colonel
-
నోరూరించే కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!
ప్రస్తుతం యువతరం చాలా ఇష్టంగా లాగించే చికెన్ వెరైటీలో కేఎఫ్సీ ఒకటి. చాలామందికి ఈ కేఎఫ్సీ చికెన్ అంటే మహా ఇష్టం. ఫ్రైడ్ చికెన్లో ఇంతలా ప్రత్యేకతను సంతరించుకునేలా విభిన్నంగా ఎలా తయారు చేయాగలిగారో వింటే ఆశ్చర్యపోతారు. అందులోనూ లేటు వయసులో తన ఆర్థిక భద్రత గురించి కలిగిన ఆందోళన బిజినెస్ మెదలుపెట్టాలన్న ఆలోచనకు దారితీసింది. అదే చివరికి వెరైటీ రెసిపీని తయారు చేసేందుకు పురిగొల్పింది. చివరకు కనివిని ఎరుగని రీతీలో సక్సెస్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. కలను సాకారం చేసుకోవాలన్న తపన ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు.అతడే కేఎఫ్సీ చికెన్ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. అందరూ యంగ్ ఏజ్లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కొందరూ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వగా మరికొందరూ..చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకుంటారు. చివరికి రిటైర్డ్ వయసు వచ్చేటప్పటికీ ఎంతోకొంత ఆర్థిక భద్రతతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే కల్నల్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే ఎన్నో బిజినెస్లు చేశాడుగానీ ఎందులోనూ మంచి విజయం దక్కించుకోలేదు. అలా 65 ఏళ్లు వచ్చేటప్పటికీ అతడు ఎందులోనూ సక్సెస్ అందుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. పోనీ మిగతా జీవితం సాఫీగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక భద్రతను వెనకేసుకోలేదు. అతడి వద్ద కేవలం రూ. 8వేల రూపాయలే ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటీ జీవితం ఇలా వృధాగా అయిపోయిందన్న బాధ కల్నల్ని నిలువనివ్వలేదు. ఆ సమయంలోనే తాను ఒక రుచకరమైన రెసిపీని తయారు చేయాలని గట్టిగా అనుకున్నాడు. తాను తయారు చేసే రెసిపీని చూడగానే తానే గుర్తొచ్చేలా.. అత్యద్భుతంగా తయారు చేయాలనుకున్నాడు. తన వద్ద కొద్దిపాటి వనరులతో చికెన్తో వెరైటీ రెసిపీ ఏదైనా చేయాలనుకున్నాడు. చెప్పాలంటే రెస్ట్ తీసుకునే వయసులో లక్ష్యం కోసం ఆహర్నిశలు కష్టపడటం మొదలుపెట్టాడు కల్నల్. ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టమనే విషయం గ్రహించాడు. దానిలోనే ప్రత్యేక రుచితో కూడిన వెరైటీ ఫ్రైడ్ చికెన్ చేయాలనుకున్నాడు. అక్కడకు వరకు బాగానే ఉంది. తాను తయారు చేసిన ఫ్రైడ్ చికెన్లు సమీపంలోని రెస్టారెంట్ల వద్దకు వెళ్లి చేసి చూపించి వాళ్ల చేత శెభాష్ అనిపించుకోవడం అంత ఈజీ కాలేదు కల్నల్కి. ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది సార్లుకు పైగా అతడు చేసిన రెసిపీ రిజక్ట్ అయ్యింది. విసుగు, కోపం వచ్చేస్తున్నా.. వెనకడుగు వేయకుండా వారి చేత బాగుంది అని ఒప్పుకునేదాక ప్రయత్నం విరమించలేదు. ఒక రోజు మజ్జిగలో నానబెట్టిన చికెన్ని బ్రెడ్ పౌడర్లో దొల్లించి తాను రెడీ చేసి పెట్టుకున్న మసాల మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసి ఇవ్వగా ఒక రెస్టారెంట్ ఆ టేస్ట్కి ఫిదా అయిపోయింది. ఇక అంతే కొద్ది కాలంలో కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయింది. దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో కేఎప్సీగా జనాల్లోకి తీసుకురావడం, ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడం చకచక జరిగిపోయాయి. అలా 1964 నాటికి అతడి బ్రాండ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ దేశవ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది. అదే సంవత్సరం తన బ్రాండ్ని సుమారు రూ. 16 కోట్లుకు విక్రయించాడు(ప్రస్తుత రోజుల్లో రూ. 144 కోట్లకు సమానం). అయితే అతనే ఆ బ్రాండ్కి అంబాసిడర్, ప్రతినిధి. దీంతో కల్నల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని వ్యక్తి కోటీశ్వరుగా మారిపోయాడు. చాలా లేటు వయసులో లక్ష్యం కోసం యత్నంచి అతిపెద్ద సక్సెస్ని అందుకుని.. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.(చదవండి: 77 ఏళ్ల నాటి కేకు ముక్క..! వేలంలో ఏకంగా..) -
కల్నల్ మన్ప్రీత్కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్ప్రీత్సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్రక్షక్ మెడల్, మూడు తట్రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
కల్నల్ నియామకాల్లో మహిళలకు అన్యాయం... నిబంధనలకు విరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్గా ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది. కల్నల్ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్)లకు సైన్యం కటాఫ్ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్ప్రీత్సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్లోని మల్లాన్పూర్కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల్నల్ కుటుంబంపై జనసేన నేత దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఇది దేశ రక్షణలో నిమగ్నమైన కల్నల్ కుటుంబంపై ఓ జనసైనికుడి దాష్టీకం. కల్నల్ ఇంటిని నివాసానికని అద్దెకు తీసుకొని, పార్టీ కార్యాలయం పెట్టారు. అందులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, ఇదేమిటని ప్రశ్నించి ఇల్లు ఖాళీ చేయమన్న ఆయన తల్లినీ బెదిరించాడు. దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను కార్గిల్లో పనిచేస్తున్న కల్నల్ మహేశ్వరరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. తరచూ అక్కడ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ పోస్టు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ‘సాక్షి’తో కూడా మాట్లాడారు. వివరాలివీ.. కర్నూలు సీ క్యాంపు గణేశ్నగర్కు చెందిన మహేశ్వరరెడ్డి భారత సైన్యంలో కల్నల్గా కార్గిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంటిని (హౌస్ నంబర్ 87/1024)ను 2021 మేలో షేక్మహ్మద్ మహబూబ్బాషా, అతని భార్య హసీనా బేగం అద్దెకు తీసుకున్నారు. నివాసానికి అని చెప్పి తీసుకున్నప్పటికీ, అందులో నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జనసేనలో చేరి, ఆ పార్టీ కార్యాలయంగా మార్చారు. అద్దె కూడా చెల్లించలేదు. నివాసానికి అని చెప్పి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, అద్దె కూడా చెల్లించడంలేదని, వెంటనే ఖాళీ చేయాలని కల్నల్ నోటీసులు ఇచ్చారు. జనవరిలో