Education policies
-
ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానాలు
సంబేపల్లె: ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తోన్న విద్యా విధానాలు ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ)కి దగ్గరగా ఉన్నాయని ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి రానున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు వెండిగీన్ (అమెరికా) ఎరిక్ బాబర్ (ఇంగ్లండ్) సందర్శించారు. వీరు నాడు–నేడు ద్వారా సమకూరిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలవుతోన్న విద్యా విధానం, విద్యార్థుల అభ్యసన విధానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎలా దోహదపడుతున్నాయనేది పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్లను చూసి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు. బైజూస్ ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా తాము ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నామో విద్యార్థులు వీరికి వివరించారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాఠశాలలోని జగనన్న గోరుముద్దను తిన్నారు. పాఠశాలలో డిజిటల్ విద్య, ద్విభాష పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, యూనిఫామ్, భౌతిక, జీవనశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు. ఎస్సీఈఆర్టీ అధ్యాపకుడు గిరిబాబు యాదవ్ మాట్లాడుతూ 2035కి పదోతరగతికి, 2037కి 12వ తరగతికి ఐబీ సిలబస్ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీలోని పలు పాఠశాలలను సందర్శిస్తున్నారని చెప్పారు. -
పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ లాభమేనా?
నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వం నుంచి హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా కానీ, నేను వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా? – అమిత్ సోలంకి ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా హెల్త్ స్కీమ్ల కింద కవరేజీ ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) కింద రక్షణ లభిస్తుంది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది. అలాగే, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున హెల్త్ కవరేజీ ఉద్యోగులకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్, వెస్ట్ బెంగాల్ హెల్త్ స్కీమ్ ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వ, ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో వైద్య కిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు వీటి పరిధిలో కవరేజీ వస్తుంది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగ చికిత్సలకూ వీరు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. అత్యవసర చికిత్స/వైద్యం, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు పరిహారం వస్తుంది. కాకపోతే అన్ని రకాల ఆస్పత్రుల్లో చికిత్సలు పొందే వెసులుబాటు ఉండదు. ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితంగా ఉంటుంది. పైగా ప్రభుత్వ ఆమోదిత ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. ప్రధాన పట్టణాల్లోనే ఇవి ఉంటాయి. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉంటుందో ముందు తెలుసుకోండి. అక్కడ ఉండే వసతులు ఏ మేరకో విచారించుకోవాలి. ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన వసతులతో అందుబాటులో లేకపోయినా, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం పొందాలనుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ప్రైవేటు బీమా సంస్థ నుం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో పే షరతును ఆమోదించాల్సి రావచ్చు. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ కవరేజీ ప్లాన్ను తీసుకోవాలి. పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్ అనుకూలం. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉంటే, వీలైనంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికి మూడేళ్ల ముందే సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. ఇలా చేస్తే మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే కారణం. -
పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– కిరణ్ అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – విజయశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ఈక్విటీల్లోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్ ఏపీ..!
ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్సైట్లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది. మన రాష్ట్ర విధాన్ని తన సైట్లో ప్రచురించిన యుఎన్ ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం. దేశచరిత్రలో తోలి సారిగా.. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్ ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు నాడు-నేడు స్లాల్ను సందర్శించిన లచ్చెజర స్టోవ్ జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం. ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’ -
సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు
-
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. ►దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. ►దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్బుక్స్ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్బుక్స్ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటుచేసింది. ►మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. ►3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు. ►జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్ను విద్యార్థులకు అందించింది. ►దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. ►తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్పీలు, స్మార్ట్టీవీల ఏర్పాటు చేయనుంది. ►దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. ►విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ►పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. ► పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియాకు చెందిన షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? -
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులను చూస్తే కార్పోరేట్ స్కూళ్లు సిగ్గు పడాల్సిందే
మదనపల్లె సిటీ: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్మికుడి ఇంట.. చదువుల తల్లి మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్వలి మెకానిక్. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది. పదో తరగతి స్థానిక హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్ బాలికల జూనియర్ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్లో 968 మార్కులు వచ్చాయి. రైతు బిడ్డ ..చదువులో దిట్ట రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాసైంది. ఇంటర్ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ విద్యలో రాణించింది. వాచ్మెన్ కూతురు..ఇంటర్లో టాపర్ తండ్రి వాచ్మెన్. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్. మదనపల్లె ఎస్టేట్కు చెందిన దిగంబర్దాల్ ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది. దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్కుమార్ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్ తో మృతి చెందాడు. ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. –ప్రీతిలతాదాల్ ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్,నీట్ ఎంట్రన్స్లకు ప్రిపేర్ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. –కవిత రాజుపాళెం : మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్నవుతా నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్ లైన్మెన్గా, తల్లి అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్కు కోచింగ్ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది. వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్నవుతానని తెలిపింది. బి.ఫార్మసీ చేయాలని ఉంది ఎంసెట్, నీట్ ఎంట్రన్స్ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా. –మెహర్, మదనపల్లె ఐఏఎస్ చదవాలన్నదే ఆశయం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి ఐఏఎస్ కావాలన్నదే తన ఆశయమని అశోక్కుమార్ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. -
విద్యావిధానం అమలులో ఏపీ భేష్
స్విట్జర్లాండ్లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు. మంచి ప్రాథమిక విద్య, శిక్షణ, స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కంప్యూటర్ ట్యాబ్లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. యూఎన్ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు. -
నెలవారీ సమీక్షలతో ‘తొలిమెట్టు’
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల మెరుగుకు ఉద్దేశించి చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లావిద్యాశాఖ అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. పురోగతిని ప్రతినెలా సాంకేతికంగా నమోదు చేస్తున్నప్పటీకీ, బోధన ప్రక్రియల్లో వినూత్న మెలకువలు అమలు చేస్తున్నా ఇంకా చాలాపాఠశాలల్లో విద్యార్థులు వెనుకబడే ఉన్నారని తెలిపారు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులు నిమిషానికి 30 నుంచి 50 పదాలు కూడా ధారాళంగా చదవలేకపోవడాన్ని అధికారులు డీఈవోల దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు పథకం అమలు తీరుపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన శుక్రవారం డీఈవోలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు సంబంధించి సబ్జెక్టులవారీగా విశ్లేషించి, కొన్ని సూచనలు చేశారు. తెలుగులో... రెండు తరగతుల వరకూ బోధించిన అక్షరా లు, గుణింతాలు ఒత్తులపై స్పష్టత ఇవ్వాలి. గేయాల్లో బట్టీ విధానం కాకుండా, అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. ధ్వని ఆధారంగా పదాలు చెప్పేలా చూడాలి. గుం డ్రంగా అక్షరాలు రాసేలా చూడాలి. 3–5 తరగతుల్లో బోధించేపాఠాల్లో అక్షరాల ఆధా రంగా పదాలు తయారు చేసేలా చూడాలి. ఒకటి, రెండు తరగతుల్లో రాయడం, 3–5 తరగతుల్లో చేతిరాత అందంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రమాణాలవారీగా బోధన విధానాలు అమలు చేయాలి. ఇంగ్లిష్లో... స్పష్టంగా పదాలు పలికేలా చూడాలి. పదాలకు అనుగుణంగా చిత్రాలు గుర్తించడం, చదివించడం, రాయించడం చేయాలి. ప్రతిరోజూ నిర్ధారించిన బోధనాభ్యసన ప్రక్రియలను ధ్వనులు, గుర్తించడం, రాయించడం ద్వారానే చేపట్టాలి. గణితంలో... ఏ యూనిట్ బోధించినా వాటిలోని గణిత భావనలపట్ల సామగ్రిని ఉపయోగించి అవగాహన కల్పించాలి. చిత్రాలు వాడటం వల్ల తేలికగా అర్థమవుతుంది. సంఖ్యలు నేర్చించడానికి వాచకంలో సరైన విధానాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని ఉపయోగించాలి. 3–5 తరగతుల్లో బోధన చేసేప్పుడు పూర్వ భావనలను అవగాహన కల్పించి, అభ్యాసం చేయించడానికి ప్రయత్నించాలి. ఇక చేయాల్సింది ఇదీ.. తొలిమెట్టు బోధన విధానాలపై ఇచ్చిన సూచనలను ప్రతీ టీచర్కు చేరవేసేందుకు డీఈవోలే చొరవ తీసుకోవాలని, దీనికోసం కాంప్లెక్సు సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు డీఈవోలకు సూచించారు. తొలిమెట్టులో విజయం సాధించిన పాఠశాలలను గుర్తించి వారి అనుభవాలను ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు. తొలిమెట్టులో క్రియాశీలపాత్ర పోషించేవారిలో మండలానికి ఒకరి చొప్పున టీచర్ను గుర్తించాలని సూచించారు. వారి పురోగతి వివరాలను ఫొటోతోసహా ఈ నెలాఖరుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. టీచర్లందరికీ సబ్జెక్టులవారీగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఇక నుంచి రాష్ట్రస్థాయిలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సాహం ఇస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. -
Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి యువతను రక్షించాలి
తుమకూరు: విద్వేష రాజకీయాల నుంచి దేశ యువతను రక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను వారికి కల్పించి మంచి భవిష్యత్తును చూపాలన్నారు. యువతను విద్వేషాల మంటల్లోకి నెట్టేవేయడం దేశ భవితను నాశనం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ఆదివారం తుమకూరు జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు పెరుగుతున్న నిరుద్యోగం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. శాంతి, సోదరభావ సందేశాన్ని వ్యాపింపజేసి, దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో పాల్గొనాలని ఆయన వారిని కోరారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ విద్వేష రాజకీయాల కోసం వారిని నిరుద్యోగులుగానే ఉంచుతూ తప్పుదోవపట్టిస్తున్నాయి. యువత మన దేశ భవిష్యత్తు. ఉపాధి చూపితే వారు తమ, కుటుంబ, దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. మనదేశాన్ని మునుపటి మాదిరిగా అందమైన దేశంగా తయారు చేసుకుందాం’అని రాహుల్ పేర్కొన్నారు. చిక్కనాయకనహళ్లిలో చిన్నారులతో కలిసి కారులో కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి కారులో రాహుల్ సరదా -
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్భవన్లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
పట్టా పట్టు.. కొలువు కొట్టు
చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్లో అమల్లో ఉన్న ఇంటర్న్షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్ పూర్తి చేసింది. నెల్లూరు (టౌన్): ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్లో ఇంటర్న్షిప్ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్షిప్ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది. 10 నెలల ఇంటర్న్షిప్ తప్పని సరి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్షిప్ తప్పని సరి చేశారు. అకడమిక్ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్షిప్ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. 8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్–3, ప్రైవేట్– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్షిప్ కోసం విద్యార్థులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్కు పోర్టల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్షిప్ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్గా కలెక్టర్, మెంబర్గా వర్సిటీ వైస్ చాన్సలర్, మెంబర్ సెక్రటరీగా జాయింట్ కలెక్టర్, అడిషనల్ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్మర్, సీమెన్స్గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్సీఎస్ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, బీఎం ఆర్ గ్రూపు జీఎంలు ఉన్నారు. ఇంటర్న్షిప్కు అవకాశం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనున్నాం. – సుందరవల్లి, వైస్ చాన్సలర్, వీఎస్యూ -
‘ఫెస్టో ఎక్స్పోటైనర్’ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సజ్జల
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండి యురో సింక్రనైజెషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫెస్టో ఎక్స్పోటైనర్’ వాహనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్ రెడ్డి, ఎస్డీ అండ్ టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సత్యనారాయణ, ఎండీ APSSDC, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసి రాజశేఖర్ పాల్గొన్నారు. ఫెస్టో ఎక్స్పోటైనర్ వాహనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ‘నూతన జాతీయ విద్యా విధానం వస్తుందంటున్నారు. కానీ దాని కన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. చదువుపైన ఆసక్తి ఉన్న వారికి, చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించింది. విద్యావ్యవస్థలో ఈ దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తీసుకువచ్చాము. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలకు సంబంధించిన ఫలితాలు అందుతున్నాయి. నైపుణ్యం సాధించడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వల్ల ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఫెస్టో ఎక్స్పోటైనర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల -
నిర్బంధ విద్యపై నిఘా
మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా కళాశాలలు, కోచింగ్ సెంటర్లు నిర్బంధ విద్యకు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ (డీఎంఎస్సీ)కి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా సమావేశాలు పెట్టి ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్ల లోపాలపై చర్యలకు సిఫారసు చేస్తే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. నెల్లూరు (టౌన్): బలవంతపు చదువులకు స్వస్తి చెబుతూ ప్రశాంత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీలతో శ్రీకారం చుట్టింది. ఇంటర్ నుంచే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్›డ్, నీట్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై బలవంతపు చదువులను రద్దుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అనువైన పరిస్థితులను ఆయా కళాశాలల్లో కల్పించాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 204 జూనియర్ కళాశాలలు ఉంటే.. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యం 65, ప్రైవేట్ 139 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 57,647 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 28,510, ద్వితీయ సంవత్సరం 29,137 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20కు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించారు. పరీక్షల్లో ర్యాంకుల కోసం ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరిని చదివిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. డీఎంఎస్సీ కమిటీ ఏర్పాటు జిల్లాలో జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కలెక్టర్ చక్రధర్బాబు వ్యవహరించనున్నారు. కమిటీ అధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కన్వీనర్గా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, సభ్యులుగా ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ రమేష్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, సీడీపీఓ అనూరాధ, ఫుడ్సేఫ్టీ అధికారి నీరజ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు జాషువా, మానసిక వైద్యులు డాక్టర్ క్రిష్టినా, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ రమ్య ఉంటారు. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. కమిటీ విధి, విధానాలు కమిటీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలో 2 జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకు వస్తున్నారనే కారణాలను గుర్తించాలి. కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవాలి. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఆత్మహత్యల నివారణకు మార్గనిర్దేశం ఇవ్వాలి. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలను గుర్తించాలి. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇంటర్ విద్యలో సంస్కరణలను సూచించాలి. కళాశాల సందర్శన, పరిశీలన వివరాలతో కూడిన నివేదికను తయారు చేసి ప్రతి నెలా కలెక్టర్కు అందజేయాలి. ప్రతి నెలా జేసీ అధ్యక్షతన కమిటీ సభ్యులు కలిసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. అక్కడ గుర్తించిన సమస్యలు, వివరాలను సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్లాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించే కళాశాలలను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తాం. ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా తరగతులు నిర్వహించాలి. – ఎ.శ్రీనివాసులు, డీవీఈఓ, కమిటీ కన్వీనర్ -
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
HYD: సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మంగళవారం సాయంత్రం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుకులాలను ఇంటర్ స్థాయికి ఉన్నతీకరించడంపై ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను.. ఉపాధి శిక్షణా కేంద్రాలుగా మార్చే అంశంపైనా చర్చ కోసం ఈ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందించడం, సంక్షేమ అంశాలపై చర్చ ప్రధానాంశాలుగా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భారతీయ విద్యార్ధులకు అమెరికా గుడ్ న్యూస్!
