CRISIL
-
ఇంటి భోజనం మరింత భారం!
కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.టమోటా ధరలు: డిసెంబర్లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.ఇదీ చదవండి: చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది. -
బ్రాండెడ్ హోటల్స్కు భలే డిమాండ్
బ్రాండెడ్ హోటల్స్లో విడిది చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో బ్రాండెడ్ హోటల్స్(Hotels) పరిశ్రమ ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–12 శాతం మేర అధికంగా నమోదవుతుందని క్రిసిల్(Crisil) రేటింగ్స్ నివేదిక తెలిపింది. దేశీయంగా విహార, వ్యాపార ప్రయాణాలు ప్రధానంగా బ్రాండెడ్ హోటళ్ల డిమాండ్ను పెంచుతున్నాయని, ఇక ఎంఐసీ విభాగంలో (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) వృద్ధి, విదేశీ పర్యాటకుల సందర్శనలు పుంజుకోవడం పరిశ్రమ ఆదాయానికి మద్దతునివ్వనున్నట్టు వివరించింది.బ్రాండెడ్ హోటల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం సైతం 17 శాతం మేర వృద్ధిని నమోదు చేయడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి హోటళ్లలో రూమ్ల పెరుగుదల వేగాన్ని అందుకున్నట్టు తెలిపింది. అస్సెట్ లైట్ (సొంతంగా కాకుండా లీజు విధానంలో) నమూనాలో ఇక ముందూ కొత్త గదుల చేరిక వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద కొత్త గదుల లభ్యత 20 శాతం మించుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–9 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరాలో 11–12 శాతం మేర కొత్త గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. బ్రాండెడ్ హోటళ్ల నిర్వహణ మార్జిన్ 100–150 బేసిస్ పాయింట్లు మేర ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగుపడుతుందని అంచనా వేసింది. బలమైన నగదు ప్రవాహాలు, అస్సెట్ లైట్ నమూనాలో విస్తరణ, తగినంత మూలధనం సమీకరణతో బ్రాండెడ్ హోటళ్ల రుణ భారం నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుందని పేర్కొంది. ఇది ఆయా హోటళ్ల రుణ పరపతిని బలోపేతం చేస్తుందని తెలిపింది.రూమ్ రేట్లు అప్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాండెడ్ హోటళ్ల సగటు రూమ్ రేట్లు (ARR) 6–7 శాతం మేర పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే ఏడాది 3–4 శాతం పెరుగుదలకు పరిమితం అవుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అదనపు గదులు అందుబాటులోకి రావడం ఇందుకు కారణంగా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11–12 శాతం చొప్పున ఆదాయంలో వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. విహార, వ్యాపార పర్యటనల్లో ఏడు ప్రధాన నగరాలు 25 శాతం వాటా ఆక్రమిస్తాయని.. మిగిలిన మేర ఆధ్యాత్మిక పర్యాటక రూపంలో ఉంటుందని తెలిపింది.ఇదీ చదవండి: నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధిఆక్యుపెన్సీ ఎలా ఉంటుందంటే..‘నాన్ మెట్రో(Non Metro) నగరాల్లో, విహార గమ్యస్థానాల్లో హోటల్ పరిశ్రమ కార్యకలాపాలు ఎక్కువగా విస్తరణకు నోచుకుంటున్నాయి. దీంతో కొత్త గదుల చేరికలో 60–65 శాతం మేర ఇక్కడే ఉండనుంది. అది కూడా అస్సెట్ లైట్ నమూనాలో కావడంతో, పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం కూడా ఉండదు’ అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పల్లవి సింఘ్ తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త గదులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆక్యుపెన్సీ (రూముల వినియోగం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 74–75 శాతం స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అది ఈ ఏడాది కంటే 1–1.5% తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యయాలను సమర్థవంతంగా నియంత్రించడం, టెక్నాలజీ, మానవ వనరుల మెరుగైన వినియోగం, అస్సెట్ లైట్ విధానం ఫలితంగా పరిశ్రమ ఎబిటా మార్జిన్ 1–1.5% పెరిగి 2024–25లో 33–34 శాతానికి చేరవచ్చన్నది క్రిసిల్ అంచనా. -
పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్వెజ్ ఖరీదు
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా కీలక డేటాను విడుదల చేసింది. ఇంట్లోని శాఖాహార భోజనానికి అయ్యే ఖర్చు 7 శాతం పెరిగి రూ.27.3 చేరిందని నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఈ ధర రూ.25.5గా ఉండేది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం వల్ల వంటిల్లు నిర్వహణ భారంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46 శాతం, టమాటాలు 36 శాతం, బంగాళదుంపలు 22 శాతం పెరగడంతో వెజ్భోజనం ధర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో ఉల్లి, బంగాళదుంపలు, టమాటా కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు బియ్యం ధరలు 14 శాతం, పప్పులు 22 శాతం అధికమయ్యాయి. అదే సమయంలో మాంసం ధరలు 16 శాతం పడిపోయినందున మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గింది. ఇదీ చదవండి: కీలక వడ్డీరేట్లు యథాతథం క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ మాట్లాడుతూ.. ‘గత ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మాంసహారం ధర పడిపోయి, కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరగడమే ఇందుకు కారణం. దేశంలో ముడి సరుకు ధరలు ఐదుశాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్వెజ్ భోజనం ధర రెండుశాతం పెరిగింది. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పశుగ్రాసం ధర కూడా అధికమైంది. సమీప భవిష్యత్తులో తాజా పంట మార్కెట్లోకి వస్తే గోధుమల ధరలు తగ్గుతాయి’ అని శర్మ వెల్లడించారు. -
యాక్సిస్ క్రిసిల్ డెట్ ఇండెక్స్ ఫండ్
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 12తో ఈ ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత ఇండెక్స్ సెక్యూరిటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుత ఈల్డ్ కర్వ్ .. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందుకునేందుకు అనువుగా ఉందని సంస్థ తెలిపింది. ఫిక్సిడ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియోను పటిష్టపర్చుకోవాలని భావిస్తున్న ఇన్వెస్టర్లకు ఇది అనుకూలమైన ఫండ్ కాగలదని తెలిపింది. -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
ఆగ్రోకెమికల్స్ ఆదాయం డౌన్! దశాబ్దకాలంలో ఇదే తొలిసారి..
ముంబై: ఉత్పత్తుల ధరల తగ్గుదల, డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, రబీ పంట సీజన్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ ఆగ్రోకెమికల్స్ రంగం ఆదాయం 3 శాతం మేర క్షీణించనుంది. క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనాలు వేసింది. దశాబ్దకాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. చైనా నుంచి సరఫరా వెల్లువెత్తడంతో అంతర్జాతీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు పడిపోయాయని, ఎగుమతులకు డిమాండ్ తగ్గిందని క్రిసిల్ తెలిపింది. అటు అమ్మకాల పరిమాణం, వసూళ్లు తగ్గడం వల్ల నిర్వహణ మార్జిన్లు 400–450 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర క్షీణించి దశాబ్దపు కనిష్టమైన 10–11 శాతానికి పడిపోవచ్చని వివరించింది. డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటంతో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాల ప్రణాళికలను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొందని క్రిసిల్ పేర్కొంది. లాటిన్ అమెరికా, అమెరికాలో పంటల సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి అంతర్జాతీయంగా తయారీ సంస్థలు తిరిగి నిల్వలను పెంచుకోవడం మొదలెట్టాక నవంబర్ నుంచి ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎగుమతుల్లో ఆ రెండు మార్కెట్ల వాటా 55 శాతం ఉంటుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ఎగుమతులు మందగించడంతో దేశీ తయారీ సంస్థల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దేశీయంగా అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉండొచ్చు. వర్షపాతం ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆగ్రోకెమికల్స్ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా దేశీయంగా క్రిమిసంహారకాల వినియోగంలో ఈ సీజన్ వాటా 35 శాతం ఉంటుంది. అటు ఎగుమతులు మందగించడం, ఇటు దేశీయంగా డిమాండ్ నెమ్మదించడం వంటి అంశాల కారణంగా ఆగ్రోకెమికల్స్ తయారీ సంస్థల నిర్వహణ లాభదాయకత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో వాటి ఆపరేటింగ్ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 700–1,000 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే, మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకునే అవకాశం ఉండటం వల్ల నిర్వహణ లాభదాయకత సీక్వెన్షియల్గా మెరుగుపడవచ్చు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తక్కువగా 10–11 శాతానికే పరిమితం కావచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 15.2 శాతంగా నమోదైంది. రాబోయే రోజుల్లో డిమాండు, కీలక ఎగుమతి మార్కెట్లలో వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తులు.. ముడిసరుకు ధరలు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
ప్రింట్ మీడియాకు ఎన్నికల బూస్ట్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రింట్ మీడియా ఆదాయాలు 13–15 శాతం వృద్ధి చెంది రూ. 30,000 కోట్లకు చేరనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ఇటు ప్రభుత్వాలు, అటు బ్రాండింగ్ కోసం కార్పొరేట్లు ప్రకటనలపై గణనీయంగా వెచ్చి ంచనుండటం ఇందుకు దోహదపడనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తాము రేటింగ్ ఇచ్చే కంపెనీలను విశ్లేíÙంచిన మీదట ఈ అంచనాలకు వచ్చి నట్లు క్రిసిల్ పేర్కొంది. ప్రింట్ మీడియా రంగం ఆదాయాల్లో ఈ సంస్థల వాటా 40 శాతం వరకూ ఉంటుందని వివరించింది. సాధారణంగా, ప్రింట్ మీడియా సంస్థల ఆదాయాల్లో 70 శాతం భాగం అడ్వర్టయిజింగ్ ద్వారా వస్తుండగా, మిగతా 30 శాతం సబ్ర్స్కిప్షన్ల ద్వారా వస్తోంది. ఆదాయాలు పెరగడం, న్యూస్ప్రింట్ ధరలు తగ్గుతుండటంతో ప్రింట్ మీడియా లాభదాయకత మెరుగుపడగలదని క్రిసిల్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం 10 పర్సంటేజీ పాయింట్లు పెరిగి 14.5 శాతానికి చేరొచ్చని వివరించింది. ‘కీలక రంగాల్లోని కార్పొరేట్లు ప్రకటనలపై మరింతగా వెచ్చి ంచనుండటం, అలాగే రాబోయే రాష్ట్రాల, సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభుత్వాలు కూడా యాడ్లపై ఖర్చు చేయనుండటం దేశీ ప్రింట్ మీడియా రంగం ఆదాయాలకు ఊతమివ్వగలదు. ప్రకటనలపరమైన ఆదాయంలో ప్రభుత్వ యాడ్ల వాటా అయిదో వంతు ఉంటుంది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వాలు మరింతగా వెచ్చి ంచడం వల్ల ప్రింట్ మీడియా ఆదాయం మరింత పెరగగలదు‘ అని క్రిసిల్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ చెప్పారు. కరోనా మహమ్మారి దెబ్బతో 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయాలు 40 శాతం పడిపోయాయి. అయితే, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లోనూ పుంజుకుని వరుసగా 25%, 15% మేర వృద్ధి నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦ రిటైల్, ఎఫ్ఎంసీజీ, ఫ్యాషన్ ఆభరణాలు, కొత్త వాహనాల ఆవిష్కరణ, ఉన్నత విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం, ఆన్లైన్ షాపింగ్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ప్రింట్ మీడియా ప్రకటనల ఆదాయ వృద్ధికి దోహదపడనున్నాయి. ప్రింట్ మీడియా యాడ్ రెవెన్యూలో వీటి వాటా మూడింట రెండొంతులు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రింట్ ఆదాయాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ♦ ప్రింట్ మీడియా కంపెనీలు, ముఖ్యంగా ఇంగ్లీష్ పత్రికలు, తమ ప్రీమియం డిజిటల్ కంటెంట్కు వసూళ్లు చేస్తున్నాయి. ♦ కవర్ ధరలు పెరగడంతో సబ్ర్స్కిప్షన్ ఆదాయం 7 శాతం పెరగనుంది. భౌతిక న్యూస్పేపర్లకు ప్రాధాన్యమిచ్చే పాఠకుల సంఖ్య పెరుగుతుండటానికి ఇది నిదర్శనం. అయితే, సబ్ర్స్కిప్షన్ వృద్ధి వల్ల న్యూస్ప్రింట్ అవసరం కూడా పెరిగి ప్రింట్ మీడియా లాభాలపై ప్రభావం పడుతోంది. భారత్ తన న్యూస్ప్రింట్ అవసరాల్లో సగానికి పైగా భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ప్రధాన ఎగుమతిదారైన రష్యా.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్పరమైన సవాళ్లు తలెత్తుతున్నాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో న్యూస్ప్రింట్ రేట్లు 8.5 పర్సంటేజీ పాయింట్లు పెరిగి ప్రింట్ మీడియా కంపెనీల నిర్వహణ మార్జిన్లు తగ్గాయి. అయితే, ఇటీవలి కాలంలో గరిష్ట స్థాయి నుంచి న్యూస్ప్రింట్ ధరలు 15–20 శాతం మేర తగ్గాయి. ప్రింట్ మీడియా కంపెనీల లాభాలు పెరిగేందుకు ఇది దోహదపడనుంది. ♦ మధ్యకాలికంగా మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చు. అయితే, న్యూస్ప్రింట్ రేట్లు పెరగడం, ప్రింట్ రంగాన్ని ప్రభావితం చేసేలా స్థూలఆర్థిక పరిస్థితులు మారడం తదితర రిసు్కలు ఉండొచ్చు. -
ఆల్టైమ్ క్యూ1 గరిష్టానికి సెక్యూరిటైజేషన్
ముంబై: బ్యాంక్యేతర ఆర్థిక సంస్థల రుణాల మంజూరీ, వసూళ్ల వృద్ధి భారీ స్థాయిలో ఉంటుండటంతో సెక్యూరిటైజేషన్ పరిమాణం గణనీయంగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 60 శాతం ఎగిసి రూ. 55,000 కోట్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. రుణాలకు డిమాండ్ పెరగడంతో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణం. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తన ప్రస్తుత అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు ఏదైనా ఆర్థిక సంస్థ తాను ఇచ్చిన రుణాలపై రాబడులను మరో ఫైనాన్షియర్కు బదలాయించడాన్ని సెక్యూరిటైజేషన్గా వ్యవహరిస్తారు. తొలి త్రైమాసికంలో ఈ తరహా లావాదేవీలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 160 నుంచి 250కి పెరిగాయి. వాహన రుణాల సెక్యూరిటైజేషన్ 9 పర్సంటేజి పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరింది. సెక్యూరిటైజేషన్ లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం 2019 ఆర్థిక సంవత్సరం నాటి రూ. 1.9 లక్షల కోట్ల గరిష్ట స్థాయిని దాటేయవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. -
భారత్ కార్పొరేట్ ఆదాయాలు 12% డౌన్!