స్వయంగా కల్నల్ వచ్చి వారితో మాట్లాడారు. ఫిబ్రవరి 28 లోపు ఖాళీ చేయాలని గట్టిగా చెప్పారు. అయినా ఖాళీ చేయలేదు. మంగళవారం కల్నల్ తల్లి లక్ష్మీదేవి ఇంటిని ఖాళీ చేయాలని బాషాకు చెప్పారు. ఖాళీ చేయనని, గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తామని బాషా బెదిరించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కల్నల్ కుటుంబ సభ్యులు జనసేన కార్యాలయంలోని ఫర్నీచర్ను బయట పెట్టి తాళం వేసుకున్నారు. తమను బెదిరించిన బాషాపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబ్ బాషాపై కల్నల్, ఆయన తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని త్రీ టౌన్ సీఐ మహ్మద్ తబ్రేజ్ చెప్పారు. బాషాపై గతంలోనే ఓ అత్యాచారం కేసు నమోదైంది. తన కార్యాలయంలో పనిచేసిన ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు, ఫోన్లో పలుమార్లు బాధితురాలిని బెదిరించినట్లు 2021 అక్టోబరు 18న కేసు నమోదైంది. ఆడియో రికార్డులతో సహా ఆమె త్రీటౌన్, దిశ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాషాపై సెక్షన్ 376 క్లాజ్–1, 376 క్లాజ్–సి, 354 డి, 506, 108 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రిమాండ్కు కూడా వెళ్లొచ్చాడు. జనసేనకు ప్రశ్నలు సంధించిన కల్నల్ తాను సరిహద్దుల్లో దేశం కోసం శ్రమిస్తున్నానని, కానీ జనసేన నేతలు తమను, తమ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని కల్నల్ అన్నారు. జనసేన రాష్ట్ర నాయకత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పార్టీలోకి చేర్చుకునే వ్యక్తుల పూర్వాపరాలు పరిశీలించరా? పార్టీ నేతలు, కార్యకర్తలకు కనీస విలువలు ఉండవా? నేరస్తులను పార్టీలోకి చేర్చుకుని ఏం సందేశం ఇస్తున్నారు? ఇతరుల నివాసాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసుకోండని జనసేన ప్రోత్సహిస్తోందా? మహిళను దూషించడం, కొట్టడం లాంటి చర్యలకు పార్టీ మద్దతిస్తోందా? అని ప్రశ్నించారు. బాషాపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకత్వాన్ని కోరారు. -
1971 ఇండియా–పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు
సైనికుడిగా సరిహద్దుల్లోసేవలందించడం విద్యార్థులుగా చాలామంది కల. ఆ కలను నిజం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు. యుద్ధంలో పాల్గొనడం ప్రతి సైనికుడి ఆశయం. ఆ ఆశయంలోనూవాళ్లు పాలుపంచుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే... ఇంకొకరు ఆ మిత్రున్ని ఇలా స్మరించుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విమోచనలో భాగంగా జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండాయి. ఆ యుద్ధంలో హైదరాబాద్కు చెందిన 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో మాజీ కల్నల్ డాక్టర్ వీఆర్కే ప్రసాద్, అమరుడైన సెకండ్ లెఫ్ట్నెంట్ విక్రమ్ బర్న్ అప్పలస్వామి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రులయ్యారు. సికింద్రాబాద్లో నివసిస్తూ ప్రస్తుతం రెండు ప్రైవేట్ వర్సిటీలకు వీసీగా సేవలు అందిస్తున్న వీఆర్కే ప్రసాద్ ఆప్తమిత్రుడైన విక్రమ్ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... మాణిక్ షాకు లేఖ రాసిన విక్రమ్... విక్రమ్ బర్న్ అప్పలస్వామి, నేను హిమాయత్నగర్, నారాయణగూడల్లోని పక్కపక్క కాలనీల్లో నివసించే వాళ్లం. నిజాం కాలేజీలో 1967–69 మధ్య బీఎస్సీ పూర్తి చేశాం. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లినా విజయం సాధించలేదు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం వరించట్లేదని విక్రమ్ అప్పటి ఆర్మీ జనరల్ మాణిక్ షాకు ఓ లేఖ రాశారు. దీన్ని చూసిన మాణిక్ షా తన అధికారిక లెటర్ హెడ్పై ‘నిరాశ పడకుండా ప్రయత్నించు. నీ పట్టుదల చూస్తుంటే కచ్చితంగా సాధిస్తావనే నమ్మకం ఉంది’ అని ప్రత్యుత్తరం రాశారు. దాంతో విక్రమ్ మరెంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఇద్దరం ఎంపికయ్యాం. విక్రమ్ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో, నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్లో (టెలిమ్యూనికేషన్స్ బ్రాంచ్) బాధ్యతలు తీసుకున్నాం. సెకండ్ లెఫ్ట్నెంట్ హోదాలో విక్రమ్ «గుజరాత్లో దరంగ్ధరలోని ఫీల్డ్ రెజిమెంట్లో, నేను పఠాన్కోట్ సిగ్నల్ రెజిమెంట్కు వెళ్లాం. అప్పట్లో ఉత్తరప్రత్యుత్తరాలు, గ్రీటింగ్ కార్డుల ద్వారా మాత్రమే మా మధ్య సమాచార మార్పిడి జరిగేది. ఎయిర్ బేస్లపై ఏక కాలంలో దాడులు.. 1971 సెప్టెంబర్ నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. డిసెంబర్ 3న పఠాన్కోట్ కమ్యూనికేషన్ సెంటర్లో విధుల్లో ఉన్నా. సాయంత్రం 5.45కి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. బయటకు వెళ్లి చూస్తే అక్కడి సమీపంలోని ఎయిర్ఫీల్డ్ పొగలు కక్కుతోంది. ఆరా తీస్తే పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఓ బాంబు వేసి వెళ్లాయని చెప్పారు. అది మొదలు పఠాన్కోట్, ఆగ్రా, గ్వాలియర్.. ఇలా ఉత్తరాన ఉన్న ఎయిర్ఫీల్డ్స్పై ఒకేసారి ఎయిర్ ఎటాక్ జరిగింది. దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పి కొట్టాయి. డిసెంబర్ 16 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యలోనే విక్రమ్కు ఓ లేఖ రాశాను. అయితే యుద్ధం నేపథ్యంలో అది పోస్టు చేయడం సాధ్యం కాలేదు. ఆ నెలాఖరు వరకు విక్రమ్నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్రిస్ట్మస్, న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో విక్రమ్ కోసం గ్రీటింగ్ కార్డులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. నిజాం కాలేజీకే గర్వకారణం.. ఈ లోపు మా సిగ్నల్స్ ఛానల్లో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. విక్రమ్ బర్న్ అప్పలస్వామి యు ద్ధంలో చనిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎంతో శోధించి తెలుసుకున్నా. అప్పట్లో విక్రమ్ వాళ్ల రెజిమెంట్కు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఈయన వాహనం కమాండింగ్ ఆఫీసర్ వాహనం వెనుకే ఉంటుంది. డిసెంబర్ 5న ఈ జీపు రాజస్థాన్లోని బర్మేర్ సెక్టార్లో శత్రు సైన్యం ఏర్పాటు చేసిన ఓ యాంటీ ట్యాంక్ మైన్ మీద నుంచి వెళ్లింది. ఆ పేలుడు ధాటికి విక్రమ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ 9న కన్ను మూశారు. తర్వాత జమ్మూ నుంచి జోథ్పూర్ బదిలీ అయ్యా. అప్పుడు విక్రమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవుపై వెళ్లి విక్రమ్ అంత్యక్రియలు నిర్వహించిన పాస్టర్ను కలిశాను. ఆయన చెప్పిన వివరాలతో వెళ్లి సమాధిని గుర్తించి నివాళులర్పించా. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ వచ్చా. నిజాం కాలేజీకే గర్వకారణమైన విక్రమ్ ఫొటోను ఆ కాలేజీలో పెట్టించా. ఇప్పటికీ ఏటా విక్రమ్ సంస్మరణ లెక్చర్ ఇస్తున్నా. వీఆర్కే ప్రసాద్ -