భారతీయ విద్యార్థులకు భారత్లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయం శుభవార్త చెప్పింది. చట్టబద్దంగా అమెరికాలో చదువుకునేందుకు అర్హులైన విద్యార్ధులు పొందే ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ స్లాట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించింది. అమెరికాలో చదువుకునేందుకు వేలాది మంది విద్యార్ధులకు యునైటెడ్ స్టేట్స్లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సెర్టిఫైడ్ స్కూల్(ఎస్ఈవీఐసీ)లో అడ్మిషన్ లభిస్తుంది. దీని తర్వాత సంబంధిత స్కూల్ నుంచి అర్హులైన విద్యార్ధులకు అధికారులు ఫారమ్ ఐ-20ని పంపుతారు. Student visa appointments are available on our website. If you have an I-20, don't wait! Future F, M, and J appointment openings at the Embassy and Consulates will be for interviews taking place after Aug 14, so if you need to arrive at school by mid-Aug, book an appointment now! — U.S. Embassy India (@USAndIndia) June 24, 2022 అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్ను అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్లో ఉన్న యూఎస్ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్ కోరిక మేరకు 2022 జూన్- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా..త్వరలో యూఎస్ ఎంబసీ, కాన్సలేట్ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్లు బుక్ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి," అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్లో పేర్కొంది. -
సెన్సేషన్ జరగాలి.. జరుగుతుంది: తెలంగాణ సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సంచలనం జరగబోతోందని, త్వరలోనే అంతా చూస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ‘‘దేశంలో సెన్సేషన్ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు’’ అని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లతో భేటీని ప్రస్తావిస్తూ.. ‘బిజినెస్మన్తో బిజినెస్ అంశాలే చర్చించినట్టుగా.. రాజకీయ నేతలతో రాజకీయ అంశాలే చర్చించాం’’ అని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో భాగంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన సీఎం కేసీఆర్.. శనివారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు కొనసాగిస్తున్న విధానాలపై సంఘటితంగా కొట్లాడాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ సందర్భంగా కేజ్రీవాల్, అఖిలేశ్లతో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. కేంద్రం అవలంబిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి పోరాటం అవసరమని.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కలిసి నడుద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. కేసీఆర్ నివాసానికి అఖిలేష్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్లతో కలిసి అఖిలేష్ భోజనం చేశారు. తర్వాత కేసీఆర్, అఖిలేష్ సుమారు రెండున్నర గంటల పాటు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఉమ్మడిగా ఎదుర్కొందాం! ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎస్పీ ఎదుర్కొన్న తీరు, రైతు సమస్యలపై ఆ పార్టీ చేసిన పోరు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీయే సర్కారును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, అఖిలేష్ చర్చించుకున్నట్టు సమాచారం. బీజేపీ మతపరమైన అంశాలను ముందుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతోందని, ఈ విభజన రాజకీయాలను ఎదురించకుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయడం, తద్వారా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రైతు అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణలో రైతులను ఆదుకునేలా, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని.. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం సహకరించకుండా ఇబ్బందిపెట్టిందని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. మద్దతు ధర, వ్యవసాయోత్పత్తుల సేకరణ విషయంలో జాతీయ విధానాన్ని తేవాల్సి ఉన్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడినట్టు సమాచారం. రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా విద్యుత్ మీటర్ల ఏర్పాటు, కార్పొరేషన్ రుణాలు దక్కకుండా షరతులు, గ్రామ పంచాయతీ నిధుల్లో జోక్యం వంటివాటితో కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ అంశాలన్నింటిపై భావ సారూప్య పార్టీలన్నీ ఉమ్మడిగా కొట్లాడితేనే దేశంలో గుణాత్మక మార్పు వస్తుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పినట్టు సమాచారం. వీటన్నింటిపైనా కేసీఆర్ వాదనతో అఖిలేష్ కూడా ఏకీభవించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అఖిలేష్తో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రివాల్తో కేసీఆర్ సమావేశమై చర్చించారు. అయితే పాఠశాలలు, మొహల్లా క్లీనిక్ల సందర్శన కార్యక్రమాలు ఉండటంతో.. ఆదివారం చండీగఢ్ పర్యటనలో మరింత లోతుగా చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్టు సమాచారం. సెన్సేషన్ జరుగుతుంది: కేసీఆర్ కేజ్రీవాల్తో కలిసి పాఠశాలను సందర్శించిన సందర్భంగా కేసీఆర్ను మీడియా పలకరించింది. అఖిలేష్తో భేటీలో ఏమేం చర్చించారని ప్రశ్నించగా.. ‘‘బిజినెస్మన్తో బిజినెస్ అంశాలే చర్చించినట్టుగా రాజకీయ నేతతో అవే అంశాలు చర్చించాం. దేశంలో సెన్సేషన్ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు..’’ అని కేసీఆర్ బదులిచ్చారు. ఇంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ అంశాలు మాట్లాడలేనని, వీటిపై మరోసారి మాట్లాడుతానని చెప్పారు. -
కూడు పెట్టే భాష కావాలి!
వచ్చే నెలలో స్కూళ్లు, పాఠాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక నుండి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు! దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతీ పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ పేరిట ఆకలి తీర్చని భాషల్లో చదువు నెందుకు నేర్చుకోవాలి? ఆత్మగౌరవమీయని భాషా సంస్కృతులు; వివక్ష, అసమానతలకు నిలయమైన పురుషాధిపత్య సంస్కృతిని మనదనే పేరిట తలకెత్తుకోవాలా అని మరికొందరు విమర్శిస్తున్నారు. లోకంలో అనేక భాషలున్నాయి. అవన్నీ కాలగతిలో రూపొం దుతూ, మార్పు చెందుతూ ప్రస్తుత రీతిలో వాడకంలో ఉన్నాయి. ఎవరి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇతర భాషల వారితో మాట్లాడడానికి ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి 1970 నుండి లక్షలాది ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. భాష విషయంలో ఏదో రీతిలో అడ్జస్టయి పోయారు. బట్టల మిల్లుల్లో పని చేయడానికి 150 ఏళ్ల క్రితం వలసపోయిన తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, భివండి వంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో; అహమ్మద్ నగర్ వంటి గుజరాత్ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కున్నారు. ఆయా ప్రాంత భాషలను మాట్లాడుతూ ఉండటమే కాదు, తమ భాషా రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు. లోకంలో ఇట్లా అవసరా లను అనుసరించి అడ్జస్టయిపోతున్నారు జనం. ప్రజలు ఇలా బతుకుతుంటే భాషావాదులు బయల్దేరి మాతృభాషలోనే పాఠాలు ఉండాలి అంటుంటే... మరోవైపు ఇంగ్లిష్లో చదివితే ఎక్కడికి పోయినా ఉపాధి రంగంలో అవకాశాలు పెరుగుతాయనీ, పరస్పర వ్యక్తీకరణలో సౌలభ్యం పెరుగుతుందనీ అంటున్నారు మరికొందరు. ఈ వాదం వల్లనే కొన్ని రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం పెరిగింది కూడా! ఒక రాష్ట్రంలో వివిధ భాషలు మాతృ భాషలుగా కలిగిన సమూహాలు అనేకం ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజలు మాట్లాడే ఒకటి రెండు భాషల్లోనే పాఠ్య పుస్తకాలు ముద్రించి చదువులు చెబుతున్నారు. ఇలా చేస్తే మరి మిగిలిన సమూహాలు మాతృభాషలో చదువుకుంటున్నట్లే భావించాలా? మాతృ భాషలో ఎందుకు చదువుకోవాలట? అని అడిగితే ‘సంస్కృతీ పరిరక్షణ కోసమ’ని అంటారు. భాష మారితే సంస్కృతీ మారి పోతే ... అదేమి సంస్కృతి? అది విశ్వజనీన సంస్కృతి కానట్టే గదా అంటారు ఇంగ్లిష్ చదువులు కావాలనేవారు. కానీ, లక్షలాది మంది ఇంగ్లిష్లో విద్యాభ్యాసం చేసినందువల్లే ఉద్యోగాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి. ఏ భాషనైనా బలవంతంగా రుద్దకూడదు. అవసరాలను బట్టి, భవిష్యత్ అవకాశాలను బట్టి ఎటువంటి భాషనైనా కష్టపడి నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్, సైన్సు, టెక్నాలజీ రంగాలలో అవకా శాలను అందిపుచ్చుకోవడానికీ, విదేశాలకు వెళ్లి మంచి ఉద్యో గాలు పొందడానికీ ఇంగ్లిష్ చదువులే ఉపయోగం అని స్పష్టమ వుతున్నది. ఈ వాస్తవాలను గుర్తించి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ఇంగ్లిష్ మీడియం చదువులకు పెద్దపీట వేయడం అభినందనీయం. చివరిగా... మొక్కిన వరమీయని వేల్పును, ఎంత చదివినా ఉపాధి దొరకని చదువును గ్రక్కున విడువంగ వలయు... ఏమంటే నేడు కూడా కోటి విద్యలు కూటి కొరకే! కూడు పెట్టని చదువులెందుకు? ముసుగులో గుద్దులాటలెందుకు? అంటున్న తరానికి పరిష్కారాలు అవసరం! వ్యాసకర్త: బి.ఎస్. రాములు సామాజిక తత్వవేత్త మొబైల్: 83319 66987 -
మార్పు ఎందుకు మహాశయా?
దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. అదీ కాకుంటే, అత్యవసరమైనా ఉండాలి. అవేవీ లేకుండా సాధారణ అంశాలలో అవసరం లేని మార్పులు చేసి, వాటిని అసాధారణ చర్చనీయాంశాలుగా మార్చడం ఇటీవల ప్రబలుతున్న పాలకుల, పాలనా సంస్థల వైఖరి. దానికి తాజా ఉదాహరణ – పట్టభద్రులయ్యాక వృత్తి బాధ్యతలు చేపట్టే ముందు వైద్యులు చేసే శపథాన్ని మార్చాలంటూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సూచన. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తిలోకి వచ్చేవారందరూ ఆనవాయితీగా చేసే హిప్పోక్రేట్స్ శపథాన్ని మన దేశంలో ఆయుర్వేద వైద్య శిఖామణి చరకుడు పేర్కొన్న మాటలతో మార్చాలన్న హఠాత్ సూచన వివాదాస్పదమైంది. ఇకపై కళాశాలల్లో తెల్లకోటు వేసుకొని వృత్తిలోకి వచ్చే వైద్య విద్యార్థులు సర్వసాధారణ ‘హిప్పోక్రేట్స్ ప్రమాణా’నికి బదులుగా ఎన్ఎంసీ వెబ్సైట్లోని ‘మహర్షి చరకుడి శపథం’ చేయాల్సి ఉంటుంది. దేశంలోని వైద్య కళాశాలలతో ఈ ఫిబ్రవరి 7 నాటి సమావేశంలో ఎన్ఎంసీ ఈ సంగతి చెప్పడంతో తేనెతుట్టె కదిలినట్టయింది. వైద్య విద్య, విధానాలను నియంత్రించడానికి దేశంలోని ‘భారతీయ వైద్య మండలి’ స్థానంలో రెండేళ్ళ క్రితం 2020లో ఎన్ఎంసీని పెట్టారు. పాలకుల ఆశీస్సులతో పుట్టుకొచ్చిన ఈ కొత్త నియంత్రణ వ్యవస్థ వారి భావధారను ప్రవచిస్తూ, ప్రచారంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ శపథంలో మార్పు కూడా భాగమని విమర్శలు వస్తున్నాయి. 3 లక్షలకు పైగా సభ్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మార్పును వ్యతిరేకించింది. ఇది వైద్యవిద్యను సైతం కాషాయీకరించే ప్రయత్నమని రాజకీయ వాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుతం ప్రపంచమంతటా వైద్యులు చేస్తున్న శపథానికీ ఓ చరిత్ర ఉంది. అది ప్రపంచ వైద్యచరిత్రలో ప్రముఖుడిగా భావించే క్రీస్తుపూర్వం 4 – 5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యశిఖామణి హిప్పోక్రేట్స్ తన వైద్యగ్రంథంలో పేర్కొన్న మాటలని భావన. అయితే, అది ఆయన వ్యక్తిగతంగా రాసినది కాకపోవచ్చనే వాదనా ఉంది. ఎవరిదైనప్పటికీ వైద్యంలో నైతిక విలువలపై ప్రాచీన భావవ్యక్తీకరణ అదేననీ, నేటికీ దానికి ప్రాధాన్యం ఉందనీ పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంటుంది. రోగి గోప్యతను కాపాడడం, చెడు చేయకపోవడం లాంటి విలువలను ప్రస్తావించే ప్రమాణం అది. ‘రోగి స్వస్థత కోసమే తప్ప, అతనికి నష్టం కలిగించడానికి వైద్యాన్ని వాడను. అడిగినా సరే ఎవరికీ విషమివ్వను. ఎవరి గడపతొక్కినా, అస్వస్థులకు సాయపడేందుకే ప్రయత్నిస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. ఏ రోగిని కలిసినా, ఆ వ్యక్తి గోప్యతకు భిన్నంగా వివరాలు బయటపెట్టను’ అని సాగుతుంది ఆ శపథం. నైతికత రీత్యా ఆ భావనలన్నీ ఎవరికైనా, ఎప్పటికైనా అనుసరణీయాలే. ఇంకా చెప్పాలంటే, ప్రతిపాదిత ‘చరక శపథం’లోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రాతిపదిక ‘చరక సంహిత’లో ఔషధ చికిత్స చరకుడు చెబితే, క్రీ.శ. 4వ శతాబ్దపు శుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని వివరించాడు. గ్రీకు విధానాల కన్నా మన ఆయుర్వేద పద్ధతులే మెరుగైనవనీ ఓ వాదన. ఆ తులనాత్మక చర్చలోకి వెళ్ళకుండా, చరక సంహితలో భావాలు చూస్తే – వాటికీ, హిప్పోక్రేట్స్ మాటలకూ సారంలో ఆట్టే తేడా లేదు. మంచి మాటలు పేర్కొన్నది హిప్పోక్రేట్స్ అయితేనేం? చరకుడు అయితేనేం? అది గ్రహించకుండా, అందులో ఏం తప్పుందని ఇప్పుడీ మార్పు చేస్తున్నట్టు? ఏ సంకేతాలివ్వడానికి చేస్తున్నట్టు? ప్రపంచమంతటా అక్షరమక్షరం ఒకేలా వైద్య శపథం లేకున్నా, స్ఫూర్తి మాత్రం రోగి గోప్యత, ఆరోగ్య పరిరక్షణే! అమెరికన్, బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్లకూ హిప్పోక్రేట్స్ మాటలే ప్రాతిపదిక. ప్రపంచ మెడికల్ అసోసియేషన్ సైతం 1949లో అంతర్జాతీయ వైద్య నైతిక సూత్రావళిని చేపట్టింది. కాలగతిలో మార్పులు చేసుకుంటూ, నిరుడు మే నెలలో వైద్య ప్రపంచంతో పాటు మొత్తం సమాజానికి ఆధునిక అంతర్జాతీయ సూత్రావళి ప్రతిపాదననూ ప్రచురించింది. మన దగ్గర వైద్యకళాశాలల్లో చేయించే శపథంలోని మాటల్లో ఎడనెడ మార్పులున్నా ‘వైద్యో నారాయణో హరిః’ అనే భావనలో మార్పు లేదు. సాక్షాత్తూ దైవంగా భావించే ఆ ప్రాణదాతల నైతికతలో మార్పు లేదు. వరుస కరోనా వేవ్లలో పోరాడుతున్న వైద్యప్రపంచంలో ఇప్పుడీ కొత్త రచ్చ అవసరమా? వైద్య శపథాన్ని మారిస్తే వచ్చే ప్రత్యేక లాభమేమిటో అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి ప్రవర్తించడానికో, మనసు చూరగొనడానికో మార్చాలనుకొంటే అంత కన్నా అవివేకమూ లేదు. అయితే, పాలకవర్గాలు సాగిస్తున్న పచ్చి కాషాయీకరణకు ఇది పరాకాష్ఠ అనేది ఆధార రహిత ఆరోపణ అని సంప్రదాయవాదుల మాట. ‘ఎయిమ్స్’ లాంటిచోట వార్షిక స్నాతకోత్సవంలో అనేక ఏళ్ళుగా చరక శపథమే చేస్తున్నారంటున్నారు. అలాగే అనుకున్నా, ఊరంతా ఒక దారి అయితే, ఉలిపికట్టెది ఒక దారిగా ప్రపంచ పోకడకు భిన్నంగా తీసుకుంటున్న హఠాన్నిర్ణయానికి సహేతుకత ఏమిటో అర్థం కాదు. ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన రోజుల్లో ఈ వైద్య శపథంలో మాత్రం అందరి బాట కాదనే అత్యవసరం ఏమొచ్చింది? ఆ మాటకొస్తే ఏ ప్రమాణం చేశామన్నదాని కన్నా, దాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం, అలాంటి వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్లలో ఏ మాత్రం తోడ్పాటునిస్తున్నాం అన్నది కీలకం. పాలకులు చూడాల్సింది ఆ ప్రజా సంక్షేమం. అవి చేస్తామని శపథాలు చేసి గద్దెనెక్కి, తీరా ఆ చేతలు వదిలేసి, ఈ చిన్న మాటలు పట్టు కొంటే ఎలా? ఈ కరోనా కష్టకాలంలో పట్టించుకోవాల్సింది – ఆ శపథాలనే కానీ, ఈ శపథాలను కాదు! -
Telangana: అందరిదీ ఆం‘గళమే’
సాక్షి, హైదరాబాద్: ఆంగ్ల భాష ప్రపంచాన్ని శాసిస్తోందన్న విషయం అందరికీ అవగతమైంది. ఇంగ్లిష్పై పట్టు ఉంటేనే పిల్లలు పోటీ పరీక్షలు గట్టెక్కగలుగుతారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవడంలో ముందుంటారనే వాస్తవాన్ని అన్ని వర్గాలు తెలుసుకున్నాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలో బోధనను కోరుకుంటున్నారు. వ్యయ ప్రయాసలతో కూడినదైనా కుగ్రామాల ప్రజలు సైతం తమ పిల్లల్ని స్కూలు బస్సులు, వ్యానులు ఎక్కించి మరీ, సమీప పట్టణంలోనో, మండల కేంద్రంలోనో ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు పెరుగుతున్న డిమాండ్ను గుర్తించిన ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇంగ్లిష్ వైపే ఎక్కువ మంది తెలంగాణలో 42,575 స్కూళ్లుంటే ప్రభుత్వ పాఠశాలలు 31 వేలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు ఎక్కువైనా విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లకే వెళ్తున్నారు. దీనికి కారణం అక్కడ ఆంగ్ల బోధన ఉండటమే. ప్రైవేటులో ఫీజు కట్టలేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘సక్సెస్’సాధించిన స్కూళ్లు ఇంగ్లిష్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 2008లో సక్సెస్ స్కూళ్ల పేరుతో 6–10 తరగతులకు ఇంగ్లిష్ మీడియం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 5 వేలకు పైగా స్కూళ్లలో ఇలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత 2016లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టారు. 1,800 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఉంటే, 4,500 వరకు ప్రాథమికోన్నత ఆపై తరగతుల్లో ఇంగ్లిష్ బోధన ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లిష్కున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో (గురుకులాలు కలిపి) మొత్తం 26,18,413 మంది విద్యార్థులుంటే, ఇందులో 12,35,909 (47.24 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతుంటే 12,72,776 (48.61 శాతం) ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 గురుకుల పాఠశాలల్లో ఉన్న 4,29,540 మంది ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో 84,234 మంది ఉంటే, ఇందులో 19,491 (23.14 శాతం) మంది తెలుగు మీడియం, 56,387 (66.94 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో 32,49,344 మంది విద్యార్థులకు గాను కేవలం 42,416 (1.31 శాతం) మంది తెలుగు మీడియంలో ఉంటే, 31,79,633 (97.85 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఉన్నారు. లోతైన అధ్యయనం చేయాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నా కార్యాచరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా బోధించే సత్తా సర్కారీ స్కూళ్ళకు ఉన్నప్పటికీ ఆచరణ లోపాలే సమస్యగా మారుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం అమలుకు కావాల్సిన వనరులేమిటి? సాధ్యాసాధ్యాలేంటి? అనే విషయాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నడుస్తున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు, గతంలో కొన్ని పాఠశాలలు మూతపడ్డానికి కారణాలు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల సంగతేంటి? రాష్ట్రంలో 1.06 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 10 శాతం మాత్రమే ఇంగ్లిష్ నేపథ్యంలో చదువుకున్న ఉపాధ్యాయులున్నారు. మరో 15 శాతం టీచర్లు ఇంగ్లిష్ బోధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళని విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. మొత్తం మీద 25 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. 2017లో జరిగిన డీఎస్సీలో 980 మందిని మాత్రమే ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా నియమించారు. కాబట్టి 75 శాతం ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లంతా క్వాలిఫైడే ఉంటారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు నేపథ్యం నుంచి వచ్చారు. ఇంగ్లిష్ భాషపై పట్టు కోసం శిక్షణ ఇస్తే బోధించే సామర్థ్యం వస్తుంది. కాబట్టి మొదట టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. మరోవైపు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తే 22 వేల మంది ఆంగ్ల భాష నేపథ్యం ఉండేవాళ్ళు వస్తారు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పేదోడి జీవితమే మారుతుంది ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ఊళ్ళను వదిలేసి పట్టణాలకు పోతున్నారు. గ్రామాల్లో ఇంగ్లిష్ బోధన అందుబాటులోకి వస్తే పేదవాడి జీవితంలో ఊహించని మార్పులొస్తాయి. ఇలాంటి ఉన్నతమైన చదువును పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీనిని చిత్తశుద్ధిగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని మార్పులు ఖాయం. – తుపాకుల వెలగొండ, మాజీ సర్పంచ్, విద్యార్థి తండ్రి, వి.కృష్ణాపురం, ఖమ్మం జిల్లా విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ప్రపంచంతో పోటీపడాల్సిన పరిస్థితుల్లో ఇంగ్లిష్పై పట్టున్న విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. అందరికీ ఆంగ్ల బోధన చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయడం అభినందనీయమే. చిన్నప్పటి నుంచే ఆంగ్లంపై అవగాహన పెంచితే ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అన్ని తరగతులకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమ బోధన అంటే కొంత కష్టం కావొచ్చు. పెద్ద తరగతుల్లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం అంటే విద్యార్థి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. – కె. శేషగిరి రావు (ఉపాధ్యాయుడు, హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా) -
