karnataka police
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు సస్పెండ్
బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్సెట్ టూ సన్రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వాసు బర్త్డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్హాస్లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
దేశ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించి.. చివరికి బిగ్ ట్విస్ట్..
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు. ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్కుమార్ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రాత్రి బైకులు ఆపి ఫింగర్ ప్రింట్ టెస్టులు!
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్టవేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు. ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్ చేస్తారు. తద్వారా రాత్రి వేళల్లో దొంగలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో తేలిపోతుంది పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలను తమ మొబైల్ఫోన్లో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే ఏమీ ఉండదు. నేరాల్లో భాగస్వామి అయితేనే అతని నమోదైన కేసుల వివరాలు లభ్యమౌతాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. సరైన కారణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనం నంబరును బట్టి చోరీ చేసిన వాహనమా, నేరాల్లో ఉపయోగించారా, లేదా అనేది కూడా యాప్ ద్వారా నిర్ధారిస్తారు. సీఐ, ఎస్ఐలకు శిక్షణ గత రెండు నెలలనుంచి వివిధ పోలీస్స్టేషన్లలో మల్లోకి తీసుకువచ్చారు. ప్రతిపోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని, కేవల వేలిముద్రలు స్కాన్ అవుతాయని, రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు తెలిపారు. జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చు రాత్రి సమయంలో దొంగలు, నేర చరిత్ర కలవారి ఆచూకీ కనిపెట్టి, జరగబోయే నేరాలను తప్పించడానికి సీసీటీఎన్ఎస్ డేటా ద్వారా రాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నట్లు తూర్పు విభాగం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ తెలిపారు. -
కర్ణాటకలో ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్
శివమొగ్గ: నిషేధిత ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘా వేశారు. ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో టెర్రరిస్ట్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద పేలుడు పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించినట్లు తెలిపారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్పై నుంచి ఎగిరి బస్సు టైర్ కింద..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో కర్నాటక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఓ బస్సు బ్యాక్ టైర్ కిందపడిపోతాడు. అయితే, ఈ సమయంలో బైకర్ ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ ఉన్న హెల్మెట్ను ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో, ప్రతీ ఒక్కరూ విధిగా స్టాండర్ట్ ఉన్న హెల్మెట్ను ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ" Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u — Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022 -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్
సాక్షి, హిందూపురం: హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి) -
హిజాబ్ వివాదం.. కర్నాటక పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలో సంచలనంగా మారింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కర్నాటకలోని విద్యాసంస్థల వద్ద హిజాబ్ను తీసివేసి లోపలికి వెళ్లాలని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో వారి నిర్ణయంపై విద్యార్థినిలు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నిరసన తెలిపిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. కర్నాటకలో తుమకూరులోని ఎంప్రెస్ కాలేజీలో హిజాబ్ ధరించడంపై ఆంక్షలు విధించారు. అయితే, విద్యార్థినిలు మాత్రం హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. ఈ క్రమంలో కాలేజీలోకి వారిని అనుమతించలేదు యాజమాన్యం. ఈ సందర్బంగా కాలేజీ యాజమాన్యం, విద్యార్థినిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థినిలు తాము హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో, కాలేజీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 మంది విద్యార్థినిలపై కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కూర్గ్ జిల్లాలోని జూనియర్ కాలేజీలో విద్యార్థులు హిజాబ్ ధరించి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి
శివాజీనగర(కర్ణాటక): కేంద్ర ప్రభుత్వ సర్వే శాఖలో డిప్యూటి కమిషనర్గా పనిచేస్తున్నట్లు చెప్పుకొని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వందలాది మందితో డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న ఖతర్నాక్ వంచకున్ని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన రాఘవేంద్ర అరెస్ట్ అయిన నిందితుడు. ఇతడు ఉడుపిలో ప్రైవేట్గా సర్వేయర్గా పని చేస్తుండేవాడు. చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి.. తక్కువ కాలంలో ధనవంతున్ని కావాలని వక్రమార్గం పట్టాడు. 10 సంవత్సరాల కిందట బెంగళూరుకు వచ్చి కేంద్ర సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్ అని నకిలీ గుర్తింపు కార్డు చేయించుకొన్నాడు. కారుకు భారత ప్రభుత్వం అని బోర్డు వేసుకుని ప్రభుత్వ శాఖల్లో పని ఇప్పిస్తానంటూ మోసాలను ప్రారంభించాడు. ఎక్కువగా ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్దసంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేశాడు. నాలుగు పెళ్లిళ్లు బెంగళూరు జే.పీ.నగరలో ఉంటున్న రాఘవేంద్ర హావేరి, బాగలకోట, బెంగళూరు, కుందాపురలో రహస్యంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి సంపాదించిన డబ్బుతో సొంతూరు సహా పలుచోట్ల ఫ్లాట్లు, నగలు, కార్లు కొన్నాడు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో మోసగాని బండారం బయటపడింది. అతనిని అరెస్టు చేసి నకిలీ గుర్తింపు కార్డు, మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, చెక్బుక్, బాండ్ పేపర్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన ఫిర్యాదులపైనా విచారణ చేపట్టారు. -
‘ఖాకీ’ని తలపించే చేజింగ్, 45 రోజుల ఆపరేషన్
సాక్షి, కరీంనగర్: కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్ పోలీసులు షోలాపూర్లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. (చదవండి: 200కు పైగా ఇన్స్టాంట్ లోన్యాప్స్ తొలగింపు..) -
ఇలాగైతే ఎలా?
కర్ణాటక రాష్ట్రం హవేరీ పోలీసులు 69 మంది మీద ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, 1897’ చట్టాల కింద కేసులు పెట్టారు. వాళ్లందరూ ఒక ఊరి వాళ్లే. వారంతా ఊరి పండుగ చేసుకోవడానికి గుమిగూడారు. హవేరీ జిల్లా కర్జగి గ్రామంలో ఏటా జరిగే ‘కరా హున్నిమే’ ఉత్సవానికి యాభైవేల మంది హాజరవుతారు. ఎన్నోఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ‘ఎన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమైనప్పటికీ ఈ ఏడాది అన్ని ఏడాదుల వంటిది కాదు. ఉత్సవాలను పక్కన పెట్టండి’ అన్నారు పోలీసు అధికారులు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. దాంతో నిర్వహకులు ఇటు భక్తుల విశ్వాసాలకు, కోవిడ్ నిబంధనలకు మధ్య ఒక మధ్యే మార్గాన్ని ఆశ్రయించారు. బ్రహ్మ లింగేశ్వరుడికి పూజలన్నీ యధావిధిగా జరుగుతాయి. ఎడ్లబండి ఊరేగింపు మాత్రం అతి కొద్దిమందితో నామమాత్రంగా నిర్వహించాలనుకున్నారు. ఆనవాయితీని కొనసాగించడం మాత్రమే జరుగుతుంది. వేడుక కాదు, కాబట్టి ఎవరూ పాల్గొనవద్దని ఊరంతటికీ చెప్పారు. విన్నట్లే తలూపారందరూ. గురువారం (11–06–2020) సాయంత్రం ఊరేగింపు మొదలవగానే జనం నేల ఈనినట్లు పోగయ్యారు. నిర్వహకుల మాట వినేవాళ్లు ఒక్కరూ లేరు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. భౌతిక దూరం పాటించలేదు, మాస్కులు ధరించనూ లేదు. మరీ ఈ రకంగా నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవడం కుదరదని తేల్చి చెప్పేశారు పోలీసులు. నిర్వాహక కమిటీసభ్యులతోపాటు మరికొందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. ఇది విశ్వాసాలకు విఘాతం కలిగించడం కాదు, సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే. -
మరోసారి వార్తల్లోకి గ్యాంగ్స్టర్ రవి పూజారి
న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్) 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్పోర్ట్ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెయిల్పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!) కాగా గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
'కర్ణాటక మృతుల కుటుంబాలకు మమతా బెనర్జీ భరోసా'
మంగళూరు : పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. మాట ఇచ్చిన 48 గంటల లోపే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది. మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడుతూ.. ఇది మానవతా సాయం మాత్రమే. ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. చదవండి: సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్ వీడినట్టే..! -
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్కు జరిమానా!
కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్టేషన్లో నిందితుడి పుట్టినరోజు వేడుక
కర్ణాటక ,యశవంతపుర : రిమాండ్ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు పోలీసు స్టేషన్లో జరిగాయి. ఈ విచిత్ర ఘటన విద్యారణ్య పోలీసు స్టేషన్లో జరిగింది. పోలీసు అధికారి పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అభిషేక్ అలియాస్ అభిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో అభి పుట్టిన రోజు వేడుకలను పోలీసు స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు అభికి ఆ పోలీసు స్టేషన్ ఎస్ఐ కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఎస్ఐ, స్టేషన్ సిబ్బంది నిందితుడికి కేక్ తినిపిస్తున్న వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో ప్రజల ఆక్రోశానికి గురవుతున్నారు. బాడుగకు తీసుకున్న కారును ధ్వసం చేసిన నిందితుడు అభిషేక్.. కారు యజమాని రిపేర్కు డబ్బులు అడిగితే నేను పోలీసును, నన్నే డబ్బులు అడుగుతావా.. కేసు నమోదు చేస్తానంటూ కారు యజమానిని బెదిరించారు. ఇదే కాకుండాకారు యజమాని నుంచి వేల రూపాయలను వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి దాసరహళ్లి నివాసి కార్తీక్ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి జతలో పోలీసులు కేక్ తిన్న విషయంపై ఉన్నత అధికారులను వివరణ కోరగా నిందితుడు పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాది క్రితం పుట్టిన రోజును స్టేషన్లో జరిపారు. అయితే నాలుగు నెలల క్రితం అక్కడి ఎస్ఐతో పాటు పోలీసులు బదిలీ అయినట్లు వివరించారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావటంలేదన్నారు. -
వెనుకసీటులో కూర్చున్న వృద్ధుడి పైశాచికత్వం
కృష్ణరాజపురం : రైలులో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ యువతి ఫేస్బుక్లో ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్గా పని చేస్తున్న యువతి ఈనెల17వ తేదీన విధులు ముగిసిన అనంతరం రైలులో స్నేహితులతో కలసి కేజీఎఫ్ పట్టణానికి వెళుతున్నారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికి యువతి నిద్రలోకి జారుకోవడాన్ని గమనించిన వెనుకసీటులో కూర్చున్న 55 ఏళ్ల వ్యక్తి యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే మేల్కొన్న యువతి వ్యక్తిని ప్రశ్నించగా మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పక్క బోగీలో ఉన్న తన స్నేహితులను పిలవడానికి ప్రయత్నించగా అంతలోపు వ్యక్తి వైట్ఫీల్డ్ స్టేషన్లో దిగి పారిపోయాడు. దీనిపై వైట్ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తమ పరిధిలోకి రాదని అడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. దీంతో అడుగోడి పోలీస్స్టేషన్కు చేరుకొని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఘటన తమ పరిధిలోకి రాదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అక్కడి నుంచి కూడా పంపించేశారు. అక్కడి నుంచి నేరుగా కంటోన్మెంట్ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఫోటో ఉందా, అడ్రస్ ఉందా, వ్యక్తి పేరేంటి ఇలా నిర్లక్ష్యంగా ప్రశ్నలు వేసి కేసు నమోదు చేసుకోవానికి నిరాకరించారంటూ ఫేస్బుక్లో బాధను వ్యక్తం చేశారు. ఫేస్బుక్ పోస్ట్ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా ట్యాగ్ చేశారు. -
గ్రేట్ పోలీస్
కృష్ణరాజపురం : ఇండోనేషియా దేశ రాజధాని జకార్త నగరానికి చెందిన మహిళ డీజే బెంగళూరు నగర పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కొత్త సంవత్సరం వేడుకల్లో సంగీత విభావరి (డీజే) కోసం బాణసవాడిలోని యునైటెడ్ టాలెంట్ అనే సంస్థ నిర్వాహకులు జకార్త నగరానికి చెందిన మహిళ డీజే కేసా అయ్రెస్ను తీసుకువచ్చారు. సంగీత విభావరి కోసం తీసుకువచ్చిన కేసా రానుపోను విమాన ఛార్జీలు, హోటల్లో బస కూడా ఏర్పాటు చేశారు. సంగీత విభావరి ముగిసిన అనంతరం రెండు రోజుల్లో ఖాతాలోకి పారితోషకం పంపిస్తామంటూ నిర్వాహకులు నమ్మించారు. జకార్తకు వెళ్లి రోజులు గడుస్తున్నా పారితోషకం పంపించకపోవడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిర్వాహకులు స్పందించలేదు. కార్యక్రమ నిర్వాహకుల తీరుతో విసుగు చెందిన కేసా ఇదేనెల 8న బెంగళూరుకు వచ్చి పోలీస్ కమిషనర్ సునీల్కుమార్ను కలుసుకొని తన సమస్య వివరించారు. స్పందించిన కమిషనర్ సునీల్కుమార్ కేసా సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డీసీపీ రాహుల్కుమార్ను ఆదేశించారు. వివరాలు తెలుసుకున్న డీసీపీ రాహుల్ కుమార్ బాణసవాడి ఎస్ఐ మురళికి కేసా సమస్య గురించి వివరించి పరిష్కరించాలంటూ ఆదేశించారు. కేసా ఫిర్యాదుతో విచారణ జరిపిన బాణసవాడి పోలీసులు కేసాకు రావాల్సిన 600 డాలర్ల పారితోషికంతో కేసా విమాన ఛార్జీలు కూడా ఇప్పించి జకార్తకు పంపించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించి తమకు రావాల్సిన పారితోషికం ఇప్పించినందుకు సంతోషం వ్యక్తం చేసిన కేసా పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
ప్రియుని భార్యను చంపడానికి కేసరిబాత్లో సైనేడ్..
చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మరణించడం, మరో 8మంది తీవ్ర అస్వస్థత పాలైన ఘటనలో మిస్టరీ వీడిపోయింది. అక్రమ సంబంధమే ఇంత పని చేయించిందని తేలింది. తమ ఆనందానికి ప్రియుని భార్య గౌరి, ఆమె తల్లి అడ్డుగా ఉందని వారిని మట్టుబెట్టడానికి ప్రియుడు లోకేష్ (30)తో కలిసి నిందితురాలు లక్ష్మీ (48) ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. స్వర్ణకారులు బంగారంపనిలో ఉపయోగించే సైనేడ్ విషాన్ని ప్రసాదంలో కలిపినట్లు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఐజీపీ దయానంద, ఎస్పీ కార్తీక్రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీ, ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వివరాలు.. గత శుక్రవారం రాత్రి చింతామణి పట్టణంలో ఒక ఆలయం వద్ద ఇద్దరు మహిళలు పంచిన ప్రసాదం తిని కవిత (29), సరస్వతమ్మ (55) అనే ఇద్దరు మహిళలు మరణించారు. ఇది సంచలనం కలిగించింది. ఎస్పీ కార్తీక్రెడ్డి కేసు దర్యాప్తును సీరియస్గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను పట్టుకుని విచారించగా లక్ష్మీ పాత్ర బయటపడింది. అడ్డు తొలగించుకోవాలని ఆలయం వద్ద ఎదురెదురు ఇళ్లలో ఉండే మహిళ లక్ష్మీతో యువకుడులోకేష్ అనైతిక సంబంధం ఉంది. రెండేళ్ల కిందట లోకేష్కు శిడ్లఘట్టకు చెందిన గౌరి అనే యువతితో పెళ్లయింది. లోకేష్ బండారం భార్యకు తెలిసిపోవడంతో లక్ష్మీతో గొడవలు పడింది. పోలీసు స్టేషన్కు వెళ్లి పంచాయతీ జరిగాయి. నాలుగు నెలల కిందట లోకేష్ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. గౌరి పోలీసుస్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ అజ్ఞాతం నుంచి లక్ష్మీ– లోకేష్ మధ్య సంబంధాలు కొనసాగాయి. గౌరిని చంపాలని పథకం పన్ని రెండుసార్లు ప్రయత్నించి విఫలయినట్టు లక్ష్మీ అంగీరించింది. ఈసారి పకడ్బందీగా గత శుక్రవారం పకడ్బందీగా అమలు చేశారు. లక్ష్మీ తన ఇంట్లో కేసరిబాత్ను తయారు చేసింది. ప్రసాదాన్ని రెండు భాగాలు చేసి ఇంటి పనిమనిషి అమరావతి, ఆలయం ముందర పూలు అమ్ముతున్న పార్వతీలను పిలిచి ప్రసాదాన్ని పంచాలని సూచించింది. అందులో సైనైడ్ కలిపి ఉన్న విషయం వారికి తెలియకపోవడంతో సరేనని అంగీకరించారు. ప్లాస్టిక్ కప్పులో పెట్టినది గౌరి, వారి తల్లి సరస్వతి గుడినుంచి రాగానే ఇవ్వాలని సూచింది. వారు సరిగ్గా గౌరి, తల్లి సరస్వతికి ఇచ్చి తినమని చెప్పారు. ఇంటికి వెళ్లాక సరస్వతి ఇంటిపక్కలవారికి పంచింది.తాను కొంత తిని, కూతురికి ఇవ్వగా ఆమె తినలేదు. కొంతసేపటికే ప్రసాదం తిన్న 10 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కవిత అనే మహిళ చనిపోగా, ఆమె భర్త రాజు, చిన్నారులు జాహ్నవి, చరణి , ఇతరులు నారాయణప్ప, వెంకటరమణ, సుధా, శశిదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మరొక నిందితుడు లోకేష్ కోసం గాలిస్తున్నామని ఐజీపీ చెప్పారు. దర్యాప్తు బృందానికి 50వేలు బహుమానాన్ని ప్రకటించారు. -
కారులో హెల్మెట్లతో వచ్చి మరీ..