వీరుడా వందనం
న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్లోని ఫరీద్కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్గా ప్రీతిపాల్సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్ కౌర్కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్ మనవడు అభయ్పాల్ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషితో స్పెషల్ ఇంటర్వూ
-
అండగా ఉంటా: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: ‘కల్నల్ సంతోష్బాబు మరణం నన్ను ఎం తగానో కలచివేసింది. దేశ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇంతటి త్యాగం చేసిన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉం టుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కల్నల్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. సరిహద్దులో చైనా దాడిలో వీరమరణం పొందిన సూర్యాపేటవాసి కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాపేటలోని సంతోష్బాబు నివాసానికి చేరుకున్నారు. ముం దుగా కల్నల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్లతో కలసి కల్నల్ సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్, తల్లి దండ్రులు ఉపేందర్, మంజుల, చెల్లెలు శృతితో కేసీఆర్ మాట్లాడి వారిని ఓదార్చారు. దేశం కోసం సంతోష్బాబు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబా నికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డికి కేసీఆర్ సూచించారు. సీఎం ఓదార్పుతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్బాబు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రూ.5 కోట్ల చెక్కులు అందించిన సీఎం.. కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషికి గ్రూప్–1 ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమెకు అందజేశారు. అలాగే హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీపాన ఉన్న 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఆమెకు అందించారు. వాటితోపాటు సంతోషికి రూ. 4 కోట్ల చెక్కును, కల్నల్ తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. ఇంటి స్థలాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ఎంపిక చేశారని మంత్రి జగదీశ్రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్లను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లోకి సీఎంతోపాటు ముగ్గురే.. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీఎం కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలెవరూ రావొద్దని ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ సీఎంతోపాటు కేవలం మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్లు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం వెంట వచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్రెడ్డిలు సంతోష్బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావులు సంతోష్బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోష్ బాబు చిత్రపటంపై జైహింద్ అని రాస్తున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన పర్యటన.. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చిట్యాల మీదుగా సూర్యాపేటకు చేరుకున్నారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించాక తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో ఫాంహౌస్కు వెళ్లారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సంతోషి: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, సూర్యాపేట: కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమ వారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సం బంధిత శాఖ కమిషనర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270–93,780 వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తూ మరో జీవో.. సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 59ను సీఎస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని షేక్పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6/1, వార్డు నంబర్ 10, రోడ్డు నంబర్ 14 బంజారాహిల్స్లో కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు మా కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. సంతోష్బాబును తీసుకురాలేం కానీ ఆయన లేని లోటు పూడుస్తామని భరోసా ఇచ్చారు. గ్రూప్–1 స్ధాయి ఉద్యోగాన్ని ఇస్తామన్నారు. ఈ అవకాశం నాకే ఇచ్చారు. ఏ శాఖలో చేరితే ఆ శాఖను కేటాయిస్తామన్నారు. రూ. 4 కోట్లను పిల్లల పేరున, రూ. కోటిని మా అత్తగారి పేరున చెక్కులు అందించారు. బంజారాహిల్స్లో నివాస స్ధలాన్ని కేటాయించారు. ఈ సంఘటనలో వీరమరణం పొందిన ఇతర సైనికులకు త్వరలోనే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు. ప్రభుత్వానికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. – బిక్కుమళ్ల సంతోషి, కల్నల్ సంతోష్బాబు సతీమణి కొండంత ధైర్యం వచ్చింది సీఎం కేసీఆర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. ఏ సాయం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. కేసీఆర్ రావడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. కేసీఆర్ గొప్పతనం మాటల్లోనే కాదు.. చేతుల్లోనూ చూపిస్తారని మా ఇంటికి స్వయంగా రావడంతో తెలిసొచ్చింది. మా బాబు లేకున్నా మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మా బాబు చనిపోయిన నాటి నుంచి అన్ని విషయాల్లోనూ సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు. – మంజుల, కల్నల్ సంతోష్బాబు తల్లి సూర్యాపేటలో కల్నల్ కాంస్య విగ్రహం: మంత్రి జగదీశ్రెడ్డి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రకటించారు. సోమవారం కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించి వెళ్లిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట పాత బస్టాండ్–కోర్టు జంక్షన్ రహదారికి కల్నల్ పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కల్నల్ సంతోష్బాబుతోపాటు వీరమరణం పొందిన మరో 19 మంది సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి సీఎం కేసీఆర్ ఔదార్యం చాటుకున్నారన్నారు. -