ముంబై: భారత్ కార్పొరేట్ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం. 47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్ వర్గాలు వెల్లడించాయి. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది. ► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది. ► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది. ► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎనేబుల్డ్ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి. ► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు. ► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు. ► ఎయిర్లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వంటి వినియోగదారులకు డిమాండ్ వృద్ధి కొనసాగుతుంది. ► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్లైన్స్ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు. ► ముడి చమురు, నాన్–కోకింగ్ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది. -
దశాబ్ద కనిష్టానికి మొండి బాకీలు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 3.8 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చివరిసారిగా 2014 మార్చి త్రైమాసికంలో ఈ స్థాయి ఎన్పీఏలు నమోదయ్యాయి. ఈమధ్యే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5.9 శాతం నుంచి 4.2 శాతానికి దిగి వచ్చి ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. అధిక విలువ గల కార్పొరేట్ రుణ పద్దులకు సంబంధించిన ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2 శాతం దిగువకు తగ్గవచ్చని పేర్కొంది. కార్పొరేట్లు తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రీ–పేమెంట్ సహా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిస్కు నిర్వహణ, అండర్రైటింగ్ను పటిష్టం చేసుకోవడం తదితర అంశాలు కూడా బ్యాంకులు.. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తోడ్పడుతున్నాయి. రిటైల్ విభాగంలో తనఖా లేని రుణాల మంజూరు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో వాటి వాటా చాలా తక్కువే ఉంటుందని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 26 శాతంగా ఉంటాయని.. వీటిలో సగం గృహ రుణాలు, నాలుగో వంతు వాటా వాహన రుణాలది ఉంటుందని తెలిపారు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్నింటి వాటా రిటైల్ పోర్ట్ఫోలియోలో నాలుగో వంతుగా ఉంటుందన్నారు. నెమ్మదించనున్న వడ్డీ మార్జిన్లు.. వడ్డీ రేట్ల పెంపుదలతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం పెరుగుతూ వచ్చిన నికర వడ్డీ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించవచ్చని సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభ పరిస్థితులు ఎలా ఉన్నా దేశీ బ్యాంకింగ్ రంగం ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనగలదని పేర్కొన్నారు. భారత్లో వడ్డీ రేట్ల పెంపు తక్కువ స్థాయిలో ఉండటం, రికార్డు కనిష్ట స్థాయికి తగ్గుతున్న మొండి బాకీలతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం తదితర అంశాలు ఇందు కు దోహదపడగలవని సీతారామన్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారీ రుణ వృద్ధి 15 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొన్నారు. అసెట్ క్వాలిటీపై ఆందోళన తగ్గుతున్న నేపథ్యంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) పెరగవచ్చని తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఏయూఎం 13–14 శాతం పెరగవచ్చని సీతారామన్ వివరించారు. -
రుణ భారం, ఆదాయం రెండూ అప్
ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది. 18 సంస్థలపై.. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది. హెచ్ఏఎంలో.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్హెచ్ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్లుక్ సెమినార్ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మెరుగుపడుతున్న భారత్ కార్పొరేట్ రుణ నాణ్యత
ముంబై: భారత్ కంపెనీల రుణ నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) మెరుగుపడిందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అనుబంధ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు కాలంలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే వీలుందని వివరించింది. 2021–22 మొదటి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ క్రెడిట్ రేషియో 5.04 వద్ద ఉంటే తాజా సమీక్షా కాలంలో ఈ నిష్పత్తి 5.52కు పెరిగిందని వివరించింది. పటిష్ట క్యాష్ ఫ్లోస్, పెట్టుబడులు దీనికి కారణమని దాదాపు 6,800 కంపెనీలకు రేటింగ్ ఇచ్చే క్రిసిల్ నివేదిక వివరించింది. అయితే కొన్ని చిన్న పరిశ్రమలకు తమ అధ్యయనం వర్తించబోదని మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రీత్ చౌహాత్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలు ఉన్నప్పటికీ, భారత్ కార్పొరేట్ పరిశ్రమ ఈ సవాళ్లను ఎదుర్కొంటుందన్న భరోసాను క్రిసిల్ వ్యక్తం చేసింది. తాను రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 80 శాతం యథాతథ పరిస్థితిని కొనసాగించగా, 569 సంస్థలను అప్గ్రేడ్ చేయడం జరిగిందని, 103 సంస్థలను డౌన్గ్రేడ్ చేసినట్లు వివరించింది. కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తన రేటింగ్ సంస్థల్లో 159కి అప్గ్రేడ్ చేసినట్లు 40 సంస్థలను డౌన్గ్రేడ్ చేసినట్లు తెలిపింది. ఇక్రా రేటింగ్స్ విషయంలో 250 సంస్థలు అప్గ్రేడ్కాగా, 76 సంస్థలు డౌన్గ్రేడ్ అయ్యాయి. అప్గ్రేడ్ సంస్థలు అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం. -
ఎడెల్వీస్ నుంచి 2 టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్ను ఆవిష్కరించింది. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ ఏప్రిల్ 2037 ఇండెక్స్ ఫండ్తో పాటు 2027 జూన్లో మెచ్యూర్ అయ్యే ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తాయి. 2037 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 6న, 2027 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
రూ.1 లక్ష కోట్లకు గృహోపకరణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంజ్యూమర్ డ్యూరబుల్స్ (గృహోపకరణాలు) విపణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో రూ.1 లక్ష కోట్ల మార్కును చేరుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ‘కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. వినియోగదార్లు అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వైపు మళ్లుతున్నారు. ఏసీల విషయంలో కాంపాక్ట్ మోడళ్లకు గిరాకీ పెరిగింది. పెద్ద సైజు టీవీల పట్ల కస్టమర్లలో మోజు అధికం అయింది. ఇక రాగి, అల్యూమినియం, స్టీల్, పాలీప్రొపైలీన్ వంటి ముడిపదార్థాల వ్యయం భారం అయినందున లాభాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ పరిమాణం పరంగా పరిశ్రమ 2022–23లో రెండంకెల వృద్ధి సాధిస్తుంది. రూపాయి విలువ తగ్గడం కూడా లాభాల క్షీణతకు కారణం అవుతోంది. 45–50 శాతం ముడిపదార్థాలు దిగుమతి అవుతున్నవే. ఇక పరిమాణం 10–13 శాతం దూసుకెళ్లడం ద్వారా ఆదాయం 15–18 శాతం ఎగుస్తుంది. 2021–22లో విలువ పరంగా పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. పట్టణవాసుల ఆదాయం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధర అధికం కావడంతో డిమాండ్ను పెంచుతుంది’ అని నివేదిక వివరించింది. -
ఇప్పుడు సిమెంట్ వంతు..భారీగా పెరగనున్న ధరలు..! ఒక బస్తాపై..