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక పోలీసు అధికారులు మన రాజధానిపై కన్నేశారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు, బీదర్లో జరిగిన నేరాల్లో నిందితులు, హతుడి కోసం ఇక్కడ ఆరా తీస్తున్నారు. బెంగళూరులోని మార్తహళ్లి ఠాణా పరిధి నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్నకు యత్నించిన నిందితులు, బీదర్ జిల్లాలోని మన్నెకిళ్లిలో చోటు చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులను ఛేదించడానికి అక్కడి పోలీసులు ఇప్పటికే రెండుసార్లు ఇక్కడికి వచ్చి వెళ్లారు. ఓ కేసులో స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటుండగా, మరోదాంట్లో వాళ్లే నేరుగా గాలిస్తున్నారు. కారులో హెల్మెట్లతో వచ్చి మరీ.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనురాగ్వర్మ బెంగళూరులోని మార్తహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న యమలూర్లో నివసిస్తూ సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం ఇండోర్కే చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఆపై కొన్నాళ్లకు వీరి మధ్య స్పర్థలు వచ్చాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 11 ఉదయం కార్యాలయానికి వెళ్తున్న అనురాగ్పై కిడ్నాప్ యత్నం జరిగింది. హెల్మెట్లు ధరించి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనురాగ్ తలకు తుపాకీ గురిపెట్టి కారులోకి ఎక్కాలని బలవంతం చేయగా అప్రమత్తమైన అనురాగ్ పెద్దగా అరవడంతో పాటు పెనుగులాడాడు. ఫలితంగా అతడి సెల్ఫోన్ కారులో పడిపోగా.. ఇద్దరు దుండగులు అందులో ఉడాయించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు మార్తహళ్లి ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నేపథ్యంలో నిందితులు రాజస్థాన్కు చెందిన వారని, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టు తేల్చారు. దీంతో వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రాజస్థాన్, ఇండోర్తో పాటు నగరంలోను ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక్కడి ఆటో కావడంతో... సిటీలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు పొరుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల దర్యాప్తులోనూ ఉపయుక్తంగా మారుతున్నాయి. బీదర్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసును ఛేదించడానికి అక్కడి పోలీసులు సైబరాబాద్ అధికారులను కలిసి తమకు నిర్ణీత ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఇప్పించాలని కోరారు. వారికి సహకరించిన ఇక్కడి పోలీసులు ఆ కేసు దర్యాప్తుతో పాటు నిందితులు, హతుడి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న పద్మావతినగర్ నుంచి ఈ నెల 10న ఓ ఆటో చోరీకి గురైంది. ఇది కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న చరక్పల్లి ఠాణా పరిధిలోని ఓ కల్లుకాంపౌండ్ సమీపంలో దొరికింది. కేసు నమోదు తర్వాత రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అక్కడి పోలీసులు ఇక్కడి బాధితుడికి సమాచారం ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా వివిధ చెక్పోస్టుల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ ఆ ఆటోలో డ్రైవర్తో పాటు మరోవ్యక్తి ఉన్న ఆనవాళ్లు దొరికాయి. ఇదిలా ఉండగా.. చరక్పల్లికి సమీపంలో ఉన్న మన్నెకిళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న దీన్ని గుర్తించడం కష్టంగా మారింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి మిస్సింగ్ కేసులు లేకపోవడంతో ఈ ఆటోతో ఆ మృతదేహానికి లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఆటోను తస్కరించిన చోరులు దొరకాల్సి ఉంది. దీనికోసం సిటీకి వచ్చిన చరక్పల్లి పోలీసులు స్థానిక అధికారుల సాయంతో పద్మావతినగర్లో దర్యాప్తు చేశారు. ఆటో చోరీకి గురైన ప్రాంతంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్ను సేకరించారు. -
పోలీసులకు తీపి కబురు
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలోని 86 వేల మంది పోలీసుల పంట పండింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బహుకాల నిరీక్షణకు తెరపడనుంది. వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న పోలీసుల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పోలీసుల జీతాల పెంపు అనివార్యమని ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు పెంచాల్సిన జీతాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఆందోళనలతో కమిటీ.. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల పోలీసు జీతాలతో పోల్చినా ఇక్కడి రక్షకభటుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. గతంలో తమ జీతాలను పెంచాలని అనేక సార్లు పోలీసులు ఆందోనలకు దిగారు. గత కాంగ్రెస్ హయాంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మాజీ సీఎం సిద్ధరామయ్య అప్పట్లో ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. 30 శాతం పెంపునకు సిఫారసు.. 2016 సెప్టెంబర్ 27న ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర పోలీసులు జీతాల పెంపు అనివార్యమని ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలోని పని చేసే ఆయా విభాగాల్లోని సిబ్బందికి 30 శాతం మేర జీతాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ తర్వాత కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. కర్ణాటక 8వ స్థానం.. కమిటీ నివేదిక ప్రకారం పోలీసుల వేతన శ్రేణిలో కర్ణాటక ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో వెనుకబడి ఉంది. కర్ణాటక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సైతం ముందుగానే ఉన్నాయి. దీంతో ఇక్కడి పోలీసులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరి జీతాలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బడ్జెట్ పూర్వ సమావేశాల్లో ఈ విషయంపై తీర్మానించి వచ్చే బడ్జెట్లో పెంపు మేర కేటాయింపులు జరపనున్నారు. -
ప్రకాశ్రాజ్కు పోలీసుల నోటీసు
కర్ణాటక, యశవంతపుర : హిందువులను అవహేళనంగా మాట్లాడిన బహుభాష నటుడు ప్రకాశ్రాజ్కు బెంగళూరు పోలీసులు విచారణ నోటీస్ను జారీ చేశారు. న్యాయవాది ఎన్.కిరణ్ బెంగరూరు 24వ ఎసీఎంఎం కోర్డు ఆదేశాల మేరకు హనుమంతనగర పోలీసులు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు చేశారు. దీంతో తమ ముందు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విజయపురలో జరిగిన సమావేశంలో గోమాత గురించి ఏమి తెలియదు. బట్టలు సుభ్రం కావాలంటే ఒక కేజీ పేడ, రెండు లీటర్ల గోమూత్రంతో బట్టలను శుభ్రం చేసుకోవాలని అవహేళనగా మాట్లాడారు. హిందువుల మనోభావాలను రెచ్చకొట్టిన ప్రకాశ్రాజ్పై చర్యలు తీసుకోనేలా పోలీసులను అదేశించాలంటూ రెండు నెలల క్రితం న్యాయవాది కిరణ్కేసు దాఖలు చేశారు. దీంతో ప్రకాశ్రాజ్కు పోలీసులు నోటీసును జారీ చేశారు. -
తుపాకీ లేని ఖాకీ
బొమ్మనహళ్లి: ప్రజా భద్రతను చూసే పోలీసులు లాఠీలతోనే దుండగులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోంశాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయిస్తున్నా మౌలికమైన ఆయుధాల కొరత నాలుగో సింహాన్ని నిస్తేజం చేస్తోంది. నేరస్థులు, ఉగ్రవాదుల నుంచి ప్రజల ధన,మాన, ప్రాణాలను రక్షించడానికి ఎన్నో పరీక్షలు నిర్వహించి నెలల పాటు శిక్షణనిచ్చి పోలీసులను నియమించే ప్రభుత్వాలు వారికి ఆయుధాలను ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని వదులుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చిల్లర దొంగల నుంచి ఉగ్రవాదుల వరకు అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉండగా, వారిని ఎదుర్కొనాల్సిన పోలీసులు మాత్రం దశాబ్దాల కాలం నాటి తుపాకులతోనే నెట్టుకొస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాత్రి వేళల్లో గస్తీలో పాల్గొనే కానిస్టేబుళ్లు కేవలం లాఠీలతో విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు నిర్భీతిగా దాడులకు తెగబడుతున్నారు. బెంగళూరు నగరంలో కూడా దొంగలు, అసాంఘిక ముఠాలు పోలీసులపై దాడులకు తెగబడ్డ ఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా పోలీసులకు కొత్త ఆయుధాలు అందించి శాఖలో ఆయుధాల కొరతను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం. కాగ్ నివేదికలో చేదు నిజాలు రాష్ట్ర పోలీసుశాఖలో ఆయుధాల కొరతపై గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందంటూ కాగ్ స్పష్టం చేసింది. చాలా స్టేషన్లలో కావాల్సినంత మందుగుండు ఉంది, తుపాకులే లేవు, కొన్నిచోట్ల తుపాకులు ఉన్నాయి, అందుకు తగిన మందుగుండు అందుబాటులో లేదు. ♦ 2012లో రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో ఏకే– 47 తదితర ఆయుధాల కొరత మరింత తీవ్రంగా ఉంది. ♦ ప్రతి పోలీస్స్టేషన్లో తప్పనిసరిగాఉండాల్సిన 0.303 ట్రంకెటేడ్ రైఫిల్ల కొరత 72 శాతం ఉండగా 2017 మార్చ్ నెలఖారు నాటికి కూడా ఆయుధాల కొరత శాతం అంతే ఉన్నట్లు కాగ్ నివేదికలో బహిర్గతమైంది. ♦ ఆయుధాలు ఉన్న 18 పోలీస్స్టేషన్లలో అందుకు సరిపడా మందుగుండు సామగ్రి లేకపోవడంతో ఆయుధాలన్నింటినీ స్టోర్రూమ్లలో పడేశారు. పలు పీఎస్లలో మందుగుండు కాలవ్యవధి ముగియడంతో బెంగళూరులోని సీఏఆర్,మైసూరు నగరంలోని డీఏఆర్ కేంద్రాల్లో అటకెక్కించారు. ఇంటెలిజెన్స్ విభాగ ఏడీజీపీ, కేఎస్ఆర్పీ, యాదగిరి, తుమకూరు తదితర 18 పోలీసు కేంద్రాల్లో భారీగా నిల్వ చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఏళ్లతరబడి వృథాగా ఉంటోంది. ప్రస్తుతం కొత్తగా పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయుధాలు లేనంతగా ఆయుధాల కొరత సమస్య పరిణమించిందని పోలీసు వర్గాల సమాచారం. దీంతో చేతిలో సరైన ఆయుధాలు లేక పోవడంతో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు. శిక్షణ లేక చిలుము కాగ్ నివేదికల ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 21 పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లకు 9 ఎంఎం గన్లు ఇచ్చారు. అయితే ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లకు అందించిన గన్లను అధికారులు స్టేషన్లలోని స్టోర్రూమ్లలో భద్రపరిచారు. సంవత్సరాల తరబడి స్టోర్ రూమ్లలో భద్రపరచిన గన్లను ఎప్పుడు కూడా వాడకపోవడం, కనీసం అప్పుడప్పుడు శుభ్రం కూడా చేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఆయుధాల కొరత లేదు: డీసీఎం పరమేశ్వర్ రాష్ట్రంలోని హోం శాఖలో ఎలాంటి ఆయుధాల కోరత లేదని, సీఏజీ ఇచ్చిన నివేదికను చాలా సీరియస్గా తిసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర్ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ. పోలీసు సిబ్బందికి ఆయుధాల కొరతపై కాగ్ నివేదిక మీద చర్చించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తామని తెలిపారు. -
నిర్భయ తల్లే ఇంత అందంగా ఉంటే...
సాక్షి, బెంగళూరు : దేశరాజధాని నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. మానవ మృగాలు 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని బస్సులో కిరాతకంగా అత్యాచారం చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్భయ తల్లి ఆశాదేవి లైంగిక దాడుల్లో కఠిన చట్టాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రిటైర్డ్ అధికారి ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... స్త్రీలను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి కర్ణాటక మాజీ డీజీపీ హెచ్టీ సంగ్లియానాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ‘నిర్భయ’ తల్లి ఆశా దేవి కూడా వచ్చారు. సంగ్లియానాను వేదిక మీదకు ఆహ్వానించి మాట్లాడాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఈ ఉన్నతాధికారి తాను ఎక్కడ ఉన్నది, ఎందుకు వేదిక మీదకు వచ్చిందనే విషయం మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయ తల్లిని చూశాను. ఆమె చక్కగా, అందంగా ఉన్నారు. తల్లే ఇంత అందంగా ఉంటే ఇక నిర్భయ ఎంత అందంగా ఉండేదో నేను ఊహించగలను’ అన్నారు. అంతేకాకుండా కార్యక్రమానికి వచ్చిన వారికి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ‘మీరు ఎంత బలవంతులైనా సరే.. రేపిస్టులకు లొంగిపోవాల్సిందే. అలా అయితేనే మీరు, మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి, ఈ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి’ అంటూ వ్యాఖ్యానించారు. సంగ్లియానా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ మహిళ సంఘాలు ధర్నా చేపట్టాయి. -
కర్ణాటక పోలీసుల దాష్టీకం
సాక్షి, పెద్దపంజాని: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే 11 మంది యువకులను కర్ణాటక తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. వారిలో ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దొంగతనం చేయకుండానే ఒప్పుకోమని వారిని బెదిరిస్తున్నారని ఆ యువకుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
పోలీసులే షాకయ్యారు.. వైరల్ వీడియో
-
పోలీసులే షాకయ్యారు.. వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు : నేరగాళ్లు రోజురోజుకు తెలివి మితిమీరిపోతున్నారు. కర్ణాటక పోలీసులకు దొరికిన వాకింగ్ స్టిక్ గన్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అసలు ఎవరికీ అనుమానం రాని విధంగా వాకింగ్ స్టిక్లో పూర్తిస్థాయి తుపాకీని తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని తయారు చేసిన వాడి నైపుణ్యంపై మనం ఆశ్చర్యపోవాల్సిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాకింగ్ స్టిక్ను గుర్తించిన పోలీసులు ఇది మామూలు వాకింగ్ స్టిక్ అనుకున్నారు. కానీ అనుమానం రావడంతో స్టిక్ను పరిశీలించిన పోలీసులు ఇది కేవలం మామూలు వాకింగ్ స్టిక్ అయితే కాదని నిర్ధారించుకున్నారు. వాకింగ్ స్టిక్ ముందు భాగంలో తూటాలు వెళ్లేందుకు మార్గం ఉన్నట్లుగా ఉంది. చేతితో పట్టుకునే స్టిక్ భాగాన్ని విప్పిచూడగా అందులో ట్రిగ్గర్ ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇది ఎక్కడ తయారు చేశారు, ఏ గ్యాంగ్ వాడుతున్నది అనేది గుర్తించాల్సి ఉంది . అయితే ఏ ప్రాంతంలో ఈ స్టిక్ను పోలీసులు గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. -
కర్ణాటక - ఆంధ్ర పోలీసుల భేటీ
పావగడ: కర్ణాటక - ఆంధ్ర సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ఆంధ్ర , కర్ణాటక ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు స్థానిక నిడుగల్కొండలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మధుగిరి డీఎస్పీ కల్లేశప్పతో పాటు శిర, కళ్యాణదుర్గం, మడకశిర డీఎస్పీలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాలలో నేరాల నివారణ పై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆచూకీ లభించని గుర్తు తెలియని శవాల ఉదంతాలపై కూడా మాట్లాడినట్లు సమాచారం. అంతే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో అసాయింఘిక కార్యకలాపాల నివారణపై కూడా లోతుగా చర్చించినట్లు తెలిసింది. సరిహద్దు ప్రాంతాల్లో నేరాల అదుపుకు ఇరు ప్రాంతాల పోలీసు అధికారులు సంయుక్తంగా కూంబింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
కర్ణాటక పోలీసుల దాష్టీకం
- ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన వైనం - ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన ---------------------------------------------------- గుంతకల్లు : విచారణ పేరుతో ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన కర్ణాటక పోలీసుల దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అనంతపురం జిల్లా గుంతకల్లు శివార్లలోని ఆలూరు రోడ్డు కాల్వగడ్డ ఏరియాలో నివాసముంటున్న షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తాపీ మేస్త్రీ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక పాతబస్టాండ్ ఏరియాలోని మెకానిక్ షెడ్డులో బైక్ను రిపేరి చేయించుకుంటుండగా అదే సమయంలో టాటాసుమోలో వచ్చిన కర్ణాటక రాష్ట్రం బళ్లారి కౌల్బజార్ ఠాణా పోలీసులు ‘అబ్దుల్లా అంటే నువ్వేనా’ అని అడిగారు. ఔనని సమాధానం చెప్పేలోగానే లాఠీలతో చితకబాదేశారు. ‘నన్ను ఎందుకు కొడుతున్నారని’ అతను అడుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఏకంగా అతని చేతికి సంకెళ్లు వేసి తమ వెంట పట్టణ శివార్లలోని బళ్లారి చౌరస్తాలోకి పిల్చుకెళ్లారు. ఆ తరువాత అబ్ధుల్లాను సెల్ఫోన్ కెమెరాలో బంధిచి వాట్సప్ ద్వారా బళ్లారి కౌల్బజార్ పోలీసుస్టేషన్కు నిర్ధరణ కోసం పంపగా... అసలు వ్యక్తి అతను కాదని అక్కడి నుంచి సమాధానం రావడంతో వదిలేశారు. తన వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కొని సిమ్కార్డు(నెంబర్: 8341085352) తీసుకువెళ్లారని బాధితుడు ఆరోపించాడు. గుంతకల్లు మండలం నరసాపురం కొట్టాలలో నివాసముంటున్న అబ్ధుల్లా అనే వ్యక్తి(అంత్రాలు వేస్తూ జీవించేవాడు)పై బళ్లారి కౌల్బజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావడంతో అతని కోసం వచ్చి తనను తీసుకువెళ్లి చితకబాదారని తాపీ మేస్త్రీ అబ్ధుల్లా బోరుమన్నాడు. తల, వీపు, ముఖంపై బలంగా పిడిగుద్దలు కురిపించారని కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై గుంతకల్లు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు అబ్ధుల్లా విలేకరులకు గురువారం తెలిపారు. -
పోలీసుల వేతనాలు పెంపు !
