాల ధరలపైనా ఈ ప్రభావం పడబోతోంది. కానీ దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్లు ప్రమాదాల నివారణలో ఎయిర్ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, వాహనం అన్ని వేరియెంట్, సెగ్మెంట్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా అందించాలని నేను అన్ని ప్రైవేట్ వాహన తయారీదారులకు విజ్ఞప్తి చేశాను రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో తయారు చేసిన అన్ని వాహనాల్లో తప్పనిసరిగా ముందు వరస సహ ప్రయాణీకుల కోసం రెండు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టిఎస్ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది. (చదవండి: కొత్త ఏడాదిలో ఎలన్ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్కు చెందిన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
షాకిచ్చిన టాటా మోటార్స్.. కార్ల ధరల పెంపు
TATA Motors Increase Prices On All Vehicles: కొత్త సంవత్సరంలో కొత్తకారు కొనాలనుకుంటున్న వాళ్లకు టాటా మోటార్స్ షాకిచ్చింది. ఈ వాహన తయారీ సంస్థ అన్ని ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచుతోంది. దీంతో టాటా మోటార్స్ కార్లు ఖరీదు కానున్నాయి. అయితే ఎంత శాతం సవరిస్తున్నదనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర తెలిపారు. మరోవైపు కమర్షియల్ వెహికల్స్ ధరలను సైతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఈమధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ, మధ్య, తేలిక వాహనాలతో పాటు చిన్నస్థాయి వాణిజ్య వాహనాలు, బస్సులకు ఈ పెంపు వర్తించనుందని తెలిపింది. ఇక ఈ కమర్షియల్ వాహనాలపై 2.5 శాతం పెంపు జనవరి 1, 2022 నుంచి అమలుకానుంది. డుకాటీ సైతం కాగా, లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ డుకాటీ సైతం వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ‘ఇక్కడి మార్కెట్లో అత్యంత పోటీతత్వంతో వాహనాల ధరలను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ధరలను మార్చవలసి వస్తోంది’ అని వివరించింది. ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి కార్ల ధరలను పెంచుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హోండా, రెనాల్ట్ కంపెనీలు కూడా ధరలను ధరల పెంపును సమీక్షించే యోచనలో ఉండగా.. అడీ కంపెనీ ఏకంగా 3 శాతం పెంచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. కానీ, కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్ల ధరలు బాగా పెరగడం, దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెప్తున్నాయి. కార్ల రేట్లు రయ్.. రయ్! -
సొంత కారు కలకు షాకిచ్చిన మారుతి
సాక్షి, ముంబై: సొంత కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను మరోసారి పెంచింది. కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు తక్షణం (శుక్రవారం) అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ధరల్ని పెంచక తప్పలేదని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయంతో స్విఫ్ట్, సెలెరియా మినహా అన్ని మోడళ్లకు చెందిన వాహన ధరలు రూ.22,500 వరకు పెరిగే అవకాశం ఉంది.మోడల్ను బట్టి 1.6 శాతం మేర ధరల పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జనవరి 18న ధరలు పెంచిన కంపెనీ... కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. -
ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి. చదవండి: వన్ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్ ఉచితంగా పొందండిలా! -
2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో ప్రజా జీవనానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలలో మార్పులకు తెరలేవనుంది. వీటిలో ప్రధానంగా చెక్కుల జారీ ద్వారా జరిగే చెల్లింపుల నిబంధనలు మారనున్నాయి. ఇదేవిధంగా యూపీఐ చెల్లింపులలో అదనపు చార్జీలతోపాటు.. కార్లు, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే వీలుంది. ఇక పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు చెల్లింపుల పరిమితి రూ. 5,000కు పెరగనుంది. ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే నంబర్కు ముందు 0ను జత చేయవలసి రావచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొన్ని అంశాలను చూద్దాం.. 1. చెక్ చెల్లింపులు సానుకూల చెల్లింపుల వ్యవస్థలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని సవరణలు చేపట్టింది. దీంతో రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల్లో కస్టమర్ల వివరాలను బ్యాంకులు తిరిగి ధృవ పరుచుకోవలసి ఉంటుంది. రూ. 5 లక్షలకు మించిన చెక్కుల చెల్లింపులకు ఇవి తప్పనిసరికాగా.. కొన్ని విషయాలలో కస్టమర్ల ఆసక్తిమేరకు బ్యాంకులు ఈ నిబంధనను అమలు చేసే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) 2. పిన్తో పనిలేదు బ్యాంకులు జారీ చేసిన కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు రూ. 5,000వరకూ పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి రూ. 2,000గా అమలవుతోంది. రక్షణాత్మక విధానంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కోవిడ్-19 నేపథ్యంలో కస్టమర్ల భద్రతరీత్యా కూడా డిజిటల్ చెల్లింపుల పరిమితిని పెంచినట్లు తెలియజేశాయి. (పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్) 3. యూపీఐ చెల్లింపులు అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే తదితర యాప్ల ద్వారా వినియోగదారులు చేపట్టే చెల్లింపులపై అదనపు చార్జీల భారం పడనుంది. థర్డ్పార్టీ నిర్వహించే యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలను విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. జనవరి 1నుంచి థర్డ్పార్టీ యాప్స్పై 30 శాతం పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. 4. ఫాస్టాగ్ తప్పనిసరి జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీల్ వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరికానుంది. ఇందుకు కేంద్ర రోడ్ రవాణా శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989కు సవరణలు చేపట్టింది. ఈ అంశంపై నవంబర్ 6నే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 5. నో.. వాట్పాప్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్తో నడిచే స్మార్ట్ఫోన్లలో ఇకపై వాట్సాప్కు వీలుండదు. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 వెర్షన్తో నడిచే స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇదేవిధంగా ఐవోఎస్9 వెర్షన్ ఐఫోన్లలోనూ వాట్సాప్ నిలిచిపోనుంది. ఈ జాబితాలో కేఏఐవోఎస్ 2.5.1 వెర్షన్తో నడిచే కొన్ని ఎంపిక చేసిన జియో ఫోన్లు సైతం ఉన్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. 6. ఎల్పీజీ, కార్ల ధరలు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతీ నెలా మొదటి రోజున అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సగటు ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఇటీవల విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్తోపాటు, ఎల్పీజీ ధరలను సైతం పెంచిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఆటో రంగ దిగ్గజాలు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితరాలు జనవరి నుంచి వాహనాల ధరలను పెంచేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 7. 0తో మొదలు ల్యాండ్ లైన్ నుంచి దేశీయంగా మొబైల్కు కాల్ చేయాలంటే నంబర్కు ముందు 0ను జత చేయవలసి రావచ్చని టెలికం వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశాయి. తద్వారా మొబైల్ టెలికంలు తగిన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. -
హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు..!
