harrasement
-
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 2022లో జస్థాన్లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే హైకోర్టు తీర్పును రామ్జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. -
విమానంలో మహిళకు వేధింపులు..వ్యక్తి అరెస్ట్
చెన్నై:ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాజేష్శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితునిది రాజస్థాన్ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: జాక్పాట్ కొట్టిన మెకానిక్..లాటరీలో రూ.25 కోట్లు -
బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్
బెంగాల్లో టీఎంసీలు నిరసనలు అప్డేట్స్.. 👉బెంగాల్లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I know that CPM and BJP vandalised RG Kar Medical College and Hospital...They went there at 12-1 am in the night, the video shows that CPM took the DYFI flag and BJP took the national flag. They have misused the national… pic.twitter.com/WzEPz1Q0CT— ANI (@ANI) August 16, 2024👉మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు. 👉పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. #WATCH | West Bengal CM Mamata Banerjee holds a protest against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in Kolkata She is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/3wkc3V1aza— ANI (@ANI) August 16, 2024 #WATCH | West Bengal CM Mamata Banerjee takes out a rally against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, in KolkataShe is demanding justice for the victim and capital punishment for the accused. pic.twitter.com/z8rBxRuqGn— ANI (@ANI) August 16, 2024 -
సోషల్ మీడియాలో వేధింపులు.. తేజస్వినీ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నాపై ఈ అఘాయిత్యం..! నేనేమి చేశాను పాపం..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాకు ఆరేళ్లు.. అమ్మానాన్న ప్రేమగా చూసుకునేవారు. ఏడు నెలల చెల్లితో బాగా ఆడుకునేదాన్ని. సంతోషంగా గడుస్తున్న జీవితంలో ఒక్కసారిగా ఇలా.. ఎవరికి ఏం కీడు చేశాను? ఇంకా ఎంత మంది చిన్నారులు బలికావాలి? ఏ అమ్మాయికి ఇలాంటి అఘాయిత్యం జరగకుండా చూడండి. ఏం చేస్తే బాగుంటుందో.. ఆలోచించండి. బాలికలను కాపాడండి. నాలాంటి బాధితులు సమాజంలో ఎందరో ఉన్నారు. మీకు తెలిసింది కొందరే. కొన్ని రోజులు బాధపడి వదిలేసే విషయం కాదు. నా వయసు చూడండి.. నాకేం తెలుసని ఇలా చేశారు? నా బాల్యాన్ని ఎందుకు దూరం చేశారు? మీ కూతురిలా.. చెల్లిలా.. కనిపించడం లేదా? సీ్త్రని దేవతగా పూజించే ఈ దేశంలో ఇంత దారుణ పరిస్థితులా? నిర్భయ.. దిశ.. వరంగల్ చిన్నారి.. ఇప్పుడు నేను.. దీనికి ముగింపు ఎప్పుడో? – ‘హత్యా’చారానికి గురైన చిన్నారి ఆత్మఘోషఅప్పటివరకు అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా మాయమై, విగతజీవులుగా మారితే.. అదిచూసిన కన్నోళ్ల పరిస్థితి ఏమిటి? ఆకాశంలో గద్దలు అకస్మాతుగా నేల మీదకు వచ్చి కోడిపిల్లలను తన్నుకుపోయినట్లుగా పొత్తిళ్లలో, తల్లి ఒడిలో నిద్రపోతున్న పసిపిల్లలను ఎత్తకుపోతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడినవారు సమాజానికి ము ప్పుగా, పిల్లల పాలిట యమకింకరులుగా త యారయ్యారు.తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలంలోని కాట్నపల్లిలో గురువారం రాత్రి జరి గిన ఆరేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, ఆపై హత్య ఘటన భయానకవాతావరణం సృష్టించింది. ముక్కుపచ్చలారని చిన్నారిని మానవ మృగం చిదిమేసిన తీరుపై స్థానికులు భగ్గుమన్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.‘వలస’ బతుకులు అగమ్యగోచరంవలస కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. పనికి తగ్గ వేతనం, పని ప్రదేశాల్లో కనీస వసతులు మృగ్యమయ్యాయి. దీనికితోడు ఎప్పుడు ఎవరి నుంచి ఆపద ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. వలస కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు.. వారి భద్రతకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలేంటి.. పని ప్రదేశాల్లో వసతుల కల్పనపై పట్టించుకునేవారు కరువయ్యారు.ఏ అండ లేకపోవడంతో లైగింక వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లోనే కేసులు నమోదవుతుండగా, చాలావరకు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, సెటిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కాట్నపల్లి రైస్మిల్లులో పని చేయడానికి వచ్చిన కుటుంబాలకు వేర్వేరుగా వసతి గదులు, వాటికి తలుపులు లేకపోవడం వల్లే సంఘటన జరిగిందన్న చర్చ జరుగుతోంది.మద్యం, గంజాయి మత్తులో..మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఎక్కువ శాతం మద్యం, గంజాయి మత్తులోనే చోటుచేసుకుంటున్నట్లు నేరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా 24 గంటలు బెల్టుషాపుల్లో మద్యం లభిస్తుండంతోపాటు వలస కార్మికులు ఉన్న ప్రదేశాల్లో కొన్ని ముఠాలు గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియాలి..పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో తెలియాలి. దీనిపై ప్రతీ పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయమై తల్లిదండ్రులు ఆరా తీస్తుండాలి. చుట్టుపక్కల ఉండేవారిపై ఓ కన్నేసి ఉంచాలి. లైంగిక దాడులు చిన్నారులపై దీర్ఘకాలిక మానసిక దుష్ప్రభావాలు చూపుతాయి. ఇలాంటి పని చేసినవారు వయసులో పెద్దవారు, బంధువు అని చూడకూడదు. ఒకవేళ వదిలేస్తే వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది.పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది కార్మికులు..కార్మిక శాఖ లెక్కల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో భవన నిర్మాణ కార్మికులు 6 వేల మంది వరకు, రైస్మిల్లుల్లో 2,500 మంది, ఇటుక బట్టీల్లో 1,500 మంది పని చేస్తున్నారు. యజమానులు దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల వలస కూలీలకు అడ్వాన్స్ చెల్లించి, పనికి తీసుకువస్తున్నారు. డబ్బులకు ఆశపడి వచ్చిన కార్మికులు ఇక్కడి వాతావరణంలో పని చేయలేక, పని ఒత్తిడి, లైగింక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు.పక్కలో నుంచి ఎత్తుకుపోయి సంపిండు..మేము నెల కింద పని కోసం మిల్లుకు వచ్చాం. ఎప్పటిలాగే మా ఇద్దరు బిడ్డలతో కలిసి రేకుల కింద పడుకున్నం. వర్షం పడుతుండటంతో లోపలికి తీసుకుపోయిన. కరెంట్ పోవడంతో ఉక్కపోస్తోందని బయటకు వచ్చాం. పిల్లలను పడుకోబెట్టిన. రాత్రి 11 గంటలకు చూస్తే పాప కనబడలేదు. పక్కలో నుంచి ఎత్తుకపోయి సంపిండు. వాడిని విడిచిపెట్టొద్దు. – మృతురాలి తల్లి ఆవేదనపరిచయస్తులే నిందితులు..పోక్సో కేసులకు సంబంధించి బాధితుల్లో చాలామంది తమకు పరిచయస్తులు, బంధువుల చేతిలోనే లైంగికదాడులకు గురవుతున్నారు. కుటుంబ పరువు మంటగలుస్తుందని వారు బయటకు రావడం లేదు. ఇదే సమయంలో పరిచయం లేనివారు కూడా ఎక్కడినుంచో వచ్చి, అఘాయిత్యాలకు పాల్పడుతూ ప్రాణాలు తీసి, కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కాట్నపల్లి ఘటన నిందితుడు మృతురాలి తల్లిదండ్రులు పనిచేసే చోటే పని చేస్తుండటం గమనార్హం.గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..2019లో ఎలిగేడు మండలం శివపల్లి పరిసరాల్లోని రైస్మిల్లులో వలస మహిళా కూలీపై అత్యాచారం జరిగింది.2021 నవంబర్లో పెద్దపల్లిలోని రంగాపూర్ ఇటుక బట్టీల్లో వలస కూలీపై అత్యాచారం చేయగా, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.2023 ఆగస్టులో అప్పన్నపేట వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన బాలిక రక్తస్రావంతో మృతిచెందింది. మొదట్లో సామూహిక అత్యాచారం చేశారని ప్రచారం జరిగింది. తర్వాత, క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.ఉమ్మడి జిల్లాలో పోక్సో కేసులు..కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి. -
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే..