10 నుంచి15 శాతం వరకు పెరిగే అవకాశం బెంగళూరు: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పోలీసుల డిమాండ్లలో ఒకటైన వేతనాల పెంపు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే పోలీసుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించనుందని సమాచారం. పోలీసుల వేతనాలను 10నుంచి 15 శాతం వరకు పెంచేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ సూత్ర ప్రాయంగా అంగీకరించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆర్థిక శాఖ వద్ద సైతం ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి పోలీసులు గతంలో సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ వినాయక చవితి పండుగకు పోలీసులకు శుభవార్తను వినిపించనుందని తెలుస్తోంది. -
ఫేస్బుక్లో మహిళా అధికారి సంచలన పోస్టు!
సాక్షాత్తు ఓ మంత్రి వేధిస్తున్నారంటూ బళ్లారీలోని కుడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్ తన పదవికి రాజీనామా చేసి రెండునెలలైన గడవకముందే మరో అధికారిణి కర్ణాటక పోలీసుశాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. బళ్లారీ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గాయత్రి ఫర్హాన్ సోమవారం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. 'మహిళలను అధికారులుగా గుర్తించడం కష్టతరంగా కనిపిస్తోంది. నా కెరీర్ మొదలైన నాటినుంచి నేను దీనిని స్వయంగా అనుభవిస్తున్నా. డిపార్ట్మెంట్లో మహిళలు ఎంతోగానో శ్రమించినా.. వారి పనితీరుకు పురుషులకు లభించినంతగా గుర్తింపు రావడం లేదు' అంటూ గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 'డిపార్ట్మెంట్లో వారానికి ఏడు రోజులు, 24 గంటలూ పనిచేసినా అంతా వృథా అవుతోంది. డిపార్ట్మెంట్లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు నాకు ఏడేళ్లు పట్టింది. కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. కానీ అవి నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఎప్పుడూ నా కన్నీళ్లను చూపలేదు. ఇప్పుడు సమర్థతపైనే నాలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా బ్యాచ్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టి సెప్టెంబర్ 1తో పన్నెండేళ్లు పూర్తికావొస్తున్నది. అయినా ఉద్యోగంలో సంతృప్తి లేదు. సమాజంలోనూ, వృత్తిజీవితంలోనూ మహిళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. 'చెయ్యి లేదా చావు' అన్న పరిస్థితి నెలకొంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక పోలీసు శాఖపై మహిళా అధికారులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేయడం సిద్ధరామయ్య సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారింది. కార్మికశాఖ మంత్రి పీటీ పరమేశ్వరన్ నాయక్ వేధిస్తున్నారంటూ బళ్లారీ డీఎస్పీ అనితా షెనాయ్ రాజీనామా చేయడం పెద్ద దుమారం రేపింది. తాజాగా పోలీసుశాఖలో మహిళలపట్ల తీవ్ర లింగవివక్ష పాటిస్తున్నారంటూ గాయత్రి ఫర్హాన్ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
ఆమ్నేస్టీ సంస్థపై రాజద్రోహం కేసు
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది. కశ్మీర్లో మానవ హక్కులపై అమ్నేస్టీ సంస్థ శనివారం బెంగళూరులో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కశ్మీరీలు ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అమ్నేస్టీ సదస్సు జాతి వ్యతిరేకమంటూ ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారని ఏబీవీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్నెస్టీ సంస్థతో పాటు మరికొందరిపై కర్ణాటక పోలీసులు సోమవారం రాజద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తమకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని ఆమ్నేస్టీ కర్ణాటక విభాగం తెలిపింది. -
మధురవీణ వర్సెస్ సోనియా!
ఇద్దరు ఐపీఎస్ మహిళా అధికారులు మధ్య గొడవ కర్ణాటకలో దుమారం రేపుతున్నది. సీఐడీ ఎస్పీ మధురవీణ, సీఐడీ డీఐజీ సోనియా నారంగ్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఐజీ సోనియా నారంగ్పై మధుర వీణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐడీ ఎస్పీ మధురవీణ బ్లాక్ మెయిల్కు పాల్పడి.. ఓ హోటల్ మేనేజ్మెంట్ నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యభిచారం జరుగుతుందన్న అనుమానంతో మార్చి 3న బెంగళూరు కన్నింగ్హామ్ రోడ్డులోని ఆర్చిడ్ రమదా స్టార్ హోటల్పై మధురవీణ నేతృత్వంలో పోలీసుల దాడి జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హోటల్లోని గది నంబర్ 306పై పోలీసులు దాడి చేశారు. గదిలో ఇద్దరు అమ్మాయిలు దొరికారు. దీంతో రూ. 5 లక్షలు ఇవ్వాల్సిందిగా మధురవీణ హోటల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేసిందని, అయితే, చర్చల ద్వారా సెటిల్ చేసి రూ. 2 లక్షలకు డీల్ చేసుకొని, ఈ వ్యవహారాన్ని ముగించినట్టు మధురవీణపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో హోటల్ ఆరోపణలు, సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా సీఐడీ డీఐజీ సోనియా నారంగ్ మధురవీణకి వ్యతిరేకంగా డీజీపీకి దర్యాప్తు నివేదిక అందజేశారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా కర్ణాటక డీజీపీ ఓంప్రకాశ్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీపీ కిషోర్ చంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన సోనియా నారంగ్ తనను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నదని, తనను ఆమె వేధిస్తున్నదని ఏకంగా బాస్పైనే మధురవీణ కేసు పెట్టడంతో కర్ణాటకలో పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది. -
పోలీసుల అదుపులో 'బీటెక్ బాబు'?