పకడ్బందీగా పాఠశాల విద్య
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేసే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో రూపకల్పన చేస్తున్న నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్)కు స్థానిక అంశాలు, పరిస్థితులను జోడించనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను రూపొందించనుంది. పిల్లల్లో పునాది స్థాయి నుంచి విద్యాభ్యసన సామర్థ్యాలు పెంచడం ద్వారా పాఠశాల విద్య, ఆపై ఉన్నత విద్య పరిపుష్టం అవుతుందన్న ఉద్దేశంతో తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను స్పృశిస్తూ స్థానికుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో మేధావులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాలుగు వేల మంది నుంచి విద్యారంగ పురోగతిపై ఈ అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ ఆయా రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయిస్తోంది. అభిప్రాయ సేకరణ, నివేదికల రూపకల్పన వంటివన్నీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఎన్సీఎఫ్కు నిర్దేశించిన అంశాలు.. పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య అనే నాలుగు విభాగాల పరిపుష్టం దిశగా నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ రూపొందనుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎన్సీఈఆర్టీ గుర్తించి అన్ని రాష్ట్లాలకు వీటిని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ అంశాల్లో అభిప్రాయాలను స్వీకరించనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్సీఈఆర్టీలు, ఎన్సీఈఆర్టీ జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనున్నాయి. వీటి ఆధారంగా 25 ఫోకస్ గ్రూపుల ద్వారా పొజిషన్ పేపర్లను రూపొందించనుంది. ‘మైగవ్.ఐఎన్’ పోర్టల్తో పాటు సర్వే కోసం మొబైల్ యాప్ను ఏర్పాటుచేసింది. 12 మందితో స్టీరింగ్ కమిటీ ఇక కొత్త జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ రూపకల్పన కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. సిలబస్, పాఠ్యపుస్తకాల రూపకల్పన, బోధనా పద్ధతులను రూపొందించి అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది. ప్రస్తుతం 2005లో రూపొందించిన నాలుగవ జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో విశ్వవ్యాప్తంగా విద్యారంగం.. దానికి ఆలంబనమైన రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో, సాంకేతిక పరిజ్ఞానంలో, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఈ మార్పులొచ్చాయి. దీంతో కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్కు కేంద్రం ఏర్పాట్లుచేసింది. రానున్న కాలంలో పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధికి అవకాశమున్నందున ఆ దిశగా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లోనే పిల్లల్లో పఠనం, లేఖనం, గణితం అంశాల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్నదే లక్ష్యం. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను స్థానిక అంశాలకు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం ద్వారానే ఈ లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టింది. దీని ప్రకారమే రాష్ట్రాల కార్యక్రమాలకు కేంద్రం నిధులు అందించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి. ప్రతాప్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్సీఈఆర్టీ గుర్తించిన ముఖ్యాంశాలివే.. 5+3+3+4 విధానంలో పాఠ్య ప్రణాళిక, బోధనా విధానం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషనల్ లిట్రసీ, అండ్ న్యూమరసీ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సెకండరీ తరగతుల్లో సబ్జెక్టు ఎంపిక చేసుకునే సౌలభ్యం కరికులమ్ కుదింపు, కోర్ ఎసెన్షియల్స్ 3, 5, 8 తరగతుల్లో బెంచ్మార్కు లెర్నింగ్ లెవెల్స్ వొకేషనల్ విద్య పునర్వ్యవస్థీకరణ బహుభాషా పరిజ్ఞానం 21వ శతాబ్దపు నైపుణ్యాలు.. ఐసీటీ తదితరాలు జీవ నైపుణ్యాలు, పౌరసత్వం, నైతికత, జాతీయ వారసత్వ సంపద, ప్రజా ఆస్తుల పరిరక్షణ, సేవా దృక్పథం సమ్మిళత విద్య– ఆర్ట్స్, క్రాఫ్ట్, టాయిస్, స్పోర్ట్స్– ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇండియన్ నాలెడ్జి సిస్టమ్ పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య అనుసంధానం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రిఫారŠమ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు స్కూల్ కమ్యూనిటీ రిలేషన్ వనరుల వ్యవస్థల బలోపేతం పాఠ్యపుస్తకాల డిజైన్, డెవలప్మెంట్ -
‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమేణా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్ మోడల్గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అనే అంశంలో రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, గుజరాత్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు ఇలా.. ►ఓవరాల్ కేటగిరీని పరిశీలిస్తే.. చిన్న రాష్ట్రాల్లో కేరళ 67.95 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 58.95 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్ 52.69 స్కోరుతో, మిజోరం 51.64 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. ►అభ్యసన ఫలితాలు, విద్యా మౌలిక సదుపాయాల అంశాల స్కోరులో కేరళకు ఇతర రాష్ట్రాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని నివేదిక పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాలు శ్రద్ధ పెట్టాలని సూచించింది. ►ఫౌండేషన్ లిటరీసీ, న్యూమరసీ ఇండెక్స్లో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జాతీయ సగటు కన్నా ఎక్కువ స్కోరు సాధించాయి. ► జార్ఖండ్ 45.28, ఒడిశా 45.58, మధ్యప్రదేశ్ 38.69, ఉత్తరప్రదేశ్ 38.46, బీహార్ 36.81 స్కోరుతో పేలవమైన పనితీరుతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఫౌండేషన్ విద్య స్థితిగతుల్ని విశ్లేషించిన నివేదిక ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. విద్య మౌలిక సదుపాయాలు, విద్య అందుబాటు, కనీస ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు అనే ఐదు విభాగాల్లో, 41 అంశాలతో నేషనల్ అఛీవ్మెంటు సర్వే (ఎన్ఏఎస్), యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి రప్పించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతుల్లో అభ్యసనాల మెరుగుకు తీసుకోవలసిన చర్యలను సూచించింది. -
పల్లెల్లో డిజి‘డల్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విద్య పల్లెల వరకు చేరనట్టు కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ చదువుకు కావాల్సిన వస్తువుల కోసం ఖర్చు చేసే స్థోమత పల్లె విద్యార్థులకు లేకపోవడం, ఎలాగో కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్తో చదువుకునేందుకు ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. తాజా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సందేహా లను లేవనెత్తాయి. కరోనా లాక్డౌన్తో.. 2020లో కరోనా లాక్డౌన్ పెట్టడంతో సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులూ మారుమూల గ్రామా లకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆన్లైన్ బోధన తెరమీదికొచ్చింది. కానీ అప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం పల్లె విద్యార్థులకు సాధ్యం కాలేదు. ఆన్లైన్ విద్యకు ఉపకరణాలు సమకూర్చుకోవడంలో వెనుక బడ్డారు. ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్, అంతరాయాలతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు కూడా ఆన్లైన్కు అంతగా ఆసక్తి చూపలేదు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసేయడంతో పేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అప్పటికీ ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గించినా గ్రామీణ విద్యార్థులు వేగంగా ముందుకెళ్లలేక పోయారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కు వుండే సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం కన్నా తక్కువే నమోదైంది. అరకొరగా పాసైనా వాళ్ల మార్కుల గ్రేడ్ సగటున 50 శాతం దాటలేదు. దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ స్పీడ్ను అందుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. పట్టణాలకే పరిమితమైందా? సాధారణంగా ఇంటర్ విద్యకు ఎక్కువ మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుం టున్నారు. కరోనా వల్ల ప్రైవేటు కాలేజీల్లో ఆన్లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులూ పట్టణాల్లో ఉండటంతో నెట్ సమస్యలు రాలేదు. ఆ సమయంలో వచ్చిన కొత్త యాప్లూ పట్టణ విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా పట్టణాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లలో 50 నుంచి 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీళ్లలో ఎక్కువ మంది 75 శాతం మార్కులతో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. దీన్ని బట్టి ఆన్లైన్ విద్య పట్టణాలకే పరిమితమైందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎవరిదీ వైఫల్యం? 220 రోజులు జరగాల్సిన ప్రత్యక్ష బోధన 60 రోజులే సాగింది. 60 శాతం వరకూ వచ్చే ఫలి తాలు 49 శాతం దగ్గరే ఆగాయి. దీన్నిబట్టి ఆన్ లైన్ బోధన గ్రామీణ విద్యార్థులను చేరుకోలే దని గుర్తించాలి. ఈ వైఫల్యంపై ఆత్మ పరిశీలన జరగాలి. నష్టపోయేది ఊళ్లల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలేనని తెలుసుకోవాలి. – డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ,(ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్) పాఠం వినే అవకాశమేది? ప్రభుత్వ హాస్టల్లో సీటొచ్చింది. కానీ కరోనా వల్ల మూసేశారు. మా ఊర్లో టీవీ కనెక్షన్లు లేవు. మొబైల్ సిగ్నల్ సరిగా రాదు. ఊరికి దూరంగా వెళ్తేనే సిగ్నల్ వచ్చేది. దీంతో ఆన్ లైన్ క్లాసులకు కష్టమైంది. ఈ మధ్యే కాలేజీలు తెరిచారు. హాస్టళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో ఫస్టియర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. – ఎ. శంకర్ (అడవి ముత్తారం,కరీంనగర్ జిల్లా) -
ఉచిత విద్య, వైద్యంపైనే తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని, ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఉచిత విద్య, వైద్యం ఫైల్పై తొలి సంతకం పెట్టించే బాధ్యత తనదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్కొండ కోటపై కాషాయజెండాను రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కుటుంబ–అవినీతి–నియంత పాలనపై ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. బీజేపీ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని, డిసెంబర్ 17–20 తేదీల మధ్య రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలు పెడతామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ను రాజేద్దామనుకున్నారని విమర్శించారు. అపాయిట్మెంటే కోరలేదనే విషయం ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేయడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అపాయిట్మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం కేసీఆర్ కుటుంబంలో నాలుగు స్తంభాలాట, ప్రగతిభవన్ డైనింగ్ టేబుల్పై యుద్ధమే జరుగుతోందని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ తల్లికి విముక్తి.. రాజకీయ పతనం ప్రారంభమైందని ఇటీవల కేసీఆర్కు ఒక జ్యోతిష్యుడు చెప్పగా, తెలంగాణ తల్లికి బీజేపీతోనే విముక్తి లభించబోతోందని తనకూ మరో జ్యోతిష్యుడు చెప్పారని సంజయ్ తెలిపారు. ఐదు శాతం ఓట్లతో బీహార్లో ఎంఐఎం పార్టీ 12 సీట్లు గెలుచుకుంటే, 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధించాలి? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్రకార్యవర్గం,సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ సంఘటనా సహకార్యదర్శి శివప్రకాష్ సన్మానించారు. సమావేశంలో డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్ర సేనారెడ్డి, డా.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, స్వామిగౌడ్, పొంగులేటి సుధాకరరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, లక్ష్మీనారాయణ, ప్రదీప్కుమార్, ప్రేమేందర్రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్రెడ్డి పాల్గొన్నారు. -
మన పిల్లలకు విద్యే కానుక.. ఏపీ సీఎం వైఎస్ జగన్
రూపు మార్చుకున్న అంటరానితనం ప్రభావం వల్ల మన పిల్లలు అణగిమణిగి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనతో ఇంగ్లిష్ మాధ్యమంలో చదువులు నేర్చుకోనివ్వకుండా అణగదొక్కుతున్నారు. ఈ పరిస్థితిని రూపు మాపి.. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. విద్యాపరంగా సామాజిక న్యాయం చేయాలనే లక్ష్యంతో రైట్ టు ఎడ్యుకేషన్ను రైట్ టు ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్గా మారుస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థి.. 20 ఏళ్ల తర్వాత ప్రపంచంతో పోటీపడి, నిలబడేలా తీర్చిదిద్దేందుకు విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కేజీ నుంచి డిగ్రీ వరకూ విద్యను హక్కుగా కల్పించామని, మన పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోందన్నారు. శుక్రవారం శాసనసభలో విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్ను రైట్ టు ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్గా మార్చే నిర్ణయాన్ని ప్రతి విద్యార్థి తల్లి అభిప్రాయం అడిగాకే తీసుకున్నామన్నారు. పిల్లలకు ఆరేళ్లకే మెదడు 85 శాతం ఎదుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైందని.. ఈ నేపథ్యంలో అంగన్వాడీ స్థాయి (ప్రీప్రైమరీ నుంచే పిల్లలను ఇంగ్లిష్ మాధ్యమం వైపు మళ్లించేలా సంస్కరణలకు నాంది పలికామని సగర్వంగా చెబుతున్నామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆరు విభాగాలుగా ప్రభుత్వ స్కూళ్లు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2) ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు) n ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు (పీపీ–1 నుంచి ఐదో తరగతి వరకు) ప్రీ హైస్కూళ్లు (మూడో తరగతి నుంచి 7–8 తరగతుల వరకు) n హైస్కూళ్లు (3–10 తరగతులు) n హైస్కూళ్లు ప్లస్ (3–12 తరగతులు) ప్రీ ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్ మాధ్యమంలోనే బోధిస్తున్నాం. పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను తీసుకొస్తున్నాం. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడో తరగతి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేక టీచర్ను నియమిస్తున్నాం. జూన్లో అమ్మ ఒడి, విద్యా కానుక పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల చొప్పున రెండేళ్లలో 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల తల్లుల (44.50 లక్షల మంది) ఖాతాల్లో రూ.13,023 కోట్లు జమ చేశాం. దీని వల్ల 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు. జూన్లో తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఏటా రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. భోజనంలో నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పథకం కింద చిక్కీతో పాటు వేర్వేరు ఆహార పదార్థాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఈ పథకం కోసం ఏటా రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్ (కుట్టు కూలితో కలిపి), బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్సులతో కలిపి జగనన్న విద్యా కానుక కింద ఉచితంగా అందిస్తున్నాం. ఈ పథకానికి రెండేళ్లలో రూ.1,437 కోట్లు ఖర్చు చేశాం. పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం 2009 నుంచి 2019 వరకు ప్రభుత్వాలు చదువును కొనుక్కొనేలా ప్రైవేటు సంస్థలకు పట్టం కట్టి.. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు నాడు–నేడు కింద 57,189 ప్రభుత్వ పాఠశాలలు, 3,280 హాస్టళ్లను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నాం. శిథిలావస్థకు చేరిన పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చి.. కనీస మౌలిక సదుపా యాలు కల్పించాం. తొలి విడతగా 15,715 పాఠశాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడానికి రూ.3,669 కోట్లు ఖర్చు చేశాం. పాఠశాలల్లో 24 గంటల నీటి సౌకర్యం ఉండే టాయిలెట్లను నిర్మించడమే కాకుండా.. వాటిని శుభ్రంగా నిర్వహించడానికి అమ్మ ఒడి ద్వారా ఇచ్చే రూ.15 వేలలో రూ.వెయ్యిని తల్లులే టాయిలెట్ నిర్వహణ ఫండ్గా ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. టాయిలెట్ల నిర్వహణకు పెట్టే ప్రతి రూపాయి రూ.34 విలువైన ఫలితం ఇస్తుందని డబ్ల్యూహెచ్వో నివేదిక స్పష్టం చేస్తోంది. వీటన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు చేరుతున్నారు. ఉన్నత చదువులకు అండగా నిలిచాం బీటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివినప్పుడే.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందనే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి పాలకులు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే మూడు దశల్లో పూర్తి ఫీజును తల్లుల ఖాతాలకు రీయింబర్స్ చేస్తున్నాం. ఈ రెండేళ్లలో ఈ విద్యాదీవెన పథకానికి రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం. హాస్టల్ ఖర్చుల కోసం ఐటీఐ చదివే పిల్లలకు రూ.పది వేలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.15 వేలు, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేల చొప్పున విద్యా దీవెన పథకం కింద వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రెండేళ్లలో రూ.2,270 కోట్లు ఇచ్చాం. వచ్చే సంవత్సర.‡ం అమ్మ ఒడి, వసతి దీవెన డబ్బులు వద్దు.. పిల్లలకు ఉపయోగపడేలా ల్యాప్ టాప్లు ఇవ్వండి అని తల్లులు కోరితే.. బయట రూ.25వేల నుంచి రూ.27 వేల ధర పలికే ల్యాప్ టాప్లను తక్కువ ధరకే అందిస్తాం. టెండర్లు, రివర్స్ టెండర్ నిర్వహించడం వల్ల నాణ్యమైన ల్యాప్ టాప్లు రూ.18 వేల నుంచి రూ.18,500 వస్తాయని అనుకుంటున్నాం. ఇవి బాగోలేకపోతే.. సచివాలయంలో ఇస్తే వారం రోజుల్లో కొత్త ల్యాప్ టాప్ ఇచ్చేలా నిబంధన పెట్టాం. ఉద్యోగం, ఉపాధినిచ్చేలా (జాబ్ ఓరియెంటెడ్) డిగ్రీ, బీటెక్ వంటి ఉన్నత విద్యలలో మార్పులు తీసుకొస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, జిల్లాలోని పరిశ్రమలను అనుసంధానం చేస్తూ అప్రెంటిస్షిప్ను తప్పనిసరి చేస్తూ జాబ్ ఓరియెంట్డ్ కోర్సులుగా ఉన్నత విద్యను మార్చే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం. -
విద్యారంగం బాగుపడాలంటే...