బైక్ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
-
శేజల్తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమపై కేసులు పెట్టించారని గత రెండు నెలలు నుంచి పలు రకాలుగా ఆందోళన చేస్తున్న ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్తో బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్లు శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని, అలాగే ఆమెకు న్యాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యకు షాక్! -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది. ఇటీవల దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంలూ జాతీయ మహిళా కమిషన్కు సైతం శేజల్ ఫిర్యాదు చేసింది. అయితే రోజుల వ్యవధిలోనే సీబీఐని ఆశ్రయించిన ఆమె.. తెలంగాణ పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని తెలిపింది. ఇటీవల జాతీయ మహిళా కమిషన్కు సైతం ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్ విడుదల చేసింది. దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
ప్రేమించి పెళ్లి.. కానిస్టేబుల్ భర్త వేధింపులు భరించలేక
సాక్షి, మలక్పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (కానిస్టేబుల్) పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాస్ కుమార్తె పవిత్ర(27), తిరుమలగిరిలో కానిస్టేబుల్గా పని చేస్తున్న అవినాష్ 2016 జూన్ 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మలక్పేటలోని బి–బ్లాక్ క్వార్టర్స్లో నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు అవిక్షిత (5) ఉంది. అయితే కూతురు పుట్టినప్పటినుంచీ అవినాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాగుడుకు బానిసై అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం మత్తులో పవిత్రను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై మహిళా పోలీసుల వద్ద అతనికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా అతని ప్రవర్తన మారలేదు. ప్రవర్తన మార్చుకుంటానని, మద్యం మానేస్తానని మామ శ్రీనివాస్కు చెప్పగా.. కారు కొనుకోవడానికి రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం అవినాష్ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4.30 గంటలకు అత్త రేణుకకు ఫోన్చేసి అరగంట నుంచి తనతో పవిత్ర గొడవ పడుతోందని చెప్పాడు. సాయంత్రం మామకు ఫోన్ చేసి పవిత్ర చీరతో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. అల్లుడు అవినాష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలు తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. -
మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని
సాక్షి, కరీంనగర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా వద్దని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో అక్కడే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్కు చెందిన ఎండీ.ఫారూఖ్ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫారూఖ్ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది. నిరసన తెలుపుతున్న దుర్గ మొదటి భార్యతో కలిసి వేధింపులు.. ఫారూఖ్తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. అలుగునూర్లో ఉంటున్నట్లు తెలుసుకొని.. ఫారూఖ్ ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు -
యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి..
సాక్షి, హైదరాబాద్: బాధితురాళ్ల భయమే పోకిరీలకు అవకాశంగా మారుతోంది. ఫిర్యాదు చేయడానికి, ఆధారాలు అందించడానికి అనేక మంది వెనుకడుగు వేయడంతోనే పదేపదే వేధింపుల బారినపడుతున్నారు. నగరానికి చెందిన ఓ యువతి తనను వేధించిన పోకిరీని అతడి వాహనంతో సహా ఫొటో తీయడమే కాకుండా షీ–టీమ్స్ మెట్లు ఎక్కింది. వాహనం నంబర్ ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం గురువారం అతడికి ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఓ మహిళ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో పని చేస్తోంది. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్పై వెంట పడటంతో పాటు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. రెండుసార్లు ఇలా చేయడంతో పాటు ఈ నెల 16న బంజారాహిల్స్ రోడ్ నం.12లోని లక్ష్మీనర్సింహ్మ స్వామి దేవాలయం వద్దా ఆమెను వేధించాడు. దీంతో ధైర్యం చేసిన బాధితురాలు పోకిరీతో పాటు అతడి వాహనాన్నీ ఫొటో తీసింది. షీ–టీమ్స్కు ఫిర్యాదు చేసి తన వద్ద ఉన్న ఫొటోను చూపించింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ఫొటోలో ఉన్న వాహనం నంబర్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో అతడు బంజారాహిల్స్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి జి.నగేష్గా తేలింది. వెయిట్ లాస్ టెక్నిక్స్ పేరుతో ఆమెతో పరిచయం పెంచుకుని, స్నేహం చేయడానికి ప్రయత్నించాడని విచారణ లో తేలింది. నగేష్ను షీ–టీమ్స్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు అదన పు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి బాధితురాలు ఇలా ధైర్యం చేసి ముందుకు వస్తే పోకిరీలకు చెక్ పడుతుందని, ఫలితంగా వారితో పాటు మరికొందరూ వీరి బారినపడకుండా ఉంటారని అధికారులు చెప్తున్నారు. చదవండి: చక్రబంధంలో లింగంపల్లి.. చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు మరో ముగ్గురికీ జైలు శిక్ష బన్సీలాల్పేట్: మద్యం మత్తులో మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన, స్థానికంగా న్యూసెన్స్ చేసిన మరో ముగ్గురికి గురువారం జైలు శిక్ష పడింది. వీరిలో ఒకరికి 112 రోజుల జైలు విధించడం గమనార్హం. భోలక్పూర్ ప్రాంతానికి చెందిన మణికంఠ, భువనేశ్వర్ మద్యం మత్తులో ఆటోలో వెళ్తున్న మహిళలను వేధిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు నగర్ వాసి భరత్ ఎలియాస్ భల్లుపై రౌడీషీట్ ఉంది. ఇతగాడు స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఎప్పుడు పడితే అప్పుడు మద్యం మత్తులో హంగామా చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇతగాడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ముగ్గురినీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. వీరిపై దాఖలు చేసిన చార్జ్షీట్లు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం భరత్కు 112 రోజులు, మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్కు 19 రోజుల జైలు శిక్ష విధించింది. -
ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, జియాగూడ: ఆన్లైన్ యాప్లలో యువత రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్లు తీసుకునే సమయంలో ఇచ్చే రెఫరెన్స్ నంబర్లకు మెసేజ్లు పెడుతుండటంతో అవమాన భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జియాగూడ న్యూ గంగానగర్లోని రాజ్కుమార్ యాదవ్(22) ప్రముఖ కార్ల కంపెనీలో డ్రైవర్ కమ్ డెలివరి బాయ్. దాంతోపాటు జియాగూడ మేకలమండిలో చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్లో రూ.12 వేల రుణం పొందినట్లు బంధువులు తెలిపారు. బకాయిలు చెల్లించలేదని లోన్ యాప్ నిర్వహకులు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పాటు స్నేహితులకు మెసేజ్లు పెడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన రాజ్కుమార్ యాదవ్ ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరేళ్ల క్రితం వివాహం.. రూ. 10 లక్షలు కట్నం తేవాలని..