రష్యా-ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల, ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో సిమెంట్ ధరలు కూడా భారీగా అవకాశం ఉన్నట్లు క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పెరిగిన ఇన్పుట్ ఛార్జీలు..! సిమెంట్ తయారీలో ఇన్పుట్ ఛార్జీలు పెరగడంతో ఆయా కంపెనీలు ఖర్చులను తీవ్రంగా భరించడం మొదలుపెట్టాయి. దీంతో మార్జినల్ లాభాలను పొందడంలో ఆయా కంపెనీలకు కష్టతరంగా అయ్యే అవకాశం ఉండడంతో కంపెనీలు ఈ నెలలో ఒక్కో బ్యాగ్పై రూ. 25 నుంచి రూ. 50 వరకు సిమెంట్ బ్యాగ్ ధరలు పెంచే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. పెరిగిన రవాణా ఖర్చులు..! మార్చిలో ముడి చమురు బ్యారెల్ ధరలు సగటున 115 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఆస్ట్రేలియాలోని కీలక మైనింగ్ ప్రాంతాల్లో వాతావరణ అంతరాయాలు, దేశీయ డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ బొగ్గు ధరలు కూడా పెరిగాయని క్రిసిల్ పేర్కొంది. విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల ఫలితంగా సరుకు రవాణా ఖర్చు పెరిగింది, ఇది సిమెంట్ రవాణాలో 50 శాతం వాటాలను కలిగి ఉంది. బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచారు, రిటైల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవి సిమెంట్ ధరల పెంపుకు కారణాలుగా ఉన్నాయని క్రిసిల్ వెల్లడించింది. క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ ప్రకారం...గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సిమెంట్ డిమాండ్ సంవత్సరానికి 20 శాతం పెరగగా...అకాల వర్షాలు, ఇసుక సమస్యలు, కార్మికుల లభ్యత కారణంగా రెండో భాగంలో ఊహించని విధంగా మందగమనాన్ని ఎదుర్కొంది. స్థిరంగా డిమాండ్..! వచ్చే ఆర్థిక సంవత్సరంలో...సిమెంట్కు డిమాండ్ 5-7 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది, మౌలిక సదుపాయాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల నుంచి సరసమైన గృహాల డిమాండ్తో ధరలు స్ధిరంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధిక నిర్మాణ ఖర్చులు సిమెంట్ డిమాండ్ పెరుగుదలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదని హేతల్ గాంధీ అభిప్రాయపడ్డారు. చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్ -
బ్యాంకుల రుణాల్లో 8.9శాతం నుంచి 10.2% వృద్ధి!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం నుంచి 10.2 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. 2022 మార్చి నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో ఉంటాయన్నది అంచనాకాగా, 2023 మార్చి నాటికి 5.6 – 5.7 శ్రేణికి తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఇక నికర మొండిబాకాయిలు ఇదే కాలంలో 2 శాతం నుంచి 1.7.–1.8 శాతం శ్రేణికి దిగివచ్చే వీలుంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ►ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల అవుట్లుక్ స్థిరంగా ఉంటుందని అంచనా. బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021–22లో 8.3 శాతంగా అంచనావేస్తే, 2022–23లో ఇది 8.9–10.2 శాతం శ్రేణికి మెరుగుపడే వీలుంది. 2020–21లో ఇది మరింత తక్కువగా 5.5 శాతంగా ఉంది. ► రిటైల్ రంగం అలాగే సూక్ష్మ, లఘు చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పారిశ్రామిక రంగం చోదకంగా ఉండే ఆహారేతర విభాగాల నుంచి రుణ వృద్ధి బాగుంటుంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) కో–లెండింగ్ సమన్వయ సౌలభ్యత పెరిగే వీలుంది. ► 2019లో చోటుచేసుకున్న పరిణామాల తరహాలో హోల్సేల్ క్రెడిట్ విభాగంలో రుణ డిమాండ్ డెట్ క్యాపిటల్ మార్కెట్ నుంచి బ్యాంక్ క్రెడిట్కు మారే వీలుంది. డెట్ మార్కెట్లో బాండ్ ఈల్డ్ (వడ్డీ) భారీగా పెరిగే అవకాశం ఉండడం దీనికి కారణం. బాండ్ ఈల్డ్ పెరుగుదల నేపథ్యంలో 2022–23లో ట్రెజరీ ఇన్కమ్ కూడా గణనీయంగా తగ్గే వీలుంది. ►ఇక బ్యాంకింగ్ క్రెడిట్, ఇతర ప్రొవిజన్స్ (కేటాయింపులు) 2021–22లో 1.7 నుంచి 1.8 శాతం శ్రేణిలో ఉంటే 2022–23 నాటికి ఈ శాతాలు 1.3–1.4 శాతం శ్రేణికి తగ్గే వీలుంది. ►2021–22లో డిపాజిట్ల వృద్ధి రేటు అంచనా 8.3 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.3 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గవచ్చు. ► నియంత్రణ, ఎకానమీ వృద్ధి అవసరాల పరంగా ప్రభుత్వ రంగ (పీఎస్యూ) బ్యాంకులకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో తగిన మూలదనం ఉంటుందని భావిస్తున్నాం. ఇక ప్రైవేట్ బ్యాంకింగ్కు మూలధనం అవసరం రూ. 10,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. ► రుణ వృద్ధి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగులు రూ. 1.5–2.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా వ్యవస్థలో మిగులు లిక్విడిటీని క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. ► బలమైన కార్పొరేట్ క్రెడిట్ నిష్పత్తి, రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగాల్లో రుణ వృద్ధి, ఎన్పీఏలు తగ్గడం, ఆదాయల పెరుగుదల వంటి అంశాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా ఉంటాయి. -
ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్ఝున్వాలా
ముంబై: బ్లూచిప్ స్టాక్స్తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు. డీఎల్ఎఫ్, మాక్రో డెవలపర్స్ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్ఝున్వాలా.. రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్టాక్ మార్కెట్, తదితర బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఆధారపడలేం తాను రియల్టీ డెవలపర్ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్ చేయబోనంటూ రాకేష్ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్ఎస్టేట్ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్ ప్రసంగించారు. బ్లూచిప్ స్టాక్స్ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లు, కమర్షియల్ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్టుబడులు గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసినట్లు రాకేష్ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు. కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్ ఎయిర్లైన్స్ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్ ఎయిర్ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్ ప్రస్తావించారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
సెకెండ్ వేవ్లో వ్యాపార నష్టం అంతగా జరగలేదంట
ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్తో పోల్చితే రెండవ వేవ్లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ సుభోద్ రాయ్ నివేదికలో వివరించారు. మొదటి వేవ్తో పోల్చితే రెండవ వేవ్లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0ను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్వర్క్ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్ రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్ వివరించింది. వ్యాపార అవుట్లుక్ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్ వస్తే మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. చదవండి : జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! -
Multiplexes In India: మల్టీప్లెక్స్లకు మరో ఏడాది కష్టాలే!
ముంబై: మల్టీప్లెక్స్లకు (సినిమా ప్రదర్శన, వినోద కేంద్రాలు) మరో ఏడాది పాటు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా మరోవిడత తీవ్రరూపం దాల్చడంతోపాటు దేశవ్యాప్తంగా స్థానిక లాక్డౌన్లు మల్టీప్లెక్స్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. దీనివల్ల వచ్చే కొన్ని నెలల పాటు వీక్షకుల సీట్ల భర్తీ (ఆక్యుపెన్సీ) తక్కువగానే ఉంటుందని వివరించింది. దీంతో వరుసగా రెండో ఆర్థిక ఏడాది మల్టీప్లెక్స్ సంస్థలు (పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర) నిర్వహణ నష్టాలను ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న రంగం ఇదొకటని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లోనే రికవరీని (కోలుకోవడం) చూస్తుందని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. 2020 మార్చిలో లాక్డౌన్ల కంటే ముందే మూతపడినవి మల్టీప్లెక్స్లేనని.. ఆలస్యంగా (అక్టోబర్లో) తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన రంగం కూడా ఇదేనని క్రిసిల్ వివరించింది. కార్యకలాపాలు తిరిగి ఆరంభించిన తర్వాత నుంచి సీట్ల భర్తీ మెరుగుపడడం కనిపించినట్టు.. నిర్వహణ లాభం దృష్ట్యా తటస్థ స్థాయికి ప్రస్తుత త్రైమాసికంలో చేరుకోవచ్చని అంచనా వేసినట్టుగా పేర్కొంది. అయితే, ఇటీవల పెరిగిపోయిన కేసుల వల్ల రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగానికి వాయిదా పడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2020–21లో మొదటి ఆరు నెలల్లో సీట్ల భర్తీ 10–12 శాతంగాను, ద్వీతీయ ఆరు నెలల్లో 20–22 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా చర్యలతో భారీ కలెక్షన్లు వచ్చే నూతన సినిమాల విడుదల ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి (జూలై–సెప్టెంబర్) వాయిదా పడొచ్చని తెలిపింది. 2020–21లో మల్టీప్లెక్స్లు రూ.900 కోట్ల నష్టం చూడగా.. 2021–22లోనూ నష్టాలనే నమోదు చేస్తాయని అంచనా వేసింది. 6 నెలలు నెట్టుకురావచ్చు.. 2020–21లో వ్యయాల నియంత్రణ కోసం మల్టీప్లెక్స్ కంపెనీలు తీసుకున్న చర్యలు, మూలధన వ్యయాల వాయిదా, ఈక్విటీల జారీ రూపంలో సమీకరించిన రూ.1,350 కోట్ల నిధులతో అవి నష్టాలను ఏదుర్కోగలవని క్రిసిల్ తెలిపింది. వాటివద్ద ప్రస్తుద నగదు నిల్వలు 4–6 నెలల పాటు నిర్వహణ వ్యయాలు, రుణాల చెల్లింపులకు సరిపోతాయని పేర్కొంది. -
హెచ్1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పమే: క్రిసెల్
భారత ఐటీ కంపెనీలపై హెచ్1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పంగానే ఉంటుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ఐటీ రంగానికి రూ.1200 కోట్ల మేర మాత్రమే ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఐటీ పరిశ్రమ లాభదాయకత 0.25-0.30శాతం మేర క్షీణించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ పేర్కోంది. గత కొన్నేళ్లుగా భారత ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకు అధికస్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తోందని, ఫలితంగా వీసా సంబంధిత సమస్యల వల్ల కలిగే నష్టాలు పరిమితమయ్యే అవకాశం ఉందని క్రిసెల్ తన నివేదికలో పేర్కోంది. యూఎస్లో నిరుద్యోగ కట్టడి చర్యలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గతనెలలో హెచ్-1వీసాలను ఏడాదిపాటు రద్దుచేసిన సంగతి తెలిసిందే. టాప్-15 ఐటీ కంపెనీల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోన్న క్రిసెల్... కోవిడ్-19 ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటి సంస్థల లాభాలు 2.50శాతానికిపైగా క్షీణించడంతో పాటు నిర్వహణ లాభదాయకత 23శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఎంట్రీ సిస్టమ్ స్థాయి ఉద్యోగాలను స్థానికుల ద్వారా భర్తీ చేయడంతో హెచ్1-బి, ఎల్ 1 వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావాన్ని చూపదు. అలాగే వీసాల పునరుద్ధరణ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని రేటింగ్ సంస్థ తెలిపింది. -
వొడాఫోన్ ఐడియాకు మరోషాక్
సాక్షి,న్యూఢిల్లీ: ఏజీఆర్ వివాదంతో కష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు మరో చిక్కొచ్చి పడింది. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తాజాగా వొడాఫోన్ ఐడియా డౌన్ రేటింగ్ను కొనసాగించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలను చెల్లించాల్సిన అవకాశం ఉన్నందున కంపెనీ ఆర్ధిక రిస్క్ ప్రొఫైల్లో గణనీయమైన క్షీణత ఉంటుందని అంచనా వేసింది. ఏజీఆర్ వివాదానికి ముందు బీబీబీగా ఇచ్చిన ర్యాంకును బీబీబీ మైనస్కు తగ్గించింది. వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 3,500 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లపై క్రిసిల్ తన రేటింగ్ను తగ్గించిందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ .53,038 కోట్లు చెల్లించాల్సి వుంది. కాగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను జనవరి 23నాటికి చెల్లించాల్సిందేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో ఈ గడువులోగా బకాయిలు చెల్లించలేమన్న టెల్కోలు ఈ తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంలో టెల్కోలు పిటిషన్ను దాఖలు చేశాయి. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వచ్చే వారం వాదనలు విననుంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బలవంతంగా బాకీల వసూలుకు చర్యలు తీసుకోరాదని టెలికం శాఖ(డాట్) నిర్ణయించింది. లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ వింగ్ ఈ మేరకు అన్ని విభాగాలకు ఆదేశాలు పంపించింది. చదవండి : ఏజీఆర్ బకాయిలపై టెల్కోలకు ఊరట, జియో ఏజీఆర్ బకాయిలు చెల్లింపు -
పదేళ్లలో రూ.110 లక్షల కోట్లకు పెరగాలి
న్యూఢిల్లీ: భారత్ నిర్దేశించుకున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలను సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే దశాబ్దంలో (2021–2030) ఇన్ఫ్రాపై వ్యయాలను రూ. 110 లక్షల కోట్లకు పెంచాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఇన్ఫ్రాపై చేసే మొత్తం రూ. 77 లక్షల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు 41 శాతం రాష్ట్రాలదే ఉండనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్బుక్ 2019 పుస్తకావిష్కరణ సందర్భంగా క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. రూ.235 లక్షల కోట్లు అవసరం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రాబోయే దశాబ్దంలో రూ. 235 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసింది. అలాగే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సగటున 7.5 శాతం ఉండాలని, జీడీపీలో 6 శాతం పైగా ఇన్ఫ్రా వ్యయాలు ఉండాలని పేర్కొంది. రాష్ట్రాలు చేసే వ్యయాల్లో మూడింట రెండొంతుల భాగం .. రవాణా, సాగునీటి సదుపాయం, ఇంధనం వంటి అయిదు రంగాలపైనే ఉంటోంది. ఇన్ఫ్రా పెట్టుబడుల్లో రాష్ట్రాల వాటా సుమారు 50 శాతం స్థాయికి చేరాల్సిన అవసరం ఉందని క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ ప్రెసిడెంట్ సమీర్ భాటియా తెలిపారు. పెట్టుబడుల తీరు ఆధారంగా రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా క్రిసిల్ వర్గీకరించింది. ముందు వరుసలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా.. మధ్య స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా ఉన్నాయి. మధ్య స్థాయిలో ఉన్న రాష్ట్రాలు.. నిలకడగా పెట్టుబడులు కొనుసాగించడం ద్వారా వృద్ధి సారథులుగా ఎదిగే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఎదుగుతున్న రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లపై రుణభారం పెరుగుతున్నందున పెట్టుబడుల సామర్థ్యం పరిమితంగా ఉండొచ్చని తెలిపింది. -
పీఎస్బీలకు తగ్గనున్న మూలధన భారం
ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. అయితే, బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్ బఫర్ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు 8.875% క్యాపిటల్ అడెక్వసీ రేషియోను పాటించాలి. ఇందులో సీసీబీ వాటా 1.875%. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625% పెంచుకోవాల్సి ఉంది. అయితే, ఈ గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. -
తక్షణం రూ. 1.2 లక్షల కోట్లు కావాలి!