‘దేశ భవిష్యత్తు తరగతి గది లోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు విద్యావేత్త కొఠారి. మరి దేశ భవిష్యత్తును నిర్ణ యించే తరగతి గదులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ‘తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థ రూపురేఖలే మార్చే స్తాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన విధానాన్ని ఆవిష్కరిస్తాం’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో గొప్పగా ప్రకటించారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా విద్యారంగం తిరోగమన బాటలోనే పయనిస్తోంది. రాష్ట్రావిర్భావం తర్వాత పాఠశాలలు బ్రహ్మాండంగా బాగుపడ్డాయనీ, విద్యా రంగం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నదనీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీరు వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేయడం, నిబం ధనలు పాటించని పాఠశాలల అనుమతులను కొన సాగించడం ద్వారా ప్రభుత్వం విద్యారంగానికి తీరని నష్టం కలిగిస్తున్నది. బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు మంగళం పాడుతున్నది. కోవిడ్ రెండవ వేవ్ అనంతరం పాఠశాలలు భౌతికంగా పునః ప్రారంభం అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లుగా విద్యాశాఖ గణాంకాలే చెబుతున్నాయి. మరి పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఆరేళ్లుగా పదోన్నతులు లేక ఖాళీలు వెక్కిరి స్తున్నాయి. సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థుల భవిష్యత్తు పాలిట శాపంగా పరిణమించింది. టీచర్ల తాత్కాలిక సర్దుబాటు ఉపాధ్యాయుల లేమిని తీర్చే దివ్యౌషధం ఏమాత్రం కాదని తేలిపోయింది. రాష్ట్రంలోని 17 ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేని మోడల్ స్కూల్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఒత్తిడి సమస్యను తీర్చడానికి మోడల్ స్కూల్స్కి ఇతర పాఠశాల నుండి ఉపాధ్యా యులను డిప్యూటేషన్ ఇవ్వడం విధాన లోపమే తప్ప పరిష్కారం అసలే కాదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో సమస్యల చిట్టా చాంతాడంత ఉంది. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్... ఒకదానితో మరొక వ్యవ స్థకు అంతరాలున్నాయి. సొంత భవనాల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం, నిర్మాణం ప్రారంభమైనవి సకా లంలో పూర్తి కాకపోవడం... ఇలా ప్రచార ఆర్భాటానికి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే అపప్రథను మూటగట్టుకుంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో రేకెత్తిన సున్నితమైన సమస్య వల్ల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలకు మరింత మంది ఉపా ధ్యాయులు దూరమయ్యారు. మైనర్ మీడియం పాఠశా లల్లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉన్నా తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనేది గగనమైంది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించడా నికి ప్రభుత్వమే చొరవ చూపాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలన్నింటినీ రెగ్యులర్ ఉపాధ్యా యులతో భర్తీ చేయాలి. వివిధ రకాల గురుకుల పాఠ శాలలను ఏకతాటిపైన నిలిపేందుకు సొసైటీలన్నింటినీ కలిపి ఒక కామన్ బోర్డుని ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టు విధానంలో నియమింపబడిన ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న దేశాలు నేడు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. అందరికీ విద్య అందించాలనే లక్ష్యం ప్రభుత్వ విద్యా రంగం ద్వారా మాత్రమే సాధ్యం. ప్రభుత్వ పాఠ శాలలను బాగు చేసుకున్న రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచీలో కూడా పురోగమిస్తున్నాయి. కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికై పరితపించాలి. గతంలో రాష్ట్ర పెద్దలు చెప్పినట్లు ప్రపంచంలోనే అత్యు న్నత స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది! వ్యాసకర్త: వరగంటి అశోక్ ప్రభుత్వోపాధ్యాయుడు మొబైల్: 94930 01171 -
‘గుర్తింపు’నకు ససేమిరా.. ప్రమాణాలు అరకొర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నివేదిక స్పష్టం చేస్తోంది. జాతీయస్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో 11 శాతమే ఉండటాన్ని నివేదిక ప్రస్తావించింది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత విద్య ప్రమాణాలపై నాక్ అధ్యయనం చేసింది. ఇందులోభాగంగా తెలంగాణలో జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల బెంగుళూరులో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యా సంస్థలుంటే, ఇందులో 141 మాత్రమే నాక్ గుర్తింపు పొందాయి. వీటిల్లో 35 ప్రభుత్వ, 19 గ్రాంట్–ఇన్–ఎయిడ్, 87 ప్రైవేటు సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 విశ్వవిద్యాలయాల్లో పదింటికే నాక్ గుర్తింపు ఉంది. ప్రభుత్వంలోని శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇప్పటి వరకూ నాక్ గుర్తింపు లేదు. నాక్ గుర్తింపు ఉన్న 141 కాలేజీల్లో 81 కాలేజీలు తిరిగి గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. పట్టణ ప్రాంతాల్లోని 72 కాలేజీలకు, సెమీ అర్బన్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 సంస్థలకు గుర్తింపు ఉంది. వెనుకబాటుకు కారణాలేంటి? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సింహభాగం గ్రామీణ నేపథ్యంలోనే ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పెంచాలి. దీనికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అరకొర ఆదాయం వచ్చే ఈ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్లడం లేదు. నాక్ గుర్తింపు కోసం కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదు. పట్టణ ప్రాంతాల్లో బడ్జెట్ కాలేజీలు కూడా ఆదాయం పెద్దగా ఉండటం లేదని నాక్ ప్రమాణాల వైపు చూడటం లేదు. రాష్ట్రంలోని 71 శాతం ఉన్నత విద్యాసంస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవని నివేదిక పేర్కొంది. వీటిల్లో 36 శాతం కాలేజీల్లో కనీస వసతులు కూడా లేవంది. బోధనా సిబ్బంది విషయంలోనూ ఏమాత్రం నాణ్యత పాటించని కాలేజీలు ఎక్కువగా ఉన్నట్టు తేటతెల్లమైంది. మంచి ప్రమాణాలున్న అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, అప్పుడు విద్యార్థుల ఫీజులు పెరుగుతాయని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. నాక్ గుర్తింపు ఎందుకు? వివిధ రంగాల్లోని ప్రముఖులతో నాక్ ఏర్పడింది. జాతీయస్థాయిలో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రధానంగా ఏడు అంశాలను నాక్ గుర్తింపు ప్రామాణికంగా తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమైన ప్రమాణాల అమలు అనే అంశాలను నాక్ పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో వెనుకబడే ఉందని నాక్ నివేదిక స్పష్టం చేస్తోంది. ‘ఎ’గ్రేడ్లో కేవలం 11 సంస్థలుంటే.. ‘బి’గ్రేడ్లో 71 సంస్థలు, మిగతావి ‘సి’గ్రేడ్లో ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందిన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని నిధులు కూడా అందుతాయి. గుర్తింపు కోసం వస్తే రూ.లక్ష నజరానా తగిన ప్రమాణాలు పాటించి నాక్ గుర్తింపు కోసం విద్యా సంస్థలు పోటీపడేలా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నాక్ గుర్తింపు కోసం అర్హతలతో వస్తే రూ.లక్ష నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లోనే డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల మౌలిక సదుపాయాల మెరుగు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులతో నడిపే కాలేజీల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం
సాక్షి, చెన్నై: ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవా పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెన్నైలో తొలి విడతగా మొబైల్ దంత వైద్య సేవలకు సోమవారం ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. అందరికీ మెరుగైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నైలో తొలిసారిగా సోమవారం ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. ఇందు కోసం అన్ని రకాల వసతులతో ప్రత్యేకంగా మొబైల్ వాహనం సిద్ధం చేశారు. ఇకపై ప్రతి శనివారం వ్యాక్సినేషన్ క్యాంప్ మీడియాతో సోమవారం ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ, ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఆదివారం మెగా వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది మాంసం ప్రియులు, మందుబాబులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. ఆదివారం మద్యం తాగేందుకు, మాసం తినడానికి టీకా సమస్యగా మారుతుందేమోనన్న తప్పుడు ప్రచారమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అందుకే ఇకపై శనివారం మెగా వ్యాక్సిన్ శిబిరం ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఈసారి 50 వేల శిబిరాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. 53 లక్షల వ్యాక్సిన్ డోస్లు చేతిలో ఉన్నాయని వెల్లడించారు. చదవండి: (తొమ్మిదేళ్ల సర్వేశ్ని అభినందించిన సీఎం స్టాలిన్) ఇంటి వద్దకే విద్య.. నవంబర్ 1వ తేదీన పాఠశాలల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నా, ఇంటి వద్దకే విద్య అన్న నినాదాన్ని తాజాగా అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 9,10,11,12 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు విస్తృతం చేయనున్నా రు. అలాగే, 1తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇంటి వద్దకే వెళ్లి విద్యను అందించేందు చే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. సోమవారం సీఎం ఎంకే స్టాలిన్తో విద్యామంత్రి అన్భిల్ మహేశ్, కార్యదర్శి కాకర్లు ఉషాతో పాటుగా అధికారులు సమావేశం ఈ విషయంపై చర్చించారు. -
సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ ’ అవార్డును లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ స్థాపకుడు సుబ్బు పరమేశ్వరన్ అందుకున్నారు. విద్యార్థి దశలోనే పిల్లలకి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అందించేందుకు నడుం బిగించింది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో అనుసంధానమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సామాజిక, మనోవైజ్ఞానిక బోధనల విధానాలపై ఉపాధ్యాయులకు కూడా ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. 2016లో హైదరాబాద్లో ఆవిర్భవించిన ఈ సంస్థ ఇప్పటి వరకు దేశంలోని 200 పాఠశాలలకు చెందిన 13 వందల మంది ఉపాధ్యాయులు, 42,500 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. అందరూ విస్మరించిన ఒక మౌలికమైన సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడం ద్వారా విద్యార్థుల బహువిధ నిపుణతల కోసం లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. గర్వించే క్షణం ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. సాక్షికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు, ప్రైవేటు లో బడ్జెట్ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాం. -
ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం
తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా చరిత్ర సృష్టించారు. తెలుగును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తూనే అంగన్వాడీ∙(ప్రీ–స్కూల్) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది నిజంగానే పెనుమార్పు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంత వరకు, అన్నితరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది. ఒక తెలుగు దినపత్రికలో జూలై 30వ తేదీన ’పేద పిల్లలు పెద్ద చదువులు’ అనే వార్తను చూశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యావిధానంపై, విద్య ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న పేద పిల్లల జీవితాల్లో విద్యా మాధ్యమం ఎలాంటి మార్పు తీసుకొస్తోందనే అంశంపై ఆ వార్త ఒక సమగ్ర వివరణను అందించింది. భారతీయ విద్యా వ్యవస్థలోని ప్రతి ఒక్క అంశంలో సమాన అవకాశాల విషయంలో తిరస్కరణకు గురైన భారతీయ సమాజంలోని వివిధ వర్గాలకు ఏపీ విద్యా విధానం కచ్చితంగా సరికొత్త ఆశను కలిగిస్తోంది. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ కొత్త ఆశ పుట్టుకొచ్చింది. ఆయన విధానంలో మూడు కీలక అంశాలున్నాయి. ఒకటి, ఏపీ సీఎం పదే పదే చెప్పినట్లుగా, అన్ని అంశాల్లో నాణ్యమైన, సమాన విద్య అనేది ప్రభుత్వం యువతరానికి ఇచ్చే అత్యుత్తమ సంపదగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి చివరి ఊపిరి వరకు మిగిలి ఉండే ఏకైక సంపద విద్యే. ఎవరూ దాన్ని దొంగిలించలేరు. ఎవరూ దాన్ని దుర్వినియోగపర్చలేరు. రెండు, భారతీయులు తమ చరిత్ర పొడవునా అంటే ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యవస్థను ఏర్పర్చుకున్న తర్వాతి కాలంలో కూడా ఒకే భాషలో అనేక బోధనావకాశాలను పొందే అవకాశానికి నోచుకోలేదు.. ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎం తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటూనే అంగన్వాడీ (ప్రీ–స్కూల్) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని తప్పక నేర్చుకునేలా చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది అతి గొప్ప గెంతుగా చెప్పాలి. మూడు, ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై గణనీయమైన మొత్తాన్ని చాలా సృజనాత్మకంగా ఖర్చుపెడుతోంది. ఇక్కడ ఇచ్చిన డేటా దీనిపై స్పష్టమైన చిత్రణను అందజేస్తుంది. ఇక్కడ ఇచ్చిన నగదు వివరాలు 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బడ్జెట్ సంవత్సరాల్లో విద్యపై పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13,022 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం బడికి వెళుతున్న తమ పిల్లల విద్యకోసం ఖర్చుపెట్టడానికి నిరుపేద తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఇది 44 లక్షల 48 వేల 865 కుటుంబాలకు ప్రయోజనం కలి గించింది. ఇక జగనన్న విద్యా దీవెన కింద రూ. 5,573 కోట్లను కాలేజీ వెళుతున్న పిల్లలకు ఫీజు చెల్లించడానికి తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఈ మొత్తం 18 లక్షల 80 వేల 934 కుటుంబాలకు లబ్ధి కలి గించింది. జగనన్న వసతి దీవెన కింద రూ. 2,270 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం కూడా అనేక విద్యాపరమైన, కుటుంబపరమైన ఖర్చుల నిమిత్తం మహిళల ఖాతాల్లోకి వెళ్లింది. ఇకపోతే జగనన్న గోరుముద్ద పథకానికి రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకంకింద పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించారు. ప్రతిపిల్లవాడి పళ్లెంలో నాణ్యమైన ఆహారం అందించడం కోసం దీన్ని వెచ్చించారు. చివరకు కరోనా మహమ్మారి కాలంలో పాఠశాలలు మూతపడిన సందర్భంలో కూడా వండిన భోజ నాన్ని పిల్లల ఇళ్లకే వెళ్లి అందించారు. ఇది 36,88,618 మంది పిల్లలకు ప్రయోజనం కలిగించింది. జగనన్న విద్యా కానుక అనే మరో పథకం కింద పుస్తకాలు, బ్యాగులు, షూలు తదితరాల కోసం రూ. 650 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకం 45 లక్షల పిల్లలకు ప్రయోజనం కలిగిం చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పాఠశాల మౌలిక వసతులను నిర్మించడానికి ‘నాడు నేడు’ పథకం ప్రారంభించింది. మౌలిక వసతుల అభివృద్ధి పథకం తొలిదశలో రూ. 3,564 కోట్లు వెచ్చించి 15,205 పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించారు. మొత్తం మీద చూస్తే ఈ విద్యా పథకాలన్నింటిపై రెండు ఆర్థిక సంవత్సరాల సమయంలో రూ. 26,678 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ పథకాలకు పెట్టిన ఖర్చు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకంటే ఎంతో ఎక్కువ. తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అనేది అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. భారతీయ విద్యావ్యవస్థ తొలి నుంచీ కుల, వర్గ పక్షపాతంతో కొనసాగుతూ వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం నాణ్యమైన పాఠశాల విద్య ప్రాముఖ్యతను ఇంతవరకు గుర్తించలేదు. విద్యపై మంచి బడ్జెట్ కేటాయింపులను చేయవలసిన అవసరాన్ని కూడా మన వ్యవస్థ గుర్తించలేదు. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం లేక కేంద్ర ప్రభుత్వం కూడా పిల్లలందరికీ ఒకే భాషలో విద్యతో జాతిని ఐక్యపర్చవచ్చని గుర్తించలేకపోయాయి. దీనికోసం ఇంగ్లిష్ని ప్రధాన జాతీయ బోధనా భాషగా చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంగ్లిష్ని ఇప్పటికైనా భారతీయ భాషగా గుర్తించితీరాలనీ, అన్ని పాఠశాలల్లో జాతీయ ప్రాధాన్యత కింద ఇంగ్లిష్ని బోధించాలనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణ మూర్తి ఇటీవలే మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. అయితే సాహసోపేతమైన ముఖ్యమంత్రులుగా పేరొందిన సిద్ధరామయ్య, పినరయి విజయన్ కూడా తమ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంని ప్రవేశపెట్టడానికి భయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడతామని వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోలేకపోయారు. అత్యంత సాహసిగా పేరొందిన మమతా బెనర్జీ సైతం తన రాష్ట్రంలో ఇంగ్లిష్ను ఉమ్మడి బోధనా భాషగా చేయడం ద్వారా విద్యావ్యవస్థను సంస్కరించడానికి చర్యలు చేపట్టలేకపోయారు. పునరుజ్జీవనోద్యమ రాష్ట్రంగా పేరొందిన బెంగాల్ ఇప్పుడు అన్ని పరామితులలో చూస్తే విద్యలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రంగా ఉంటోంది. చివరకు మహారాష్ట్ర, గుజరాత్లలో కూడా సంపన్నులు తమ పిల్లలను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తుండగా, మరాఠా, గుజరాతీ భాషా సెంటిమెంట్ని నిరుపేద దళితులకు, శూద్రులకు, ఆదివాసీలకు పరిమితం చేసి వారు ప్రాంతీయ భాషా విద్యకు కట్టుబడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్యను తప్పకుండా అభినందించాల్సి ఉంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రాంతీయవాదం అనే సాంప్రదాయ అవగాహనతోనే ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నారు. కానీ సంపన్నులు మాత్రం ఇంగ్లిష్ను వలస భాషగా గుర్తించడం లేదు కాబట్టే తమ పిల్లలను ఏ ప్రాంతంలోనైనా, లేక ఏ రాష్ట్రంలోనైనా సరే... ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదివించేందుకు డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ వివక్షను ఎందుకు పట్టుకుని ఇంకా వేలాడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యావిధానం భాషా విధానంలో మౌలిక మలుపులాంటిది, అంతేకాకుండా ఇది సమర్థవంతమైన పెట్టుబడి పాలసీ కూడా. బ్రిటిష్ నమూనాను పోలినటువంటి విద్యాపరమైన సంక్షేమవాదాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. అయితే బ్రిటన్ వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో మాదిరి కాకుండా, భారత్లో ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు లేదు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంతవరకు, ప్రస్తుతం అంతర్జాతీయీకరణకు గురైన ప్రపంచానికి వర్తించే, అన్ని తరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు
పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!