సాక్షి, మహబూబాబాద్ (వరంగల్): వరకట్న వేధింపులు, సూటిపోటి మాటలు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మానుకోట జిల్లా కేంద్రంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గందె శ్రీనివాస్ – కళావతి దంపతుల పెద్ద కుమార్తె అనూష(26)ను మహబూబాబాద్కు చెందిన భూముల వెంకన్న– వెంకటమ్మ రెండో కుమారుడు రవిచందర్కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కట్నం రూపంలో ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రవిచందర్ కరోనా కారణంగా ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలే కావడంతో మరో రూ.10 లక్షల అదనపు కట్నంతేవాలని రవిచందర్ భార్య అనూషను వేధించడంతోపాటు సూటిపోటి మాటలతో మనోవేధనకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేమాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించగా తహసీల్దార్ ఎం.రంజిత్కుమార్, సీఐ రవికుమార్ వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు. -
‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’
గాంధీనగర్: దెయ్యాలున్నాయో, లేవే తెలియదు కానీ.. వాటికి సంబంధించిన వార్తల మీద జనాలకు ఎంతో ఆసక్తి. దెయ్యాలను వదిలించే బాబాలకు మన సమాజంలో ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఈ దెయ్యాల గొడవ ఎందుకంటే తాజాగా గుజరాత్లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వింత ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలుగా హమ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్భాయ్ బరియా(35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. ప్రశాంతంగా ఉడనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గ్రూపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు. బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి.. కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో బరియా మానసిక పరిస్థితి సరిగా లేదని.. గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులగా మందులు తీసుకోవడం మానేశాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అతడికి వైద్యం అందిచాల్సిందిగా సూచించారు. చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?! -
కరోనా కష్టకాలంలో వృద్ధులపై పెరిగిన వేధింపులు
-
కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...!
కొత్తకోట రూరల్: కొడుకు మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతూ తాగొచ్చి కొట్టి.. లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని తల్లి అతడిని తుదముట్టించింది. హత్య చేశాక ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన హరిజన్ నాగమ్మకు 25 ఏళ్ల క్రితం పామాపురం వాసి శాంతన్నతో వివాహమైంది. వీరికి కుమారుడు శివ (25), కూతురు అంజలి ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో నాగమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తల్లి బుచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కూతురు అంజలికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. కుమారుడు శివ ట్రాక్టర్ డ్రైవర్గా, హమాలీగా పనిచేస్తున్నాడు. అయితే శివ ఇటీవల మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. తరచూ తల్లిని, అమ్మమ్మను దూషించడంతో పాటు కొడుతుండేవాడు. అలాగే తల్లిని లైంగికంగానూ వేధించసాగాడు. దీంతో అతడి ప్రవర్తనకు తట్టుకోలేక ఎలాగైనా అంతమొందించాలని నాగమ్మ, బుచ్చమ్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన రాత్రి గాఢ నిద్రలో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు కట్టి కత్తితో పొడిచి చంపేశారు. బయట పడిందిలా.. ప్రస్తుతం గ్రామంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతోంది. శివ ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో ఈనెల 21వ తేదీన సాయంత్రం తోటి హమాలీలు ఇంటికి వెళ్లి ఏమైందని తల్లి నాగమ్మను అడగ్గా ఆమె తడబడుతూ సమాధానం చెప్పింది. చివరకు 22న సర్పంచ్ లతకు అసలు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వనపర్తి డీఎస్పీ కిరణ్కుమార్, ఇన్చార్జి సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగమ్మ, బుచ్చమ్మలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం డాక్టర్, తహసీల్దార్ సమక్షంలో శివ మృతదేహాన్ని వెలికితీస్తామని తెలిపారు. కాగా, ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా సమస్యలపై పోరాడుతున్న యువతికి వేధింపులు..
సాక్షి, బంజారాహిల్స్: సోషల్ మీడియాలో మహిళల సమస్యలపై పోరాడుతున్న యువతిని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్లో నివాసముంటున్న యువతి(31) బ్యూటీషియన్గా పని చేస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులను తన ఫేస్బుక్ పేజీ ద్వారా వెలుగులోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో ఫేస్బుక్ ద్వారా మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు అశ్లీల ఫొటోలను పంపిస్తున్నారు. అతడితో పాటు కెరాటాల రాజేశ్వరి, తాళ్ల శివారెడ్డి, స్నేహారెడ్డి తదితరులు కూడా ఇదే విధంగా అసభ్యంగా మాట్లాడుతూ అశ్లీల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన పేరుతో ఫేక్ అకౌంట్ను నిర్వహిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354(ఏ), 66(డి), 67ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు!
సాక్షి, పాలకుర్తి(ములుగు): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు భర్తకు దేహశుద్ధి చేయించే వరకు వెళ్లింది. ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీంతో మురళి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి దాడి విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ విషయమై పీఎస్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం ఎస్సై సతీష్ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు. -
ఆడ పిల్లలు పుట్టారని భర్త వేధింపులు.. దీంతో ఆ మహిళ
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): ఆడపిల్లలు పుట్టారని భర్త నిత్యం వేధిస్తుండంటంతో ఓ వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన లింగంపేట మండలంలోని పొల్కంపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల నాగవణి(27), సంజీవులు భార్యాభర్తలు. వీరికిపెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. ఈదంపతులకుఇద్దరు ఆడపిల్లలు భవిత(11), లాస్య (ఏడాది)ఉన్నారు. సంజీవులు బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి తిరిగి వచ్చాడు. గల్ఫై నుంచి వచ్చిననాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఈ విషయాన్నితన తల్లిదండ్రులకు వివరించింది. వారు వచ్చి పలుమార్లు నచ్చజేప్పారు. అయినా అతనిలోమార్పు రాలేదు. అంతేకాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చే వాడుకాదు. ఫోన్లో సైతం మాట్లాడవద్దని బెదిరించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నాగమణి తన తల్లితో ఫోన్ లోమాట్లాడింది. వారికి ఎందుకు ఫోన్ చేశావని సంజీవులు ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని వాగులోని నీటి మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆడ పిల్లలు పుట్టారని అల్లుడు వేధిస్తుండటంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి వడ్ల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగికంగా వేధించాడు: మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
చెన్నై : స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( లా అండ్ ఆర్డర్) తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం..విధుల్లో ఉన్న తనపై రాజేష్ దాస్ అనే స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసింది. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్వయంగా ఓ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురికావడం చాలా బాధకరమైన ఘటన అని ప్రతిపక్ష నేత, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ విమర్శించారు. నిందితుడిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారిని ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. చదవండి : (ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో) (పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం) -
లైంగిక వేధింపులు: దర్శకుడికి సమన్లు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనురాగ్పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?) ఇప్పటికే అనురాగ్పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్పై కేసు నమోదు) -
దుబ్బాకలో మరో డేరాబాబా
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో మరో డేరాబాబా (స్వామీజీ), ఆయన అనుచరుడి రాసలీలల భాగోతం బట్టభయలు కావడం తీవ్ర చర్చానీయాంశగా మారింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ వివాహిత దుబ్బాక పోలీస్స్టేషన్ను ఆశ్రయించడంతో స్వామీజీతో పాటు ఆయన అనుచరుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక సీఐ హరికృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇవి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్కు చెందిన ఓ మహిళ సంతోషిమాతా భక్తురాలు.. ఆమెకు సంతోషిమాతా గుడి కట్టాలన్న సంకల్పం చాలా రోజులుగా ఉంది. అయితే చీకోడ్ సమీపంలోనే కొన్నేండ్లుగా రఘు అనే వ్యక్తి ఓ స్వామీజీగా అవతారమెత్తి స్వామి సమర్థ మహరాజ్ ఈనే పేరుతో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా మహిమ గల స్వామీజీగా పేరొందడంతో ప్రతిరోజు చాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో చీకోడ్కు చెందిన భాదిత మహిళ సైతం స్వామీజీకి భక్తురాలిగా మారింది. మహిళ తన మదిలో ఉన్న సంకల్పం(సంతోషీమాతా గుడి కట్టాలన్నది) స్వామీజీకి చెప్పింది. దీంతో భక్తురాలి అమాయకత్వాన్ని పసిగట్టిన స్వామీజీ రాత్రి వేళలో బాధిత మహిళకు తన అనుచరుడు నరేష్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి నేను స్వామీజీని మాట్లాడుతున్నా నీ సంకల్పం నేరవేరాలంటే నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను ఆయన రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరిస్తే నీ ఆలయ సంకల్పం నేరవేరుతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ ఒట్టు వేయించుకొన్నాడు. ఇది నమ్మిన ఆ అమాయక మహిళపై స్వామీజీ అనుచరుడు నరేష్గత కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. చాలా రోజులు అవుతున్నా ఆమె సంకల్పం నేరవేరకపోవడంతో తనను మోసం చేశారని తెలుసుకున్న మహిళ తమకు ఫిర్యాదు చేసిందని సీఐ హరికృష్ణ తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు ఆయన అనుచరుడు నరేష్పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చానీయాంశగా మారింది. -
శీలానికి వెల కట్టారు..