సీఎం కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారు : సంతోషి
సాక్షి, సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి అన్నారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్లో 711 గజాల ఇంటిస్థలం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోపా ఇచ్చారని చెప్పారు. తన పిల్లలతో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, తమను ఇంటికి కూడా ఆహ్వానించారని ఆమె చెప్పారు. ఏ అవసరం ఉన్న ఫోన్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని ఆమె తెలిపారు. తనకు మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. (చదవండి : సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం : కేసీఆర్) సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని సంతోష్బాబు తల్లి మంజుల కొనియాడారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. కాగా,సంతోష్బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్లో ఉన్న సంతోష్బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సూర్యాపేటకు వెళ్లారు. -
సంతోష్ కుటుంబానికి అండగా ఉంటా: కేసీఆర్
సాక్షి, సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. (చదవండి : రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..) సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.(చదవండి : పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: కిషన్రెడ్డి
సూర్యాపేట అర్బన్: దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా దొంగ దెబ్బతీసి మన సైనికులను పొట్టన పెట్టుకుందని, వారి త్యాగం వృథా కాదన్నారు. ప్రధాని ఆదేశం మేరకే సంతోష్బాబు కుటుంబసభ్యులను కలిశానని, మోదీ సందేశం వారికి తెలియజేశానని పేర్కొన్నారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ విద్యానగర్లో ఉన్న సంతోష్బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నగదు, సంతోషికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగానికి సంబం ధించిన ఉత్తర్వులను సీఎం వారికి అందజేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని షేక్పేటలో ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ సంతోష్బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. -
జవాన్ల త్యాగాలు వృథా పోవు: కిషన్రెడ్డి
సాక్షి, సూర్యాపేట: దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. (రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్) చైనా దొంగ దెబ్బ తీసింది.. ‘‘భారత భూ భాగాన్ని, సైనికుల ప్రాణాలను రక్షించడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. పరిణామాలను ఎదుర్కోవడానికి షరతులు లేకుండా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని’’ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహించామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జవాన్ల త్యాగాలు వృధాపోవని, ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందన్నారు. చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. (ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం) కిషన్రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచదర్రావు,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్రావు తదితరులు ఉన్నారు. అంతకు ముందు రోడ్లు,భవనాల శాఖ గెస్ట్హౌస్కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రితో పాటు ఆయన భార్య సునీత.. సంతోష్బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతో షిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్బాబు కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్ వారి నివాసానికి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్–1 ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వయంగా కల్నల్ కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నారు. సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్లో వారి కుటుంబ అవసరాల రీత్యా రూ.5 కోట్ల నగదు, నివాస స్థలాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంటిస్థలం అన్నది సూర్యాపేటలోనా లేక హైదరాబాద్లోనా అన్నది సంతోష్బాబు కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి ఉన్నారు. వాడపల్లి సంగమంలో సంతోష్బాబు అస్థికల నిమజ్జనం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా – మూసీ సం గమంలో కల్నల్ సంతోష్ అస్థికలను శనివా రం కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కొడుకు, కూతురు ప్రత్యేక వాహనంలో వాడపల్లికి వచ్చారు. పడవలో సంగమం వద్దకు వెళ్లి వేదమంత్రాల నడుమ అస్థికలను నిమజ్జనం చేశారు. -
కల్నల్ సంతోష్కు నివాళులర్పించిన యువ హీరో
సాక్షి, సూర్యాపేట : సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ‘హిట్’ సినిమా హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం సూర్యాపేట వెళ్లి, సంతోష్బాబుకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్బాబు లాంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. (పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కరి కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్’అన్నారు. (చదవండి : కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు ) -
నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..