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనేది వెల్లడించలేదు. మారుతీ, టాటా మోటార్స్తో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
రాష్ట్రాల్లో పన్నులు అధికం
ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, రోడ్డు ట్యాక్స్ పెంచిన రాష్ట్రాల్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని వివరించారు. రాష్ట్రాలు తోడ్పాటునందించాలి.... తయారీ రంగంలో తమ పాత్ర విషయమై రాష్ట్రాలు తగిన విధంగా వ్యవహరించాలని భార్గవ సూచించారు. లేకుంటే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారం కావడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తయారీ రంగం వృద్ధి చెందడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన సూచించారు. -
హ్యుందాయ్ కార్ల ధరలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నూతనంగా విడుదల చేసిన వెన్యూ, కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీలు మినహాయించి మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నూతన భద్రతా నిబంధనలను పాటించాల్సి రావడం వల్ల ముడి పదార్థాల వ్యయం పెరిగినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. మోడల్ ఆధారంగా రూ.9,200 వరకు పెంపు ఉండనుండగా.. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కంపెనీ శాంత్రో హ్యాచ్బ్యాక్ నుంచి టక్సన్ ఎస్యూవీ వరకు విక్రయిస్తోంది. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
ఈ కార్ల ధరకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార్ల ధరలను పెంచనున్నట్టు పలు వాహన కంపెనీలు ప్రకటించగా, తాజాగా ఫ్రెంచ్ కార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ రెనాల్ట్ తమ కార్లు క్విడ్, డస్టర్, లాడ్జీ వెరైటీలను మూడు శాతం మేర పెంచనున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహన ధరల పెంపు అనివార్యమైందని రెనాల్ట్ పేర్కొంది. అయితే ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్యూవీ క్యాప్చర్ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. మహీంద్ర అండ్ మహీంద్ర, వోక్స్వ్యాగన్లు భారత్లో తమ వాహన ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను మూడు శాతం పెంచుతున్నట్టు మహీంద్ర వెల్లడించగా, తమ వాహన ధరలను రూ 20,000 వరకూ పెంచనున్నట్టు వోక్స్వ్యాగన్ తెలిపింది. -
ఫోక్స్వాగన్ కార్ల ధరలు పెరుగుతున్నాయ్..
ఇన్పుట్ వ్యయాలు పెరుగడంతో, కార్ల ధరలను పెంచబోతున్నట్టు కార్ల తయారీ సంస్థలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్మన్ కారు తయారీదారు ఫోక్స్వాగన్ కూడా తన మోడల్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి నుంచి తన మోడల్స్ అన్నింటిపై రూ.20వేల వరకు ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల్లో, స్థానిక ఇన్పుట్ వ్యయాల్లో మార్పులు వంటి పలు బాహ్య ఆర్థిక కారణాలతో కార్ల ధరలను పెంచబోతున్నట్టు ఫోక్స్వాగన్ ప్యాసెంజర్ కార్ల డైరెక్టర్ స్టెఫెన్ నాప్ తెలిపారు. ఈ ప్రభావం తమ ప్రొడక్ట్ రేంజ్ అన్నింటిపై పడనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కూడా బుధవారం తన కార్లపై వచ్చే నెల నుంచి రూ.20వేల వరకు ధర పెంచబోతున్నట్టు తెలిపింది. నిర్వహణ, ఇతర వ్యయాలు పెరుగుతుండడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. అదేవిధంగా టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా మోటార్స్, స్కోడా ఆటో ఇండియాలు కూడా ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. -
కార్ల ధరలు పెరుగుతున్నాయ్..!