సాక్షి, అమరావతి : అమ్మాయి జీవితం నాశనమైందన్న బాధ వారిలో ఏకోశానా లేదు. అందుకు కారణమైన వారిని శిక్షించాలన్న కసి తల్లిదండ్రుల్లో కనిపించలేదు. ప్రేమ పేరుతో మోసగించి.. వేధించిన నిందితుడి వర్గీయులు, బాధితురాలు ఒకే సామాజిక వర్గానికి వారు కావడంతో ‘డబ్బు’ తో కేసు రాజీ కుదుర్చుకున్నారు. ఇరు కుటుంబాలు ఉన్నతస్థాయికి చెందినవి కావడం .. పరువుపోతుందని భావించడంతో వారంతా షరతులతో రాజీకి సిద్ధపడ్డారు. భవిష్యత్లో నిందితులు తమ కుటుంబం జోలికి రాకుండా షరతులు రూపొందించుకున్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహం పేరిట లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు.. అందుకు కారణమైన ప్రధాన సూత్రధారి అయిన అతడి స్నేహితుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. పోలీసులపై ఒతిళ్లు రావడంతో వారు కూడా ‘సామాజిక న్యాయం’ చేసేశారు. ఇటీవల నగరంలో సంచలనం రేకెత్తించిన లైంగిక వేధింపుల కేసును ఇరువర్గాలు అటకెక్కించేసిన తీరు నగరంలో చర్చనీయాంశమైంది. యువతి నయవంచనకు గురైందిలా.. సరిగ్గా నెల రోజుల కిందట ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి వచ్చింది. తన కుమార్తెపై ఓ యువకుడి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణను టాస్క్ఫోర్స్ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో మాచవరం ప్రాం తంలో ఉన్న ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లిన యువతికి అతని స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ యువకుడిని నమ్మింది. ఇద్దరూ హద్దులు దాటేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత ఆ యువకుడు చదువు నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గతంలో తాము తీసుకున్న నగ్న చిత్రాలను ఆ యువకుడు సూర్యారావుపేటలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్లో షేర్ చేశాడు. తన స్నేహితుడు పంపిన ఫోటోలను చూపి యువతిని ఆ యువకుడు బెదిరించడం ప్రారంభించాడు. చివరకు అతడి బెదిరింపులకు ఆ యువతి భయపడి అతడికి లొంగిపోయింది. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించసాగాడు. ఆఖరకు డబ్బులు సైతం డిమాండ్ చేసి దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసుకున్నాడు. అయినా ఆ యువకుడి బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి గత నెలలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులోకి టీడీపీ నేతలు కొందరు రంగప్రవేశం చేసి కేసును నీరుగార్చేందుకు యత్నించారు. చివరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని మాచవరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజీతో కేసు నీరుగార్చారు.. ఈ కేసులో అసలు సూత్రధారి ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని తెలిసిన పోలీసులు అతడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తొలుత తాము చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి ఎంతో జాగ్రత్తపడ్డ టీడీపీ నేతలు ‘సామాజిక వర్గం’ కార్డును ఉపయోగించారు. పంచాయతీ టీడీపీ అధినేత వద్ద పెట్టినట్లు సమాచారం. నిందితుడిని రక్షించే యత్నం.. వాస్తవానికి ఆస్ట్రేలియాకు విద్యాభ్యాసం కోసం వెళ్లిన నిందితుడిని పోలీసులు ఇక్కడికి రప్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ కేసు పెట్టిన బాధితులు, నిందితుల వర్గీయులతో రాజీకి రావడంతో లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తమ కుమారుడి భవిష్యత్ అంథకారం కాకూడదన్న నిర్ణయానికి వచ్చిన నిందితుడి తల్లిదండ్రులు బాధితురాలి కుటుంబసభ్యులు అడిగినంతా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దానికి అంగీకరించిన యువతి కుటుంబసభ్యులు షరతులపెట్టి డబ్బు తీసుకోవడమే కాకుండా వారి తో అగ్రిమెంటు సైతం రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా నుంచి రప్పిస్తాం.. లైంగిక దాడి కేసులో నిందితులను వదిలే ప్రసక్తే ఉండదు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడిని రప్పించే యత్నాలు చేస్తున్నాం. కేసులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావివ్వం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, సీపీ -
వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లకు పోలీసుల వేధింపులు
-
ఆకతాయి పనులు.. ఐదుగురి అరెస్ట్
క్రైమ్ : ఆకతాయిగా అల్లరి పనులు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని సెక్టార్ 86లో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగివస్తోన్న ఐటీ ఉద్యోగినిని అల్లరిమూక భయబ్రాంతులకు గురిచేసింది. ఆ యువతి ఉండే అపార్ట్మెంట్లోనే కింది ఫ్లోర్లో ఉండే ఆ దుండగులు యువతిని వేధించేందుకు ప్రయత్నించారు. అసభ్యకర మాటలతో, లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించగా.. యువతి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆ దుండగులు ఇంట్లోకి వచ్చి ఆ తల్లిదండ్రులపైనా తమ ఆకతాయితనాన్ని చూపసాగారు. అనంతరం ఫిర్యాదు అందుకున్న పోలీసులు అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. ఆ యువకులు కాలనీలో అల్లరి చేస్తుంటారని, మద్యం సేవిస్తారని, రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని అక్కడి కాలనీవాసులు చెప్పుకొచ్చారు. -
ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : భర్త పెడుతున్న చిత్రహింసలకు తాళలేక బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఎయిర్హోస్టెస్ అనిస్సియా బత్రా(32) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు అనిస్సియా బత్రా భర్త మయాంక్కు గతంలోనే వివాహం అయినట్లు విచారణలో తెలిసింది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు ముదిరి చివరకు అనిస్సియా ఆత్మహత్యకు దారి తీశాయంటున్నారు పోలీసులు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసాధికారి ఒకరు ‘విచారణలో భాగంగా మయాంక్కు అనిస్సియా కంటే ముందే మరో మహిళతో వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మయాంక్ అనిస్సియాకు చెప్పకుండా రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. అనిస్సియా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నెల రోజుల ముందు మయాంక్ మొదటి వివాహం గురించి ఆమెకు తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సున్నిత మనస్కురాలైన అనిస్సియా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయింది. ఈ కారణం వల్లే ఆమె బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అని తెలిపారు. కట్నంగా బీఎమ్డబ్య్లూ కార్... వివాహ సందర్భంగా అనిస్సియా తల్లిదండ్రులు దంపతులకు బీఎమ్డబ్య్లూ కార్ బహుకరించారు. అడిగినంతా కట్నం కూడా ఇచ్చారు. కానీ మయాంక్ మాత్రం వివాహం అయిన రెండో రోజు నుంచే తమ కూమార్తేను వేధించడం ప్రారంభించాడని అనిస్సియా తల్లిదండ్రులు వాపోయారు. హనీమూన్కు వెళ్లిన రెండో రోజునుంచే తమ కుమార్తేను కొట్టడం ప్రారంభించాడని, అదనపు కట్నం కోసం వేధించాడని పోలీసులకు తెలిపారు. మయాంక్తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలని అనిస్సియా తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేశారు. -
అత్తింటి వేధింపులతో యువకుడు ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. ‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్... ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక పోలీసులు గురువారెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వేధింపులకు పాల్పడుతోన్న టీడీపీ నేత అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా : యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 354డీ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ అరెస్ట్
గచ్చిబౌలి: లఘుచిత్రాల్లో నటించే మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్కు అసభ్యకరమైన మేసేజ్లు పంపి వేధిస్తున్న కేసులో తప్పించుకు తిరుగుతున్న షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ కుమార్ను గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల మేరకు... బీహెచ్ఈఎల్ ఎంఐజీలో నివాసం ఉండే ముత్యాల యోగేష్ కుమార్(35)కు ఏడాది క్రితం గచ్చిబౌలిలో నివాసముండే హారికతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయంతో హారిక వాట్సాప్ నంబర్కే కాకుండా, ఆమె భర్త ఫోన్కు కూడా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు యోగి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూకట్పల్లి 25ఎంఎం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వరూధిని బెయిల్ మంజూరు చేశారు. సమయానికి పూచీకత్తు చెల్లించకపోవడంతో యోగేష్ను చర్లపల్లి జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అందుకే డీసీపీ బూటుతో తన్నాడు’