ఇటీవల చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన భారతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్బాబు. ఆయన సతీమణి సంతోషి తన భర్త జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మనోగతం ఆమె మాటల్లోనే... చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం, తానూ సంతోషంగా ఉండడమే ఆయన బలం. ఎదుటివారికి చేతనైన సహాయం చేయాలని తపన పడేవారు. కుమారుడిగా తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. అయినా కుటుంబానికి ఏమీ లోటు చేయలేదు. భర్తగా నన్ను బాగా చూసుకున్నారు. తండ్రిగా నా పిల్లలకు రోల్ మోడల్ అయ్యారు. రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారు ఆర్మీలో చేరతానన్నా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే బాధ్యతాయుతమైన యువత ఆర్మీలో చేరి దేశభక్తిని చాటుకోవాలి’ అని సంతోషి ఆకాంక్షించారు. నేనే కావాలని.. సైనికుడిగా తన జీవన సరళి అంతా వేరేలా ఉంటుందని, సగటు ఆడపిల్లలు కోరుకునే మామూలు జీవితాన్ని తాను ఇవ్వలేకపోవచ్చని, కనుక తనను అర్థం చేసుకునే అమ్మాయి కావాలని, అలాంటి సంబంధమే చూడమని సంతోష్ తన అమ్మా, నాన్నతో అన్నాడట. అలా చుట్టాలమ్మాయని నన్ను అతనికి చూపించారు. ‘నిన్ను చూసిన తర్వాత సంతోష్ రెండు, మూడు మ్యాచ్లు చూశాడమ్మా.. కానీ నువ్వే కావాలని అన్నాడు’ అని అత్తయ్య ఎప్పుడూ నాతో అనేది. (కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు) సమన్యాయం చేశారు డ్యూటీలో ఉన్నప్పుడు పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కుటుంబానికి అంతే స్థాయిలో ప్రాధాన్యత నిచ్చారు. మా దగ్గరకు మార్చి 21న ఢిల్లీ వచ్చి ఏప్రిల్ 15కు వెళ్లారు. సెలవులకు వచ్చినప్పుడు విహార యాత్రలకు పిల్లలతో కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల వెళ్లలేకపోయాం. అదే సమయంలో మా నాన్నకు హాస్పిటల్లో చెకప్ ఉంటే సూర్యాపేటకు రమ్మని అడిగారు. అయితే ఇక్కడకు వస్తే తానే దగ్గరుండి చూపిస్తానని, వాళ్లనే ఇక్కడికి రమ్మని చెప్పారు. మా అమ్మానాన్నని కూడా వాళ్ల అమ్మానాన్నల్లాగే చూసుకునేవాడు. అక్కడ సగం.. ఇక్కడ సగం.. మా పెళ్లయి పదిన్నరేళ్లు అయింది. పెళ్లి తర్వాత మేము రెండేళ్లు కలిసి ఉన్నాం. తర్వాత నాలుగేళ్లు సర్వీస్లో ఉన్నారు. మళ్లీ మూడేళ్లు కలిసి ఉన్నాం. గత ఏడాది జూన్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు. నాకు, పిల్లలకు ఏది ఇష్టమైతే అది కొనిచ్చేవారు. తన గురించి తర్వాత ఆలోచించే వారు. పిల్లల గురించి కలలు కన్నారు.. పిల్లలకు మంచి విద్యనందించాలని, వారిని మంచి స్థాయికి తీసుకురావాలని కలలు కన్నారు. కానీ ఇంతట్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు...(దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) మా పాపకు 9 ఏళ్లు, బాబుకు మూడేళ్లు. ఎప్పుడు ఫోన్ చేసినా ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాతనే నాతో మాట్లాడేవారు. అదే చివరి మాట.. చివరిసారిగా ఈ నెల 14న ఆయన నాతో మాట్లాడారు. పిల్లల యోగ క్షేమాలు అడిగారు. అంతలోనే బిజీగా ఉన్నానని, ఆ తర్వాత తీరిగ్గా కాల్ చేస్తానని చెప్పారు. ఇదే నాకు అతని నుంచి వచ్చిన చివరి ఫోన్. తర్వాత రెండు రోజులకే.. తాను ఇక లేడన్న విషాద వార్త నాకు చేరింది. యుద్ధంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారని టీవీలో స్క్రోలింగ్ చూశాను. పిల్లలు ఆర్మీకి వెళ్తా అంటే పంపిస్తా.. పిల్లలు భవిష్యత్లో ఏది చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాలనే వారు. ఆయన పోయారని నేను వెనుకాడేది లేదు. పిల్లలకు భవిష్యత్లో ఏది ఇష్టమైతే అదే చేయిస్తా. ఒకవేళ వాళ్లు ఆర్మీలోకి వాళ్లు వెళ్లాలనుకుంటే అక్కడికైనా పంపిస్తానని‘సాక్షి’అడిగిన ప్రశ్నకు ఆమె సగర్వంగా సమాధానమిచ్చారు. ఆయనపై దేశభక్తిని చాటారు.. ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఆలోచనలు ఎంతో ఉదాత్తంగా ఉండేవి. మాటలు ఎదుటివారికి ఎంతో ధైర్యాన్నిచ్చేవి. వృత్తిధర్మంగా శత్రువులను చీల్చి చెండాడేవారు. ఆయన ఎంత గొప్పవ్యక్తో ఆయన అంత్యక్రియల సందర్భంగా అందరూ మాట్లాడుకునే మాటలు వింటుంటే బాధతోపాటు గర్వంగా కూడా అనిపించింది. సరిహద్దుల్లో మన కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తున్నారు. డిఫెన్స్లోకి రావాలంటే ప్రాణాలు పోతాయన్న భయం ఉండొద్దు. దేశరక్షణకు ఎంతమంది ఉంటే.. మనకు అంత బలం. తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా... మా మామగారికి ఒక ఆలోచన ఉండేది. పుట్టిన ప్రతి వాళ్లు బతుకుతారు, చస్తారు.. కానీ ఆ చావుకు ఒక అర్థం ఉండాలన్నది ఆయన భావన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే తండ్రి తనను, చెల్లిని పెంచేవారని నాకు చెబుతుండేవారు. ఆయన తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా పెరిగినట్లే నేను రేపు నా పిల్లలను వాళ్ల తండ్రి ఆలోచనలకు తగ్గట్టే తీర్చిదిద్దుతాను. – బొల్లం శ్రీనివాస్, సూర్యాపేట -
కల్నల్ సంతోష్కు కాంస్య విగ్రహం
సాక్షి, సూర్యాపేట : భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలను సైనిక అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సంతోష్బాబు దహన సంస్కారాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య , మాజీ కేంద్ర రక్షణ శాఖా మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు) సంతోష్ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంతోష్ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్కు సంతోష్ పేరు పెడుతామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. -
లక్సెట్టిపేటలో సంతోష్ బాబు విద్యాభ్యాసం
లక్సెట్టిపేట(మంచిర్యాల): వీరమరణం పొందిన జవాన్ లెఫ్ట్నెంట్ కల్నల్ సంతోష్బాబు విద్యాబ్యాసం జిల్లాలోని లక్సెట్టిపేటలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రారంభమైంది. ఆయ న తండ్రి ఉపేందర్ స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో బ్రాంచ్లో మేనేజర్గా 1988లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. సంతోష్బాబును స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదువుకుని ఐదవ తరగతిలో కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రవేశపరీక్షలో అర్హత సాధించగా విజయనగరంలోని సైనిక్ పాఠశాలలో చేరారు. ఉపేందర్కు బదిలీ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఇక్కడినుంచి విజయనగరం వెళ్లిపోయారు. మరిపోలేని చిన్ననాటి స్నేహితులు సంతోష్బాబు మరణాన్ని అతడి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అప్పటి పాఠశాల ఆచార్యులు రామన్న సంతోష్బాబును గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చిన్నప్పుడు తీయించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి దేశరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. -
‘సంతోష్ దేశానికి మంచి చేయాలని తపించేవాడు’