న్యూఢిల్లీ: కార్ల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ధరలు పెంచుతున్నామని ఇప్పటికే టయోటా, హోండా, స్కోడా, ఇసుజు కంపెనీలు ప్రకటించాయి. ఇక తాజాగా టాటా మోటార్స్, ఫోర్డ్ కూడా ధరలు పెంచనున్నట్లు వెల్లడించాయి. ప్రయాణికుల వాహనాల ధరలను రూ.25,000 వరకూ పెంచనున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన నెక్సన్ ఎస్యూవీ పరిచయ ధరలు ఈ నెల 31 వరకూ మాత్రమే చెల్లుబాటవుతాయని, వచ్చే నెల 1 నుంచి ఈ వాహనాల ధరలు రూ.25,000 వరకూ పెరుగుతాయని వివరించారు. ఫోర్డ్ పెంపు 4 శాతం వరకూ...: ఫోర్డ్ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను 4 శాతం వరకూ పెంచుతోంది. కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, రవాణా వ్యయాలు పెరగడం వల్ల తప్పనిసరిగా ధరలను పెంచవలసి వస్తోందని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్ సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ రైనా చెప్పారు. పెరుగుతున్న ఈ వ్యయాలన్నింటినీ అధిక భాగం తామే భరిస్తున్నామని, వినియోగదారులపై మరీ భారం పడకుండా 4 శాతానికి మించి ధరలను పెంచకూడదని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్తో సహా అన్ని ఫోర్డ్ మోడళ్లకు ధరల పెంపు వర్తిస్తుందని వివరించారు. -
భారీగా పెరిగిన హోండా కార్ల ధరలు
సాక్షి, ముంబై: జిఎస్టీ ప్రభావంతో దేశంలో నాల్గవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కూడా ధరలు పెంచేసింది. వివిధ మోడళ్ల కార్లపై రూ. 7వేల నుంచి రూ. 89వేల దాకా ధరలను పెంచింది. పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్ల కార్లపై పెంచిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. సెస్ భారీగా పెరగడంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.సెప్టెంబర్ 11నుంచి ఈ సవరించిన ధరలను అమలు చేయనునట్టు హోండా ప్రకటించింది. దీంతో సిటీ, బిఆర్-వి, సిఆర్-వి మోడల్ కార్ల ధరలు భారీగా పెరగనున్నారు. హోండా సిటీ కారు దేశంలో టాప్ మిడ్ సైజ్ కారువిక్రయాల్లో టాప్ 2 స్థానంలో ఉంది. దీని ధర పెంచిన ధరల ప్రకారం రూ. 13.62 లక్షలు. అటాగే టాప్ ఎండ్ బడ్జెట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ బీఆర్-వి (డీజిల్ వెర్షన్) ప్రస్తుత ధర రూ. 13.22 లక్షలు. ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వి ధర రూ.26.36లక్షలుగా ఉండనుంది. కాగా జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా ఇటీవల ఇటియోస్, కొరిల్లా ఆల్టిస్, ఇన్నోవా క్రిస్తా, ఫార్య్చూనర్ ధరలను రూ.1.6లక్షల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. -
జీఎస్టీతో చిన్న కార్ల ధరలు అప్!
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో చిన్న, మధ్య స్థాయి కార్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ప్రస్తుతం వీటిపై వ్యాట్ మొదలైన వివిధ పన్నులు 27–27.5 శాతం దాకా ఉంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇవి 28 శాతానికి పెరుగుతాయని, ఫలితంగా చిన్న కార్ల ధరలు కూడా స్వల్పంగా పెరగవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. పది రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. -
మారుతీ కార్ల రేట్లు పెరిగాయ్..
రూ.1,500–రూ.8,014 వరకూ పెంపు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెరిగాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 రూ.8,014 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)వరకూ పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కమోడిటీ, రవాణా, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.2.45 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.12.03 లక్షలు ధర ఉన్న ఎస్–క్రాస్ మోడల్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఈ కంపెనీ కొన్ని రకాల మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.5,000 రేంజ్లో పెంచింది. కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజా ధరను రూ.20,000, ప్రీమియమ్ హ్యాచ్బాక్ బాలెనో ధరను రూ.10,000 చొప్పున పెంచింది. గత ఏడాది పలు వాహన కంపెనీలు–హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, టయోటా, రెనో, మెర్సిడెస్–బెంజ్ ఇండియా, టాటా మోటార్స్లు తమ కార్ల ధరలను పెంచాయి. -
ఫియట్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఇతర వాహన కంపెనీలన్నీ వాటి కార్ల ధరల పెంపులో నిమగ్నమై ఉంటే.. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) ఇండియా మాత్రం వీటికి భిన్నంగా మరంత మంది కస్టమర్ల ఆకర్షించడం కోసం కార్ల ధరల్లో కోత విధించింది. తన సెడాన్ కారు లీనియా ధరను 7.3 శాతం వరకు (రూ.77,121 వరకు).. హ్యాచ్బ్యాక్ కారు పుంటో ఈవో ధరను దాదాపు 7 శాతం వరకు (రూ.47,365 వరకు) తగ్గించింది. దీంతో లీనియా కార్ల ధర రూ.7.25 లక్షల నుంచి రూ.9.99 లక్షల శ్రేణికి తగ్గింది. కాగా వీటి ఇదివరకు ధర రూ.7.82 లక్షల నుంచి రూ.10.76 లక్షల శ్రేణిలో ఉంది. ఇక పుంటో ఈవో కార్ల ధర కూడా రూ.5.45 లక్షలు – రూ.7.55 లక్షల శ్రేణికి తగ్గింది. వీటి ఇదివరకు ధర రూ.5.85 లక్షలు– రూ.7.92 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. -
కార్ లవర్స్ కు కొత్త సంవత్సరంలో షాక్!