కాబూల్: అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అందరూ భయపడుతున్న విధంగానే మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే కో-ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావేలేదని, అంతా షరియత్ చట్టాల ప్రకారమేనని ఇప్పటికే కరాఖండిగా తేల్చి చెప్పిన తాలిబన్లు ఆవైపుగానే నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. తాలిబన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువు కోవడాన్ని నిషేధించారు. అంతేకాదు ‘సమాజంలోని అన్ని దుర్మార్గాలకు అదే మూలం' అని వర్ణించడం గమనార్హం. చదవండి : తాలిబన్ల చెరలో అఫ్గన్: హృదయ విదారక ఫోటోలు వైరల్ వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు తాలిబన్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ శనివారం నివేదించింది. అఫ్గాన్ ఉన్నత విద్యకు చెందిన తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడు గంటలపాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కో-ఎడ్యుకేషన్ను నిలిపివేయాల్సిందేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. అలాగే మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుంది తప్ప, పురుషులకు బోధించే అవకాశం ఉండదని కూడా వెల్లడించారు. చదవండి : Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన కాగా గత రెండు దశాబ్దాలలో, అఫ్గాన్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లలో కో-ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ప్రత్యేక తరగతుల మిశ్రమ వ్యవస్థను అమలు చేసింది. అధికారిక అంచనాల ప్రకారం హెరాత్లో ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 40వేలమంది విద్యార్థులు, 2వేల లెక్చరర్లు ఉన్నారు. చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
ఏపీలో విద్య దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి : నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, విద్యా కానుక, నూతన విధానాల్లో బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని విద్యా విధానం దేశానికే ఆదర్శం అని విద్యా రంగం నిపుణులు కొనియాడారు. ‘75 వసంతాల స్వరాజ్యంలో విద్యా సంస్కరణలు– ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో శనివారం మేధావుల వర్చువల్ సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడిచిన రెండేళ్లలో విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు బా టలు వేశారని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తుండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. అమ్మ ఒడి, విద్యా కానుకతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని విశ్లేషించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలువురు విద్యావేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని సమావేశ సమన్వయకర్త, ఎరుక పత్రిక సంపాదకులు జి.ఆంజనేయులు వివరించారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పి.విజయప్రకాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లకు రెండు కమిషన్లు తేవడం మంచి పరిణామమన్నారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ.25,714 కోట్లు 2014– 2019 మధ్య 5.62 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్గా మారితే, గత రెండేళ్లుగా 6.63 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ బాలమోహన్ దాస్ తెలిపారు. విద్య కోసం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ. 25,714 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 1,60,75, 373 మంది లబ్ధిదారులకు లాభం చేకూరిందని, 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు వారి ఖాతాలలోకి నేరుగా వేశారన్నారు. నీతి అ యోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఆరువేల స్కూల్స్ మూతపడ్డాయని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎన్.వెంకట్రావు తెలిపారు. సీఎం జగన్ గొప్ప ఆలోచన తీరు వల్ల నేడు ఆ పరిస్థితి మారి, మూత పడ్డ స్కూల్స్ తెరుచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పిల్లలు పరుగెత్తుకుంటూ స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ లక్ష్యం ఎంతో ఉపయుక్తం సోషల్ జస్టిస్, సమానత్వం అనేది విద్యతోనే సాధ్యం అని, వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ వై.హరగోపాల్ రెడ్డి ప్రశంసించారు. ఈ పరిణామం మంచి విజ్ఞానవంతులను, మంచి పౌరులను అందించి మంచి సమాజాన్ని తయారు చేస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ వర్గాలకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్దే అని రాయలసీమ యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ కె.కృష్ణ నాయక్ కొనియాడారు. -
జగనన్న విద్యా దీవెన: విద్యారంగంలో పెరిగిన చేరికల నిష్పత్తి
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యారంగంలో చేరికల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో)లో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు రెట్టింపు స్థాయికి మించి ఉండటం గమనార్హం. ఏపీకి దరిదాపుల్లో కూడా ఇతర రాష్ట్రాలేవీ లేవు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ఉన్నత విద్య (ఏఐఎస్హెచ్ఈ) 2019 – 20 సర్వే గణాంకాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఐదేళ్ల గణాంకాలు చూస్తే... ఏఐఎస్హెచ్ఈ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 18 – 23 ఏళ్ల వయసున్న ప్రతి వంద మందిలో 2015–16లో గరిష్ట చేరికల నిష్పత్తి 24.5 ఉండగా 2019–20 నాటికి 27.1కి చేరుకుంది. ఐదేళ్లలో చేరికలు 10.61 శాతానికి పెరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్లో గణాంకాలు పరిశీలిస్తే 30.8 నుంచి నిష్పత్తి 35.2కి పెరిగింది. అంటే ఉన్నత విద్యనభ్యసించే వారు ఐదేళ్లలో 14.5 శాతం మేర పెరిగారు. చివరి రెండేళ్లలో ఉన్నత విద్యలో చేరికలను విశ్లేషిస్తే పెరుగుదల శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2018–19, 2019–20లలో జాతీయస్థాయిలో చేరికలు 3.04 శాతం కాగా ఏపీలో 8.6గా ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో 2016– 18 మధ్య ఉన్నత విద్యలో చేరికలు 4.85 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా.. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల గణాంకాలను పరిశీలిస్తే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2018–19, 2019–20లలో పెరుగుదల 5 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణలో చేరికల శాతం ఏకంగా మైనస్లోకి దిగజారింది. 2018–19, 2019–20 గణాంకాలు పరిశీలిస్తే తెలంగాణలో 1.6 శాతం మేర తగ్గుదల ఉంది. విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల... గత ఐదేళ్లుగా ఉన్నత విద్యారంగం గరిష్ట చేరికల్లో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో 2018–19లో విద్యార్థుల జీఈఆర్ 35.8 కాగా 2019–20లో 38.3గా నమోదైంది. అంతకు ముందు ఏడాది కన్నా 2019–20లో ఏడు శాతం మంది విద్యార్థులు అదనంగా ఉన్నత విద్యలో చేరినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏపీలో విద్యార్థినుల చేరికల నిష్పత్తి 2018–19లో 29.0 కాగా 2019–20లో 32.2గా ఉంది. రాష్ట్రంలో ఉన్నతవిద్యలో విద్యార్థినుల చేరికలు ఒక్క ఏడాదిలో 11.03 శాతానికి పెరగడం గమనార్హం. అదే జాతీయస్థాయి జీఈఆర్ గణాంకాలు చూస్తే విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల 2.28 శాతమే ఉంది. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో 2018–19, 2019–20లలో విద్యార్థుల చేరికలు 4 శాతం లోపు, విద్యార్థినుల చేరికలు 6 శాతం లోపే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోనూ గణనీయ పురోగతి.. ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లోనూ ఏపీలో గణనీయ పురోగతి ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19, 2019–20లలో చేరికల గణాంకాలు చూస్తే ఎస్సీలు 7.5 శాతం పెరగ్గా ఎస్టీల చేరికలు 9.5 శాతానికి పెరిగాయి. అదే జాతీయ స్థాయిలో గత రెండేళ్లలో ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం మాత్రమే పెరుగుదల ఉండడం గమనార్హం. ఇదే సమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది. పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో భరోసా.. ’గత రెండేళ్లలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల చేరికల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలే దీనికి ప్రధాన కారణం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుండగా వసతి దీవెన కింద వసతి, భోజనం, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు నేరుగా అందిస్తోంది. దీంతో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు భరోసా నెలకొంది. ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యాకోర్సుల్లో చేరగలుగుతున్నారు. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల నిష్పత్తి 2024 నాటికి 70కి పెంచడంతోపాటు 2035 నాటికి 90కి చేర్చాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలమనే నమ్మకం ఉంది’ – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
Andhra Pradesh: సంస్కరణలతో విద్యావిప్లవం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తన భుజస్కందాలపై వేసుకుంది. విద్యాపరంగా, వ్యవస్థాపరంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు. సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2021–22కిగాను ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 10న ఆర్థిక సహాయం అందించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో దశ నగదు చెల్లింపులను మంత్రివర్గం ఆమోదించింది. అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్లను ఆమోదించింది. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మంత్రివర్గం సమావేశం వివరాలను రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యావేత్తలతో చర్చించి సంస్కరణలు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రభుత్వం వివిధ సర్వేలను నిర్వహించింది. విద్యావేత్తలతో చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల విధానంలో సంస్కరణలు తెస్తూ ఆరు రకాలుగా వర్గీకరించింది. ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్: ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 ►ఫౌండేషన్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 లతోపాటు ఒకటి, రెండో తరగతులు ►ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1 నుంచి ఐదో తరగతి వరకు ►ప్రీ హైస్కూల్స్: మూడో తరగతి నుంచి ఏడు (లేదా) ఎనిమిదో తరగతి వరకు ►హై స్కూల్స్ : మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ►హై స్కూల్ ప్లస్ స్కూల్స్: మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు మహర్దశ ఈ ఏడాది జగనన్న విద్యా కానుక పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది. విద్యాకానుక, మనబడి, నాడు– నేడు ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రివర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారుతోందని తెలిపింది. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నాడు – నేడు తొలి విడత కోసం రూ.3,669 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. ఈ పనుల కోసం మొత్తం రూ.16,021.67 కోట్లు వెచ్చించనుంది. తద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దనుంది. 10న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆగస్టు 10న అర్హులైన నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అందుకోసం బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించింది. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. రెండో దశ చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 5 వరకూ అందిన వివరాల ప్రకారం నాలుగు లక్షల మంది డిపాజిట్దారులకు ప్రభుత్వం దాదాపు రూ.511 కోట్లు చెల్లించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్దారులు 3.4 లక్షల మందికి గతంలోనే రూ.238.7 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆక్రమణల క్రమబద్ధీకరణ ఇలా.. అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 300 చ.గజాల వరకు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు విధి విధానాలు ఇలా ఉన్నాయి... ►ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ►2019 అక్టోబరు 15 నాటి వరకూ ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తారు. ►75 చ. గజాల వరకు భూమి బేసిక్ వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. లబ్ధిదారుడు కేటగిరీ–1కు చెందినవారైతే ఉచితంగా పట్టా, డి ఫారం పట్టా పంపిణీ చేస్తారు. ►75 నుంచి 150 చ.గజాల వరకూ భూమి బేసిక్వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. ►150 నుంచి 300 చ.గజాల వరకూ భూమి బేసిక్ వాల్యూలో 100 శాతం రుసుము వసూలు చేస్తారు. ►మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో ప్రభావితమైన భూములకు ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. ►అప్రూవ్డ్ లే అవుట్లలోని నిర్మాణాలకు వర్తించదు. అసైన్డ్ చట్టంలో సవరణలు.. అసైన్డ్ చట్టం–1977(పీవోటీ)లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అందుతున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 3(2ఎ), సెక్షన్ 3(2బీ) సవరించేందుకు ఆమోదం తెలిపింది. ►అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇల్లు విక్రయానికి ప్రస్తుతం ఉన్న గడువు 20 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించారు. ►సవరించిన చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటిని ఆమోదిస్తారు. ►చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని అమ్మాలని అనుకుంటే నిర్దేశించిన రుసుములను అనుసరించి అనుమతులు ఇస్తారు. ప్రైవేట్ భూమి తీసుకుంటే బదులుగా మరోచోట.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాల కొరత సమస్య తీర్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రైవేట్ భూమి తీసుకుని బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, విత్తన అభివృద్ధి కేంద్రాలు, మల్లీ ఫెసిలిటీ కేంద్రాలు, 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు మొదలైన వాటికి భూములు సేకరించి అవసరమైన నిర్మాణాలు చేపడతారు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్లకు ఆమోదం బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను మంత్రివర్గం ఆమోదించింది. రూ.5,155.73 కోట్లతో బందరు పోర్టు రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. భావనపాడు పోర్టు మొదటి దశ కోసం రూ.4,361.90 కోట్లతో రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. భూసేకరణ, పోర్టు మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్లు రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రివర్గం పరిపాలన అనుమతులు జారీ చేసింది. బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం(ప్రకాశం)లలో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.1,720.61 కోట్లతో డీపీఆర్ను ఆమోదించారు. స్వచ్ఛతకు ‘క్లాప్’ ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇళ్ల వద్ద నుంచి చెత్త సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహిస్తారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు చేపడతారు. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.550 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుడా’ ఏర్పాటు రాజమహేంద్రవర్గం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు కొవ్వూరు, నిడదవోలు, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థలోని కొంత భాగాన్ని రుడా పరిధిలోకి తెచ్చారు. మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థలు, 17 మండలాలు, 207 గ్రామాలతో 1,566.44 చ.కి.మీ. పరిధితో ‘రుడా’ ఏర్పాటు చేశారు. గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ పేరును కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)గా మార్చారు. మొత్తం 1,236.42 చ.కి.మీ. పరిధిలోని కుడాలో 5 పట్టణ స్థానిక సంస్థలు, 15 మండలాలు, 172 గ్రామాలు ఉన్నాయి. ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలు పెంపు రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీడీసీ)లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలను గణనీయంగా పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వాటి వాటాను 50 నుంచి 74 శాతానికి పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. ►నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి టెక్నో ఎకనామిక్ ఫీజ్బిలిటీ అధ్యయన నివేదికకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్ యాక్ట్ 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల అభివృద్ది, అర్చకుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ రూపొందించారు. ►ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ మేరకు చట్ట సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ కానుంది. ►చిత్తూరు జిల్లా పుంగనూరు రవాణా శాఖ కార్యాలయంలో ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, సీనియర్ /జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టుల మంజూరు. ►ఈ నెల 13న ప్రదానం చేయనున్న వైఎస్సార్ లైఫ్టైం ఎఛీవ్మెంట్ అవార్డులకు మంత్రివర్గం ఆమోదం. ►రాష్ట్ర హైకోర్టు అభిప్రాయం మేరకు హైదరాబాద్లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం. ►హైకోర్టు అభిప్రాయాల మేరకే రాష్ట్ర మావన హక్కుల సంఘం కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం. మానవహక్కుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పీఆర్వో పోస్టులకు మంత్రివర్గం ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్–జ్యుడిషియల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్సైకిల్ మెసెంజర్ పోస్టుల మంజూరు. ►గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు ఆమోదం. ►రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్– 2021కి మంత్రివర్గం ఆమోదం. ►మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఉత్పత్తిలో 30 శాతం స్థానికంగానే వినియోగించేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పన. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఆక్వాహబ్లు, వీటికి అనుబంధంగా రిటైల్ దుకాణాల ఏర్పాటు. ►పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్ టెక్నీషియన్, 8 ల్యాబ్ అటెండెంట్ల పోస్టుల మంజూరు. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నీషియన్లను, అవుట్ సోర్సింగ్పై అటెండెంట్లను నియమిస్తారు. ►రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. ఉద్యానవన పంటల సాగు చట్ట సవరణకు ఆమోదం. ఖరీఫ్లో ఇప్పటిదాకా 42.27 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఖరీఫ్ సాగు, పంటల పరిస్థితుల వివరాలను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. వైఎస్సార్ జిల్లాలో 70.2 శాతం, అనంతపురం జిల్లాలో 65.6 శాతం, కర్నూలు జిల్లాలో 25.5 శాతం, చిత్తూరు జిల్లాలో 58.6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అగ్రికల్చర్ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియచేశారు. -
విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం కానుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ శాటిలైట్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2) ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2. 1, 2) ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ) ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ) హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ) హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్ 44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్ అవుతాయని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలి 3వ తరగతి నుంచి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యాబోధన జరగాలని తెలిపారు. ప్రపంచస్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు-నేడు కోసం రూ.16 వేలకోట్ల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను వివరంగా తెలియజేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు. అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు-నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సీఎం జగన్పై ప్రశంసలు కురిపించిన ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలను ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ప్రశంసించారు. 11వ వర్శిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణల పట్ల ఆయన అభినందించారు. వర్చువల్ ద్వారా పాల్గొన్న కస్తూరి రంగన్కు సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా సంస్కరణలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఏపీలో అమలవుతున్న విద్యా పథకాలపై సీఎం వైఎస్ జగన్ను కస్తూరి రంగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో సమర్థవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు, ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యా పథకాల అమలుపై కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు. -
ఏ కాలేజీలో చేరినా.. మీకిష్టమైన కాలేజీలో క్లాసులు వినొచ్చు!