సాక్షి, హైదరాబాద్: భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి సహోద్యోగులు సంతోష్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘సంతోష్ నిగర్వి.. దూకుడుగా ఉండే వాడు కాదు. మృదు స్వభావి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. చాలా మంచి మనిషి’ అని కల్నల్ ఎస్ శ్రీనివాసరావు తెలిపాడు. అంతేకాక ‘మరో రెండేళ్లలో సంతోష్కు సికింద్రాబాద్కు పోస్టింగ్ వచ్చేది. దాని కోసం అతడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏ అధికారి అయినా తన సొంత రాష్ట్రంలో సేవ చేయడం చాలా గౌరవంగా భావిస్తారు. సంతోష్ కూడా అలానే. ఇప్పటి నుంచే అతడు తన పిల్లలకు మంచి స్కూల్ గురించి వెతుకుతున్నాడు. తెలుగు అధికార్లుగా మేం ఎప్పుడు టచ్లో ఉండే వాళ్లం. ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకునే వాళ్లం. ఒకరి బాగోగులు ఒకరం తెలుసుకునే వాళ్లం’ అని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక తనతో పాటు పని చేసే జూనియర్ల గురించి సంతోష్ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘పూర్వ విద్యార్థుల కార్యక్రమాల్లో సంతోష్ చురుగ్గా పాల్గొనేవాడు. టీచర్లతో కాంటక్ట్లో ఉండేవాడు’ అని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ.. ‘సంతోష్ సమస్యలకు భయపడేవాడు కాదు. దేశానికి, తన బెటాలియన్కు మంచి చేయాలని తపిస్తుండేవాడు. ఎప్పుడు కంబాట్ దుస్తుల్లోనే ఉండేవాడు. ఏ పని అయినా చేస్తాడు.. ఎంత కష్టమైన ఆపరేషన్లో అయినా పాల్గొంటాడు. అతడి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగదు’ అని తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. (చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు) -
చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సలామ్ కల్నల్ సంతోష్..) -
కన్నీటి పర్యంతమైన కల్నల్ సోదరి
సాక్షి, సూర్యాపేట : ‘అన్నయ్య కొద్ది రోజులు పాకిస్తాన్ బార్డర్లో పని చేశాడు. ఆ సమయంలో కొంతమంది చొరబాటుదారుల్ని ఆన్నయ్య హతమార్చాడు. అప్పుడు మేము ఎంతో గర్వంగా ఫీలయ్యాం. దేశం కోసం అన్నయ్య చేస్తున్న సేవను చూసి మురిసిపోయాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్లేని ఏరియాల్లో ఇలా జరగడం బాధగా ఉంది. అన్నయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు చైనాతో ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్బాబు సోదరి శృతి. తనతో ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నయ్య.. ఇక లేడనే విషయాన్ని ఆ సోదరి తట్టుకోలేకపోతోంది. తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి : తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) ‘చిన్నప్పటి నుంచి అన్నయ చాలా యక్టివ్. చదువులో కానీ, ఇతర కాంపిటీషన్లలో కానీ అన్నింట్లో ముందుండేవాడు. సైనిక్ స్కూల్ గురించి డాడీ చిన్నప్పుడే ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఆయన కోరిక మేరకు అన్నయ్య సాధించాడు. అన్నయ్య గురించే డాడీ ఆదిలాబాద్ నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడికి వెళ్లాము. అన్నయ్య ఒక సంవత్సరం మొత్తం కష్టపడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో పాసయ్యారు. అక్కడ మాకు తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అమ్మ, డాడీ సపోర్ట్తో అన్నయ్య ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అన్నయ్య 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్కి కెప్టెన్గా వ్యవహరించాడు. తర్వాత అన్నయ్య కమిషనర్ అయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అన్నయ్య కమిషనర్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్ బార్డర్లో పనిచేశారు. అప్పడు కూడా కొంతమంది చొరబాటుదారుల్ని హతమార్చారు. అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్లేని ఏరియాలో ఇలా జరగడం బాధగా ఉంది. ( చదవండి : చైనాతో ఘర్షణ: 20 మంది భారత జవాన్లు మృతి!) అదే లాస్ట్ కాల్ రెండు రోజుల క్రితం జూన్ 14 రాత్రి 9 గంటల ప్రాంతంలో అన్నయ్య మాతో మాట్లాడారు. ఆ రోజు మా పెళ్లి రోజు. మాకు విషెష్ చెప్పడం కోసమే అన్నయ్య కాల్ చేశారు. కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. ఎలా ఉన్నావ్ అన్నయ్యా అని అడగ్గా.. ఏం చెప్పలేను. నన్ను అడుగొద్దు అన్నాడు. తర్వాత అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పడు చాలా సంతోష పడ్డాం అన్నయ్య హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యారని తెలియగానే ఎంతో సంతోష పడ్డాం. అన్నయ్య చిన్నప్పటి నుంచి మాకు దూరంగా పెరిగాడు. ఇప్పుడు హైదరాబాద్కు వస్తే అందరం కలిసి హ్యాపీగా ఉంటాం అనుకున్నా.ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మా వదిన, పిల్లల్ని ఎలా సముదాయించాలో అర్థం కావడంలేదు. ఉద్యోగం రిత్యా అన్నయ్య పిల్లలతో (కూతురు అభిజ్ఞ(9), కుమారుడుఅనిరుధ్(4) ) ఎక్కువగా గడపలేదు. అనురిధ్ అచ్చం అన్నయ్యలా ఉంటాడు. వాడు ఎప్పుడూ పప్పా.. పప్పా అని ఏడుస్తూ ఉన్నాడు. అత్తా.. మే పప్పాకే పాస్ జాతా హూ అంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’ అని సంతోష్బాబు సోదరి శృతి ‘సాక్షి’తో చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. -
కాసేపట్లో హకీంపేటకు సంతోష్ పార్థీవదేహం
సాక్షి, హైదరాబాద్ : లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద భారత్– చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. ఇప్పటికే సంతోష్ బాబు కుటుంబసభ్యులు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకునేందుకు సంతోష్ బాబు తల్లిదండ్రులు, సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ ప్రకాశ్రెడ్డి విమానాశ్రయానికి వెళ్లారు. సంతోష్బాబు భార్య, పిల్లలతో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేక వాహనంలో నానల్నగర్ ఆర్మీ గెస్ట్హౌస్కు తరలించారు. (చదవండి : సలామ్ కల్నల్ సంతోష్..) సంతోష్ భార్య ఎయిర్ పోర్టు నుండి బయలు దేరుతూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టడం అందర్నీ కలిచి వేసింది. కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు రేపు అధికారికంగా జరుపుతామని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ రోజు సాయంత్రం హాకీంపేట్ ఎయిర్పోర్ట్కు సంతోష్ భౌతికకాయం వస్తుందని, అక్కడ ఆయనకు గౌరవ వందనం సమర్పించిన అనంతరం సూర్యాపేటకు తీసుకెళ్తామని పేర్కొన్న్నారు. మరోవైపు లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. -
సలామ్ కల్నల్ సంతోష్..