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్బీలు బలహీన మార్కెట్ వాల్యుయేషన్స్, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ మేరకు నిధులు సమకూర్చిన పక్షంలో ఆర్థిక గణాంకాలు లెక్క తప్పే ప్రమాదముందని, ఈసారి ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేకపోవచ్చని నివేదికను రూపొందించిన క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. పీఎస్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తామంటూ 2017 అక్టోబర్లో కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా ఇందులో రూ. 1.12 లక్షల కోట్లు సమకూర్చగా, బ్యాంకులు మరో రూ. 12,000 కోట్లు మాత్రమే మార్కెట్ల నుంచి సమీకరించుకోగలిగాయి. పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, వాల్యుయేషన్లు బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతల కారణంగా పీఎస్బీలు ప్రస్తుతం మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించుకునే పరిస్థితి లేదని కృష్ణన్ తెలిపారు. అయితే, పటిష్టమైన బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న వాటిని విలీనం చేయడం ద్వారా అదనపు మూలధన అవసరాలు కొంత మేర తగ్గొచ్చని క్రిసిల్ అసోసియే ట్ డైరెక్టర్ వైద్యనాథన్ రామస్వామి చెప్పారు. మార్కెట్ల నుంచే మూలధనం సమీకరించుకునేలా మెరుగ్గా ఉన్న బ్యాంకులను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ.. కార్యకలాపాల విస్తరణ తదితర అవసరాల కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సహా వివిధ మార్గాల్లో ఈ నిధులు సమీకరించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్ 7న బ్యాంక్ షేర్హోల్డర్లు సమావేశం కానున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
ఏవియేషన్కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్
ముంబై: ఎయిర్లైన్స్ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్ చార్జీలను 12 శాతం పెంచడం ద్వారా పెరిగిన వ్యయాలను అధిగమించొచ్చని సూచించింది. అంతేకాక విమానయాన సంస్థల రుణ భారం 10 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 71 శాతం వాటా జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్, ఇండిగో సంస్థల చేతుల్లోనే ఉంది. -
పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసిల్
న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది. 20 లిస్టెడ్ కంపెనీల మొదటి త్రైమాసికాల్లో ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనిపించాయని పేర్కొంది. ‘‘మొదటి త్రైమాసికంలో అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో 7 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ మార్కెట్ నుంచి ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఉంది. పెద్ద ఫార్మా కంపెనీల ఆదాయాలు 12–13 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్ తెలిపింది. -
క్రిసిల్ లాభం రూ.77 కోట్లు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.77 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ. 67 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని క్రిసిల్ తెలిపింది. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లకు, ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై రూ.17 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్డీ, సీఈఓ అషు సుయాశ్ చెప్పారు. ఒక్కో షేర్కు రూ.6 మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. దేశీయ కంపెనీల బాండ్ల జారీ బాగా తగ్గినప్పటికీ తమ కీలక వ్యాపారం రేటింగ్స్ విభాగం మంచి వృద్ధినే సాధించిందని వివరించారు. -
మొండిబాకీలు మరింత పెరుగుతాయ్..
ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండిబాకీలు (జీఎన్పీఏ) ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 11.5 శాతానికి చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 11.2 శాతంగా ఉన్నాయి. 2017 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో రూ. 8 లక్షల కోట్లుగా (ఇచ్చిన రుణాల్లో 9.5 శాతం)గా ఉన్న జీఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరంలో 10.3 లక్షల కోట్లకు (11.2 శాతం) చేరాయి. ఈసారి 11.5 శాతానికి చేరిన తర్వాత నుంచి జీఎన్పీఏలు క్రమంగా తగ్గుముఖం పట్టగలవని క్రిసిల్ పేర్కొంది. మొండిబాకీలు, ప్రొవిజనింగ్ వ్యయాలు భారీగా ఎగియడంతో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా రూ. 40,000 కోట్ల పైచిలుకు నష్టాలు నమోదయ్యాయి. దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ వివిధ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాలను ఉపసంహరించడం కూడా.. మొండిబాకీల్లో అయిదో వంతుకు కారణమయ్యాయని క్రిసిల్ వివరించింది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) .. బాసెల్ త్రీ నిబంధనలను పాటించాలంటే అదనపు మూలధనం కోసం కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు ఊహించిన దానికి మించిన నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన రూ. 2.1 లక్షల కోట్ల అదనపు మూలధనం నిధులు పీఎస్బీల అవసరాలకు సరిపోకపోవచ్చని క్రిసిల్ తెలిపింది. తగ్గనున్న ఎన్పీఏలు.. ఎన్పీఏల పెరుగుదల గరిష్ట స్థాయికి చేరిందని, ఇక మెల్లగా తగ్గుముఖం పట్టవచ్చనేది క్రిసిల్ అంచనా. ఎన్పీఏల నుంచి రికవరీలు మెరుగ్గా ఉండటం, ప్రొవిజనింగ్ తగ్గే అవకాశాలు మొదలైనవి బ్యాంకులకు సానుకూలాంశాలుగా పేర్కొంది. స్పెషల్ మెన్షన్ అకౌంట్2 కింద వర్గీకరించిన 60–90 రోజుల మేర బకాయిల పరిమాణం గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి 0.8%కి చేరింది. అంతక్రితం ఏడాది ఇది 2 శాతంగా నమోదైంది. ఎన్పీఏలుగా మారే అవకాశాలు ఉన్న రుణాలు తగ్గుతున్నాయనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని క్రిసిల్ తెలిపింది. ఇక, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరుపుతున్న మొండి బాకీ కేసుల నుంచి కూడా బ్యాంకులకు మెరుగ్గానే రికవరీ కాగలదని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ఎన్సీఎల్టీ ముందున్న మొత్తం 3.3 లక్షల కోట్ల రుణాలకు సంబంధించిన కేసుల్లో సుమారు పావు వంతు కేసులు ఉక్కు సంస్థలవే ఉన్నాయి. ఉక్కు రంగం పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వేలంలో ఈ సంస్థలపై మంచి ఆసక్తి వ్యక్తమవుతుండటం సానుకూల అంశమని కృష్ణన్ చెప్పారు. -
వచ్చే ఏడాది వృద్ధి 7.5 శాతం: క్రిసిల్
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2018–19) దేశ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. దేశీయ వినియోగం, విధానాల పరంగా ప్రోత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సానుకూల అంశాలని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017–18) మాత్రం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 – 7.5 శాతం వరకు ఉండొచ్చని 2018 ఆర్థిక సర్వే సైతం పేర్కొన్న విషయం విదితమే. రెండు వరుస ప్రతికూల ఆర్థిక సంవత్సరాలు... ఒక ఏడాదిలో డీమోనిటైజేషన్, మరో ఏడాదిలో జీఎస్టీ అమలు తర్వాత వృద్ధి చెప్పుకోతగ్గ 7.5 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోనుందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలకు పరిష్కారం, గ్రామీణ మార్కెట్ తిరిగి జవసత్వాన్ని సంతరించుకోవడం, నిరంతరాయ సంస్కరణలు, ప్రపంచ వృద్ధి అన్నవి భారత వృద్ధి రేటు పెరుగుదల, స్థిరత్వాన్ని నిర్ణయించే అంశాలుగా క్రిసిల్ ప్రస్తావించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో 10.5 శాతానికి చేరిన స్థూల ఎన్పీఏల అంశాన్ని పరిష్కరించకుండా స్థిరమైన ఆర్థికవృద్ధి సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఎన్సీఎల్టీ పరిష్కార ప్రక్రియ పట్ల ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 మార్చి నాటికి ఎన్పీఏలు 11 శాతాన్ని చేరుకోవచ్చని అంచనా వ్యక్తం చేసింది. గ్రామీణ, మౌలిక రంగాలపై ఎక్కువగా నిధులు ఖర్చు చేయడం ద్వారా డిమాండ్, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి కలిసొస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా వేసింది. చైనా జీడీపీ లక్ష్యం 6.5 శాతం బీజింగ్: చైనా గతేడాది మాదిరిగానే 2018 సంవత్సరంలోనూ వృద్ధి రేటు లక్ష్యాన్ని 6.5 శాతంగానే నిర్ణయించింది. సోమవారం పార్లమెంటు వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా గడిచిన ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రధాని లీ కెకియాంగ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగానే 6.5 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని మూడు శాతం స్థాయిలోనే ఉంచాలని, కొత్తగా 1.1 కోట్ల ఉద్యోగాలను పట్టణ ప్రాంతాల్లో కల్పించాలనే లక్ష్యాలను వెల్లడించారు. నిరుద్యోగిత రేటు 5.5 శాతంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
‘పరిశీలన’లో పీఎన్బీ రేటింగ్లు
ముంబై: భారీ స్కామ్తో వణికిపోతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు రేటింగ్లను పరిశీలనలో పెడుతున్నట్టు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ ప్రకటించింది. ముంబైలోని బ్రాడీహౌస్ శాఖలో రూ.11,400 కోట్ల ఎల్వోయూల కుంభకోణం వెలుగు చూసిన విషయం విదితమే. నీరవ్ మోదీ, ఆయన కంపెనీలు ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల సాయంతో మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారు. ఎస్బీఐ తర్వాత ప్రభుత్వ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకు అయిన పీఎన్బీకి సంబంధించి డెట్ ఇన్స్ట్రుమెంట్లకు క్రిసిల్ ఏఏఏ, ఏఏ రేటింగ్లు కేటాయించి ఉంది. ‘‘పీఎన్బీ డెట్ ఇనుస్ట్రెమెంట్లపై మా రేటింగ్లను ‘పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో రేటింగ్ పరిశీలన’లో ఉంచాం. బ్రాడీహౌస్ బ్రాంచ్లో మోసపూరిత, అనధికారిక లావాదేవీలను గుర్తించినట్టు ఫిబ్రవరి 14 నాటి ప్రకటనలో వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని క్రిసిల్ పేర్కొంది. ఈ స్కామ్ కారణంగా ఏర్పడే చెల్లింపుల బాధ్యత, పరిమాణం, రికవరీ అవకాశాలు, ప్రొవిజనింగ్ అంచనాలు, మూలధన రేషియోపై పడే ప్రభావం గురించి పీఎన్బీ నుంచి స్పష్టత కోరినట్టు క్రిసిల్ తెలిపింది. వీటిపై స్పష్టత వచ్చిన అనంతరం పరిశీలన జాబితా నుంచి పీఎన్బీ రేటింగ్లను తొలగించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పెరిగిన ఉద్దేశపూర్వక ఎగవేతలు పీఎన్బీలో జనవరితో ముగిసిన చివరి ఎనిమిది నెలల కాలంలో ఉద్దేశపూర్వక