ముంబై: నూతన సంవత్సరం 2017 కార్ లవర్స్ కు భారీగానే షాకిచ్చింది. కొత్త ఏడాదిలో కారు కొనుక్కుందామనుకున్న వారికి భారీగా పెరిగి ధరలు పలకరించనున్నాయి. ఇప్పటికే పలు ధరల పెంపును ప్రకటించగా, తాజా ఈ కోవలోకి మరో రెండు దిగ్గజాలు కూడా చేరిపోయాయి. ప్రముఖ కార్ల దిగ్గజాలు కూడా కొత్త సంవత్సరంలో కార్ లవర్స్ కు నిరాశనే మిగల్చనున్నాయి. మార్కెట్లో టాప్ టు కంపెనీలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను అమాంతం పెంచేశాయి. గత కొన్ని నెలల్లోముడి పదార్థం ధరల భారీ పెరుగుదల, ఇటీవలి భారీ డిస్కౌంట్లు, బలహీనపడిన రూపాయి తదితర పరిణామాలను తమ మార్జిన్ మీద ప్రభావం చూపించాయని వెల్లడించాయి. ఆయా మోడల్స్ పై రూ. 2500 నుంచి లక్ష రూపాయలను పెంచుతున్నట్టు మారుతి ప్రకటించింది. ఇటీవలి కాలంలో అధిక డిస్కౌంట్లు, రూపాయి విలువతగ్గడం సహా పలు కారణాలతో ధరలను పెంచక తప్పలేదని మారుతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆర్ఎస్ కల్సి తెలిపారు. జనవరిలో రెండు శాతం ధరలు పెంచనున్నట్టు తెలిపారు. ఏ మోడల్ కు ఎంత ధర పెరగనుందీ తమ టీమ్ లెక్కిస్తోందని చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులు కార్లకొనుగోలుకు మొగ్గు చూపుతారనే అంచనాలతో ఆటోమోటివ్ పరిశ్రమలో కార్ల ధరలను పెంచడం ఆనవాయితీ. కానీ భారత్ లో అమ్ముడుబోయే ప్రతి రెండు వాహనాల్లో ఒకదాన్ని సాధించే మారుతి సుజికి మాత్రం సంవత్సర ఆరంభంలో వాహనాల ధరల పెంపునకు ఇప్పటి వరకూ దూరంగా ఉంటోందనే చెప్పాలి. మరోవైపు ఆరు నెలల్లో మారుతి కార్ల ధరలను పెంచడం ఇది రెండవ సారి. దాదాపు ఇదే కారణాలతో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కార్ల ధరలను 4 వేల లక్షలవరకు పెంచనుంది. తమ అన్ని రకాల కార్లపై ఈ పెంపును జనవరి నుంచి వర్తింప జేయనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీనివాస్తవ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ప్రీమియం ఎస్ యూవీ ధర శాంటా ఫే ధర లక్ష రూపాయలు పెరగనుంది. కాగా డీమానిటైజేషన్ కారణంగా ఇప్పటికే టయోటా, హోండా,మహీంద్రా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ కొత్త సంవత్సరం లో కార్ల ధరలను 3శాతం పెంచాయి. ఇపుడు ఈ దిగ్గజాల అడుగుజాడల్లో మిగిలిన కార్ కంపెనీలు కూడా త్వరలో కార్ల ధరల్ని పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
పెరగనున్న టాటా కార్ల ధరలు
న్యూఢిల్లీ: పెరిగిన ముడి సరుకుల వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కీలకమైన పండుగల సమయంలో కార్ల ధరలను పెంచే ఆలోచనల్లో టాటా గ్రూప్ ఉంది. కార్ల ధరలను పెంచనున్నామని, దీనిపై తాము దృష్టి సారించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ప్రెసిడెంట్ మయాంక్ ప్రతీక్ తెలిపారు. పండుగల సీజన్లో కార్ల ధరల పెంపు ఉంటుందని చూచాయగా చెప్పారు. ఉత్పాదక వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు కారణంగా పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు పెంచాయని, తాము కూడా చాలా కాలంగా ధరలను సవరించని విషయాన్ని ప్రతీక్ పేర్కొన్నారు. టాటా మోటార్స్ రూ.2.15 లక్షలు-16.3 లక్షల శ్రేణిలో నానో, టియాగో, ఏరియా తదితర మోడళ్లను విక్రయిస్తోంది. -
జైట్లీ సెస్ అస్ర్తం
ఖజానాకు మరింత ఆదాయం రాబట్టే క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఈసారి సెస్సు అస్త్రాన్ని ప్రయోగించారు. సర్వీసు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాటన్నింటిపైనా కృషి కల్యాణ్ సెస్సును వడ్డించారు. కార్లపై మౌలిక సెస్సును వేసి వాహన కొనుగోలు భారం చేశారు. మరికొన్ని సుంకాలు, పన్నుల వడ్డింపుతో మరింత ఆదాయంపై దృష్టిపెట్టారు. కార్ల ధరలకు రెక్కలు.. న్యూఢిల్లీ: బడ్జెట్లో వాహనాలపై ప్రవేశ పెట్టిన మౌలిక సెస్ పుణ్యమాని కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. చిన్న కార్లపై రూ.2,000 నుంచి పెద్ద డీజిల్ ఎస్యూవీలపై రూ. లక్ష వరకూ కార్ల ధరలు పెరగనున్నాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్లపై ఎడాపెడా పన్నులు బాదేశారు. ముఖ్యంగా డీజిల్ వాహనాలపై ఆయన ఏమాత్రం కనికరం చూపలేదు. 1,500 సీసీ ఇంజిన్ సామర్థ్యం, 4 మీ. లోపు పొడవున్న డీజిల్ వాహనాలపై 2.5 శాతం సెస్ను ఆర్థిక మంత్రి వడ్డించారు. ఇంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం గల కార్లు, ఎస్యూవీలు, సెడాన్లపై 4% సెస్ను జైట్లీ విధించారు. ఇక 1,200 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/ఎల్పీజీ/సీఎన్జీ కార్లపై 1 శాతం సెస్ ఉంటుందని జైట్లీ చెప్పారు. రూ.10 లక్షలకు మించిన లగ్జరీ వాహనాలపై 1% పన్నును వడ్డించారు. ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలని కోరుతున్న వాహన కంపెనీలకు సెస్ విధింపు అశనిపాతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఊహించని విధింపు... సెస్ విధింపు వల్ల మారుతీ ఆల్టో, టాటా నానో వంటి చిన్న కార్లపై ధరలు రూ.2,500 వరకూ, ఇక రూ.30 లక్షలకు మించిన వాహనాలపై రూ. లక్ష వరకూ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెస్ విధింపు ఊహించనిదని మారుతీ సుజుకీ చైర్పర్సన్ ఆర్.