సాక్షి, సూర్యాపేట: తండ్రి కలను నెరవేరుస్తూ సైన్యంలో చేరాడు... 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కల్నల్ స్థాయికి ఎదిగాడు... ఇటీవలే హైదరాబాద్కు బదిలీ అయినా కరోనా లాక్డౌన్ వల్ల రాలేక సరిహద్దులో విధులు కొనసాగించాడు... ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. బాగున్నావా’అంటూ పలకరించాడు. కానీ అనూహ్యంగా 24 గంటలు అయినా గడవకముందే చైనా సైన్యం దాష్టీకంలో వీరమరణం పొందాడు. ఇదీ విధి నిర్వహణలో అసువులుబాసిన తెలుగుతేజం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) ప్రస్థానం. భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నేపథ్యమిదీ... భార్యాపిల్లలతో కల్నల్ సంతోష్ (ఫైల్) తండ్రి కల కోసం... సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. ఎస్బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్గా రిటైరైన ఉపేందర్కు బాల్యంలోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవడంతో ఆ కోరికను ఎలాగైనా తన కుమారుడి రూపంలో చూడాలనుకున్నారు. సంతోష్ సైతం తండ్రి కలను నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్.. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్లో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్లో లెఫ్ట్నెంట్గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో విధుల్లో చేరాడు. కుమారుడి ఫొటోను చూస్తూ కన్నీరుమున్నీరవుతున్న సంతోష్ తల్లిదండ్రులు చొరబాటుదారులను హతమార్చి దేశాన్ని కాపాడి... సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని లడక్లో (కల్నల్) కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్తోగల సరిహద్దులో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు. బదిలీ అయినా రాలేక... కల్నల్ సంతోష్ను ఇప్పటికే హైదరాబాద్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మూడేళ్లపాటు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లడక్లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ మరణవార్త తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రత్యేక విమానంలో హైదాబాద్కు పార్థివదేహం... అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో సైన్యం హకీంపేట్ ఎయిర్పోర్టుకు తరలించింది. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులను సైనికాధికారులు కోరారని, కానీ సంతోష్ తల్లిదండ్రులు మాత్రం సూర్యాపేటలోనే అంత్యక్రియలు జరపాలనుకుంటున్నట్లు చెప్పారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. దీనిపై బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. తల్లిగా బాధ ఉంది.. దేశ పౌరురాలిగా గర్విస్తున్నా కుమారుడి వీరమరణంపట్ల తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. కానీ దేశ పౌరురాలిగా మాత్రం గర్వంగా ఉంది. సంతోష్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ముఖ్యంగా లెక్కలు క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా చేసేవాడు. దూరప్రాంతాల్లో ఉన్నా నాతో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకొనేవాడు. సరిహద్దు వివాదాలపై టీవీల్లో వచ్చే అంశాల గురించి అడిగితే ‘అమ్మా.. టీవీల్లో వేరు, అక్కడ (సరిహద్దులో) పరిస్థితి వేరు. మీరెవరూ భయపడొద్దు’అంటూ ధైర్యం చెప్పేవాడు. చివరిసారిగా ఆదివారం ఫోన్లో మాట్లాడాడు. ఎలా ఉన్నావని అడిగాడు. – మంజుల (సంతోషతల్లి) దేశం కోసమే పంపా.. దేశానికి సేవ చేయాలనన నా కోరిక కుమారుడి రూపంలో నెరవేరింది. సంతోష్కు చిన్నతనం నుంచే దేశంపై బాగా మమకారం ఉండేది. నేను కలలుకన్న విధంగా సంతోష్ సైన్యంలో చేరడంతో ఆనందించా. సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడం ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తండ్రిగా చాలా బాధ కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఒక్క నిమిషమే నాతో మాట్లాడాడు. అమ్మతో మాట్లాడతాను.. ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చాను. అదే సంతోష్ చివరి మాట. – ఉపేందర్ (సంతోష్ తండ్రి) కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం సీఎం కేసీఆర్ హామీ.. కుటుంబ సభ్యులకు సానుభూతి సరిహద్దులో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్బాబు వీరమరణం పొందడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ పార్థివదేహాన్ని అందుకోవడంపాటు అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్నల్ తండ్రికి హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ ఫోన్ చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ వీరమరణంపట్ల హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ను దత్తాత్రేయ ఓదార్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి సైతం కల్నల్ సంతోష్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కల్నల్ సంతోష్ మరణం విచారకరం జవాన్ల ప్రాణత్యాగం ఎప్పటికీ గుర్తుంటుంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం సాక్షి, అమరావతి: తూర్పు లఢాక్ (ఎల్ఓసీ) వద్ద చైనా దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్బాబు, మరో 19 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సంతోష్బాబు ప్రాణ త్యాగం ఎప్పటికీ గుర్తుంటుందని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికుల దీక్ష మరింత దృఢతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
సంతోష్ ప్రాణత్యాగం వెలకట్టలేనిది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారత - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. (చదవండి : ః చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి) లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఇరుదేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. (చదవండి : నా ఒక్కగానొక్క కొడుకు: సంతోష్ తల్లి) మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సంతోష్ మృతిపట్ల పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి : ‘కల్నల్ సంతోష్ జీవితం యువతకు ఆదర్శం’) -
‘కల్నల్ సంతోష్ జీవితం యువతకు ఆదర్శం’
సాక్షి, నల్గొండ: భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయుల రక్షణ కోసం కుమారుడిని సైన్యంలోకి పంపిన సంతోష్ తల్లిదండ్రులకు యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు. కాగా సంతోష్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.(చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి) ఈ క్రమంలో తమ కుమారుడి భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వారు ఆయనను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సుఖేందర్రెడ్డి ఈ విషయం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. భారత భూభాగంలోకి అడుగుపెట్టాలనే దురాలోచనను చైనా విరమించుకోవాలని లేదంటే.. డ్రాగన్ దుర్మార్గానికి భారత సైన్యం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కాగా లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మంగళవారం భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత ఆర్మీలో సేవలు అందిస్తున్న, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుతో పాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. జవాన్ల సేవలు వృథా కావు: ఏపీ గవర్నర్ సాక్షి, అమరావతి: భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు వీర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమరులైన తెలంగాణలోని.. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సంతోష్ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృథా కావని నివాళులు అర్పించారు. -