భారీ రుణ ఎగవేతల మొత్తం (రూ.25 లక్షలపైన రుణం తీసుకున్న కేసులు) 23 శాతం పెరిగిపోయింది. వీటికి సంబంధించిన బకాయిలు రూ.14,593 కోట్లు. గతేడాది జూన్ నుంచి బ్యాంకు ఈ డేటాను విడుదల చేస్తోంది. అప్పుడు ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,879 కోట్లుగా ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే జనవరి నాటికి ఎనిమిది నెలల్లో 22.8 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మొండి బకాయిల వసూళ్లపై తమ చర్యల్ని తీవ్రతరం చేసిన కాలంలోనే ఇవి పెరగడం గమనార్హం. అయితే మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి బ్యాంకు నికర ఎన్పీఏలు రూ.34,076 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.34,994 కోట్లు. అంటే స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. స్థూల ఎన్పీఏలు రూ.57,519 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,628 కోట్లతో పోలిస్తే కొంచెం పెరిగాయి. గీతాంజలి గ్రూపు రికార్డుల పరిశీలన పీఎన్బీ స్కామ్ విచారణలో భాగంగా సీబీఐ, మెహుల్ చోక్సి ప్రమోట్ చేసిన గీతాంజలి గ్రూపు కంపెనీల బ్యాలన్స్ షీట్లను పరిశీలిస్తోంది. పీఎన్బీ నుంచి తీసుకున్న రూ.11,384 కోట్ల ఎల్వోయూల ఆధారంగా వివిధ బ్యాంకు శాఖల నుంచి డ్రా చేసుకున్న మొత్తం ఎంతన్న దానిని తేల్చే పని ప్రారంభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి గోకుల్నాథ్శెట్టి, మనోజ్ ఖారత్, నీరవ్మోదీ కంపెనీ ఉద్యోగి ఒకరిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరితోపాటు పీఎన్బీకి చెందిన ఇతర ఉద్యోగుల నుంచి సమాచారం రాబడుతోంది. మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నీరవ్మోదీ, మెహుల్ చోక్సీ ఇద్దరూ దగ్గరి బంధువులన్న విషయం తెలిసిందే. మరోవైపు వీరికి ఎల్వోయూల ఆధారంగా క్రెడిట్ ఇచ్చిన విదేశీ బ్యాంకు శాఖల ఉద్యోగులను కూడా సీబీఐ విచారించనుంది. హాంగ్కాంగ్లోని అలహాబాద్ బ్యాం కు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉద్యోగులకు ఈ స్కామ్లో పాత్ర ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. నిబంధనల మేరకు ఎల్వోయూలు 90 రోజుల వరకే ఉండాలని, 365 రోజులు కాదని అవి వెల్లడించాయి. కనుక ఉద్యోగులకు తెలిసే ఇది జరిగి ఉంటుందని పేర్కొన్నాయి. -
బ్యాంకులకు సానుకూల రేటింగ్
ముంబై: మొండి బాకీల సమస్య నుంచి గట్టెక్కే దిశగా అదనపు మూలధనం లభించనున్న 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రేటింగ్పై క్రిసిల్ సంస్థ సానుకూలంగా స్పందించింది. వాటి అంచనాలను నెగటివ్ నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి పెంచింది. ఆయా బ్యాంకులు పటిష్టంగా మారడానికి అదనపు మూలధనం ఉపయోగపడగలదని క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. రుణాలకు డిమాండ్ కూడా పుంజుకుంటే బ్యాంకుల మొత్తం పనితీరు కూడా మెరుగుపడగలదని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎస్బీల అంచనాలపై క్రిసిల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర 18 బ్యాంకుల అంచనాలను స్థిర స్థాయికి క్రిసిల్ పెంచింది. అయితే, ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. 8,800 కోట్లు అందుకోనున్న దిగ్గజం ఎస్బీఐ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆంధ్రా బ్యాంక్, బీవోబీ సహా తొమ్మిది పీఎస్బీల బాసెల్ త్రీ టైర్ 1 బాండ్ల రేటింగ్స్ను, అంచనాలను (నెగటివ్) యధాతథంగా కొనసాగిస్తున్నట్లు క్రిసిల్ తెలిపింది. రీక్యాపిటలైజేషన్ ప్రక్రియ.. ప్రభుత్వ మద్దతును సూచించడంతో పాటు పీఎస్బీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది కూడా గుర్తు చేస్తుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. -
వృద్ధి 7.6 శాతమే: క్రిసిల్
ముంబై: రానున్న ఆర్థిక సంవత్సరాని(2018–19)కి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మరోసారి పునరుద్ఘాటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించడానికి డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల స్వల్ప కాలంలో ఎదురైన ప్రతికూలతలు, వ్యవసాయ వృద్ధి బలహీనంగా ఉండడమే కారణాలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రతికూల ప్రభావం కొనసాగుతుందన్న అంచనాలతోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.6 శాతంగా పేర్కొంటున్నట్టు వివరించింది. ప్రైవేటు వినియోగం 2017 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉండగా, అది 2018 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ జీడీపీలో 55.7 శాతంతో ఇదే అతిపెద్ద వాటాదారు అని తెలిపింది. -
రూ. 2.4 లక్షల కోట్లు వదులుకోవాలి!
♦ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో 40 శాతమే దక్కేది ♦ 50 మొండి ఖాతాలకు సంబంధించి ఇదే పరిస్థితి ♦ బ్యాంకుల ’హెయిర్కట్’ భారీగానే ఉంటుంది ♦ వీటిలో అధికం మెటల్, నిర్మాణ, విద్యుత్ కంపెనీలే ♦ విద్యుత్ కంపెనీల హెయిర్కట్ కాస్త తక్కువే: క్రిసిల్ ముంబై: భారీగా మొండి బకాయిలు పేరుకుపోయిన దాదాపు 50 ఖాతాలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు వదులుకోవాల్సి (హెయిర్కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఆయా సంస్థలు చెల్లించాల్సిన మొత్తంలో ఇది సుమారు 60%మని తెలియజేసింది. ఈ 50 మొండి బాకీల ఖాతాలు.. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందినవి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల పైగా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణంలో వీటి వాటా దాదాపు సగభాగం ఉంటుందని క్రిసిల్ తెలిపింది. ‘దాదాపు రూ.4 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 50 భారీ మొండి బాకీల ఖాతాల సమస్యను సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు సుమారు 60%.. అంటే దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర వదులుకోవాల్సి వస్తుంది‘ అని పేర్కొంది. ఈ హెయిర్కట్ను స్వల్ప (25% కన్నా తక్కువ), ఒక మోస్తరు (25–50 %), అధికం (50–75%), అత్యధికం (75% పైగా) కింద నాలుగు రకాలుగా వర్గీకరించింది. ప్రస్తుతం ఇలా ఎన్పీఏలు బాగా పేరుకుపోయిన సంస్థలపై రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు దివాలా ప్రక్రియను ఆరంభించిన విషయం తెలిసిందే. దివాలా ప్రక్రియలో భాగంగా చివరకు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. ఇలా విక్రయించిన పక్షంలో బ్యాంకులకు 40% మొత్తమే దక్కుతుందని, మిగిలిన 60%న్ని వదులుకోవాల్సి ఉంటుందని క్రిసిల్ నివేదిక హెచ్చరించింది. ఒక మోస్తరుగా విద్యుత్ రంగం.. విద్యుత్ రంగ కంపెనీలకు ఒక మోస్తరు హెయిర్కట్ సరిపోతుందని, అయితే మెటల్స్, నిర్మాణ రంగ సంస్థల మొండి బాకీల విషయంలో బ్యాంకులు అధికంగానే వదులుకోవాల్సి రావొచ్చని క్రిసిల్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ పవన్ అగ్రవాల్ తెలిపారు. అత్యధికంగా హెయిర్కట్ అవసరమయ్యే ఖాతాల్లో ఎక్కువ భాగం సంస్థలు నిలదొక్కుకోలేని వ్యాపార రంగాల్లో ఉన్నవేనని ఆయన పేర్కొన్నారు. ఒక మోస్తరు లేదా అధిక హెయిర్కట్ అవసరమైన కంపెనీలు చాలా మటుకు పెట్టుబడి వ్యయాల కోసం రుణాలు తీసుకున్నవే. అయితే డిమాండ్ పడిపోవడమో లేదా నియంత్రణపరమైన అడ్డంకులతో అవి తలపెట్టిన ప్రాజెక్టులు నిల్చిపోవడం.. ఫలితంగా సమయం వృధా కావడంతో పాటు వ్యయాలూ భారీగా పెరిగిపోయి సదరు ప్రాజెక్టు లాభదాయకత దెబ్బతినడమో జరిగిందని క్రిసిల్ తెలిపింది. ఇక స్వల్ప హెయిర్కట్ అవసరమయ్యే కంపెనీలు.. తాత్కాలికంగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నవని, కాలక్రమేణా అవి సర్దుకోగలవని వివరించింది. నిర్ణయాలు వాయిదా వేయడం కన్నా ఎకానమీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఒకింత కష్టమైనా హెయిర్కట్ చేదు మాత్ర తీసుకోవడమే శ్రేయస్కరమని తెలిపింది. బ్యాంకులకు మూలధనంపై కేంద్రం కసరత్తు.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే వ్యూహంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన చేయొచ్చని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ తమ మూలధన అవసరాలపై వివిధ బ్యాంకులు పంపిన అభ్యర్ధనలకు సంబంధించి ఇంద్రధనుష్ స్కీము కింద నిధులు సమకూర్చే ప్రతిపాదనలకు తుది రూపునిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. లబ్ధి పొందే బ్యాంకుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని, గత ంలోలాగే ఈసారీ మూలధన నిధులు దశలవారీగా అందిస్తామని అధికారి తెలిపారు. ఇంద్రధనుష్ స్కిము కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల మూలధన అవసరాలకోసం రూ. 10,000 కోట్లు కేటాయించినప్పటికీ.. మొండిబాకీల పరిష్కారాల కోసం బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్ చేయాల్సి వస్తుండటంతో ఈ మొత్తం సరిపోకపోవచ్చని భావిస్తున్నారు. స్వయంగా ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సైతం గత నెలలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ల్యాంకో ఇన్ఫ్రాకు డిఫాల్ట్ రేటింగ్: క్రిసిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సంక్షోభంలో చిక్కుకున్న నిర్మాణ రంగ సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ (ఎల్ఐటీఎల్)కు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా డిఫాల్ట్ ’డి’ రేటింగ్ ఇచ్చింది. రుణాల చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతుండటాన్ని ఈ రేటింగ్ ప్రతిఫలిస్తుంది. తగినంత నగదు లేకపోవడమే రుణాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమని క్రిసిల్ పేర్కొంది. ల్యాంకో ఇన్ఫ్రాతో పాటు అది ఆస్ట్రేలియాలో తలపెట్టిన గ్రిఫిన్ కోల్ వెంచర్ ఆర్థిక, వ్యాపార పరిస్థితులను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వివరించింది. భారీ స్థాయిలో రుణాలు పేరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రాపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులను గత నెలలో ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ముందుకు ఈ అంశం చేరింది. 2012–13 నుంచి ల్యాంకో ఇన్ఫ్రా రుణాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ల్యాంకో ఇన్ఫ్రా నగదుయేతర రుణభారం రూ. 3,221 కోట్లుగాను, నగదు రూప రుణభారం రూ. 8,146 కోట్లుగాను ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో స్టాండెలోన్ ప్రాతిపదికన ఎల్ఐటీఎల్ రూ. 1,635 కోట్ల ఆదాయంపై రూ. 890 నికర నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ. 445 కోట్లు. -
సవాళ్లున్నాయ్... పరిష్కరించాలి..!