సాక్షి, హైదరాబాద్: పలు కారణాలతో ఒక విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో చేరలేకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో కాలేజీలో చేరినా... తనకిష్టమైన కాలేజీలో చేరలేదన్న అసంతృప్తి ఆ విద్యార్థిని వెన్నాడుతుంటుంది. అందుకే అటువంటి విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసి, తద నంతరం పూర్తిస్థాయిలో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ సహా పలువురు వీసీలతో కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని కొన్ని కాలేజీలను కలుపుతూ పైలట్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బోధనాసిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్న వారు అదే క్లస్టర్లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకమైన అంశం. -
ఏపీలో నూతన విద్యా విధానం భేష్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, ప్రకాశం: ఏపీలో విద్యా విధానం బాగుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న విద్యా పథకాలు బీసీ విద్యార్థులకు మేలు చేస్తున్నాయని కొనియాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాల అమలుతో అణగారిన వర్గాలకు వరం లాంటివని ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
విద్యా విప్లవానికి నాందీవాచకం
పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహిం చడం ఒక్కటే సరైన పద్ధతి. దేశంలోని రైతులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేసిన మనోభావాల లింకును వైఎస్ జగన్ తుంచేశారు. ప్రాథమిక విద్యపై, కళాశాల విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో సీఎంని మనం చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీనికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఇంగ్లిష్ని విద్యా మాధ్యమంగా చేసింది. వీటిని చేపట్టడానికి రాష్ట్ర యువ, ఆశావహ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. తమ పిల్లలను మాత్రం అతి ఖరీదైన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి స్తున్న ఏపీలోని కపట మేధావి–రాజకీయ వర్గం జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాన్ని మాతృభాషా సమస్యగా మార్చేసింది. తల్లి భాష అంటే తల్లి పాలు అంటూ వీరు గొంతు చించుకున్నారు. తమ గావుకేకలు వైఎస్ జగన్ని కదిలించకపోవడంతో తర్వాత వీరు న్యాయస్థానం ముందు సాగిలపడ్డారు. రాష్ట్ర కుహనా మేధావివర్గాల, ప్రతిపక్షాల ఈ కపటత్వాన్ని ఎండగడుతూ, వీరి వీధి పోరాటాలతో, మీడియాలో యుద్ధాలతో తలపడటానికి ఏపీ ముఖ్యమంత్రి తమ యువ కేడర్ని, పార్టీ నాయకులను మోహరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా జగన్ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు వ్యతిరేకి అని ఆరోపించారు. అయితే ఇంగ్లిష్ మీడియంలో విద్య అనేది తన నవరత్నాలు పథకంలో భాగం కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు వాగ్దానం చేశారు కాబట్టి వైఎస్ జగన్ తన మాటకు చివరివరకు కట్టుబడ్డారు. అదే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని జగన్ ఆదేశిం చారు. అన్ని పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించి ఇవ్వాలని కూడా ఆదేశించారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోని పాఠాలు ఒక వైపు పేజీలో ఇంగ్లిష్లో, దాని పక్కపేజీలో తెలుగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో విమర్శకులకు మౌనం పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీరి పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా రెండు భాషల్లో విద్య నేర్చుకోవచ్చు. ఇంతవరకు ఏపీలోని ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు తెలుగులో విద్య నేర్చుకోవడాన్ని అనుమతించలేదు. విద్యలో జగన్ సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు గ్రామీణ, రైతు, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల మద్దతును వైఎస్ జగన్ పొందారు. తాము ఎంచుకున్న మీడియంలో విద్య పొందాలనుకునే పిల్లల హక్కును ఏ కోర్టూ వ్యతిరేకించదు. ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎత్తిపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా హక్కు ప్రైవేట్ రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. పిల్లలంటే పిల్లలే. ప్రైవేట్ లేదా ప్రభుత్వ.. ఇలా వారు ఏ పాఠశాలలో చదివినా వారి హక్కు వారికే చెందుతుంది. వైఎస్ జగన్ తన ఇంగ్లిష్ మీడియం ఎజెండాను అమ్మ ఒడి పథకంతో మేళవించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా విద్యా ఖర్చుల కోసం రూ. 15,000ల నగదును అందించే పథకమిది. దీంతోపాటు కాలేజీలో చదువుకునేవారి ఫీజు మొత్తం రీయింబర్స్ చేస్తున్నారు. దీనికి తోడుగా నాడు–నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక వసతులను సమూలంగా మార్చడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకం కంటే నాడు–నేడు మరింత నిర్దిష్టమైనది, గుణాత్మకమైనది కావడం విశేషం. పైగా ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం కూడా. ఏపీ ముఖ్యమంత్రి ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్ వాడీలను కూడా ప్రాథమిక పాఠశాలలతో మిళితం చేశారు. పైగా స్కూల్ సిబ్బందిని, వసతి సౌకర్యాలను పెంచారు. ప్రతి రోజు స్థిరమైన మెనూతో ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈ పథకం కింద పిల్ల లకు మంచి ఆహారం లభిస్తూండటం గమనార్హం. పిల్లలున్న ప్రతి ఇంటి నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూలును, ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పర్చనున్నారు. ఈ అన్ని విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్టులో తెలుగును తప్పనిసరి చేస్తూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. పైగా ఇంగ్లిష్, తెలుగు రెండింటిలో టీచర్లు బోధించేలా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య అనేది ప్రతి పాప, బాబుకి చెందిన గౌరవనీయమైన ఆస్తిగా పాలకులు భావించనంతవరకు ఏ పాలకుడైనా విద్యపై ఇంత శ్రద్ధ పెట్టలేరు. వైఎస్ జగన్ 48 ఏళ్ల యువకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. నిజానికి దేశంలో అధికారంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జగన్ అత్యంత యువ ముఖ్యమంత్రి కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఒక రాజకీయనేతగా తన ఈ విద్యా ఎజెం డాను జగన్ కొనసాగించినట్లయితే దేశంలోని ప్రభుత్వ రంగ విద్యావిధానంలో గణనీయ ముద్రను వేయడం ఖాయం. సమానత్వానికి నమూనా ఎవరి జీవితంలోనైనా విద్య అత్యంత విలువైన సంపద అనేది తెలిసిన విషయమే. ఇది బంగారం కంటే ఉత్తమమైనది. దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు ఇంగ్లిష్ విద్య అనేది తమ ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకుని మోసే బంగారు గనిలాంటిది. పదే పదే ఇది రుజువవుతోంది కూడా. అయితే స్వాతంత్య్రానంతర భారత పాలకులు ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ భాష అనే రెండు వేర్వేరు రంగాలను నెలకొల్పడం ద్వారా దేశ ప్రజలకు సమానమైన మీడియం విద్యను తిరస్కరించారు. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఈ సెంటిమెంటును తోసిపుచ్చి, ఇంగ్లిష్ కులీన విద్యావంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చాయి. ఇలాంటి సెంటిమెంటల్ లింకును జగన్మోహన్ రెడ్డి తెంచివేసారు. తన నూతన విద్యా ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు. విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో ముఖ్యమంత్రిని మనం చూడలేం. విద్యకోసం తన ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కూడా చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. తన విద్యాపథకాల కోసం ఇతర పథకాలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం మెరుగైన విద్యా నమూనాపై కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానం.. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించలేని గ్రామీణ, పేద ప్రజానీకానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయి విద్యను అందించడంలో తోడ్పడలేదు. పైగా బీజేపీ హయాంలో విద్యారంగంలో ఒక సరికొత్త వైరుధ్యం ఆవిర్భవించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో పాఠశాల విద్య విషయంలో మొండిగా వ్యవహరిస్తూనే, మరోవైపున ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను అనుమతిస్తోంది. పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహించడం ఒక్కడే సరైన, ఏకైక మార్గం. వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఏ ఒక్క స్కూల్ మూతపడదు: సజ్జల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క టీచర్ పోస్టు కూడా రద్దు కాదని తెలిపారు. జాతీయ విద్యావిధానంతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకుంటే భూముల కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలోభాగంగా క్రీడల ప్రోత్సాహానికి స్పోర్ట్స్ కిట్ల అందజేశారు. అందులో జత బూట్లు, ఒక డ్రెస్ ఉన్నాయి. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్ఈపీ అమలులో ఉపాధ్యాయుల పాత్రే కీలకమని పేర్కొన్నారు. చదవండి: నిర్ణీత సమయాల్లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఎం జగన్ -
Rabindranath Tagore: విశ్వగురువు
రవీంద్రనాథ్ టాగోర్ జీవనయానంలో, కీర్తి పతాకలో మూడు మైలు రాళ్ళుగా చెప్పుకోవలసినవి : (1) 1911లో రాసి ఆలపించిన ‘జనగణమన’ జాతీయగీతం, (2) ‘గీతాంజలి’ గేయ సంకలనానికి 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం, (3) 1921లో శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. టాగోర్కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మూడవ దాని గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. (1) ‘జనగణమన’ గేయాన్ని రవీంద్రుడు 11–12–1911న రాసి, స్వరకల్పన చేస్తే, 17 రోజుల తరువాత అంటే 28–12–1911న కలకత్తాలో జరిగిన 28వ జాతీయ కాంగ్రెస్ మహాసభలో రవీంద్రుడు స్వయంగా పాడే అవకాశం వచ్చింది. హిందీ, ఉర్దూ భాషల్లోకి ‘జనగణమన’ గేయాన్ని 1912లోనే అబీద్ ఆలీ అనువదించారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలోని బెసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కజిన్స్ అభ్యర్థన మేరకు మదనపల్లెలోనే 28–02–1919వ తేదీన ఆంగ్లంలోకి ‘భారతదేశ సూర్యోదయ గీతం’ అనే పేరుతో రవీంద్రులే స్వయంగా అనువదించగా, డాక్టర్ కజిన్స్ భార్య మార్గరేట్ స్వరకల్పన చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బెర్లిన్లో 1941 నవంబర్ 2వ తేదీన జరిగిన ‘ఆజాద్ హింద్’ సమావేశంలో ‘జనగణమన’ను జాతీయగీతంగా, ‘జైహింద్’ను జాతీయ నినాదంగా ఆమోదిం చారు. 1950 జనవరి 24న జనగణమన భారత జాతీయగీతంగా రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది. 2) గీతాంజలిని బెంగాలీలో మొదటగా 1910లో రవీంద్రుడు రచించారు. 1912లో దీనిని టాగోర్ ఆంగ్లం లోకి ‘గీతాంజలి : సాంగ్ ఆఫరింగ్స్’ అనే పేరుతో అనువదించగా, విలియమ్ బట్లర్ ఏట్స్ అనే బ్రిటిష్ కవి 20 పేజీల ముందుమాటను రాశారు. 1913లోనే ఈ గీతాంజలి ఆంగ్ల అనువాదానికి నోబెల్ బహుమతి వచ్చింది. గీతాంజలిని చలం రమ్యంగా అనువదించారు. (3) విశ్వభారతి విశ్వవిద్యాలయం : ప్రస్తుతం నూరు వసంతాలు (శతాబ్ది) నిండిన ఈ విశ్వవిద్యాలయం రవీం ద్రుని కలల సాకారం, ఆయన ఆశయాలకు ప్రతిరూపం, ఆయన సామాజిక çస్పృహకు, సేవాతత్పరతకు నిదర్శనం. తన సొంత నిధులతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం గురించి ఒక్కసారి తెలుసుకుంటే టాగోర్కు విద్య మీద ఎటువంటి ఉన్నత భావాలు కలవో, ఎటువంటి నాణ్యత గల విద్యను అందించాలనుకున్నారో, యువతను ఏవిధంగా, ఎటువంటి విద్యావంతులుగా తయారు చేయాలనుకున్నారో అర్థమవుతుంది. శాంతినికేతన్, శ్రీనికేతన్ల ప్రాంగణాలలో స్థాపించిన ఈ విద్యా సంస్థలలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ శాస్త్రాల విజ్ఞానాన్ని, వివిధ రంగాల, వృత్తివిద్యా నైపుణ్యాలను విద్యార్థులకు అందించే ధ్యేయంతో స్థాపించిన విద్యాలయం ఇది. ఒక వ్యక్తి ఏ రంగంలో నిష్ణాతులవ్వాలనుకున్నా ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విద్య సాగేది. శాంతి నికేతన్లోని విభాగాలు అన్ని రకాల శాస్త్రాల, కళల అధ్యయనానికి తోడ్పడితే, శ్రీనికేతన్ మాత్రం వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కోర్సులను అందిస్తుంది. నిజానికి విశ్వవిద్యాలయం ఎలా ఉండాలి, ఎటువంటి విద్య, కళలను విద్యార్థులకు నేర్పించాలి అనే ప్రశ్నలకు సమాధానమే కలకత్తాకు సుమారుగా 212 కిలోమీటర్ల దూరంలో ‘విశ్వ గురువు’ స్థాపించిన ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం. ‘విశ్వభారతి’ అంటేనే ప్రపంచాన్నంతటినీ ఒకే రకపు విశ్వాసం, నమ్మకం, ఆశయం కల సమూహంగా తయారుచేయడం. ఈ లక్ష్యసాధన కోసమే ‘ప్రపంచమంతా నివసించగలిగే ఏకైక గూడు’ను విశ్వ భారతి ఆశయంగా ఎంపిక చేశారు. ఇక్కడ బెంగాలీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, సంస్కృతం లాంటి భారతీయ భాషలలోను, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పెర్షియన్, రష్యన్, టిబెటన్ లాంటి విదేశీ భాషలలోను బోధన జరుగుతుంది. సత్యజిత్రే, మహాశ్వేతాదేవి, ఇందిరాగాంధీ, అమర్త్యసేన్ లాంటి దేశీయ ప్రముఖులతో పాటు, ఎంతో మంది విదేశీ ప్రముఖులు కూడా ఇక్కడ విద్యనభ్యసిం చారు. 1951లో దీనిని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చారు. 1905లో టాగోర్ రాసిన ‘నా బంగారు బంగ్లా’నే బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా స్వీకరించిన కారణంగా ప్రపంచంలో రెండు దేశాల జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తిగా టాగోర్ చరిత్రలో నిలిచిపోయారు. సర్వదేశాల సంస్కృతీసంప్రదాయాలను మన సంస్కృతీసంప్రదాయాలతో సమ్మిళతం చేయడానికి కృషిసల్పిన విశ్వ గురువు, విశ్వ కవి, గురు దేవుడాయన. -ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు వ్యాసకర్త మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఈ–మెయిల్ : mnaidumurru@gmail.com (మే 7న, శత వసంతాల విశ్వభారతి విశ్వవిద్యాలయ సృష్టికర్త టాగోర్ జయంతి) -
చదువులమ్మ ఈ లాయరమ్మ
అనాథ పిల్లలు రోజు గడవడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. జీవితంలో ఎదుగుదలకు లక్ష్యం ఏర్పాడటానికి ఊతంగా నిలిచే చదువు లభించాలంటే అందుకు దైవం నుంచి వరం లభించాల్సిందే. అలాంటి అనాథ పిల్లల చదువుకు వరప్రదాయినిగా కృషి చేస్తోంది లాయర్ పౌలోమి పావిని శ్లుక్లా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 సంవత్సరాల వయస్సులో సేవా రంగంలో గణనీయమైన కృషి చేసిన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది అనాథల విద్య కోసం కృషి చేస్తున్న పావిని పేరును ఆ 30 మంది జాబితాలో చేర్చింది. అనాథ పిల్లలకు సరైన విద్యను అందించడం ఎలాగో 28 ఏళ్ల సుప్రింకోర్టు న్యాయవాది పావినికి తెలుసు. ఆమె చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఆమె కుటుంబమే అతి పెద్ద మద్ధతు. పావిని తల్లి అరాధన శుక్లా మాట్లాడుతూ –‘దేశంలో తమ గొంతు వినిపించలేని అనాథ పిల్లలు చదువులో రాణించడం వల్ల వారి హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏమీ లేని పిల్లలు జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నది ఒక న్యాయవాది. ఆమె నా కూతురు అవడం మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆనందంగా పావిని చేస్తున్న పనిని అభినందించారు ఆమె తల్లి. స్వీయ రచన లక్నోలో ఉంటున్న రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి పావిని శుక్లా దేశం గర్వించదగిన వ్యక్తుల జాబితాలో చేరడం ఒకే రోజులో జరగలేదు. దాని వెనక పదేళ్లుగా ఆమె చేస్తున్న కృషి ఉంది. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లైన ఆరాధన శుక్లా, ప్రదీప్ శుక్లాల కూతురు పౌలోమి పావిని శుక్లా. 2015 లో భారతదేశంలో అనాథ పిల్లల దుస్థితి గురించి తన సోదరుడితో కలిసి ‘వీకెస్ట్ ఆన్ ఎర్త్– ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకం రాసింది. పావిని అదే ఏడాది అనాథల కోసం లక్నోలో ‘అడాప్ట్ ఎ అనాథాశ్రమం’ ప్రారంభించింది. ఆశ్రమ నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. వీరి నుంచి నగరంలోని పాఠశాలల నిరుపేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను ఇచ్చి చదివించగలిగింది. పిల్లలను చదివించడానికి గల కారణాలను పావిని తెలియజేస్తూ– ‘నా తొమ్మిదేళ్ల వయసులో నా పుట్టిన రోజున మా అమ్మ అనాథాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. మాట్లాడాను. చదువుకోవాలనే వారి ఆశను స్వయంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి అనాథల కోసం ఏదైనా చేయాలి అని బలంగా అనుకునేదాన్ని. దాంట్లో భాగంగానే వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాను’ అని వివరించింది. పదేళ్ల కృషి సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథ పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు దశాబ్దం పాటు కృషి చేస్తూనే ఉంది పావిని. విద్యార్థులకు అవసరమైన కోచింగ్, ట్యూషన్ల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖతో కలిసి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది నగరాల్లో 13 స్కూళ్లలోని నిరుపేద పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ డబ్బును అందజేసింది. లాక్డౌన్ సమయంలో నగరంలోని అన్ని అనాథాశ్రమాలలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకు ఆ¯Œ లైన్ విద్య సౌకర్యం లభిస్తోంది. ఈ పని ప్రారంభాన్ని వివరిస్తూ, పావిని ఇలా అన్నారు ‘ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది. అనాథల కోసం ఎక్కువ పని చేయమని సూచించిన ఈ స్థానం నన్ను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు. -