నా ఒక్కగానొక్క కొడుకు: సంతోష్ తల్లి
సాక్షి, సూర్యాపేట : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ‘నా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం తల్లిగా బాధగా ఉంది. కానీ దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషంగా ఉంది’ అని మంజుల పేర్కొనడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఇంతటి పెను విషాదంలోనూ ఆ తల్లి ఈ విధంగా మాట్లాడడం వారి దేశ భక్తిని చాటుతోంది. (చదవండి : చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి) కాగా, సంతోష్ తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉండగా.. భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి
సాక్షి, హైదరాబాద్ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్బాబు సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. (చదవండి : సరిహద్దుల్లో తీవ్ర అలజడి) లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. హైదరబాద్కు బదిలీ అంతలోనే.. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందరు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్లు 21 రాష్ట్రీయ రైఫిల్స్లోని గార్డ్స్ రెజిమెంట్కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
విషాదంలో షారూక్ ఖాన్
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ విషాదంలో మునిగిపోయారు. ఫౌజీ టెలివిజన్ షోతో షారూక్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కల్నల్ రాజ్ కపూర్ (87) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని రాజ్ కపూర్ కుమార్తె రితంబర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజ్కపూర్ మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. ‘ప్రియమైన మా తండ్రిగారు రాజ్కుమార్ భువినుంచి దివికేగారం’టూ ఫేస్బుక్ పోస్ట్లో ఆయన కుమార్తె వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆయన వయసు సంబంధిత కారణాల రీత్యా అనారోగ్యానికి గురయ్యారనీ, చికిత్స పొందుతూ ఆకస్మాత్తుగా చనిపోయారనీ... గురువారం ఆయన అంత్యక్రియలు పూర్తి అయినట్టు రితంబర్ తెలిపారు. కాగా ఆర్మీ ఆఫీసర్గా పనిచేసిన రాజ్కపూర్ ఓషో శిష్యరికం తీసుకున్నాక..ఆర్మీకి రిజైన్ చేసి ముంబైలో సెటిల్ అయ్యారు. అనంతరం అనేక టీవీ సీరియళ్లను నిర్మించారు, కొన్నింటిలో నటించారు కూడా. మూడు యుద్ధాల్లో పాల్గొన్నా, నటుడిగా , నిర్మాతగా రాణించినా రాని గుర్తింపు 20 ఏళ్ల క్రితం పరిచయం చేసిన షారూక్ ఖాన్ ద్వారా లభించిందని సమార్ ఖాన్ రాసిన ‘ఎస్ఆర్కే 25 ఇయర్స్ ఆఫ్ ఏ లైఫ్’ అనే పుస్తకంలో రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అయితే సరియైన పాత్రకు, సరియైన వ్యక్తిని ఎంచుకోవడమే మాత్రమే తప్ప ఇందులో తన గొప్పతనమేమీ లేదని గుర్తు చేసుకున్నారు. అతని తల్లిదండ్రులే షారూక్ను సూపర్స్టార్గా మలిచారని తాను కాదని చెప్పారు. -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
కల్నల్పై సీబీఐ కేసు..రూ.కోటి అక్రమాస్తి
పుణె: పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టిన విధుల్లో ఉన్న కల్నల్, ఆయన భార్యపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. వారి వద్ద లెక్కచూపనీ ఆస్తులు రూ.కోటి వరకు గుర్తించింది. జనవరి 1, 2008 నుంచి మార్చి 27, 2017 మధ్య ఆ అధికారి పుణె, జమ్ము, రాజస్థాన్లో విధులు నిర్వర్తించాడని ఈ కాలంలోనే దాదాపు రూ.1కోటి వెనుకేసినట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ప్రస్తుతం ఆ అధికారి 516 ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఏఎస్సీ) బెటాలియన్ 16లో విధులు నిర్వహిస్తున్నాడని, ఆ విభాగం సౌత్ వెస్ట్రన్ కమాండ్ లో భాగంగా ఉందని పేర్కొంది. సీబీఐ వివరాల ప్రకారం 2009లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలోలో(ఎన్డీఏ) క్యాటరింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జమ్ముకు బదిలీ అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లు అక్కడ పనిచేసి శ్రీగంగనగర్కు బదిలీ అయ్యాడు. అతడికి పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలు వివిధ బ్యాంకుల్లో భార్య పేరిట, తన పేరిట ఉన్నట్లు గుర్తించి ఆ మొత్తం సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు చెప్పకపోవడంతో కేసు నమోదు చేశారు. -
విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది. లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది. అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు. -
అనిల్కు ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ అభినందనలు
హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : ఎన్సీసీ క్యాడట్గా శిక్షణ పొందిన పిన్నింటి అనిల్ ఇండియన్ నావల్ ఆఫీసర్ లెప్టినెంట్ సర్జన్గా ఎంపికయ్యారు. కాగా, పిన్నింటి అనిల్ హన్మకొండకు వచ్చిన సందర్భంగా ఆదివారం ఎన్సీసీ వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ యుఎస్ మితర్వాల్ను కలిశారు. నావల్ ఆఫీసర్గా ఎంపికయినందుకు అనిల్ను అభినందించారు. హన్మకొండ భవాని నగర్కు చెందిన పిన్నింటి అనిల్ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యను అభ్యసించారు. 2001-02లో ఎన్సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ పాసయ్యాడు. 2005-11 వరకు కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. 2013 ఫిబ్రవరిలో ఈస్ట్రన్ నావెల్ కమాండ్లో ఇండియన్ నేవీ ఆఫీసర్ సర్జన్గా, కల్యాణి వైజాగ్ కమాండ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ ఆఫీసర్గా ముంబయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇతడి తల్లిదండ్రులు పిన్నింటి వాసవి, సురేందర్రావు భవానీనగర్లో నివాసముంటున్నారు. ఎన్సీసీ వరంగల్ గ్రూప్ అడ్మినిస్రేటివ్ ఆఫీసర్ కల్నల్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎం.ఎల్.శర్మ, 10 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్పీఎస్ ప్రసాద్, సెకండ్ ఆఫీసర్ జి.ప్రేంచంద్రశేఖర్, సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.మథ్యాస్రెడ్డి, సునీతరెడ్డి నావల్ ఆఫీసర్గా ఎంపికయిన అనిల్ను అభినందించారు.