⇒ భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణలు ⇒ మొండిబకాయిల సమస్య తక్షణ పరిష్కారం ఆవశ్యకత: దీపక్ పరేఖ్ ⇒ గణాంకాల్లో మరింత స్పష్టత కావాలన్న క్రిసిల్ ⇒ ఇకపై భారత్ వృద్ధికి దేశీయ అంశాలే కారణమవుతాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమించడానికి ఇకపై దేశీయ అంశాలే కారణమవుతాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును 0.25–0.50 శాతం నుంచి 0.75– 1 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్తలు తాజా పరిస్థితులపై చేసిన విశ్లేషణల ఇదీ... మొండి బాకాయిల సమస్య తీవ్రం: పరేఖ్ ‘‘దేశంలో మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి పెట్టాలి. అయితే దీనికి ప్రభుత్వ బెయిలవుట్ తరహా చర్యలు పనికిరావు. ఇక్కడ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా కాకూడదన్నది నా అభిప్రాయం. మౌలిక రంగంపై రీఫైనాన్షింగ్, రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునే విధంగా రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చొరవల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అలాగే బ్యాంకింగ్కు తగిన మూలధనం అందుబాటులో ఉంచే చర్యలను కేంద్రం తీసుకోవాలి’’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఎల్ఎస్ఈ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా ఫోరంలో ఆర్థిక సంస్కరణలపై జరిగిన సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ విలీనాలపై మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక సందర్భాలో ఇలాంటి చొరవలు అవసరమేనన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐలో ఐదు బ్యాంకుల విలీనం తగిన నిర్ణయమేనని ఆయన అన్నారు. గణాంకాల మధ్య పొంతన ఉండడం లేదు: క్రిసిల్ భారత్లో పలు కీలక గణాంకాల మధ్య పొందన కుదరడం లేదని రేటింగ్, విశ్లేషణా సంస్థ– క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మాదికారి జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు, క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల గణాంకాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి చూస్తే... జీడీపీలో తయారీ రంగం వాటా గణాంకాలకు, నెలవారీగా విడుదలవుతున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీకీ (ఐఐపీ) మధ్య వ్యత్యాసం కనబడుతోందని చెప్పారు. దేశీయ అంశాలే వృద్ధికి ఊతం: అరవింద్ సుబ్రమణ్యం అమెరికా ఫెడ్ నిర్ణయాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ ముందే డిస్కౌంట్ చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 5–6 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాలపై ఈ ప్రభావం పడబోదనీ వారు విశ్లేషిస్తున్నారు. రేట్లు పెంపు ఇకపై ఉండబోదని క్రితం పాలసీ సందర్భంగానే ఆర్బీఐ సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఫెడ్ రేటు పెంపు అంశంపై మాట్లాడుతూ, భారత్పై ఈ ప్రభావం స్వల్పమేనని అన్నారు. దేశీయంగా తీసుకునే నిర్ణయాలే మున్ముందు దేశాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. స్థిరత్వం, అన్ని విభాగాల్లో వృద్ధి పరిస్థితులు బాగుండడం వంటి అంశాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని అన్నారు. కాగా స్వల్పకాలంలో రూపాయి భారీగా బలపడినా, 2017 చివరినాటికి 66.50–67.50 శ్రేణికి చేరుతుందన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ ఇకోవ్రాప్ అంచనావేసింది. అయితే ఫెడ్ రేటు పెంపునకు సంబంధించి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు అనుసరించే విధానాలపై ఇది ఆధారపడి ఉంటుందనీ పేర్కొంది. -
వచ్చేసారి లాభాలు అంతంతే!
⇒ రెండంకెల స్థాయిని దాటని ఆదాయ వృద్ధి ⇒ పెరిగే కమోడిటీ ధరలతో మార్జిన్లపై ఒత్తిడి ⇒ 2017–18లో దేశీ కార్పొరేట్లపై క్రిసిల్ నివేదిక ముంబై: అంచనాలకు తగ్గట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభదాయకత 100 బేసిస్ పాయింట్లు పెరిగాక.. వచ్చేసారి (2017–18)లో మాత్రం వృద్ధి అంతంతమాత్రంగానే ఉండగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఇక ఆదాయాల వృద్ధి కూడా క్రమంగానే ఉండొచ్చని ఇండియా అవుట్లుక్ నివేదికలో తెలిపింది. సింగిల్ డిజిట్ ఆదాయ వృద్ధి రేటు ఇకపై సర్వసాధారణం కాగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఎనిమిది శాతం మేర పెరగవచ్చని వివరించింది. ఫలితంగా మరోసారి కార్పొరేట్లు రెండంకెల స్థాయి వృద్ధిని సాధించలేకపోవచ్చని తెలిపింది. పెరుగుతున్న కమోడిటీల ధరల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్లపై ఒత్తిడి తప్పదని అంచనా వేసింది. అన్నీ అనుకూలిస్తే.. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ), టెలికం.. సిమెంట్ తదితర రంగాల్లో కన్సాలిడేషన్, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి వృద్ధికి ఊతమిచ్చేందుకు తోడ్పడగలిగే సానుకూల అంశాలని క్రిసిల్ వివరించింది. జీడీపీకి డిమాండ్ ఊతం.. పెద్ద నోట్ల రద్దు కారణంగా తగ్గిన డిమాండ్ క్రమక్రమంగా మళ్లీ మెరుగుపడగలదని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఇది తోడ్పడగలదని క్రిసిల్ అంచనా వేసింది. దీంతో 2017 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉండే వృద్ధి రేటు 2018 ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.4 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. సాధారణ వర్షపాతం, ఓ మోస్తరు ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి కూడా జీడీపీ పెరుగుదలకు దోహదపడే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. అన్ని రంగాలకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ అమలు కీలకమని వివరించింది. ఇక విధానపరమైన చర్యలు, తీవ్రమైన పోటీ మొదలైనవి ఎదుర్కొంటున్న రంగాల్లో (టెలికం, సిమెంట్) కన్సాలిడేషన్ చోటు చేసుకోవడం కూడా సానుకూల పరిణామమేనని క్రిసిల్ తెలిపింది. ఆటోమొబైల్, ఐటీ కీలకం.. ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్ల సారథ్యంలో ఆటోమొబైల్ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు, నిర్మాణ రంగం (ముఖ్యంగా ఇన్ఫ్రా సంబంధమైన ప్రాజెక్టులు) వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాల వృద్ధికి కీలకంగా ఉంటాయని క్రిసిల్ తెలిపింది. అయితే, గడిచిన అయిదేళ్లతో పోలిస్తే సిమెంటు, ఉక్కు రంగాల్లో పెట్టుబడులు... రానున్న అయిదేళ్లలో తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. డీమోనిటైజేషన్ ప్రభావాలు తగ్గుతున్నప్పటికీ.. రియల్ ఎస్టేట్, సిమెంట్, ఉక్కు తదితర రంగాలపై ఒత్తిళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగవచ్చునని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఒకవైపు ధరలు మరోవైపు అమ్మక పరిమాణాల తగ్గుదలతో కుదేలవుతున్న సిమెంటు రంగం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే 2018–19 ఆర్థిక సంవత్సరం దాకా ఆగక తప్పదని వివరించింది. ఏడాది కిందట మెల్లిగా మొదలైన కమోడిటీ ధరల పెరుగుదల.. అంతిమంగా వాటిని వినియోగించే సంస్థల నిర్వహణ మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ అనలిస్టులు అంచనా వేశారు. ప్రైవేట్ పెట్టుబడులు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేసుకుని ఉండటం, డిమాండ్ మాత్రం అంతంతమాత్రంగానే పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా పెట్టుబడి ప్రణాళికలు 2018–19 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. -
ఐఐపీ గణాంకాలు వాస్తవికంగా లేవు: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలకు సంబంధించి విడుడల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు (ఐఐపీ) లోపాలతో కూడుకున్నవిగా రేటింగ్స్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఇవి భారత తయారీ రంగం వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెలారంభంలో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 1.81 శాతం క్షీణించగా, పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి నెల నవంబర్లో మాత్రం 5.7 శాతం వృద్ధిని నమోదు చేయడంపై క్రిసిల్ సందేహాలు వ్యక్తం చేసింది. అయితే, ఆటో వంటి పలు రంగాలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఏ విధంగా ఉందన్నది డిసెంబర్ నెల గణాంకాల్లో మరింతగా ప్రస్ఫుటం కానుందని పేర్కొంది. ప్రతికూలంగా ఉండొచ్చు... ‘‘గతేడాది నవంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు చాలా ఎక్కువగా సూచిస్తోంది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తొలి నెల కావడంతో ఐఐపీ ప్రతికూలంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఐఐపీ 1.8 శాతం క్షీణించింది. నవంబర్లో ఒక్కసారిగా పెరిగిపోయింది’’ అని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. -
జీడీపీ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్
• 2016-17లో 6.9%కి తగ్గింపు • ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడి ముంబై: నోట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని క్రిసిల్ తెలిపింది. డీమోనటైజేషన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరి కొంత సమయం పడుతుందని, వినియోగం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం కూడా దిగివస్తుందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ‘‘నగదుకు కొరత వల్ల జీడీపీలో 55 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగంపై నేరుగా ప్రభావం పడుతుంది. దీంతో మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుంది’’ అని క్రిసిల్ వివరించింది. నోమురా అంచనా 6.5 శాతం ముంబై: డీమోనటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఈ ప్రభావం 2017 సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలోనూ కొనసాగవచ్చని పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు ఆర్థిక రంగంలో పటిష్ట పరిస్థితులు ఉండగా... పెట్టుబడుల్లో బలహీనత కారణంగా తిరిగి ఆ స్థారుుకి చేరుకోవడానికి సమయం పడుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. వ్యవసాయేతర, వినియోగ ఆధారమైన రంగాల కార్యకలాపాలు నిదానించడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. నోట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగివస్తుందని తెలిపింది. -
రుణాలపై వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో లేనట్టే: క్రిసిల్
ముంబై: ఆర్బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి)ను పెంచడం ద్వారా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్ల మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడంతో... బ్యాంకుల నుంచి ఇప్పట్లో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను 100 శాతం పెంచిన ఆర్బీఐ... సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 11 మధ్యనున్న డిపాజిట్లలో నూరు శాతాన్ని పక్కన పెట్టాలంటూ బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకుల్లో ఉన్న 3 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకుకు వెళ్లనున్నారుు. ‘‘రిజర్వ్ బ్యాంకు తాజా చర్యతో తక్షణం ద్రవ్య చలామణి తగ్గిపోనుంది. బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేయవచ్చు. సేవింగ్స ఖాతాల డిపాజిట్లపై బ్యాంకులు 4 శాతం వరకు వడ్డీకి హామీ ఇచ్చి ఉండగా... ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ పెంచడం వల్ల రిజర్వ్ బ్యాంకుకు వెళ్లే డిపాజిట్లపై బ్యాంకులకు వాటిపై వచ్చే వడ్డీ ఏమీ ఉండదు’’ అని క్రిసిల్ తన నివేదికలో వివరించింది. నోట్ల రద్దు నిర్ణయంతో వృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలు డిసెంబర్ 7న జరగనున్న మానిటరీ పాలసీ సమీక్షలో రెపో రేటుపై నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయని క్రిసిల్ తెలిపింది. -
వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!