సాక్షి, హైదరాబాద్ : షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని షార్ట్ఫిల్మ్ నటి హారిక చెప్పింది. తప్పు చేసిన వ్యక్తిని ఓ డీసీపీ బూటుతో తంతే తప్పేముందని, పోలీసులముందే తనను యోగి బూతు మాటలు అంటుంటే తన్నారని అన్నారు. అదే దుబాయ్లో అయితే కాలో చేయో తీస్తారని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదంటూ యోగి పోలీసులకు కొన్ని వాట్సాప్ మెసేజ్లను పంపించడంపై ఆమె స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తాజాగా మీడియాకు పంపించింది. ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వారు, చదువుకుంటున్నవారు జెన్యూన్గా నటించాలని ఇండస్ట్రీకి వస్తుంటారని, అలాంటి వారు యోగిలాంటి వారి బారిన పడకూడదనే తాను ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదును ఇచ్చానన్నారు. తానే స్వయంగా యోగికి అలాంటి మెసేజ్లు పెడితే ఎందుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. తన ఇమేజ్ను మీడియా సాక్షిగా దెబ్బకొట్టాననే అక్కసుతోనే తనపై యోగి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, అతడిది పూర్తిగా క్రిమిలన్ బ్రెయిన్ అని మండిపడ్డారు. అతడిపై ఇప్పటికే మూడు లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయం తనవైపే ఉందని, యోగిపై ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేశారు. ఏ అమ్మాయి కూడా వేధింపులను సహించకూడదని, ధైర్యంగా పోలీసులకు చెప్పాలని తెలిపారు. ‘బూతు మాట్లాడితే డీసీపీ బూటుతో తన్నాడు.. తప్పా?’ -
విద్యార్థినులకు లైంగిక వేధింపులు
వేలూరు: పాఠశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన కీచక హెడ్మాస్టర్కు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వేలూరు జిల్లా ఆంబూరు తాలుకా కంచి కొల్లై గ్రామానికి చెందిన జ్ఞానశేఖరన్ సోలూరు ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఎనిమిదో తరగతి విద్యార్థినులకు బోధన చేసేవాడు. ఆ సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నట్టు పలువురు విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు హెచ్ఎం జ్ఞానశేఖరన్ను నిలదీశారు. అందుకు హెచ్ఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి జరిపారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు పాఠశాలకు వెళ్లి హెచ్ఎం జ్ఞానశేఖరన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
చచ్చిపోవాలనిపిస్తోంది..
బంజారాహిల్స్: ఓ విద్యార్థి తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ విద్యార్థిని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..ఇందిరానగర్కు చెందిన బాలిక స్కూల్కు వెళ్లే క్రమంలో శ్రీనగర్ కాలనీలోని ప్రైవేట్ విద్యార్థి తరచూ ఆమె వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. గత పది రోజులుగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దారి కాచి అడ్డగిస్తూ ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించసాగాడు. సోమవారం మరోసారి బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వేధింపులు తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తోందంటూ పోలీసుల ముందే కన్నీరు మున్నీరైంది. పోలీసులు బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
స్వీపర్కు విద్యుత్ శాఖ ఏఏవో వేధింపులు
సత్తెనపల్లి: స్వీపర్పై విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ దొరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సెల్ఫోన్లలోని వాట్సప్లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా... పట్టణంలోని విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తూ రమేష్ నాయక్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్యకు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఈఆర్వో కార్యాలయంలో స్వీపర్గా ఏడాదిన్నర క్రితం ఉద్యోగమిచ్చారు. కార్యాలయంలో ఏఏవోగా పని చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఎనిమిది నెలలుగా తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 2017 నుంచి కార్యాలయం సమయం దాటిన తరువాత ఫోన్ చేస్తూ అభ్యకరంగా మాట్లాడుతున్న చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు జేఏవో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లినా మరుసటి రోజు వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ఏఏవోతో తనకు ప్రాణ హాని ఉంటుందని ఎనిమిది నెలలుగా వేధింపులు భరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఓపిక పట్టలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విచారణ నిమిత్తం ఇద్దరు ఉన్నతాధికారులను నియ మించారు. అధికారులు మంగళవారం సత్తెనపల్లి చేరుకుని ఏఏవో విచారణ చేపట్టారు. తొలుత బాధితురాలిని విచారించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మరో వైపు స్వీపర్తో రాజీ చేసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జరిగిందేదో జరిగింది ఇకపై నీ జోలికి రాకుండా చూస్తామని, ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రాజీ చర్చలు ఫలించలేదు. ఈ వ్యవహారం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. -
నామా బూతుపురాణంపై చంద్రబాబు దాటవేత..!
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు బూతుపురాణంపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. నామాది పర్సనల్ విషయమంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇంకా ఆయనతో మాట్లాడలేదని అన్నారు. మరోసారి నామా భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే..! బాధిత మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'సాక్షి'కి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్రావు ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు నామా తనను వేధిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామా, సీతయ్యలపై కేసు నమోదు మహిళను బెదిరించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా, సీతయ్యలపై కేసు నమోదు చేశామని, నామా బెదిరించిన ఆడియో, వీడియో టేపులు తమ వద్ద ఉన్నాయని బంజరాహిల్స్ ఏసీపీ మురళి తెలిపారు. నామా, సుజాతా రామకృష్ణన్ మధ్య విభేదాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ కేసు వెనుక పొలిటికల్ మోటివ్ ఉందా? లేదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
అమ్మా..! నన్ను చంపేస్తున్నారు
‘అమ్మా..! ఇంట్లో గొడవ జరుగు తోంది.. నన్ను కొడుతున్నారు.. నువ్వు రాకుంటే నన్ను చంపేస్తారు.. త్వరగా ఇక్కడికి రామ్మా..’ ఇవి ఓ కుమార్తె ఫోన్లో తన తల్లితో చివరి సారిగా చెప్పిన మాటలు. ఈ మాటలను బట్టి అత్తారింట్లో ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో తెలుస్తోంది.. తన కుమార్తెకు ఏమవు తుందోనని వెంటనే ఆ తల్లి అక్కడికి వచ్చింది. ఎంతో ఆందోళనగా వచ్చిన తల్లికి ఉరి తాడుకు వేలాడుతున్న కూతురు మృతదేహం కనిపించింది. ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలం నరసింహాపురం గ్రామంలో భర్త వేధింపులు తాళలేక చౌడం వెంకటలక్ష్మి (27) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటలక్షుమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారిలో మూడో కుమార్తె వెంకటలక్ష్మి. తల్లిదండ్రులు చేనేత పని చేస్తుంటారు. లక్ష్మికి 9 ఏళ్ల క్రితం ఖాదర్బాద్కు చెందిన వెంకటేష్తో వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వెంకటేష్ కుటుంబం ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం గ్రామంలో స్థిరపడింది. గతంలో వెంకటేష్ చేనేత పని చేసేవాడు. అయితే కొన్ని నెలల నుంచి పిప్పర్మెంట్ ఫ్యాక్టర్లో పని చేయడానికి వెళ్తున్నాడు. వారికి భరత్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి అతను భార్యను నిత్యం వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తల్లి ఆరోపిస్తోంది. దసరా పండుగ నిమిత్తం లక్ష్మి అమ్మగారింటికి వెళ్లి మూడు రోజులు ఉండి వచ్చింది. అదే ఆమె చివరి రాక. ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే.. నరసింహాపురం గ్రామంలో లక్ష్మి బయటికి కూడా వచ్చేది కాదని స్థానికులు చెబుతున్నారు. తన పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండేదంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లక్ష్మి తన తమ్ముడు సుబ్బయ్యకు ఫోన్ చేసి మాట్లాడింది. బాగున్నావా అని క్షేమ సమాచారాలు అడిగింది. తమ్ముడితో బాగా మాట్లాడిన లక్ష్మి కొన్ని నిమిషాల తర్వాత తల్లికి ఫోన్ చేసింది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే ఇక్కడికి రాకుంటే చంపేస్తారని ఆమె తల్లికి చెప్పింది. తన కుమార్తెను కొడుతున్నారేమోనని భావించిన తల్లి వెంకటలక్షుమ్మ వెంటనే నరసింహాపురం గ్రామానికి వెళ్లింది. అయితే ఆమె గుమ్మంలోకి వెళ్లగానే ఎదురుగా కూతురు ఉరి తాడుకు వేలాడుతోంది. ఆ సమయంలో ఇంట్లో మృతురాలి భర్త, అత్త లేరు. వారు అదే ప్రాంతంలోని మరో ఇంట్లో ఉన్నారు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని ఫ్యాన్కు వేలాడుతున్న లక్ష్మిని కిందికి దించగా అప్పటికే మృతి చెందింది. వచ్చేలోపే కన్నుమూశావా తల్లి అంటూ తల్లి రోదించసాగింది. బంగారం లాంటి నా కుమార్తెను ఆమె భర్త, అత్త కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. విషయం తెలియడంతో రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడి చేరుకొని జరిగిన సంఘటనపై విచారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అవమానం తట్టుకోలేక..