ద్విచక్రవాహనాలను చోరీ చేసి కుప్పంలో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తీగ లాగేసరికి డొంకంతా కదిలింది. అతడిని విచారణ చేసి ఇప్పటి వరకు 42 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకుల పుత్రరత్నాలు ఉన్నట్టు భోగట్టా! దీంతో ఒత్తిళ్లు అధికం కావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఇదెన్ని మలుపులు తిరుగుతుందోనని పట్టణవాసుల్లో చర్చనీయాంశమైంది. కుప్పం: బెంగళూరు, కేజీఎఫ్, కోలారు, క్రిష్ణగిరి తదితర పట్టణాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేసి కుప్పంలో విక్రయిస్తున్న ఓ యువకుడిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి 42 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని, వురింత సవూచారం కోసం విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ కొత్తవే కావడం విశేషం. రిజిస్ట్రేషన్ కాని కొత్త మోటార్ సైకిళ్లను చోరీ చేసి ఓ వుుఠా కుప్పంలో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సవూచారం అందడంతో నిఘా పెట్టారు. దీంతో వుండల పరిధిలోని ఎలాంజగానూరుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసి దొంగావతారమెత్తిన అతని నుంచి రాబట్టిన సమాచారంతో ఇప్పటి వరకు 42 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అతడు జల్సాల కోసం బైకుల చోరీకి పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా తేలింది. అయితే, అతనితోపాటు ఎంతమంది చోరీలో పాల్గొన్నారనేది తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం, పైగా చోరీ చేసి, విక్రయించిన బైకుల్లో బుల్లెట్ బైక్స్ను అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల కుమారుల నుంచి రికవరీ చేయడంతో పట్టణంలో తీవ్ర చర్చనీయూంశంగా వూరింది. చోరికి చేసిన వాటిల్లో బుల్లెట్తోపాటు పల్సర్ వాహనాలే అధికంగా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఇవన్నీ ఉన్నాయి. ఇంకనూ స్వాధీనం చేసుకోవలసిన మోటార్ సైకిళ్లు ఉన్నట్టు సమాచారం. ఓ వైపు- పోలీసులు ఘరానా బైక్ దొంగను పట్టుకున్నారని స్థానికుల నుంచి ప్రశంసలు అందుతున్నా, మరోవైపు ‘అధికార పార్టీ నేతల’ ఒత్తిళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలిసింది.మొత్తానికి బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. కేసు, దర్యాప్తు పరంగా ఇది పోలీసులను ఎట్లా పరుగులు తీయిస్తుందో వేచి చూడాలని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
రూ.1.50 కోట్లు కర్ణాటక పోలీసులకు అప్పగింత
సూర్యాపేట(నల్లగొండ): ఈ నెల 6వ తేదీన నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఉన్న ఓ కారులో స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల సొమ్మును పట్టణ సీఐ మొగలయ్య కర్ణాటకలోని గోల్గుంబజ్ పట్టణ సీఐ సుల్ఫీకి బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మొగలయ్య మాట్లాడుతూ డీఎస్పీ ఎంఏ రషీద్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకోగా ఆ డబ్బును కోర్టుకు అప్పగించామని, తిరిగి కర్ణాటక పోలీసులకు అప్పగించేందుకు కోర్టు అనుమతించిందని తెలిపారు. కోర్టు అనుమతితో కర్ణాటక పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. అక్కడి పోలీసులు కర్ణాటక కోర్టులో అప్పగిస్తారని, పూర్తి విచారణ తర్వాత సంబంధిత బ్యాంకు అధికారులకు కోర్టు నుంచి ఆ డబ్బును అప్పగిస్తారని తెలిపారు. ఈ కేసు విషయంలో ఈ నెల 8న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ డీఎస్పీ పాటిల్ పట్టణ పోలీసు స్టేషన్కు విచారణకు వ చ్చారు. ఆ డబ్బును కర్ణాటక రాష్ట్రం బిజాపూర్లోని ఐసీఐసీఐ శాఖ నుంచి ఆ బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కలసి దొంగతనం చేశారని తెలిపిన విషయం విదితమే. -
దేశంలోనే కర్ణాటక పోలీస్ ఉత్తమం
రాష్ట్ర డీజీపీ లాల్రుకుమ్పచావ్ బెంగళూరు(బనశంకరి) : దేశంలోనే కర్ణాటక పోలీస్ ఉత్తమమని డీజీపీ లాల్రుకుమ్ పచావ్ ప్రశంసించారు. శనివారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా శుక్రవారం కోరమంగలలోని కేఎస్ఆరపీ మైదానంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి మాట్లాడారు. తన అధికారంలో రాష్ర్టంలో పలు తీవ్ర సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నానని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో రెండు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు జరిగాయని ఈ కేసుల్లో నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో రాష్ర్ట పోలీస్ శాఖ చాకచక్యంగా వ్యవహరించిందంటూ అభినందించారు. -
పండుగ పూట విషాదం
విడపనకల్లు, కణేకల్లు : విడపనకల్లు వుండలం వి.కొత్తకోట గ్రావూనికి చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం బళ్లారి జిల్లా బెండెట్టి గ్రావుం వద్ద హెచ్చెల్సీలో గల్లంతయ్యూరని తెలియగానే వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుల బంధువులు, గ్రావుస్తులు తెలిపిన మేరకు.. వి.కొత్తకోట గ్రావూనికి చెందిన మోజెస్, సుజాతలు ఉపాధ్యాయుులు. కణేకల్లు వుండలం వూల్యంలో మోజెస్ ప్రైవురీ పాఠశాల హెచ్ఎంగా, సుజాత కణేకల్లులో ఎస్జీటీ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి కుమారులు రవితేజ (20) అతని సోదరుడు కమల్తేజ (17) సంక్రాంతి కోసం ఇంటికి వచ్చారు. మోజెస్ అన్న కుమార్తె లక్ష్మి వీరిని పండుగ కోసం అని మంగళవారం సాయంత్రం బళ్లారికి తీసుకెళ్లింది. బుధవారం వీరు బహిర్భూమికి వెళ్లారు. బాటిల్లో నీరు నింపుకుంటూ కమల్ తేజ్ కాలు జారి పడిపోయూడు. అతన్ని కాపాడటం కోసం చేరుు అందిస్తూ రవితేజ సైతం నీట మునిగాడు. కొద్ది దూరంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు చీరలు వేసి వీరిని రక్షేంచుకు విఫలయత్నం చేశారు. మహిళల అరుపులతో స్థానికులు, పోలీసులు వచ్చి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన పిల్లలు (ఒకరు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, మరొకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్) ఇలా గల్లంతయ్యూరని బంధువులు, గ్రామస్తులు కంట నీరు పెట్టారు. ప్రవూద విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు సింగాడి తిప్పయ్యు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. ఎక్కడో ఒక చోట గట్టుకు చేరి ఉంటారని తల్లిదండ్రులకు, బంధువులకు ధైర్యం చెప్పారు. అనంతరం కర్ణాటక అధికారులతో వూట్లాడి గల్లంతు అరుున విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేరుుంచారు. విద్యార్థుల గల్లంతు, కర్ణాటక పోలీసులు, విషాదం, Students missing, Karnataka police, the tragedy -
కమ్మనపల్లెలో టెన్షన్..టెన్షన్
పలమనేరు: పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కమ్మనపల్లెలో ఆదివారం టెన్షన్ నెలకొంది. కమ్మనపల్లెకు చెందిన ఓ అదృశ్యమైన వివాహిత కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ వద్ద శవమై బయటపడిందంటూ పుకార్లు వినిపించాయి. దానికితోడు గంగవరం పోలీసులు ఆ ప్రాంతంలో అన్వేషణ జరపడం, ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలను బలపరిచాయి. అదృశ్యమైన వివాహిత ఏమైందనే సమాచారం తెలియనప్పటికీ కమ్మనపల్లె పంచాయతీలోని అన్ని గ్రామాల్లో దీని గురించే చర్చ జరిగింది. కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరేపల్లెకు చెందిన శిల్పతో వారి బంధువైన కీలతొరిడి గ్రామానికి చెందిన కుమార్రాజాకు పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. ఈ సాకుతో అత్తమామలు వేధిస్తున్నారని, ఇందుకు భర్త సహకరిస్తున్నాడని బాధితురాలు గతంలో పలమనేరు కోర్టులో కేసు వేసింది. విచారణ జరుగుతుండగానే కమ్మనపల్లెకు చెందిన కొందరు తాము కేసును రాజీ చేస్తామంటూ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టుకు హాజరైన శిల్ప అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ సమీపంలో గల ఓ చెరువులో పూడ్చి పెట్టిన ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందనే విషయం దావానలంలా వ్యాపించింది. దుస్తులు దాదాపు అలాగే ఉండడంతో ఆ మృతదేహం శిల్పాదేనని కుటుంబ సభ్యులు అనుమానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి కర్ణాటక పోలీసులతో చర్చించారు. భర్త కుమార్రాజాను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కమ్మనపల్లెకు చెందిన ప్రస్తుత సర్పంచ్ కుమారుడు, మాజీ సర్పంచ్తో పాటు మరికొంధరిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డిని వివరణ కోరగా శిల్ప అదృశ్యమైందని తమకు గతంలో ఫిర్యాదు వచ్చిందని, ముల్బాగల్ ప్రాంతం లో వెలుగు చూసిన మహిళ శవం ఆమెదేనా అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు. వివరాలు తెలిశాక సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. -
మఫ్టీ తెచ్చిన తంటా