ముంబై : బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి ఆర్బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది. -
బ్రెగ్జిట్తో వృద్ధికి ఢోకా ఉండదు: క్రిసిల్
♦ 7.9% అంచనాలు కొనసాగింపు ♦ ఐటీ సహా పలు రంగాలపై ఒత్తిళ్లు ముంబై: బ్రెగ్జిట్ వల్ల కొన్ని రంగాలపై ప్రభావం ఉంటుందని, అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిపై చెప్పుకోతగ్గ ప్రభావం ఏమీ ఉండదని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధికి వ్యవసాయం చోదకంగా నిలుస్తుందని, వృద్ధి సాధించడంలో జూలై, ఆగస్టులో కురిసే వర్షాలు కీలకమని పేర్కొంది. డిమాండ్ తగ్గుదల, కమోడిటీల ధరల్లో ఒడిదుడుకులతో భారతీయ కంపెనీలపై ప్రభావం ఉంటుందని క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఆటో, టెక్స్టైల్స్, ఫార్మా, లెదర్, మెటల్స్ రంగాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేసింది. యూకే, యూరోప్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై కూడా ప్రభావం ఉంటుందని, హెడ్జింగ్ లేని విదేశీ రుణాల రూపంలో బ్యాలన్స్ షీట్లపై ఒత్తిడి పడుతుందని పేర్కొంది. ఐటీ రంగం... రూపాయి: దేశ ఎగుమతుల్లో అధిక భాగం ఐటీ రంగం నుంచే ఉంటున్నాయి. భారతీయ మొత్తం ఐటీ ఎగుమతుల్లో 17% బ్రిటన్కే వెళుతున్నాయి. యూరప్ వాటా 29%. బ్రెగ్జిట్ వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీలపై ఒకేసారి పలు కష్టాలు వచ్చి పడ్డాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అధిక కేటాయింపులు చేయడంతోపాటు... యూకే నుంచి యూరోప్కు ఉద్యోగుల తరలింపు కారణంగా పరిపాలనా ఖర్చులు పెరిగిపోతాయి. రూపాయిపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. 2017 మార్చి నాటికి డాలర్తో పోలిస్తే 66.50 స్థాయిలో ఉంటుంది. భారత్ నుంచి బ్రిటన్కు సరుకుల ఎగుమతులు కేవలం 3 శాతంగానే ఉండడంతో ఎగుమతులపై భారీగా ప్రభావం ఉండదని అంచనా వేసింది. పోటీ కరెన్సీల గమనం భారత్కు కీలకమని పేర్కొంది. అయితే, మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గుతాయి. -
2016-17లో వృద్ధి 7.9 శాతం: క్రిసిల్ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016-17లో 7.9 శాతం నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకీర్తి జోషి శుక్రవారం పేర్కొన్నారు. అయితే ఇందుకు సాధారణ వర్షపాతం, ఇప్పటి వరకూ ప్రకటించిన సంస్కరణల అమలు కీలకమని పేర్కొన్నారు. ఇదే జరిగితే బ్యాంకింగ్లో మొండిబకాయిల సమస్య ఎలావున్నా... 7.9 శాతం వృద్ధి ఖాయమన్నది క్రిసిల్ అంచనా అని తెలిపారు. క్రిసిల్ తాజా అంచనాలు ప్రభుత్వం అంచనాల శ్రేణి 7- 7.75 శాతం కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. క్రిసిల్ అంచనాల ప్రకారం.. ♦ కమోడిటీల ధరలు మరికొంత కాలం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగే వీలుంది. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం. ♦ ప్రైవేటు పెట్టుబడులు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జోరందుకోవచ్చు. ♦ 2016-17 బడ్జెట్ ప్రగతికి తోడ్పడుతుంది. ♦ మొండిబకాయిల సమస్య తీవ్రమైనదే. స్థూల ఎన్పీఏలుసహా బలహీన రుణ పరిమాణం మొత్తం 8.9%కి (దాదాపు రూ. 8 లక్షల కోట్ల) పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాదీ ఈ ఒత్తిడులు కొనసాగుతాయి. -
సాగుపై క్రీనీడలు
ఈసారి కూడా రుతు పవనాలు మొహం చాటేస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రారంభంలో చెప్పిన జోస్యం నిజమైనట్టే కనిపిస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో రుతుపవనాలు వైదొలగడం మొదలెడతాయని, రాజస్థాన్లోని పశ్చిమ ప్రాంతంలో అందుకు సంబంధించిన ఛాయలు కనబడుతు న్నాయని తాజాగా ఐఎండీ ప్రకటించింది. దేశ గ్రామీణ వ్యవస్థకు రుతు పవనాలు జీవనాడుల వంటివి. మన వర్షపాతంలో 70 శాతం రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. మనకున్న దాదాపు 16 కోట్ల హెక్టార్ల సాగుభూమిలో 65 శాతం వ్యవసా యాధారితం గనుక రుతు పవనాలు సక్రమంగా లేకపోతే ఆహారోత్పత్తులపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో వర్షపాతం లోటు జూలైలో 17 శాతం, ఆగస్టులో 23 శాతంగా ఉన్నదని ఐఎండీ లెక్కేయడం ఆందోళన కలిగిస్తుంది. ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తిలో మూడో వంతు భాగాన్ని అందించే మహా రాష్ట్ర, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఈసారి రుతుపవనాలు ప్రధానంగా దెబ్బతీశాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషిస్తున్నది. ఆ విశ్లేషణ మరో ఆసక్తికర విషయాన్ని చెప్పింది. దేశ వ్యవసాయోత్పత్తుల్లో 90 శాతాన్ని అందించే 14 రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతాన్ని నమోదు చేశాయంటున్నది. మిగిలినవన్నీ సాధారణం...అంతకంటే తక్కువ వర్షపాతాన్ని పొందాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ సాధారణంకంటే 13.7 శాతం తక్కువ వర్షపాతాన్ని నమోదు చేయగా పొరుగునున్న తమిళనాడులో ఇది -9.5 శాతంగా ఉన్నది. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లు మాత్రమే అధిక వర్షపాతాన్ని పొందాయి. కేరళ, పంజాబ్లలో వర్షపాతం లోటు అధికంగానే ఉన్నా అక్కడున్న నీటిపారుదల సౌకర్యాలు దాన్ని భర్తీ చేస్తాయి. నిరుడు ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులవల్ల వ్యవసాయోత్పత్తులు 5 శాతం మేర తగ్గాయని గుర్తుంచు కుంటే ఈసారి ఎలా ఉంటుందో సులభంగానే అంచనా వేయొచ్చు. వర్షాలపై పెద్దగా ఆశ పెట్టుకోవద్దని ఐఎండీ చెప్పినప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ మాట అన్నారు. ఈ వర్షాల లేమి ఆహారోత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని...దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని ఆయన అంచనా వేశారు. లోటు ఉండొచ్చునని ఐఎండీ చెప్పిన వాయువ్య ప్రాంతంలోని పంజాబ్, హర్యానాల్లో నీటి పారుదల సౌకర్యాలు చాలినంతగా ఉండటమే ఆయన ఆశాభావానికి కారణం. జైట్లీ జోస్యం నిజం కావాలని చాలామంది అనుకుంటున్నా ప్రస్తుత వర్షాభావ స్థితే ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని అంటున్నారు. మొత్తానికి ఎల్నినో ప్రభావం గట్టిగానే ఉన్నదని, వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉండ వచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయంగా తిండిగింజల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి గనుక ఎల్నినో వల్ల వచ్చే ముప్పేమీ లేదని ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇంతమాత్రాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసాతో ఉండటానికి వీల్లేదు. దేశంలో 56 శాతం జనాభాకు ఇప్పటికీ వ్యవసాయమే ఆధారం. బ్యాంకు లు పెట్టే నిబంధనల కారణంగా అధిక శాతం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులనే ఆశ్రయిస్తారు గనుక పంటలు దెబ్బతింటే అలాంటివారంతా మరింతగా అప్పుల్లో కూరుకుపోతారు. అటు రైతుకూలీలు కూడా ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడతా రు. కనుక గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకు సంబంధించిన జాడలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేసే హిందూస్థాన్ లీవర్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గిందని మొన్న జూలైలోనే ప్రకటించింది. నిరుడు వర్షాలు సరిగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా 12,360మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో తెలిపింది. ఈ ఏడాది ఇంతవరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతుల బలవన్మరణాలు గణనీయంగా ఉన్నాయి. పంటల బీమా పథ కం అమలవుతున్నా అందుకు సంబంధించిన పరిజ్ఞానం రైతుల్లో తగినంతగా లేక పోవడం...ఉన్నా ప్రీమియం కట్టలేకపోవడం వంటివి ఆచరణలో ఆ పథకాన్ని వెక్కిరిస్తున్నాయి. పంటల బీమా పథకంలో చేరని రైతుల్లో 46 శాతంమంది దానిపై ఆసక్తి లేదని చెప్పారని అసోచామ్ సర్వే వెల్లడించింది. ప్రభుత్వాల ఉదాసీనత వల్ల వ్యవసాయ సంక్షోభం అంతకంతకు పెరుగు తోంది. గత పదిహేనేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మూడు లక్షలమందికి పైగా రైతులు మరణిస్తే...దాదాపు 20 లక్షలమంది రైతులు సాగునుంచి తప్పుకున్నారు. యూపీఏ సర్కారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనానికి నియమించిన స్వామి నాథన్ కమిషన్ ఎన్నో విలువైన సూచనలు చేసింది. తాము అధికారంలోకొస్తే ఆ సిఫార్సులను అమలు చేస్తామని ఘనంగా ప్రకటించిన బీజేపీ ఇంతవరకూ వాటి జోలికెళ్లలేదు.ముఖ్యంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలన్న కమిషన్ సూచనను అమ లు చేస్తామన్నవారు ఇప్పుడు అలా ఇవ్వడం అసాధ్యమని సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పేదేముంది? తాజాగా క్రిసిల్ గణాంకాలు చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయోత్పత్తులకు మెరుగైన మద్దతు ధరలు ప్రకటించడంతోపాటు తక్షణం ఉపాధి హామీ పథకం వంటివాటిపై దృష్టి పెట్టాలి. ఆహార ధాన్యాల సేకరణపై విధించిన పరిమితులను పూర్తిగా ఎత్తివేయాలి. రైతులను ప్రైవేటు మార్కెట్ శక్తుల బారిన పడేస్తే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుందని గుర్తించాలి. ఈ కష్టకాలంలో రైతులకూ, రైతుకూలీలకూ అండగా నిలవడం అవసరమని తెలుసుకోవాలి. -
ప్రస్తుత బ్యాంకులకు పేమెంటు బ్యాంకులు పోటీరావు: క్రిసిల్
ముంబై : ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులకు త్వరలో రానున్న పేమెంట్ బ్యాంకులు(పీబీ) పోటీ కాబోవని శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా బలపడని తూర్పు, ఈశాన్య, మధ్య ప్రాంతాలపై పేమెంట్ బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపింది. రానున్న పేమెంట్ బ్యాంకుల గురించి ప్రస్తుత బ్యాంకులు ఎటువంటి ఆందోళనా చెందనక్కర్లేదని క్రిసిల్ చీఫ్ విశ్లేషకులు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు. పైగా పీబీలతో ప్రస్తుత బ్యాంకులు అవగాహన కుదుర్చుకుని, అన్బ్యాంకింగ్ ప్రాంతాల్లో ‘వ్యయ భారాలు లేని’ సేవల విస్తరణ దిశగా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 11 పేమెంట్ బ్యాంకులకు రెండు రోజుల క్రితం ఆర్బీఐ లెసైన్సులివ్వడం తెలిసిందే. -