సి. భార్గవ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్ల ధరలు పెంచక తప్పదని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్య సమస్య నివారణకు గాను 2020 నుంచి యూరో సిక్స్ నిబంధనలు అమలు చేయాలని అడిగామని, దీనివల్ల కార్ల తయారీకి సంబంధించి తమ పెట్టుబడులు పెరుగుతాయని, కార్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. వాహన పరిశ్రమకు మౌలిక సెస్ పెద్ద దెబ్బ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కారైన ఈయాన్పై రూ.3,000 వరకూ, శాంటాఫే ఎస్యూవీపై రూ.80,000 వరకూ ధరలు పెరుగుతాయని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పడిప్పడే కోలుకుంటున్న వాహన పరిశ్రమ సెంటిమెంట్పై ఈ సెస్ విధింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని టాటా మోటార్స్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. బీమాలో ఎఫ్డీఐ నిబంధనల సడలింపు న్యూఢిల్లీ: పెట్టుబడులు మరిన్ని ఆకర్షించే దిశగా బీమా, పింఛను రంగాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీని ప్రకారం బీమా, పింఛను రంగాల్లో ఇకపై 49 శాతం దాకా ఎఫ్డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇప్పటిదాకా ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం ఎఫ్డీఐలను మాత్రమే అనుమతిస్తున్నారు. అటు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అసెట్ రీకన్స్రక్షన్ కంపెనీల్లో (ఏఆర్సీ) ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్డీఐల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. దేశీ స్టాక్ ఎక్స్ఛేజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. దీని వల్ల దేశీ స్టాక్ ఎక్స్చేంజీలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇక బ్యాంకులు మినహా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ పద్ధతిలో ప్రస్తుత 24 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల అమలు సజావుగా సాగేలా.. దేశీయంగా కేంద్ర రాష్ట్ర పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకోవాలని జైట్లీ ప్రతిపాదించారు. ఇది కుదుర్చుకున్న రాష్ట్రాలు.. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించగలవని పేర్కొన్నారు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.56,500 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల(మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. వ్యూహాత్మక విక్రయాలకు సంబంధించి నష్టదాయక కంపెనీలతోపాటు, లాభదాయక కంపెనీలనూ జాబితాలో చేర్చనుంది. కాగా వ్యూ హాత్మక పెట్టుబడుల విక్రయంలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్లో తన వాటాను 50% దిగువకు తగ్గించుకునే విషయాన్ని పరిశీలించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకోగా రూ.25,312 కోట్లను మాత్రమే సమీకరించుకోగలిగింది. దీంతో వరుసగా ఆరేళ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని సాధించలేకపోయినట్లయ్యింది. ఈ శాఖకు కొత్తపేరు..: పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు మార్పును బడ్జెట్ ప్రతిపాదించింది. దీనిని ఇకమీదట ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ(డీఐపీఏఎం)గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫండింగ్కు కొత్త విధాన ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్యూలు నిరుపయోగంగా ఉన్న తమ ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమకూర్చుకోవడం దీని ముఖ్యోద్దేశం. 10 లక్షల డివిడెండుపై పన్ను.. వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను విధించాలని బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదించారు. ఇది డివిడెండు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి అదనంగా ఉండనుంది. ఇప్పటివరకూ డివి డెండ్లు తీసుకునే వాటాదారులు కాకుండా, వాటిని పంపిణీ చేసే కంపెనీలు డీడీటీ చెల్లిస్తుండగా, ఇకపై రూ. 10 లక్షల పైగా డివిఢ డెండు అందుకునే వారు కూడా పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగలవు. మరోవైపు ఆప్షన్ ట్రేడింగ్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను 0.017 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రాగలదని అంచనా. ♦ మొబైల్ ఫోన్లు కాస్త ఖరీదు.. ♦ 5% దాకా పెరిగే అవకాశం ♦ ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, పీసీలు కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దూకుడు మీద ఉన్న మొబైల్ ఫోన్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (పీసీబీ) దిగుమతులపై 2 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, మొబైల్స్లో వాడే స్పీకర్ల దిగుమతులపై ఇప్పటి వరకు ఉన్న పలు సుంకాల మినహాయింపులను కూడా ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికే ఈ చర్యలని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అలాగే ఐటీ, హార్డ్వేర్, క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తుల ధర తగ్గుతుందని, దేశీయ పరిశ్రమలో పోటీతత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పీసీబీలను ల్యాప్టాప్, పర్సనల్ కంప్యూటర్ల తయారీలోనూ వినియోగిస్తారు. తాజా ప్రతిపాదన ప్రభావంతో వీటి ధరలు కూడా అధికం కానున్నాయి. తిరోగమన చర్య.. పన్నుల పెంపు ఏమాత్రం ఉన్నా అది కస్టమర్లపై వేయకతప్పదని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ చెప్పారు. స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై పరిశ్రమ అసంతృప్తిగా ఉందని లావా ఇంటర్నేషనల్ చైర్మన్ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొబైళ్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరుగుతుందని వెల్లడించారు. కాగా, ఇక నుంచి దిగుమతైన చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, మొబైల్స్లో వాడే స్పీకర్లపై బేసిక్ కస్టమర్స్ డ్యూటీ 10%, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ 12.5 శాతం విధిస్తారు. వాయిదాకు విన్నవిస్తాం.. స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు పెద్ద షాక్ అని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా ఆర్థిక మంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు. ‘పీసీబీల తయారీ భారత్లో లేనే లేదు. అసలు ప్రభుత్వం వీటి తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకున్న చర్యలే లేవు. అలాంటప్పుడు ఉన్నఫలంగా డ్యూటీ వేయడం తగదు. కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందే’ అని వెల్లడించారు. బ్యాంకులకు రూ.25,000 కోట్ల తాజా మూలధనం బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంక్ బోర్డ్ బ్యూరో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిల సమస్య కొత్తదేమీ కాదని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బ్యాంకుల రోజూవారీ రుణ మంజూరు విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. బకాయిల్లో రికవరీ వేగంగా జరిగేలా చూడ్డానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ను పటిష్టపరుస్తామని కూడా స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగానికి వచ్చే ఏడాది రూ.25,000 కోట్లే కాకుండా అవసరమైతే మరింత నిధులు సైతం సమకూర్చుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఒక్క రోజులోనే కంపెనీ నమోదు ఒక్క రోజులోనే కంపెనీని నమోదు చేసుకునే వీలుండేలా 2013 నాటి కంపెనీల చట్టాన్ని సవరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తేనున్నామని జైట్లీ చెప్పారు. వ్యాపారం చేయడం అత్యంత సులభంగా ఉండేలా చూడడం, స్టార్టప్లకు అనుకూలమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందిస్తున్నామని 2016-17 బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టంపై నియమించిన ప్రభుత్వ కమిటీ ఇటీవలే సమర్పించిన తన నివేదికలో వంద సవరణలను సూచించింది. ఈ సవరణల ఆధారంగా ఈ బిల్లును తయారు చేస్తున్నామన్నారు. పసిడి బాండ్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఊరట న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా .. వీటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గోల్డ్ బాండ్ స్కీము కింద 5,10,50, 100 గ్రాముల పసిడికి సరిసమానమైన విలువతో గోల్డ్ బాండ్లను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇవి 5-7 ఏళ్ల కాల వ్యవధితో లభిస్తాయి. ఆర్బీఐ ఇప్పటిదాకా ఈ బాండ్లను 2 సార్లు జారీ చేసింది. మరోవైపు, పసిడి డిపాజిట్ల పథకం కింద ఇచ్చే డిపాజిట్ సర్టిఫికెట్లపై వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్కు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని జైట్లీ చెప్పారు. పసిడి డిపాజిట్ పథకాన్ని గతేడాది నవంబర్ 5న ప్రారంభించారు. పుత్తడి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో ఈ 2 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. -
మరిన్ని కంపెనీల కార్ల ధరలు పెంపు
* జాబితాలో టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా * మోడళ్లను బట్టి 3 శాతం వరకూ వడ్డింపు న్యూఢిల్లీ: కార్ల ధరలను తాజాగా మరికొన్ని కంపెనీలు పెంచాయి. టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా కంపెనీలు ధరలను 3 శాతం వరకూ (రూ.50,000 వరకూ) పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంపు వచ్చే నెల నుంచి వర్తిస్తుందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వివరించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల వచ్చిన ప్రతికూల ప్రభావాన్ని ఈ ధరల పెంపు కొంత ఉపశమనాన్ని ఇస్తుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కంపెనీ రూ.4.47 లక్షలున్న మైక్రా నుంచి రూ.12.91 లక్షలున్న ఎస్యూవీ టెర్రానో వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. డాట్సన్ బ్రాండ్ కింద రూ.3.23 లక్షలున్న డాట్సన్ గో కారు నుంచి రూ.4.76 లక్షలున్న డాట్సన్ గో ప్లస్ కార్లను కూడా విక్రయిస్తోంది. ఇక రెనో కంపెనీ మొత్తం ఏడు మోడళ్లను భారత్లో విక్రయిస్తోంది. వీటి ధరలన్నింటినీ 3 శాతం వరకూ పెంచుతున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ రూ.2.56 లక్షలు ఖరీదున్న క్విడ్ నుంచి రూ.23.47 లక్షల ఖరీదున్న కొలియోస్ మోడళ్లతో పాటు పల్స్, స్కేలా, డస్టర్, లాడ్జీ, ఫ్లూయెన్స్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. మరోవైపు అన్ని మోడళ్ల ధరలను రూ. 14,000 నుంచి రూ.50,000 వరకూ పెంచుతున్నామని స్కోడా కంపెనీ పేర్కొంది. మోడళ్లను బట్టి ధరలను 2-3 శాతం రేంజ్లో పెంచుతున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు మోడళ్లను-రాపిడ్, ఆక్టేవియా, యెటి, సూపర్బ్ మోడళ్లను అమ్ముతోంది. కాగా ఇప్పటికే మారుతీ సుజుకీ,హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలు కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. టాటా మోటార్స్... రూ.20,000 వరకూ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.20,000వరకూ పెంచుతున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. వివిధ ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచకతప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ. 1.99 లక్షల ఖరీదున్న నానో జెనెక్స్ నుంచి రూ.15.51 లక్షల ఖరీదున్న ఆరియా వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. -
కార్ల ధరలకు రెక్కలు
-
కార్ల ధరలు పెరిగాయ్