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టికల్స్కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబస్కు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు. 14 డిమాండ్లు పరిష్కరించండి కాగా, పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న 14 అంశాలను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు యాజమాన్యాలు మంత్రిని కోరాయి. ఫీజలు రాక ఏడాది నుంచి విద్యా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధనను విధించాలని కోరాయి. అన్ని తరగతులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. -
పూర్తయిన పాఠాలపైనే విద్యార్థులకు పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా బోధనను గాడిలో పెట్టే పనిలో ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులను ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన చర్యలపై కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధానమైన సిలబస్, పరీక్షల విధానంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఆన్లైన్/ టీశాట్/ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన వీడియో పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలా? లేదంటే పరీక్షలే లేకుండా పైతరగతులకు పంపించాలా అనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎక్కువ శాతం అధికారులు మాత్రం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలే అవసరం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 9, 10వ తరగతుల వారికి మాత్రం మాత్రం పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న భావనలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉన్నారు. 70 శాతం సిలబస్ మాత్రమే ఉండేలా ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మిగతా 30 శాతం సిలబస్లో ప్రాజెక్టులు, అసైన్మెంట్ ఆధారిత ఇంటర్నల్స్ ఉంటాయని పేర్కొంది. సీనియర్ అధికారులు మాత్రం పాఠశాలలు ప్రారంభమయ్యాక పూర్తి చేసే సిలబస్, ప్రస్తుతం ఆన్లైన్/ టీవీ ద్వారా ప్రసారం చేసిన పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తయ్యే పాఠ్యాంశాల్లో ప్రాజెక్టులు, అసైన్మెంట్లతో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై కూడా ఇంతవరకు అధికారిక నిర్ణయం లేదు. ఇకనైనా ప్రభుత్వం సిలబస్ కుదింపుపై స్పష్టత ఇస్తే ఆ విధానం కొనసాగుతుందని, లేదంటే ఏప్రిల్ నాటికి అయ్యే పాఠ్యాంశాలపై మాత్రమే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి విద్యాసంవత్సరాన్ని ముగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్లో.. ఇంటర్లోనూ ఇదే పరిస్థితి ఇంటర్మీడియట్ సిలబస్ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. అధికారులు ఇంతవరకు సిలబస్ కుదింపుపై తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. గతంలో 30 శాతం సిలబస్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలంగాణ పండుగలు, జాతీయనేతలు, సంఘసంస్కర్తల పాఠాలు తొలగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో.. అది నిర్ణయం కాదని, అలాంటి పాఠ్యాంశాలను తొలగించట్లేదని, పైగా అది ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మాత్రమేనని బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం 30 శాతం సిలబస్ కుదింపునకు ఓకే చెప్పినట్లు తెలిసింది. తగ్గించిన సిలబస్ను ప్రకటించలేదు. ఇంటర్మీడియట్ సిలబస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో ముడిపడి ఉన్నందున లెక్చరర్లు, విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సిలబస్ కుదింపు లేదు. కేవలం విద్యార్థులకు ప్రశ్నల సంఖ్యను పెంచి ఆప్షన్లు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఉన్న సిలబస్ మొత్తం ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వొకేషనల్ కోర్సుల సిలబస్ తగ్గింపుపైనా బోర్డు కసరత్తు చేయలేదు. -
వచ్చే ఏడాది నుంచే ‘ప్రీప్రైమరీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందుకు కసరత్తు చేస్తోంది. సదుపాయాలున్న రాష్ట్రాల్లో వచ్చే ఏడాది (2021–22 విద్యా సంవత్సరం) నుంచే మొదటిసారి అధికారికంగా ప్రీప్రైమరీ విద్యాబోధనను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సదుపాయాలు లేకపోతే తగిన ఏర్పాట్లు చేసుకొని 2022–25 విద్యా సంవత్సరాల్లోపు కచ్చితంగా అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్య అమలుపై విద్యాశాఖ దృష్టి సారించింది. నూతన విద్యా విధానం అమలుపై ఇటీవల అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై కేంద్రం చర్చించింది. ఇందులో భాగంగా ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలని తెలిపింది. 7 లక్షల మందికిపైగా ప్రయోజనం.. రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్యా అమల్లోకి వస్తే 7 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వారందరికీ ప్రీప్రైమరీ విద్యా బోధన అందనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రీప్రైమరీ విద్యకు అమలుకు నోచుకోని 5 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 35 వేలకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా 22 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. అందులో మూడేళ్లలోపు పిల్లలు 9,14,620 మంది ఉంటే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపున్న పిల్లలు 4,80,946 మంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ వస్తే వారిలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు ప్రైవేటు రం గంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న 7 లక్షల మంది పిల్లల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన, గత్యంతరం లేక అప్పులు చేసి మరీ చదివిస్తున్న కుటుంబాలకు చెందిన మరో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ విద్యను పొందే అవకాశం కలగనుంది. కేంద్రం సూచించిన కార్యాచరణ ప్రణాళికిదే ప్రీప్రైమరీ విద్యకు (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సేకరించాలి. ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడున్న సదుపాయాలను మరింత బలోపేతం చేసుకొని విస్తరించుకోవాలి. ప్రాథమిక పాఠశాల్లో ప్రీప్రైమరీ సెక్షన్లు/తరగతుల ప్రారంభానికి అనుగుణంగా విభజన చేసుకోవాలి. ఇవి ఉన్న రాష్ట్రాల్లో ప్రిపరేటరీ తరగతులను ప్రారంభించాలి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. ఇటు భాషా పరమైన మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలను స్కూల్ కాంప్లెక్స్, స్కూల్ క్లస్టర్ల పరిధిలోకి తేవడం, విద్యా బోధన అమలు, విద్యార్థుల ఆరోగ్య సంబంధ అంశాలు చూసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలి. పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు.. ప్రీప్రైమరీ విద్యా బోధనకు సంబంధించిన రాష్ట్రాలు పదేళ్ల దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. దానిని రెండు దశలుగా విభజించుకోవాలని పేర్కొంది. మొదటి దశలో సదుపాయాలుంటే వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రీప్రైమరీ విద్యను 2022 నుంచి 2025లోపు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని వెల్లడించింది. ఇక రెండో దశలో 2025–30లోగా అన్ని పాఠశాల్లో బోధనలో వృత్తి పరమైన అర్హత కలిగిన టీచర్లు/అంగన్వాడీ వర్కర్లు ఉండాల్సిందే.. అందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇందుకోసం ఎస్సీఈఆర్ఈ/డైట్/సీఆర్సీలను 2022–30 మధ్యలో బలోపేతం చేయాలి. ప్రీప్రైమరీ విద్య బలోపేతం కోసం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీడీపీ) ను అమలు చేయాలి. -
మూడేళ్లలో ప్రమాణాలు సాధించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ‘ఉన్నత విద్యా రంగంలో నూతన విద్యా విధానం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై సమావేశంలో అధికారులు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్–రీసెర్చ్ ఓరియెంటేషన్ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్లలో ప్రమాణాలు: సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీలు వచ్చే 3 ఏళ్లలో నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏసీ–న్యాక్) సర్టిఫికెట్లు సాధించాలన్నారు. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఆ గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్తో సహా, అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. మూడేళ్లలో కాలేజీల్లో మార్పు రాకపోతే, చర్యలు తప్పవని చెప్పాలన్నారు. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక బృందాలు–తనిఖీలు: ‘‘బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. టీచర్ ట్రెయినింగ్ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు?. కాలేజీలలో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్ఓపీ ఖరారు చేసుకోండి. బృందానికి ముగ్గురు చొప్పున 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. వారు అన్ని కాలేజీలలో తనిఖీలు నిర్వహించాలి. వారు శాశ్వత స్వా్కడ్ మాదిరిగా ఉండాలి. వారి పనితీరులో పారదర్శకత కోసం వారిని రొటేట్ చేస్తూ ఉండాలి. ప్రమాణాలు, నాణ్యత లేని కాలేజీలకు కొంత సమయం ఇచ్చి వాటిని మార్చుకోమని చెప్పాలి. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని’’ సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డిగ్రీ. పీజీ కోర్సుల్లో మార్పులు: ♦ఇక మీద రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు ♦అదే విధంగా మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ♦ఈ ఏడాది నుంచే అవి ప్రారంభం ♦4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ అడ్మిషన్లు. ♦వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ ♦అదే విధంగా వచ్చే ఏడాది నుంచి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ప్ అడ్వాన్స్డ్ టాపిక్స్తో కోర్సులు: ♦విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యలో అడ్వాన్స్డ్ టాపిక్స్తో కోర్సులు రూపొందించాలి. ♦ఆ దిశలో విద్యార్థులు చదివేలా కృషి చేయాలి. ♦రొబొటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా అనలటిక్స్ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలి. ♦ఇంకా బికామ్లో సెక్యూరిటీ (స్టాక్) అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలు కూడా ఉండాలి. అటానమస్ కాలేజీలు పెరగాలి: ♦రాష్ట్రంలో దాదాపు 3 వేల కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 104 మాత్రమే అటానమస్గా పని చేస్తున్నాయి. ♦కాబట్టి వీటి సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది. ♦జాతీయ అక్రిడిటేషన్ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్ విభాగాన్ని తయారు చేయాలి. ♦విద్యా సంస్థలను అన్నింటినీ కూడా అక్రిడిటేషన్ వైపు నడిపించాలి. ♦విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలు ♦విజయనగరంలో ఇంజనీరింగ్ విద్య ఫోకస్గా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ. ♦టీచర్ ఎడ్యుకేషన్ ఫోకస్గా ఒంగోలు యూనివర్సిటీ. కాగా, కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్న అధికారులు 200కు పైగా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు సమావేశంలో తెలిపారు. నిర్ణీత సమయంలోగా వాటిలో మార్పు రాకపోతే, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. -
విద్య–వైద్యమే ప్రగతికి పట్టుగొమ్మలు
ఏ దేశం గానీ, ప్రాంతం గానీ, రాష్ట్రం గానీ ప్రగతి పథంలో నడుస్తున్నది అని చెప్పాలంటే ఆ దేశం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించి, ఆచరిస్తున్న తీరును పరిశీలించి చూడాలి, అవి ప్రగతి వైపు పరుగెత్తుతున్నాయంటే వారు సేవారంగాలైన విద్యా, వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడాలి. ఎందుకంటే పౌరులు ఆరోగ్యంగా వుంటే అన్నిరంగాల్లోనూ పని పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయి. పౌరులెప్పుడూ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతుంటే ఆ ప్రాంతం ఆర్థిక పరిపుష్టి పొందలేక వెనకబడిపోవడం ఖాయం. ఇక సేవారంగంలో రెండవ అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్య.. వ్యాపారస్తులకు ధారాదత్తమై విద్యారంగం వ్యాపారంగా మారిపోయి డబ్బున్న కొద్దిమందికే పరిమితమవడంతో రాష్ట్రాల్లో, దేశాల్లో అక్షరాస్యత ఇంకా ఇంత శాతమేనని లెక్క పెట్టుకొనే స్ధితిలోనే ఉండిపోతున్నాయి. విద్యా, వైద్య రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఈ అమూల్యమైన సేవారంగాలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడంతో ప్రజలు ఎన్ని అవస్ధలు పడుతున్నారో ఈ కరోనా కాలమే రుజువు చేస్తోంది. ప్రజలకు కనీసం వైద్య పరీక్షలు చేసే సత్తా ప్రభుత్వాలకు లేకపోవడం, వారికి వైద్యం అందించాలంటే కనీస సదుపాయాలైన వసతి, ఆక్సిజన్, మందులు లేక ప్రభుత్వాలు చేతులెత్తేయడం, వైద్య పరీక్షలు సహితం నిలిపేయడం సిగ్గుచేటైన విషయం. పిల్లల చదువులు ఎలా కొనసాగాలి, ప్రత్యామ్నాయం ఏమిటి అన్న ధ్యాసలేకుండా చదువుతో ప్రభుత్వానికి ఏమి పని, ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి అనే వైఖరి చాలా రాష్ట్రాల్లో వుంది. కానీ దేశం మొత్తంపై ఇందుకు మినహాయింపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ప«థకంతో తల్లులందరూ తమ పిల్లలను సర్కారు బడికి పంపేలా చేయడంతో పాటు తిండికలిగితే కండకలదోయ్.. అనే కవివాక్కులు నమ్మి ఆంధ్రా సర్కారు ప్రభుత్వ బడులకు వచ్చే బడుగు జీవుల పిల్లలందరికీ సమతుల పౌష్టికాహారం అందించడానికి కంకణబద్ధమవడం నిజంగా సంతోషించదగిన విషయం. పాఠశాలలకు కొత్త శోభ తెచ్చి ప్రైవేటును తలదన్నేలా తీర్చిదిద్దడమంటే తెలుగు తల్లికి వీరగంధం పూయడమే. ఈ చర్యలు రాష్ట్రంలో విద్యా గంధం విరబూయాలనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు దర్పణం. బడుగు బతుకులకు ఇంగ్లిష్ విద్య వద్దని ఏపీలో రాజకీయ జీవులు అరచి గీపెట్టినా ఆ బడుగు జీవుల పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందివ్వడానికి కంకణబద్ధుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యపట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెబుతున్నారు. ఇక ప్రజారోగ్యం విషయానికి వస్తే కరోనా పరీక్షల్లో దేశంలోనే ప్ర«థమస్థానంలో నిలచి, ఏపీ సీఎం వైఎస్ జగన్ తమ రాష్ట్రం ప్రజలకు అండగా నిలవడం, పథకం ప్రకారం కరోనాను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ఓ ఎత్తు కాగా, ప్రజారోగ్యం కోసం శాశ్వత ప్రాతిపదికన 1,088 అంబులెన్సులు ఒకే రోజు ప్రవేశపెట్టి వాటిని ఆషామాషీగా రోడ్డుపై తిరిగే డబ్బాల్లాగా గత పాలకుల రీతిన చేయకుండా, అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా వాటిల్లో సహితం పిల్లల కోసం ప్రత్యేకించిన అంబులెన్సులు ప్రవేశపెట్టడాన్ని అభినందించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు సేవారంగాలైన విద్యా, వైద్య రంగాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్న కేరళలోని విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మానవాభివృద్ధిలో ముందడుగు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అదే సమయంలో ఈ విద్యా, వైద్య రంగాల్లో వెనకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలబడటం ఖాయం. అభివృద్ధికి పట్టుగొమ్మలైన విద్యను, వైద్యాన్ని ప్రభుత్వ రంగం నుండి తరిమికొట్టి ప్రైవేటు రంగానికి కట్టబెట్టినన్ని రోజులూ అభివృద్ధి ఒక వర్గానికే పరిమితమౌతుంది. వ్యాసకర్త: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం, 93910 24242 -
విద్యా కానుక
-