బ్యాంకుల దశ మార్చే ఇంద్రధనుష్
- వృద్ధి, పనితీరు మెరుగుపడతాయ్ - రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడి ముంబై: ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ బ్యాంకుల దశను పూర్తిగా మార్చివేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య తీరుతుందని, గతంలో అంచనా వేసినదానికంటే మెరుగైన వృద్ధిని బ్యాంకులు సాధిస్తాయని వివరించింది. బ్యాంకులకు నిధులందించే ప్రభుత్వ ప్రణాళిక, క్యాపిటల్ బఫర్ నిర్వహించాలన్న నిర్ణయం వంటి కారణాల వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్లు సమీప భవిష్యత్తులో అత్యున్నత భద్రత కేటగిరిలో ఉంటాయని పేర్కొంది. ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,088 కోట్ల నిధులందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. బ్యాంక్ బ్యూరో ఏర్పాటుకు గడవును స్పష్టంగా నిర్దేశించడం, నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ప్రొఫెషనల్స్ను తీసుకోనుండడం వంటి నిర్ణయాలు బ్యాంకుల పనితీరులో గణనీయమైన మార్పును తీసుకువస్తాయని క్రిసిల్ పేర్కొంది. బోనస్, స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం వల్ల బ్యాంకులు ప్రతిభ గల ఉద్యోగులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడింది. -
వచ్చే ఐదేళ్లలో 6.5 శాతం వృద్ధి: క్రిసిల్
ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో సగటున 6.5 శాతంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే వీలుందన్నది స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ)కు చెందిన ఈ రేటింగ్ సంస్థ అంచనా. ఈ పరిణామం 2015-2019 ఆర్థిక సంవత్సరాల మధ్య వృద్ధి సగటున 6.5 శాతంగా నమోదుకావడానికి దోహదపడుతుందన్నది తన అంచనా అని ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాత్మక తీర్పు వెలువడుతుందని, ఇది దేశాభివృద్ధిలో కీలకం కానుందని వివరించింది. కాగా విధాన నిర్ణయాల్లో క్రియాశీలత లోపించడం, అమెరికా, యూరోజోన్లలో రికవరీ వేగం ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం, రెండుమూడేళ్లలో బలహీన రుతుపవనాల పరిస్థితులు వంటి అంశాలు వృద్ధి 5% దిగువనే కొనసాగడానికి దారితీసే అంశాలని క్రిసిల్ నివేదిక పేర్కొంది. -
కంపెనీల ఆదాయంలో 11-12% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు స్థిరంగా 7-9% ఉంటాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. కాని గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఆదాయాల క్షీణత ఆగి స్వల్ప వృద్ధి కనిపిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న అంచనాతో ఆదాయం, నిర్వహణ లాభాల్లో క్షీణత ఆగి, వృద్ధి నమోదవుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ తెలిపారు. దీనికితోడు గత 12-18 నెలల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అం తర్జాతీయంగా జీడీపీ, ఎగుమతుల్లో వృద్ధి కనపడటంతో ఈ ఏడాది ఆదాయాలు 12% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కీలకమైన లోహాలు, ఇంధన, బొగ్గు ధరలు తగ్గడంతో కంపెనీల ఎబిట్టా మార్జిన్లు 1% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ, ఫార్మా, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ రంగాల ఆదాయాలు బాగా పెరగనున్నాయి. అలాగే గత 3 త్రైమాసికాల నుంచి వృద్ధి బాటలోకి వచ్చిన టెలికం, రిటైల్, మీడియా రంగాలు ఇదే విధమైన ధోరణిని కొనసాగిస్తాయని క్రిసిల్ పేర్కొంది. -
భవిష్యత్తు ఆశావహంగానే: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 4.8 శాతానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయితే, ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చనే ఆశావహధోరణి నేపథ్యంలో... వచ్చే ఏడాది మాత్రం ఆర్థిక వ్యవస్థకు సానులకూల ధోరణి కనబడుతోందని పేర్కొంది. ‘2014-15లో వృద్ధి రేటు 6%గా ఉంటుందని భావిస్తున్నాం. వర్షాలు బాగా కురవడంతో వృద్ధికి చేదోడుగా నిలవడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో దోహదపడనుంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ వృద్ధి పెరుగుదలకు తోడ్పడే అంశాలు. అయితే, ఇవన్నీ గనుక ప్రభావం చూపకపోతే 5% దిగవకు కూడా పడిపోవచ్చు’ అని క్రిసిల్ తన నివేదిక(భారత్ ఆర్థిక అంచనాలు)లో వెల్లడించింది. నివేదికలో ముఖ్యాంశాలివీ... 2014-15లో కొత్త నాయకత్వం, పాత సవాళ్లు అనే ధోరణి ఉంటుంది. ఎన్నికల ఫలితాలనుబట్టి మధ్యకాలికంగా చూస్తే వృద్ధి పెరుగుదల, తగ్గుదల రెండింటికీ అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ అనిశ్చితి ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఫలితాలు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి అనుకూలంగా వస్తే.. సంస్కరణలు మరింత ముందుకెళ్లడంతోపాటు విధానపరమైన అడ్డంకులూ తొలగుతాయి. హంగ్ గనుక ఖాయమైతే సంస్కరణలు కుంటుబడతాయి. దీంతో పెట్టుబడులకు సెంటిమెంట్ దెబ్బతినడమే కాకుండా వృద్ధి కూడా గాడితప్పుతుంది. -
ఆదాయాలు పుంజుకుంటాయ్: క్రిసిల్
ముంబై: ప్రభుత్వ ఆదాయ వృద్ధి మూడవ క్వార్టర్(అక్టోబర్-డిసెంబర్)లోనూ బాగుంటుం దని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. వరుసగా 9 త్రైమాసికాలు అసలు వృద్ధిలేకపోగా క్షీణతను నమోదుచేసుకున్న ఆదాయాలు, సెప్టెంబర్ క్వార్టర్లో తిరిగి ‘యూ’ టర్న్ తీసుకున్నాయి. రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందిన ఎగుమతి ఆధారిత రంగాలు దీనికి కారణం. అయితే డిసెంబర్ క్వార్టర్ నుంచీ మరిన్ని రంగాల్లో పురోగతి ధోరణి కనబడుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్(రీసెర్చ్) ముకేశ్ అగర్వాల్ తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, జౌళి వంటి ఎగుమతి ఆధారిత సంస్థల నుంచే కాకుండా, దేశీయ వినియోగ ఆధారిత రంగాల నుంచి తగిన పురోగతి కనిపిస్తోందన్నారు. మంచి వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం డిమాండ్ వృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. -
టెల్కోల రాబడులు రెట్టింపు!
న్యూఢిల్లీ: టెలికం(టెల్కో) కంపెనీల నిర్వహణ లాభాల వృద్ధి రేటు రెండేళ్లలో రెట్టింపవుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కాల్ రేట్లు పెరగడం, టెలికాం విధానాల్లో స్పష్టత రావడం, తదితరాలు దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., పెద్ద టెలికం కంపెనీల నిర్వహణ లాభాలు రెండేళ్లలో 20 శాతం పెరుగుతాయి. గత ఐదేళ్లలో ఈ కంపెనీల నిర్వహణ లాభాలు 10 % చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. దీంతో పోల్చితే రెండేళ్లలో నిర్వహణ లాభాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవలే కొన్ని టెలికం కంపెనీలు కాల్ రేట్లను పెంచాయి. దీనికితోడు టెలికం విధానాల్లో స్పష్టత రావడం వృద్ధికి తోడ్పడనున్నది. టెలికం కంపెనీలకు నిమిషానికి సగటున వచ్చే ఆదాయానికి (ఏఆర్పీఎం), ప్రధాన టారిఫ్ల మధ్య తేడా 50 శాతంగా ఉంది. టెల్కోలు వినియోగదారులకు భారీస్థాయిలో డిస్కౌంట్ కాల్ రేట్లను ఆఫర్ చేస్తుండడమే దీనికి కారణం. పోటీ తీవ్రత తగ్గుతుండడంతో కంపెనీలు డిస్కౌంట్ కాల్ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. టారిఫ్లు నిర్ణయించే అధికారం మరో 2-3 ఏళ్లు టెలికం కంపెనీల చేతుల్లోనే ఉండబోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల ఆదాయాల్లో 16 శాతంగా ఉన్న డేటా, వాల్యూ యాడెడ్ సర్వీసుల ఆదాయం మధ్య కాలానికి 20 శాతానికి చేరనున్నది. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండడం, ధరలు తగ్గుతుండటంతో 3జీ సేవల విస్తరణ, డిమాండ్ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల కూడా ఆదాయం మరింత పెరగనుంది. స్పెక్ట్రమ్ లభ్యత, స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన రిజర్వ్ ధర నిర్ణయం తదితర అంశాలు సానుకూలంగా పరిష్కారమవుతున్నాయి. -
5.2 శాతానికి ద్రవ్యలోటు: క్రిసిల్
ముంబై: ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం(ద్రవ్యలోటు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.2 శాతానికి చేరే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం పేర్కొంది. ద్రవ్యలోటును తగ్గించడానికి భారీ ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్ను చెల్లించాలన్న ప్రతిపాదన సరైనదేనని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇది ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా వినియోగపడుతుందని వివరించింది. ప్రభుత్వం ద్రవ్యలోటును 4.8% వద్ద కట్టడి చేయాలని భావిస్తున్నప్పటికీ రెవెన్యూ వృద్ధిలో మందగమనం వల్ల ఈ లోటు 5.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ ఇప్పటికే అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) రూ.4.57 లక్షల కోట్లకు చేరినట్లు (బడ్జెట్ లక్ష్యంలో 84%) ఇటీవలి గణాంకాలు వెల్లడించాయి. 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును రూ.5.42 లక్షల కోట్ల వద్ద (4.8%) కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2012-13లో ద్రవ్యలోటు 4.9%గా నమోదయ్యింది. -
ప్రైమరీ మార్కెట్కు ఊతం
ముంబై: ప్రైమరీ మార్కెట్లకు ఊతమిచ్చే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐపీవోలకు గ్రేడిం గ్ తప్పనిసరన్న నిబంధనను సడలించాలని యోచి స్తోంది. మరో వారం, పది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు. సెబీ ఆమోదం లభించినా ఇప్పటికీ సుమారు రూ. 72,000 కోట్ల విలువ చేసే ఐపీవో ప్రతిపాదనలు మార్కెట్లోకి రాలేదని అంచనా. ఈ నెల 24న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కార్పొరేట్ బాండ్లకు సంబంధించి షెల్ఫ్-ప్రాస్పెక్టస్ జారీ చేయగలిగే అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని కంపెనీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింప చేసే యోచన కూడా ఉన్నట్లు సిన్హా వివరించారు. ఒకే ప్రాస్పెక్టస్ని ఉపయోగించి బాండ్ ఇష్యూ పరిమాణాన్ని విడతల వారీగా సమీకరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాగా, లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించడంపైనా దృష్టి పెట్టినట్లు సిన్హా తెలిపారు.