ఎక్సైజ్ సుంకం పెంపు ఫలితం ఉత్పత్తి వ్యయాలు పెరగడమూ మరో కారణం ముంబై: ఇటీవల ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. జనరల్ మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాలు మంగళవారం ధరలను పెంపును ప్రకటించగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, బజాజ్ ఆటో కంపెనీలు కూడా త్వరలో పెంచనున్నాయి. షెవర్లే వాహనాల ధరలను మోడళ్లను బట్టి రూ.15,000 నుంచి రూ.61,000 వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. హోండా కార్స్ ఇండియా కంపెనీ తన కార్ల (హోండా సిటీ, అమేజ్ తదితర మోడళ్లు) ధరలను రూ 60,000 వరకూ పెంచింది. మారుతీ పెంపు రూ.31,600 వరకూ మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.7,850 నుంచి రూ.31,600 వరకూ పెంచింది. ఓమ్ని ధరలు రూ.7.850 నుంచి రూ.9,950 వరకూ, ఆల్టో ధరలు రూ.8,500 నుంచి రూ.12,700 వరకూ, వ్యాగన్ఆర్ ధరలు రూ.12,500 నుంచి రూ.15,700 వరకూ, స్విఫ్ట్ ధరలు రూ.15,850 నుంచి రూ.25,150 వరకూ, డిజైర్ ధరలు రూ.17,500 నుంచి రూ.26,650 వరకూ, సెలెరియో ధరలు రూ.13,600 నుంచి రూ.17,200 వరకూ, ఎర్టిగ ధరలు రూ.18,750 నుంచి రూ.27,750 వరకూ, సియాజ్ ధరలు రూ.22,450 నుంచి రూ.31,600 వరకూ పెరుగుతాయని పేర్కొంది. హ్యుందాయ్ పెంపు రూ.1.27 లక్షల వరకూ హ్యుందాయ్ మోటార్ వాహనాల ధరలను రూ.15,000 నుంచి రూ.1,27,000 వరకూ పెంచింది. ఎంట్రీ లెవల్ కారు ఈఆన్ ధరలను రూ.15,417, ఐ10 ధరలను రూ.21,501, గ్రాండ్ ఐ10 ధరలను రూ.22,508 వరకూ పెంచింది. కాంపాక్ట్సెడాన్ ఎక్సెంట్ ధరలను రూ.25,597, ప్రీమియం హ్యాచ్బాక్ ఇలీట్ ఐ20 ధరలను రూ.29,814, మిడ్ సైజ్ సెడాన్ వెర్నా ధరలను రూ.23,965, ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఎలంత్ర ధరలను రూ.36,912, సొనాట ధరను రూ.45,396, శాంటాఫై ధరలను రూ.1.27 లక్షలకు పెంచింది. సుంకం పెంపు కారణంగా టూవీలర్ల ధరలను 2,000-7,000 రేంజ్లో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ధరలను పెంచిందని సమాచారం. ఈ నెల 1 నుంచి తయారైన వాహనాలకే పెరిగిన ఎక్సైజ్ రేట్లు వర్తిస్తాయి కాబట్టి గత ఏడాది తయారైన కార్లకు ఎక్సైజ్ సుంకం పెంపు వర్తించదు. అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా కంపెనీలు/డీలర్లు పాత ధరలకే ఈ వాహనాలను ఆఫర్ చేయవచ్చని నిపుణులంటున్నారు. -
రెనో కార్ల ధరలు 2.5 శాతం పెంపు
న్యూఢిల్లీ: రేనో ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రెండున్నర శాతం వరకూ పెంచుతోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంచెమైనా తట్టుకునేందుకు ధరలను పెంచక తప్పడం లేదని రెనో ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాఫెల్ ట్రెగర్ చెప్పారు. ధరల పెరుగుదల వచ్చే నెల 1 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఉత్పత్తి వ్యయాల పెంపును తట్టుకోగలిగామని, కానీ ముడి సరుకుల ధరలు పెరుగుతున్నందున కార్ల ధరలను పెంచక తప్ప డం లేదని వివరించారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ ఇప్పటికే పలు కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. నిస్సాన్ ఇండియా రూ.18,000 వరకూ, మారుతీ సుజుకి 2-4 శాతం వరకూ, హ్యుందాయ్ రూ.25,000 వరకూ, బీఎండబ్ల్యూ 5 శాతం వరకూ పెంచాయి. జనరల్ మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ధరలను పెంచాయి. -
రోడ్లూడ్చిన రోల్స్రాయ్స్
లండన్లోని బాండ్ స్ట్రీట్. ఒకాయన ఆ వీధిలో నడుస్తున్నాడు. మార్గమధ్యంలో రోల్స్రాయ్స్ షోరూమ్ కనిపించింది. వెంటనే ఆ షోరూమ్లోకి వెళ్లిన ఆయన కార్ల ధరలు, ఇతర ఫీచర్స్ గురించి అడిగాడు. ఇండియా నుంచి వచ్చిన అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి అనుకున్న సేల్స్మ్యాన్.. అతడిని అవమానించాడు. బయటికి గెంటేసినంత పని చేశాడు. అలా అవమానం పొందిన వ్యక్తి ఎవరో కాదు హైదరాబాద్ నవాబు ముకర్రమ్ జా. వెంటనే హోటల్రూమ్కు వచ్చిన నవాబు తన సేవకులతో షోరూమ్కు ఫోన్ చేయించాడు. కార్లు కొనడానికి హైదరాబాద్ నవాబు వస్తున్నాడని చెప్పించాడు. ఈసారి పూర్తిగా నవాబు హోదా, రాజఠీవీతో షోరూమ్కు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరేటప్పటికే ఫ్లోర్పై రెడ్కార్పెట్ పరిచి ఉంది. అక్కడ ఉన్న సేల్స్మెన్ వంగి వంగి దండాలు పెట్టారు. నవాబు అప్పుడు షోరూమ్లో ఉన్న ఆరు కార్లను డెలివరీ ధరలు కూడా చెల్లించి కొనేశాడు. ఇండియాకు చేరుకున్న నవాబు కార్లు రాగానే... ఆ ఆరు కార్లకు పొరకలు కట్టి హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేయించాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్రాయ్స్ కార్లు అలా నగరంలో చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. ఈ వార్త ఈ పత్రికా, ఆ పత్రికా చేరి చివరకు... ప్రపంచ ప్రఖ్యాత రోల్స్రాయ్స్ పరువు మురికి కాలువలో కలిసింది. యూరప్ అమెరికాల్లో ఈ కారును ఉపయోగించిన వారు.. ‘ఏది ఇండియాలో చెత్త మోయడానికి వాడుతున్నారే.. ఆ కారా?’ అని వ్యంగ్యంగా అనేవారట. ఒక్కసారిగా రోల్స్రాయ్స్ ప్రతిష్టతోపాటు రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరొస్తుందనుకున్న రోల్స్రాయ్స్ యాజమాన్యం..నవాబుకు క్షమాపణలు చెబుతూ టెలిగ్రాం పంపింది. కార్లతో రోడ్లు క్లీన్చేయించడం ఆపేయాలని కోరింది. అంతేకాదు.. తాము చేసిన తప్పుకు బదులుగా ఆరు రోల్స్రాయ్స్ కార్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. 1967లో అతని నాన్నమ్మ మరణానంతరం ముకర్రమ్ జా యువరాజయ్యాడు. ప్రస్తుతం అతని ప్యాలెస్ మ్యూజియంగా మారింది. ఆ రోల్స్రాయ్స్ కార్లు కూడా ప్రదర్శనకు ఉంచారు. -
హ్యుందాయ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్ని మోడళ్లళ కార్ల ధరలను జవనరి నుంచి రూ.5,000-రూ.20,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలు పెంచుతున్నామని వివరించారు. ఇప్పటికే మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, హోండా తదితర కంపెనీలు ధరలను పెంచాయి. -