ముంబై పోలీసుల అదుపులో కర్ణాటక పోలీసులు ఉన్నతాధికారి జోక్యంతో కథ సుఖాంతం బెంగళూరు : నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ముంబై వెళ్లిన కర్ణాటక పోలీసులను.. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ముంబైకు చెందిన డాక్టర్ సంతోష్ రై తనకు ధార్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినిమా నటీనటులతో పాటు దేశంలోని వివిధ వైద్య విద్యా కళాశాల డెరైక్టర్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. అందరినీ నమ్మించడానికి వీలుగా అప్పుడప్పుడు యాగాలు, రాజకీయ నాయకులతో కలిసి ధర్నాలు చేయడంతో పాటు చిన్న చిన్న సినిమా, టీవీ సీరియల్స్ ప్రారంభోత్సవాలు, పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని హడావుడి చేసేవారు. అంతేకాకుండా హెల్త్ అండ్ హెల్త్ సొసైటీ ఆఫ్ ఇండియా, బ్రహ్మశ్రీ హెల్త్ కేర్ అండ్ రీసర్చ్ తదితర సంస్థలకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా తనను తాను పేర్కొనేవాడు. ఈ మేరకు వెబ్సైట్లను సృష్టించి సోషియల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే వాడు. ఇతని మాయలో పడిన అనేక మంది ఉత్తర భారత దేశానికి చెందిన విద్యార్థులు లక్షలాది రూపాయాలను మెడికల్ సీట్ల కోసం పోగొట్టుకున్నారు. ఈ విషయమై ముంబైతో పాటు ఢిల్లీ, హర్యానా తదితర నగరాల్లో ఇతనిపై ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విద్యా ఏడాది ప్రారంభంలో తన మకాంను బెంగళూరుకు మార్చి కర్ణాటకలోని కిమ్స్, అంబేద్కర్ మెడికల్ కళాశాల, బెంగళూరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ 12 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ.1.20 కోట్లను వసూలు చేసి ముంబైకు వెళ్లిపోయాడు. ఈ విషయమై నగరంలోని తిలక్ నగర్తో పాటు మరో రెండు మూడు పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. సంతోష్రై వాడుతున్న సెల్ఫోన్ సిగ్నల్స్ను బట్టి అతను ముంబైలో ఉన్నట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఆదివారం నలుగురు పోలీసులు ముంబైకు వెళ్లారు. యూనిఫాంతో వెళితే తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉందని భావించి వారు మఫ్టీలో సంతోష్ రై ప్రాంతాన్ని చేరుకుని అతని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరు పోలీసు వాహనాన్ని కాక కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా కారును తమతో తీసుకువెళ్లారు. సంతోష్రైను అదుపులోకి తీసుకొన్న తర్వాత అతని మొబైల్ నుంచి అవుట్గోయింగ్ కాల్స్ను కట్ చేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన కుటుంబ సభ్యులకు విషయం చెబుతానని లేదంటే భయపడుతారని సంతోష్ రై విజ్ఞప్తి చేశాడు. మానవీయతా దృష్టితో పోలీసులు అతనికి అవకాశం కల్పించగానే ‘నలుగురు దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో నన్ను బెంగళూరుకు తీసుకువెళుతున్నారు. పోలీసులకు తెలియజేసి నన్ను రక్షించండి’ అని మరాఠిలో తెలిపారు. వెళ్లిన పోలీసులెవరికీ మరాఠి రాకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వెంటనే సదరు కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ముంబైకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాహనాన్ని ఆపి నలుగురు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎంత చెప్పినా మహారాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదు. ఐడీ కార్డులు చూపించినా అవి నకిలీవని కొట్టిపారేసి అందరినీ పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. తర్వాత చాలా బతిమాలితే మఫ్టిలోవెళ్లిన పోలీసులకు కర్ణాటక ఉన్నతాధికారులతో మాట్లాడటానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం అదనపు కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న హేమంత్ నిబాల్కర్ విషయం తెలుసుకుని మరాఠిలో ముంబై పోలీసులతో మాట్లాడి అవసరమైన రుజువులు చూపించి పరిస్థితిని కొలిక్కితెచ్చారు. దీంతో ఆ పోలీసులు నిందితుడు సంతోష్ రైతో పాటు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నగర ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణికటోచ్ ధ్రువీకరించారు. సంతోష్ రై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. -
విద్యార్థిని వేధించిన యువకుడు అరెస్టు
బెంగళూరు: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శివమెగ్గకు చెందిన విశ్వనాథ్ (22)ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్థరాత్రి విశ్వనాథ్ స్నేహితులతో కలిసి ఎస్సీ రోడ్డులోని హోటల్కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ భోజనం చేస్తున్న 20 ఏళ్ల యువతితో సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కామాంధుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారణ చేస్తున్నామని శనివారం ఉప్పరపేట పోలీసులు తెలిపారు. -
‘భర్త హత్య కేసులో అంకిత ఆధారాలు లభించలేదు'
ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ హత్య కేసులో అతని భార్య అంకిత దోషిగా చూపే ఆధారాలు ఏమీ లభించలేదని స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు చెప్పారు. శుక్రవారం వారు తెలిపిన సమాచారం మేరకు.. హెచ్ఆర్గా పని చేస్తున్న సౌరభ్, అంకిత హెచ్ఎస్ఆర్ లేఔట్లోని ఓ అపార్టమెంట్లో నివాసముంటున్నారు. అదే అపార్టమెంట్లో రిశ్విన్ కూడా నివాసముంటున్నాడు. అంకిత, రిశ్విన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. దీంతో గత నెల సౌరభ్ను అతని ఫ్లాట్లోనే రిశ్విన్ దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఇందులో అంకిత ప్రమేయం ఉందని పోలీసులు భావించారు. రిశ్విన్, అంకిత నిత్యం వాట్స్ ఆఫ్లో టచ్లో ఉండేవారు. అయితే వారి మొబైళ్లలోని వాట్స్ఆప్లో ఉన్న సందేశాలను డిలిట్ చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు చిక్క లేదని పోలీసులు అంటున్నారు.దీంతో కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చివరి నివేదిక సమర్పించామని చెప్పారు. రిమాండ్లో ఉన్న రిశ్విన్ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. -
కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం
కిడ్నాప్కు గురైన మహిళను హెబ్బగుడి పోలీసులు క్షేమంగా రక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. హెబ్బగుడి సమీపంలో అనుసూయమ్మ నివాసముంటోంది. ఆమె కుటుంబ సభ్యులు భూలావాదేవీలు, రియల్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు దుండగులు అనుసూయమ్మను కిడ్నాప్ చేశారు. రూ.1.50 కోట్లను ఇవ్వాలంటూ వారు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వారు ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ డబ్బును బెంగళూరు నగర శివార్లలో ఉన్న దుండగులకు ఇచ్చారు. దీంతో వారు అనుసూయమ్మ వదిలేసి.. డబ్బుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు పూర్తి వివరాలు వెల్లడించడానికి హెబ్బగుడి పోలీసులు నిరాకరిస్తున్నారు. -
పరారీలో ఉన్న సినీ నటుడు అరెస్ట్
వెండి తెరపై అతనో సహాయ నటుడు. మూడు చిత్రాల్లో పోలీస్ అధికారిగా కూడా నటించారు. అయితే తెర వెనుక అతనో దొంగ. 14 సంవత్సరాల క్రితం మోటార్ సైకిళ్లను తస్కరించి జైలు పాలయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత బెయిల్పై వచ్చి.. పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిఘా వేసి అతన్ని అరెస్ట్ చేశారు. హెసరుఘట్ట సమీపంలోని విధాన సౌధ లేఔట్లో నివాసముంటున్న నరసింహమూర్తి అలియాస్ మూర్తి (44) పలు కన్నడ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. గూళి, బోంబాట, స్వయంవర అనే చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించాడు. ఇతను బైక్లను చోరీ చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. 2002లో మూర్తిని అరెస్ట్ చేసిన మల్లేశ్వరం పోలీసులు, అతని నుంచి 22 బైక్లను స్వాధీనం చేసుకొని జైలుకు పంపారు. రెండేళ్ల పాటు శిక్ష అనుభవించిన మూర్తి, బెయిల్పై బయటకు వచ్చి పరారయ్యాడు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ మూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా వేసి మూర్తిని అరెస్ట్ చేసింది. -
పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాలిక
విచారణలో పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న మైనర్ బాలిక మానసిక వైద్యులతో చికిత్స అందించాలని నిర్ణయించిన పోలీసులు శివమొగ్గ : తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బుతో ఉడాయించి చివరకు ఓ ఆటో డ్రైవర్ను ప్రేమ వివాహం చేసుకున్న నగరానికి చెందిన మైనర్ బాలిక...తాను పోలీసు అధికారినేనంటూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ బాలికను వివాహం చేసుకున్న నగరానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ను పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి కోర్టులో హాజరు పరచిన విషయం తెలిసిందే. శనివారం జయనగర పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎంసీ.మధు ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా..తాను నిజంగా పోలీస్ అధికారిని అని దబాయించింది. జవరేగౌడ అనే పోలీస్ ఉద్యోగం ఇప్పించారని, ఆయన సూచనమేరకు యూరఫ్, సింగపూర్ దేశాల్లో పోలీస్ శిక్షణ తీసుకుని వచ్చానని చెబుతుంది. దీంతో పోలీసులు ఆ యువతి చదివిన కళాశాలలో ఆరా తీయగా పీయూసీ ద్వితీయసంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తేలింది. దీంతో ఆ బాలికను శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్యులతో చికిత్స అందించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె నును తీసుకెళ్లిన డ్రైవరు సురేశ్ పైనే అనుమానంగా ఉందని, ఈ ఘటన వెనుక మరికొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని, డబ్బుల కోసం నాటకం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ఆనందమానందమాయె..!