వైఎస్ఆర్ జిల్లా(వల్లూరు): అవమానం తట్టుకోలేక మండలంలోని ఆదినిమ్మాయపల్లెకు చెందిన అవివాహిత యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 24 వ తేదీన ఆదినిమ్మాయపల్లెకు చెందిన సుప్రజ (20 ) అనే అవివాహిత యువతి తమ ఇంటిలో ఉండగా తల్లిదండ్రులు ఎవరూలేని సమయంలో మిట్టపల్లెకు చెందిన పాశం భాస్కర్ బాబు అనే యుకుడు ఇంటిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. అయితే అప్పటి నుంచి అవమాన భారంతో కుమిలిపోతున్న యువతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. యువతి మృతికి కారణమైన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
కమిషనర్ సారూ.. న్యాయం చేయండి
కరీంనగర్: రెండో వివాహం చేసుకుంటానంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి రక్షించి న్యాయం చేయాలంటూ ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కరీంనగర్లోని ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో స్థానిక శ్రీనగర్కాలనీకి చెందిన నేహా మెహ్రోజ్ తన ఆవేదనను వెల్లగక్కారు. 2007 ఆగస్టులో నగరంలోని శర్మనగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్మాజిద్తో తన వివాహమైందన్నారు. పెళ్లి సమయంలో తన తండ్రి రూ.2.30 లక్షల నగదు, 10 తులాల బంగారాన్ని కానుకగా ఇచ్చారని తెలిపారు. తన భర్త సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారని, తమకు ఇద్దరు ఆడపిల్లలని తెలిపారు. అయితే భర్త కొంతకాలంగా రెండో వివాహం చేసుకుంటానంటూ వేధిస్తున్నాడని, దానికి ఆడబిడ్డ వత్తాసు పలుకుతోందని వాపోయారు. రోజూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సౌదీలో ఉన్నప్పుడు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. భర్తతో ప్రాణహాని ఉందని, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని కన్నీటి పర్యంతమయ్యా రు. ఈ విషయమై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కమిషనర్ గారు స్పందించి తన కు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ఇల్లాలిని బలిగొన్న అత్తింటి వేధింపులు
రేగొండ : అత్త, భర్త వేధింపులు భరించలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని రామన్నగూడెం తండాలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, ఎస్సై షాదుల్లా బాబా కథనం ప్రకారం... రామన్నగూడెం తండాకు చెందిన గుగులోత్ బాలుకు నర్సంపేట మండలం జంగాలపల్లితండాకు చెందిన బానోత్ లచ్చు కుమార్తె విజయ(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. దీంతో అత్త భీమిని, భర్త బాలు విజయను నిత్యం వేధిస్తుండేవారు. గత వారం రోజుల క్రితం కూడా వారిద్దరు వ్యవసాయ కూలీ పనికి వెళ్లొచ్చిన విజయను దుర్భాషలాడడంతో భరించలేని విజయ ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటిచుకుంది. గమనించిన గ్రామస్తులు మంటలార్పి హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతు ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై షాదుల్లాబాబా తెలిపారు. విజయ తండ్రి లచ్చు నాయక్ ఫిర్యాదు మేరకు విజయ భర్త బాలు, అత్త భీమినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
10 ఏళ్ల వేధింపులకు.. 19 ఏళ్ల శిక్ష..
వాషింగ్టన్: ఢిల్లీ నుంచి అమెరికాలోని టెక్సాస్ వరకు సుమారు 10 ఏళ్లపాటు ఓ యువతి వెంటపడుతూ, వేధించిన వ్యక్తికి అమెరికా కోర్టు 19 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తనతో పాటు చదువుకున్న సహచర విద్యార్థిని వేధిస్తున్న జితేందర్ సింగ్ కు ఈ శిక్షను విధిస్తున్నట్లు కొల్లిన్ కంట్రీ జిల్లా అటార్నీ గ్రేగ్ విల్లీస్ తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన జితేందర్ చదువుకునే సమయంలో ఓ యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో 2006లో ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు. ఆ యువతి తిరస్కరించడంతో జితేందర్ తన చదువు పూర్తి అయ్యేవరకు వేధిస్తూనే ఉన్నాడు. 2007లో ఆమె ఎంఎస్ చేసేందుకు న్యూయార్క్ యూనివర్సిటీలో చేరినా.. అక్కడ కూడా జితేందర్ ఆ యువతిని వదల్లేదు. అంతేకాకుండా ఇండియాలో ఆమె తండ్రిని హింసించాడు. దీంతో యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. జైలు ఊచలు లెక్కపెట్టిన అతడు మరోసారి యువతి జోలికి వెళ్లనని చెప్పటంతో వదిలిపెట్టారు. ఆ తర్వాత అమెరికాలో ఆ యువతి అమ్మాయి చదువుతున్న యూనివర్సిటీలోనే సీటు కోసం ప్రయత్నించి విఫలం చెందిన జితేందర్ ఇంటర్న్ షిప్ కోసం ఆమె కాలిఫోర్నియా వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికీ చేరుకున్నారు. ఆతర్వాత నుంచి యువతిని జితేందర్ ఫోన్లో వేధిస్తుండేవాడు. ఆమె ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్లి యువతి పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్లు, నగలను తీసుకోవడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జితేందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతగాడికి 19ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కాగా బాధిత యువతి వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది. -
వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయలేరు
♦ అంబటి రాంబాబు స్పష్టీకరణ ♦ మా ఎమ్మెల్యేలు, నేతలపై అక్రమంగా ♦ కేసులు పెట్టి వేధిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేసి, ప్రతిపక్ష నేతల్ని లొంగదీసుకోవాలని సీఎం చంద్రబాబు వ్యూహం పన్నారని, అయితే అది జరగని పనని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీ మిథున్రెడ్డి మొదలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్.కె.రోజా, దాడిశెట్టి రాజా వరకూ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యావత్తు పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలపైన, నేతలపైన విచక్షణారహితంగా అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల్ని లొంగదీసుకోవాలనుకునే సంప్రదాయాన్ని చంద్రబాబే ప్రవేశపెట్టారని, ఇది చాలా ప్రమాదకరమని, అరాచకానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇవి సాక్ష్యాలవుతాయా? నెల్లూరు జైల్లో ఉన్న మిథున్రెడ్డి, చెవిరెడ్డిలను పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ మాట్లాడుతూ తిరుపతి ఎయిర్పోర్టు సంఘటన తాలూకు వీడియో ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తే కొన్ని దృశ్యాల్ని మాత్రం విడుదల చేసి అవే సాక్ష్యాలంటున్నారని అంబటి మండిపడ్డారు. టీడీపీ విడుదల చేసిన వీడియోల్ని ప్రదర్శిస్తూ... విమానాశ్రయం అన్నాక పలు కెమెరాలుంటాయని, వాటిలో ఒక భాగం మాత్రం విడుదల చేసి అవే సాక్ష్యాలనడం ఎంతవరకు సమంజసమన్నారు. చెవిరెడ్డి, మిథున్రెడ్డి ఎయిర్పోర్టులో కొట్టారనడానికి ఇవి సాక్ష్యాలవుతాయా? ఒకసారి రాష్ట్ర ప్రజలే ఆలోచించాలన్నారు. ఇవీ...సాక్ష్యాలంటే.. లోకేశ్ విదేశాల్లో అమ్మాయిలతో విహరిస్తున్న, హోటళ్లలో చిందులేస్తున్న ఫొటోలను అంబటి ప్రదర్శిస్తూ... సాక్ష్యాలంటే ఇవీ.. ఇలా ఉండాలి.. ఇలాంటి తిరుగులేని సాక్ష్యాలు ఎంతోకాలంగా కళ్లముందు సాక్షాత్కరిస్తున్నా.. వాటిపై లోకేశ్ నోరు మెదపట్లేదని విమర్శించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం లాగా రాష్ట్రంలో వైఎస్ ఉగ్రవాదం తయారైందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనడంపై రాంబాబు అభ్యంతరం తెలుపుతూ మంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ‘‘టీడీపీ 20 నెలలుగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యాలు సాగిస్తోంది గాక మమ్మల్ని ఉగ్రవాదులంటారా? మీదా ఉగ్రవాదం.. మాదా? మంత్రి ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం’’ అని హెచ్చరించారు.నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఫిర్యాదు చేయాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్టు స్వయంగా ఎమ్మార్వో చెప్పడాన్నిబట్టి పరిస్థితులను తెలుసుకోవచ్చన్నారు. కామినేని మెదడుకు ఆపరేషన్ చేసుకుంటే మంచిది.. ప్రభుత్వాసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం సంతోషదాయకమేనని, ఆయన బయట్నుంచి ప్రైవేటు వైద్యులను, ఇతర పరికరాల్ని తెప్పించుకోవడమే విచిత్రమని అంబటి అన్నారు. సాధారణ ప్రజలకోసమూ ఇలాగే కార్పొరేట్ వైద్యుల్ని రప్పించి చికిత్సలు చేయిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి చర్యలతో ప్రభుత్వాసుపత్రులపై ఇపుడున్న విశ్వాసం కూడా సడలిపోతుందన్నారు. అందుకే కామినేని మోకాలికి కాకుండా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. -
'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘మధూ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే... నువ్వు లేకుండా బతకలేనంత. నీకోసం ప్రాణమైనా ఇవ్వగలిగేంత. ఐలవ్యూ మధూ’ సురేశ్ మాటలు చెవిన పడుతున్నాయి. కానీ అదేంటో... నా మనసులో ఎలాంటి భావమూ లేదు. అది పెద్దగా స్పందించడం లేదు. పరవశించి పరవళ్లు తొక్కడం లేదు. నిశ్చలంగా ఉంది. ‘ఏంటి మధూ... ఏం మాట్లాడవేంటి?’... నా సమాధానం కోసం ఎక్కువసేపు ఎదురుచూడలేనట్టు ఆతృతగా అడిగాడు సురేశ్. త్వరగా పెదవి విప్పు అన్నట్టుగా నా ముఖంలోకే చూస్తూ నిలబడ్డాడు. జవాబు కోసం కంగారుగా కళ్లలో వెతుకుతున్నాడు. కనిపించలేనట్టుంది. కాస్త నిరాశగా ముఖం పెట్టాడు. ‘నేను నీతో ఒకటి చెప్పాలి సురేశ్. అది విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు’ అన్నాను. ‘త్వరగా చెప్పు/ అంటూ వినడానికి సమాయత్తమయ్యాడు. నేను చెప్పాను. అంతా చెప్పాను. ఏదీ దాచకుండా చెప్పేశాను. అంతే... సురేశ్ ముఖం మ్లానమయ్యింది. మౌనంగా అయిపోయాడు. కాసేపు దిక్కులు చూశాడు. క్షణం తర్వాత తేరుకుని అన్నాడు... ‘సారీ మధూ. ఓ అర్జంటు పని గుర్తొచ్చింది. మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లిపోతుంటే ఫక్కున నవ్వాన్నేను. తెరలు తెరలుగా తన్నుకొస్తోన్న నవ్వును తొక్కిపట్టే ప్రయత్నం చేయకుండా విరగబడి నవ్వాను. నవ్వీ నవ్వీ చివరికి అలసిపోయి ఆగిపోయాను. నీకేమైనా పిచ్చా అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు సురేశ్. అవును. నాకు పిచ్చే. నిజంగా పిచ్చే. లేదంటే ఇలా ఎందుకు నవ్వుతాను? ఎగసిపడుతోన్న బాధను యెద గోడల మధ్య దాచేసి... ఏమీ లేనట్టు, ఏదీ ఎరగనట్టు ఎందుకిలా పగలబడి నవ్వుతాను? నాకు పిచ్చే. లేదంటే... మూగబోయిన మనసును ఎవరో వచ్చి మళ్లీ పలికిస్తానంటే సంతోషపడాల్సింది పోయి, నిజాలు నిక్కచ్చిగా చెప్పి, అది విన్న వ్యక్తి ఛీ అన్నట్టుగా చూస్తుంటే ఏడవకుండా నరాలు తెగిపోయేంతగా పడీ పడీ ఎందుకు నవ్వుతాను? పిచ్చే. నాకు పిచ్చే. కానీ ఈ పిచ్చి ఒకప్పుడు లేదు. ఇంత నటన నాకు ఒకప్పుడు చేతగాదు. అప్పుడు నేను నిజంగానే నవ్వేదాన్ని. మల్లెలు విరిసినట్టు.. వెన్నెల విరబూసినట్టు.. హిమం కురిసినట్టు.. స్వచ్ఛంగా, నిండుగా నవ్వేదాన్ని. ఆ నవ్వు నాకు మా నాన్న ఇచ్చారు. ఆయనెప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వెంటాడి వేధించినా నవ్వుతూనే వాటితో పోరాడేవారు. సంపదలు చేజారినా, అయినవాళ్లు మోసగించినా నవ్వుతూనే అన్నిటినీ అధిగమించేవారు. చివరికి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, రోగం ముదిరి మృత్యువు ఆయనను కౌగిలించుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారు. కానీ ఆ క్షణమే నా పెదవుల మీది నుంచి నవ్వు చెరిగిపోయింది. అమ్మ నన్ను చిన్ననాట వదిలి వెళ్తే... నాన్న యవ్వనంలో వదిలిపోయారు. వెంటాడే వాళ్ల జ్ఞాపకాలు... భయపెట్టే ఒంటరి క్షణాలు... బతుకును భారంగా మార్చేశాయి. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. అంతా చీకటి. ఏ దారీ కనిపించని చిక్కనిచీకటి. అప్పుడే ఉన్నట్టుండి నాన్నగారి చెల్లెలు వచ్చింది. ఆమె పుట్టగానే మా నానమ్మా తాతయ్యా చనిపోతే నాన్నే పెంచారట. కానీ నాన్న మాటను కాదని ప్రేమించినవాడితో వెళ్లి పోయింది. అమ్మానాన్నా అయి పెంచిన అన్నని పగవాడిలా చూస్తూ ఇన్నేళ్లూ గడిపింది. కానీ ఆయన మరణవార్త తెలిశాక ఆగలేక వచ్చేసింది. నా అన్నవాళ్లు లేక నిస్పృహతో ఉన్న నన్ను అక్కున చేర్చుకుంది. నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అంత వేదనలోనూ ఓ చిన్న ఓదార్పు. నాకంటూ కొందరు ఉన్నారన్న ధైర్యం. గతాన్ని మెల్లగా మర్చిపోవాలనుకున్నాను. భవిష్యత్తును మలచుకుందామనుకున్నాను. కానీ అది సాధ్యం కాదనీ, నా భవిష్యత్తును అప్పటికే మా అత్త భర్త మరోలా లిఖించేశాడనీ తెలుసుకోలేకపోయాను. అత్తయ్య తొలిసారి ఇంటికి తీసుకెళ్లినప్పుడు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు మావయ్య. ఆ ఆప్యాయత ఆయన్ను నా మనసులో నాన్న స్థానంలో నిలబెట్టింది. కానీ ఆ నాగుపాము ఎప్పటికీ నాన్న కాలేదని తర్వాత తెలిసింది. అతనో దుర్మార్గుడు. పెళ్లానికీ కూతురికీ తేడా తెలియని కామాంధుడు. అక్కడ అడుగు పెట్టినప్పుడే నామీద కన్ను వేశాడు. అదను కోసం కాపు కాశాడు. అత్తయ్య లేని క్షణం చూసి పడగ విప్పాడు. నేను తన నిజ స్వరూపాన్ని గ్రహించేలోపే కాటు వేశాడు. నా భవితను కాలరాశాడు. నా బతుకును కన్నీటిపాలు చేసేశాడు. అంతటితో ఆగలేదు. తన వ్యాపార అవసరాల కోసం నన్ను మరికొందరి అవసరాలు తీర్చమన్నాడు. కాదంటే తనకు తోచిన రీతిలో కసి తీర్చుకునేవాడు. అత్తతో చెబుదామను కున్నాను. కానీ ఆ నీచుడు నాకా అవకాశం ఇవ్వలేదు. నోరు విప్పితే నిందల పాలు చేస్తానన్నాడు. నేనే తనని రెచ్చగొట్టానని అత్తయ్యకు చెబుతానన్నాడు. అతడి కోసం కళ్లలో పెట్టుకుని పెంచిన నాన్ననే కాదన్న అత్త... ఇవాళ అతడి కోసం నన్ను తప్పుడు మనిషిగా ఎంచదన్న నమ్మకం ఏముంది! అందుకే నోటికి తాళం వేసుకున్నాను. నిజాన్ని పెదవుల మాటున నొక్కిపెట్టేశాను. దాంతో నా బతుకు మరీ నరకమైపోయింది. నా తనువు అతని స్నేహితుల చేతుల్లో వందలసార్లు నలిగిపోయింది. నా మనసు వేలసార్లు చచ్చిపోయింది. తట్టుకోలేకపోయాను. తెగించాలని నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పంపినప్పుడు తప్పించుకు పారిపోయాను. ఎలాగో ఓ స్వచ్ఛంద సంస్థ నీడకి చేరాను. వారి సాయంతో నా కాళ్లమీద నేను నిలబడ్డాను. అప్పుడే పరిచయమయ్యాడు సురేశ్. నన్ను ప్రేమించానన్నాడు. నేను లేకపోతే చచ్చిపోతా నన్నాడు. దాంతో నా గతాన్ని అతని ముందు పరిచాను. గతుక్కుమన్నాడు. నువ్వు నా ప్రాణం అన్నవాడు కాస్తా నా మానం పోయిందని తెలిసి తన మానాన తను వెళ్లిపోయాడు. నేను లేకపోతే చచ్చిపోతాను అన్నవాడు నాతో బతకడం ఇష్టం లేదంటూ ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు. అంత వరకూ పొంగి పొర్లిన ప్రేమ నేను పతితనని తెలియగానే మాయమైపోయింది. నన్ను చిన్నచూపు చూసి వెళ్లిపోయింది. అంతే. ఆరోజే నిర్ణయించుకున్నాను... ఇక ఏ మగవాడినీ నా చేరువకు రానివ్వకూడదని. నిజం దాచి దగ్గర కాలేను. మోసగించి మనువాడలేను. అలా అని నిజం చెప్పి ఇలా ఛీత్కారానికి గురవ్వనూలేను. అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను. నాకూ ఆశలున్నాయన్న సంగతిని పూర్తిగా విస్మరించాను. తోడు కోరుకోవడం మాని నేను మోడులా బతుకుతున్నాను. తోచిన దారిలో సాగిపోతున్నాను. అంతకంటే ఏం చేయను!! - మధుమిత (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి అందరూ ఒకలా ఉండరు. సురేశ్ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తారస పడతారు. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరికీ దగ్గర కాకూడదు అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నిజం చెప్పి తీరాలన్న రూలేమీ లేదు కదా! అందరూ మెచ్యూర్డగా ఉండకపోవచ్చు. అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి బాధపెట్టే నిజాన్ని చెప్పడం కంటే మనసులోనే సమాధి చేసెయ్యడం మంచిది. జరిగినదాన్ని ఓ యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవడమే మంచిది. మధుమిత అనుకున్నట్టు అది మోసం కాదు. పాపం తనే మోసపోయింది. ఎవరో చేసిన ద్రోహానికి బలయ్యింది. అందులో ఆమె తప్పేమీ లేదు. అందుకే తన గతాన్ని చెప్పకపోవడం మోసం ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అదంతా తను పూర్తిగా మర్చిపోవడమే మంచిది. డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై. సైకియాట్రిస్టు ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఎర్రగడ్డ, హైదరాబాద్ -
అప్పు చెల్లించలేక భర్త పరారీ: భార్య నిర్బంధం
అనంతపురం: సమాజంలో మానవతా విలువలు నానాటికీ అంతరించిపోతున్నాయి. భర్త చేసిన అప్పు కారణంగా భార్యను నిర్బంధంలోకి తీసుకున్న ఘటన జిల్లాలోని ధర్మవరంలో కలకలం రేపింది. చేనేత కార్మికుడు శివప్ప గతంలో రామచంద్ర అనే వ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. తన అప్పు తీర్చాలని రామచంద్ర ఒత్తిడి చేయడంతో శివప్ప పరారీ అయ్యాడు. దీంతో ఆ చేనేత కార్మికుని భార్య లీలావతిని రామచంద్ర తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. అంతటి ఆగని రామచంద్ర ఆమెను వేధింపులకు గురిచేశాడు. తన వద్ద తీసుకున్న అప్పుని ఎలాగైనా తీర్చాలని బలవంతపెట్టడం ఆరంభించాడు. ఇక ఎటుదిక్కు తోచని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. -
మైనర్ బాలికకు పెళ్లి వేధింపులు..యువకుడు అరెస్టు
హైదరాబాద్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసిన ఘటనలో ఓ యువకుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కె.విద్యానాథ్ అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. తను అద్దెకుండే చోట పరిచయమైన యువతితో పరిచయం పెంచుకున్నాడు. అతనితో ఆ యువతి చనువుగా ఉండటాన్ని అదునుగా భావించిన ఆ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. ఈవిషయాన్ని గోప్యంగా ఉంచిన ఆ యువతికి క్రమేపి వేధింపులు ఎక్కువైయ్యాయి. ఇందులో భాగంగా ఆ యువతి సెప్టెంబర్ 14వ తేదీన మంగళహాట్ ప్రాంతంలో ఉన్న ఓ షాపు వెళ్లగా విద్యానాథ్ మరోసారి వెంటబడ్డాడు. ''నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటానని'' మాటలు కలిపాడు. యువకుడి వేధింపులకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆ యువతి అసలు విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడ్ని నల్గొండలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.