మహీంద్రా వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా వాహనాల ధరలను పెంచుతోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను వచ్చే నెల 1 నుంచి 2% వరకూ పెంచుతోంది. అధిక ఉత్పత్తి వ్యయాలు తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా గురువారం చెప్పారు. ఇప్పటికే మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, రేనాల్ట్ వంటి కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఫోక్స్వ్యాగన్ పెంపు 2.5 శాతం: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతోంది. వచ్చే నెల 1 నుంచి ధరలను 2.5% వరకూ పెంచుతున్నామని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా గురువారం తెలిపారు. గత కొన్నేళ్లుగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని, అత్యున్నత ప్రమాణాలున్న వాహనాలను అందించాలంటే ధరలను స్వల్పంగా పెంచక తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కంపెనీ భారత్లో పోలో, వెంటో, జెటా, పసంట్, టౌరేగ్, ఫేటాన్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. -
కార్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నామని కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. మరికొన్ని ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఆర్థిక, మార్కెట్ పరిస్థితులు, ముడి పదార్ధాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం, రూపాయి మారకంలో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం ఇత్యాది కారణాల వల్ల మెర్సిడెస్, బీఎండబ్ల్యూ ఆడి వంటి లగ్జరీ కార్ల కంపెనీలే కాకుండా మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా కంపెనీలు ధరల పెంపునకు రంగం సిద్ధం చేశాయి. భారమైన వ్యయాలు భరించలేనంతగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సీవోవో(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయంక్ పరీక్ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ రూ.2.13 లక్షల ఖరీదుండే ఎం800 కారు నుంచి రూ.24.6 లక్షల ఖరీదుండే గ్రాండ్ విటారా వరకూ వివిధ కార్ల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో రూపాయి ఒడిదుడుకుల కారణంగా రూ.10,000 వరకూ వివిధ మోడళ్ల కార్ల ధరలను ఈ కంపెనీ పెంచింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు తట్టుకోవడానికి వచ్చే నెల నుంచి ధరలను పెంచాలని యోచిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డివిజన్ హెడ్(మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని ఆయన వివరించారు. ఈ కంపెనీ రూ.2.89 లక్షల నుంచి రూ.26.69 లక్షల రేంజ్లో వివిధ కార్ల మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి తమ కార్ల ధరలను పెంచాలనుకుంటున్నామని హోండా కార్స్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రభావాలను కొంతైనా తట్టుకునేందుకు ధరలు పెంచాలని యోచిస్తున్నామని, ఏ మేరకు ధరలు పెంచాలనే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్లోనే ఈ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.2,000-రూ.10,000 రేంజ్లో పెంచింది. లగ్జరీ కార్లదీ అదే బాట లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ధరల పెంపు బాట పట్టాయి. అన్ని రకాల మోడళ్ల ధరలను 10 శాతం వరకూ పెంచనున్నామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తాజాగా పేర్కొంది. అయితే, ఈ కంపెనీ ధరల పెంపునకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఈ సంస్థ రూ.22 లక్షల నుంచి రూ.3 కోట్ల ధరల రేంజ్లో లగ్జరీ కార్లను విక్రయిస్తోంది. ఆర్థిక సంబంధిత కారణాల వల్ల తమ వ్యాపారంపై ఒత్తిడి తీవ్రంగా ఉందని, అందుకే జనవరి నుంచి కార్ల ధరలను 3 నుంచి 5 శాతం వరకూ పెంచుతున్నామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ తెలిపారు. ఈ కంపెనీ విభిన్న కార్ల మోడళ్ల(ఏ4, ఎస్4, ఏ6, ఎస్6, ఏ8 సెడాన్) ను, క్యూ3, క్యూ5, క్యూ7 ఎస్యూవీలను, ఆర్8, వీ8, ఆర్8 స్పైడర్ వంటి స్పోర్ట్స్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.27.93 లక్షల నుంచి రూ.2.14 కోట్ల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయి. బీఎండబ్ల్యూ పెంపు 10 శాతం కార్ల ధరలను 10% వరకూ పెంచుతామని బీఎండబ్ల్యూ ప్రకటించింది. డాలరుతో రూపాయి విలువ పతనం కారణంగా ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ కార్ల ధరలను 5% వరకూ పెంచింది. ప్రస్తు తం ఈ సంస్థ భారత్లో 1 సిరీస్, 3,5,6,7 సిరీస్ కార్లను, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్యూవీలను, ఎం సిరీస్ స్పోర్ట్స్ కార్లను, మినీ సిరీస్ కార్లను విక్రయిస్తోంది. ఈ కార్ల ధరలు రూ.20.9 లక్షల నుంచి రూ.1.78 కోట్ల రేంజ్లో ఉన్నాయి. -
బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ కార్ల ధరలు జనవరి నుంచి 10 శాతం వరకూ పెరుగుతాయి. నిలకడైన లాభదాయక వృద్ధి సాధించే వ్యూహంలో భాగంగా ధరలను పెంచుతున్నామని బీఎం డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ మంగళవారం తెలిపారు. బీఎండబ్ల్యూ , మినీ కార్ల ధరలను 7-10% వరకూ పెంచుతామని చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి, ధరలను పెంచుతున్నామని, ఈ ధరల పెంపు దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం కారణంగా ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ కార్ల ధరలను 5% వరకూ పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీ భారత్లో 1 సిరీస్, 3,5,6,7 సిరీస్ కార్లను, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్యూవీలను, ఎం సిరీస్ స్పోర్ట్స్ కార్లను, మిని సిరీస్ కార్లను విక్రయిస్తోంది. ఈ కార్ల ధరలు రూ.20.9 లక్షల నుంచి రూ.1.78 కోట్ల రేంజ్లో ఉన్నాయి.