ఇంజనీరింగ్ విద్యకు కొత్తరూపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ విద్య స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రూపొందించిన మోడల్ కరిక్యులమ్ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది ఐదారు కాలేజీలకే పరిమితమైన, సంస్కరణలతో కూడిన రీ ఇంజనీరింగ్ విద్య 2020–21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతోంది. పరిశోధన, ఆవిష్కర ణలకు ప్రాధాన్య మిస్తూ, ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్న కోర్సులను, అందు కనుగుణంగా మార్పు చేసిన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేఎన్టీ యూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ విద్యలో సం స్కరణలను 2020– 21 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనున్నాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకనుగుణంగా భవిష్యత్లో డిమాండున్న కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రానున్నాయి. సామర్థ్య పెంపే లక్ష్యంగా.. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు, పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మోడల్కరిక్యులమ్ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి చెందిన 8 మంది ఎక్స్పర్ట్స్, 33 ఐఐటీ ఎక్స్పర్ట్స్లతో కూడిన 11 కమిటీలు బీటెక్ మోడల్ కరిక్యులమ్ను రూపొందించాయి. బీటెక్లో క్రెడిట్స్ను కూడా 200 నుంచి 160కి తగ్గించాయి. ఇక పారిశ్రామిక రంగానికి చెందిన 12 మంది ఎక్స్పర్ట్స్, జాతీయ విద్యా సంస్థలకు చెందిన 22 మంది నిపుణులతో కూడిన కమిటీ ఎంటెక్లోనూ మోడల్ కరిక్యులమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనూ క్రెడిట్స్ను 68కి తగ్గించింది. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ తెచ్చిన ఈ సంస్కరణలను రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా, పారిశ్రామిక రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో కూడిన విద్యా బోధన, విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాన్ని ప్రోత్సహించడం, ఇష్టమైన సబ్జెక్టులను చదువుకునేలా సరళీకరణ విధానం విద్యార్థులకు అందుబాటులోకి రాబోతోంది. అంతేకాదు పరీక్ష సంస్కరణలు రాబోతున్నాయి. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేలా 18 శాతం, అవగాహన స్థాయిని పరీక్షించేలా 30 శాతం, విద్యార్థులు తాము తెలుసుకున్న విషయాన్ని అప్లై చేసే సామర్థ్యాన్ని పరీక్షించేలా 46 శాతం మార్కుల విధానం అమల్లోకి రానుంది. ప్రోత్సహిస్తున్న ఉన్నత విద్యామండలి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ఈ సంస్కరణల అమలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెన్నంటి ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలకు, అధ్యాపకులకు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. కొత్త సంస్కరణలు, కొత్త కోర్సులకు సంబంధించిన అనుభవజ్ఞులను, పారిశ్రామిక రంగాల వారిని తీసుకురావడం, ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలను తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే సిద్ధం చేసిన కార్యాచరణను అమల్లోకి తేబోతున్నారు. మరోవైపు విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు ఇండక్షన్ ప్రోగ్రాం, తప్పనిసరిగా వేసవిలో ఇంటర్న్షిప్ విధానం అమలుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోర్ సబ్జెక్టులతోపాటు భారత రాజ్యాంగం, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ వంటి అంశాలను విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాయి. కచ్చితంగా 3 వారాల ఇండక్షన్ ప్రోగ్రాం.. ఇంజనీరింగ్లో చేరే ప్రతి విద్యార్థికి కచ్చితంగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీతోపాటు క్రియేటివ్ ఆర్ట్స్, యూనివర్సిల్ హ్యూమన్ వ్యాల్యూస్, లిటరసీ, ఫ్రొఫిషియెన్సీ మాడ్యూల్స్, ప్రముఖులతో ఉపన్యాసాలు, స్థానిక ప్రదేశాలు సందర్శన, తాము చేరిన బ్రాంచీలకు సంబంధించిన విశేషాలు సమగ్రంగా వివరించడం వంటి చర్యలు చేపడతారు. తద్వారా ఆ విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించిన అవగాహనతో ముందునుంచే చదువుకునేందుకు వీలు ఏర్పడనుంది. ఇందులో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం, బోధనలో అవసరమైన చర్యలు చేపడతారు. 1,000 గంటల ఇంటర్న్షిప్.. నాలుగేళ్ల బీటెక్ కోర్సు విద్యార్థులకు 1,000 గంటల ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ఏఐసీటీఈ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విద్యార్థి దీనిని తప్పసరిగా చేసేలా నిబంధన విధించింది. అందులో విద్యా పారిశ్రామిక సంబంధ ఇంటర్న్షిప్ను 600–700 గంటల చేయాల్సి ఉంటుంది. అలాగే 300–400 గంటలు సామాజిక సేవా సంబంధ అంశాల్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యా సంస్థలు తమ బడ్జెట్లో 1 శాతం కచ్చితంగా కేటాయించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. డిమాండున్న కోర్సులకు ప్రాధాన్యం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సులను ఏఐసీటీఈ గతేడాది అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలోని ఐదారు విద్యా సంస్థలు మినహా మిగతావేవీ వీటిని అమలు చేయలేదు. రానున్న విద్యా సంవత్సరంలో మాత్రం వీటిని కచ్చితంగా అమలుచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలు తమ పరిధిలోకి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి ప్రధాన కోర్సులున్నాయి. వాటిల్లోనే 90 శాతం మంది విద్యార్థులు చేరుతున్నారు. అయితే వాటిల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంజనీరింగ్ కోర్సుల స్వరూపం మారుతోంది. అందుకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబొటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజైన్, ఏఆర్ అండ్ వీఆర్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులను ఏఐసీటీఈ అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతున్నాయి. -
సంపూర్ణ అక్షరాస్యత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణను 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ప్రతి ఒక్కరు–ఒకరికి బోధించాలి’అనే నినాదం అందుకుని ప్రతీ విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. ‘ఆరేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, అనేక మంది ప్రశంసలను అందుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే శక్తిని రాష్ట్రం సంతరించుకున్నది. మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది కూడా మనందరికీ గర్వకారణం. సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగాం. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. రాబోయే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వంద శాతం అందుతాయి.. రాష్ట్రం సుభిక్షమవుతుంది. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా నిలిచింది. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో వెనకబడటం మచ్చ ‘అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండటం ఓ మచ్చగా మిగిలింది. అందరినీ అక్షరాస్యులను చేయడంలో గత పాలకులు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెలంగాణ అధిగమించాలి. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్న భరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదే స్ఫూర్తితో తెలంగాణను వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్టను రూపుమాపాలి’అని సీఎం పిలుపునిచ్చారు. -
ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ మండల, గ్రామ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. గురువారం మంత్రి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంగ్లీష్ నైపుణ్యం పిల్లలకు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.36 శాతం మాత్రమే ఆంగ్ల భాష అభ్యసిస్తున్నారని వివారలను వెల్లడించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యము, ప్రతిభ బయటపడుతుందని చెప్పారు. తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాషను కూడా బోధిస్తామని, ఆంధ్రప్రదేశ్ను ఆంగ్ల ప్రదేశ్ అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, విద్యార్థుల బావి తరాల భవిష్యత్ను గుర్తు పెట్టుకుని ఇంగ్లీషు మీడియంను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పెట్టామని అన్నారను. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెడుతున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు మీడియం లేక చాలా మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగీషు మీడియంను ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదలు, వెనుక బడిన ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. -
అమ్మ ఒడి పథకాన్ని వివరించాం: మంత్రి ఆదిమూలపు
ఢిల్లీ: చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన శనివారం నూతన విద్యా విధానం ముసాయిదాపై ఏపీ ప్రభుత్వం తరఫున పలు సూచనలు అందజేశారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమావేశంలో వివరిస్తూ.. ఈ పథకంలో 43 లక్షల మంది తల్లులు ఉన్నారని, ఒక్కో తల్లికి రూ.15 వేల చొప్పున ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సాయం చేయాలని ఆయన కోరారు. ఇందులో విద్యార్థుల ఓట్ల రేట్లు తగ్గుతాయని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రూ. 5 వేల కోట్ల నిధులు కావాలని ముసాయిదాకు విజ్ఞప్తి చేశారు. మూడో తరగతి నుంచి కంప్యూటర్ బోధన జరిగేలా ఉండాలని సూచనలు చేస్తూ.. టెక్నాలజీని వీలైనంత ఏక్కువగా ఉపయోగించుకోవాలి తెలిపారు. ప్రైవేటు టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక పాలసీ రావాలని.. ప్రైవేటు పాఠశాలల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వలె ‘ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్’ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులకు సిలబస్ కూడా మార్పులు చేయాలన్నారు. ఉన్నత విద్యలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్థానిక వనరులను బట్టి పరిశ్రమల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా రూపొందిస్తామన్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కాలేజీలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 16 శాతం నిధులతో సుమారు రూ. 33 వేల కోట్లలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, సీనియర్ అకడమిక్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ను పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజు విధానంపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పాత ఫీజుల ప్రకారమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్న టీచర్ల స్థితిగతులపై కమిషన్ సూచనలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవసరానికి మించి డీఎడ్ కాలేజీలు ఉన్నాయని.. డీఎస్సీ నిర్వహణకు కొంత సమయం పడుతుందన్నారు. కోర్టులో కేసుల కారణంగా కొంత ఆలస్యం అవుతోందని తెలిపారు. అక్టోబర్ చివరివరకు పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని వెల్లడించారు. హ్యాపీనెస్ ఇండెక్స్, క్వాలిటీ, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముసాయిదా విద్యావిధానాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు స్పష్టం చేశారు. వాటిలో కొన్ని మార్పులు చేయాలని మంత్రి సూచనలు చేశారు. మనది లౌకిక ప్రభుత్వం.. దాని ఆధారంగానే ‘విద్యావిధానం’ ఏర్పడుతుందని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
‘త్వరలోనే 10,224 లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీ’
సాక్షి, విజయవాడ : విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అందుకు అనుగుణంగా సంస్కరణలు తీసుకువస్తామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. త్వరలోనే 10,224 లాంగ్వేజ్ పండిట్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. గురువారం విజయవాడలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా అపరిషృతంగా ఉన్న సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జీతాలను పెండింగ్లో పెట్టిందని గుర్తుచేశారు. రెండేళ్లలో రూ. 63వేల కోట్ల నిధులను టీడీపీ తప్పుదారి పట్టించిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఆ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించిందని మండిపడ్డారు. పారిశుధ్య కార్మికుల సమస్యపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది పరిస్థితిని గాడిలో పెడతామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రెండు నెలల్లోనే మేనిఫెస్టోలోని 80 శాతం అంశాలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న 6,267 మందికి ప్రమోషన్లు ఇచ్చామని, బడ్జెట్లో విద్యాశాఖకు రూ. 33వేల కోట్లు కేటాయించామని.. ఇది విద్యాశాఖకు సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న హాస్టల్స్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య రంగానికి 152 కోట్లు కేటాయించమని వెల్లడించారు. యూనిసెఫ్ సౌజన్యంతో కెరీర్ కౌన్సిల్ పోర్టల్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోర్టల్.. ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ పోర్టల్ అనే ఆన్లైన్ సైట్ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు తెలిపారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా తెలియజేస్తే 25 రోజుల్లో పరిష్కారం చూపుతామని వెల్లడించారు. త్వరలో మూతబడిన పాఠశాలలను రీ ఓపెన్ చేయిస్తామని ప్రకటించారు. 18004252428 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. 72,73,74 జీవోలపై ఉన్న స్టేల పక్కన పెట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని చూస్తున్నామని అన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. -
విద్యా విధానానికి పంచ సూత్రాలు
- ప్రజ్ఞా భారతి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ - పరిశోధన విద్యార్థులకు నెలకు రూ.75 వేల ఉపకార వేతనం సాక్షి, హైదరాబాద్: దేశంలో సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉద్ఘాటించారు. ప్రధానంగా ఐదు సూత్రాలతో ఈ విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విలువైన, సౌలభ్యమైన, సమానమైన, నాణ్యమైన, జవాబుదారీతనంతో కూడిన విద్యను ప్రజలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్లోని భారతీయ విద్యా భవన్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రజ్ఞా భారతి సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తరగతి గదిలో అల్లరి చేసే విద్యార్థులను ఆందోళన కలిగించేలా వారించొద్దని సూచించారు. ఆవిష్కరణలకు ఇక్కడే పేటెంట్.. ‘ఉన్నత చదువులు చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వలసలు కడుతున్నారు. అక్కడే పరిశోధనలు చేసి ఆవిష్కరించిన వాటిపై పేటెంట్ పొందుతున్నారు. దీంతో మన దేశ సంపద పొరుగు దేశాల పాలవుతోంది. ఇకపై ఇలా జరగ కుండా స్వదేశంలోనే పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. వారి ఆవిష్కరణలకు ఇక్కడే పేటెంట్ వచ్చేలా చూస్తాం. ప్రతిభావంతులైన పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.75 వేల ఉపకార వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల బడ్జెట్ లో పరిశోధన విద్యకు రూ.20 వేల కోట్లు కేటా యించాం. వచ్చే మూడేళ్లలో నిధులు మరింత ఎక్కు వగా కేటాయించి సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాం. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. దీనిపై అమెరికా సెనెట్లో సుదీర్ఘంగా చర్చించారు. అంతటి సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో ఉండటం గర్వంగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్లు వాడటం మొదలు పెట్టిన మనం.. ఇప్పుడు ఇరవై నిమిషాలు దాన్ని విడిచి ఉండలేకపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం మనల్ని అంతలా దగ్గరకు తీసుకుంది’ అని వివరించారు. దారి మళ్లించే యత్నం చేశారు: దత్తాత్రేయ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, వామపక్ష మేధావులు తమ చాకచక్యంతో దేశాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారని, ఇతర దేశాల ఆశయాలను ఇక్కడ రుద్దేలా వ్యవహరించారని అన్నారు. అలాంటి సమయంలో ప్రజ్ఞా భారతి వంటి సంస్థలు దేశ సంస్కృతిని కాపాడేలా కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేశాయని చెప్పారు. దేశంలో వెయ్యిన్నరకు పైబడి భాషలు మాట్లాడే వారున్నా మనమంతా ఒకే కుటుంబ సభ్యుల్లా కొనసాగుతున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సూపర్ పవర్గా మారుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై విస్తృత చర్చలు నిర్వహిస్తున్న ప్రజ్ఞా భారతి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీశ్ రెడ్డికి ప్రజ్ఞా పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే, ప్రజ్ఞాభారతి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ టి.హనుమాన్ చౌదరి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఎస్.రామచంద్రం, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.