8 మందికి ఉరిశిక్ష రద్దు శిక్ష అనుభవిస్తున్న వీరప్పన్ అనుచరుల్లో ఆనందం 15 మందికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వారిలో 8 మంది కర్ణాటక వారే యావజ్జీవ శిక్షగా ఖరారు బెంగళూరు, న్యూస్లైన్ : శిక్ష పడినప్పటి నుంచి తమ వారిని ఎప్పుడు ఉరి తీస్తారోనని మానసిక వేదన... ఒకటా.. రెండా కొన్నేళ్లుగా కర్ణాటకలోని హిండలాగ జైలులో ఉరిశిక్ష ఖైదీలతో పాటు వారి బంధువులు పడిన వేదన మంగళవారం సుప్రీం తీర్పుతో ఊహించని ఉపశమనం లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు ఏకంగా 15 మందికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అందులో 8 మంది కర్ణాటకకు చెందిన వారే. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినప్పటి నుంచి వారిలో నిత్యం మానసిక సంఘర్షణ.. బతకాలనే ఆశ.. కుటుంబ సభ్యులను కలుసుకోవాలనే తపన.. సుప్రీం తీర్పుతో మరోజన్మ ఎత్తినట్లు అయ్యిం ది. వివరాలు... ఒకప్పడు రాష్ట్రాన్ని గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు కొన్నేళ్ల క్రితం తమిళనాడులో మందుపాతరలు పెట్టి 22 మంది కర్ణాటక పోలీసులు మట్టుబెట్టారు. ఈ కేసులో వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యలకు ఉరి శిక్ష పడింది. ఈ నలుగురు బెల్గాంలోని హిండలాగ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ నలుగురు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీలను రాష్ట్రపతి తిరస్కరించారు. ఇక ఉరి కొయ్యపై వేలాడాల్సిందేనని నిర్ణయమైపోయింది. ఉరి తాడులు సైతం సిద్ధం చేశారు. జైలు చుట్టపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవన్ని కొన్ని నెలల క్రితం జరిగిన తతంగం. ఉరి శిక్ష పడిన నలుగురి కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని తమ వారిని కడసారి చూసుకుంటామని మూడు రోజుల పాటు పడరాని అగచాట్లు పడ్డారు. అయినా జైలు అధికారులు కరుణించలేదు. ఇంటి నుంచి తీసుకువచ్చిన చివరి భోజనం అయినా ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అయినా జైలు అధికారులు పట్టించుకోలేదు. చివరకు న్యాయవాదుల సహాయంతో వారు కడసారిగా జైలులో ఉన్న తమవారిని చూసుకుని బయటకు వచ్చి బోరున విలపించారు. సుప్రీం తీర్పు ఆ నలుగురి కుటుంబంలో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. అదే విధంగా చామరాజనగర జిల్లా కోళ్లేగాళలో మహిళను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చిన శివు, జడేస్వామిలకు ఉరి శిక్ష పడింది. వీరు కూడా ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నారు. గల్బర్గా జిల్లా జీవర్గి తాలుకా మందేవాల గ్రామానికి చెందిన సాయిబణ్ణ నింగప్ప తన ఇద్దరు భార్యలు, పిల్లలను హతమార్చడంతో ఉరిశిక్ష పడింది. ఇతను కూడా తాజా సుప్రీం తీర్పుతో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా వామంజూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు వ ుుగ్గురిని అతి దారుణంగా హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఇతనికి ఉరిశిక్ష పడింది. ఇతను కూడా ఉరిశిక్ష తప్పించుకున్నాడు. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న వారిలో కర్ణాటకలోనే 8 మంది శిక్ష అనుభవిస్తున్నారు. -
'ఏటీఎం' దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్!
రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అతడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హిందుపురం పట్టణంలో మొబైలు ఫోన్ విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుడు హిందుపురానికి చెందినవాడు. పోలీసులు విచారణ నిమిత్తం అతడిని కర్ణాటకకు తరలించారు. కాగా బెంగళూరులో నగదు డ్రా చేసేందుకు బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ ఏటీఎం సెంటర్కు వెళ్లింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి షెటర్ మూసివేసి, ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. అలాగే తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్ ఫోన్ తీసుకుని అతడు పరారయ్యాడు. ఏటీఎం నుంచి రక్తం రావడంతో స్థానికులు అనుమానించి షటర్ ఎత్తి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. దాంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఏటీఎంలో మహిళపై ఆగంతకుడు దాడి, అనంతరం జరిగిన తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో పోలీసులు సీసీ పూటేజ్లను పరిశీలించారు. నిందుతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కర్ణాటక పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసుల సహాయం తీసుకున్నారు. దాంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనుమానితుడి అరెస్ట్ ను పోలీసులు ఇంకా ద్రువీకరించలేదు. -
యాసిన్ భత్కల్ ను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు!
భారత జాబితాలో మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ యాసిన్ భత్కల్ కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భత్కల్ ఐడెంటిటీని ధృవీకరించడానికి బీహార్ పోలీసులు కర్నాటక పోలీసులను సంప్రదించినట్టు తెలిసింది. భత్కల్ ను అరెస్ట్ చేసిన వెంటనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి ఓ టీమ్ ను పంపించాలని విజ్క్షప్తి చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వ్యక్తి భత్కలేనా కాదా అని ధృవీకరించడానికి కర్నాటక పోలీసు విభాగానికి చెందిన ఓ టీమ్ బీహార్ కు వెళ్లినట్టు సమాచారం. కర్నాటకలోని తీరపాంత్రమైన భత్కల్ గ్రామానికి యాసిన్ భత్కల్ చెందినవాడని అధికారులు తెలిపారు. మభ్యపెట్టే విషయంలో భత్కల్ ఆరితేరిన వాడు కావడంతో అతని కుటుంబ సభ్యులతో జీవసంబంధమైన అంశాన్ని పోలీసులు సరి చూడటానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించానున్నారు. -
హనీఫా మళ్లీ అరెస్ట్
సాక్షి, చెన్నై: తెన్కాశి హనీఫా మళ్లీ అరెస్టు అయ్యాడు. బెంగళూరు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా హనీఫాను చేర్చారు. విచారణ నిమిత్తం అతడ్ని బెంగళూరు తీసుకెళ్లే పనిలో కర్ణాటక పోలీసులు పడ్డారు. ఇటీవల బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉండడంతో ఆ కేసు విచారణ రాష్ట్రం చుట్టూ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఇప్పటికే అరెస్ట్ అయ్యూరు. దీనిని నిరసిస్తూ మైనారిటీ సామాజిక వర్గం ఆందోళనలు నిర్వహించింది. అక్రమ అరెస్టులుగా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో తెన్కాశి హనిఫాను పేలుళ్ల కేసులో నిందితుడిగా చేరుస్తూ శనివారం అరెస్టు చేశారు. మదురైలో హనీఫా తెన్కాశి హనీఫా దిండుగల్ సమీపంలో ఇటీవల అరెస్టు అయ్యారు. బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర విచ్ఛిన్నానికి మదురై సమీపంలో జరిగిన కుట్రలో హనీఫా నిందితుడు. హనీఫా ప్రస్తుతం మదురై కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు పేలుళ్ల కేసులో హనీఫా హస్తం ఉన్నట్లు కర్ణాటక పోలీసులు తేల్చారు. అతడ్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందం అధికారులు శనివారం మదురై చేరుకున్నారు. అరెస్టుకు సంబంధించిన ఉత్తర్వులను మదురై కేంద్ర కారాగారం అధికారులకు అందజేశారు. హనీఫాను విచారణ నిమిత్తం తీసుకెళ్లడానికి కర్ణాటక పోలీసులు ప్రయత్నిస్తున్నారు.