Kathua
-
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
కథువా ఉగ్రదాడిని ఖండించిన భారత్.. ప్రతీకారం తీర్చుకుంటాం!
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు.ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. -
జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్ రోడ్లో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో(మోడర్గాం, ఫ్రిసాల్ ఏరియా) ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్పోస్ట్పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్పోస్ట్పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్పోస్ట్ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్పోస్ట్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్పూర్లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదకద్రవ్యాల అక్రమరవాణా ప్రయత్నానికి బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకట్టవేశాయి. మార్కెట్లో రూ.135 కోట్ల విలువచేసే 27 కేజీల హెరాయిన్ను భారత భూభాగంలోకి తీసుకొస్తున్న పాకిస్తానీ స్మగ్లర్ను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భారత్–పాక్ సరిహద్దు వెంట పర్సర్ బోర్డర్ ఔట్పోస్ట్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటాక(తెల్లారితే బుధవారం) 2.30–3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను బీఎస్ఎఫ్(జమ్మూ) ఐజీ ఎన్ఎస్ జామ్వాల్ వెల్లడించారు. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
‘ఆమె’ డ్రైవర్
జమ్మూ – కథువా – పఠాన్కోట్ రహదారి పెద్ద పెద్ద ట్రక్కులు, వాహనాలతో బిజీగా ఉంటుంది. అలాంటి రహదారి మీద కథువా నుండి జమ్మూ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఉన్న ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు బస్సు డ్రైవర్ని చూసి. తర్వాత సందేహించారు. కారణం ‘ఆమె’ బస్సు నడపగలదా? అని. తర్వాత తమ ప్రయాణానికి ఢోకా లేదని నిశ్చింతంగా కూర్చున్నారు. బస్సు గమ్యస్థానానికి చేరింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతూ బస్సు డ్రైవర్కి అభినందనలు తెలిపారు. ఆ బస్సు డ్రైవరు పేరు పూజా దేవి. జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి బస్సు నడిపిన మహిళగా పేరుపొంది పూజాదేవి. కతువా జిల్లాలోని సంధర్–భష్లో అనే మారుమూల గ్రామానికి చెందిన పూజాదేవికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. టీనేజ్ నుంచి కార్లు, మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేస్తుండేది. ఆ వయసు నుంచే పెద్ద పెద్ద వాహనాలను నడపాలనుకునేది. పూజాదేవి తాను చేస్తున్న పని గురించి వివరిస్తూ ‘నా కుటుంబం మొదట్లో నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ, నాకు వేరే ఉద్యోగం ఎంచుకునేంత పెద్ద చదువు లేదు. నాకు డ్రైవింగ్ పని వచ్చు. కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నాకు వచ్చిన పని నుంచే ఉపాధి పొందవచ్చు కదా అనుకున్నాను. అందుకు ఇంట్లో వాళ్లు ఆడవాళ్లు అంత పెద్ద పెద్ద వాహనాలను ఎలా నడపగలరు. శక్తి సరిపోదు అన్నారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. కమర్షియల్ వెహికిల్స్ను ఎలా నడపాలో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు టాక్సీ నడుపుతున్నాను. కతువా నుండి జమ్మూ వరకు ట్రక్కు కూడా నడిపాను. ఈ వారమే ప్రైవేట్ బస్సు డ్రైవర్గా ఉద్యోగంలో చేరాను. ఇప్పుడిలా ప్రయాణికులను చేరవేసే బస్సు నడపడంతో ఎప్పటి నుంచో నాకున్న కల నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చిన పూజను కలిస్తే ఎవ్వరైనా అభినందించకుండా ఉండలేం. పురుషులు మాత్రమే ప్రయాణికుల బస్సులను నడపగలరనే మూసను ముక్కలు చేయాలనుకున్న విషయాన్నీ పూజ ప్రస్తావిస్తారు. డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలని కోరుకునే మహిళలకు వారి కుటుంబాలు మద్దతు ఇవ్వాలని చెబుతుంది పూజ జమ్మూ కథువా పఠా¯Œ కోట్ రహదారి భారీ ట్రాఫిక్తో ఉంటుంది. ఇతర పురుష డ్రైవర్లు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా ఉండి, సరిగ్గా విధులకు హాజరు కాకపోడంతో, ఈ ఉద్యోగం పూజకు ఇచ్చారు. తన శక్తిని నమ్మి డ్రైవింగ్ ఉద్యోగం ఇచ్చిన బస్సు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతుంది పూజ. -
‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’
శ్రీనగర్: లాయర్ దీపికా రజావత్.. సంచలనాలకు మారుపేరు. ట్రోలింగ్ బారిన పడటం ఆమెకు కొత్తేమీ కాదు. రెండేళ్ల కిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి అత్యాచారం, హత్య కేసులో బాధితుల తరఫున నిలబడ్డారు. ఈ కారణంగా అత్యాచార బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబమే, దీపిక సేవలు తమకు వద్దని చెప్పడంతో కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బాధితుల తరఫున తన గళం వినిపిస్తూ సామాజిక కార్యకర్తగా తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆమె మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. (చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..) నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రతిబింబించేలా ఉన్న ఓ కార్టూన్ను మంగళవారం ట్విటర్లో షేర్ చేశారు. ఓవైపు దేవతామూర్తులను కొలుస్తూనే, మరోవైపు ఆదిశక్తి స్వరూపాలైన అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో రూపొందించిన కార్టూన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు ఆమెను అరెస్టు చేయాలంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తమ మనోభావాలు గాయపరిచిన దీపికా రజావత్ను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ #Arrest_Deepika_Rajawat అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. (‘ఏదో ఒకరోజు.. వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’) అంతేగాక మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు జమ్మూ కశ్మీర్లోని ఆమె ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వెల్లడించిన దీపిక.. ‘‘అలర్ట్... మా ఇంటి ముందు ఓ సమూహం ధర్నాకు దిగింది. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాపై ఎప్పుడు, ఎలా దాడి జరుగుతుందో తెలియదు. కాబట్టి చట్టబద్ధ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుని నాకు రక్షణ కల్పించాలని మనవి’’అని విజ్ఞప్తి చేశారు. Alert Mob assembled outside my residence and raising slogans against me . — Deepika Singh Rajawat (Kashir Koor) (@DeepikaSRajawat) October 20, 2020 -
పాకిస్తాన్ డ్రోన్ కలకలం : కూల్చివేత
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 19వ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
పాక్ నుంచి పావురం.. ఆ కోడ్ ఏంటి?
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనాను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం పదే పదే వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి తర్ఫీదునిచ్చి దాని కాలికి ఓ ఉంగరం తగిలించి పంపింది. కథువా జిల్లాలోని మన్యారీ గ్రామ ప్రజలు ఈ పావురాన్ని గుర్తించి దానిని స్థానిక పోలీస్ స్టేషనులో అప్పగించారు. ఈ విషయం గురించి కథువా ఎస్ఎస్పీ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ సరిహద్దులో దొరికిన పావురం కాలికి ఓ రింగ్ ఉంది. దానిపై కొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ కోడ్ను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాం’’ అని పేర్కొన్నారు. (‘పైలెట్ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) కాగా ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక భారత్లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. గిల్గిట్ బాల్టిస్తాన్కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు దాయాది దేశ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసి గట్టి కౌంటర్ ఇచ్చింది.(‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’) -
‘దిశ’ పేరు బహిర్గతం చేయడం నేరం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రేప్ బాధితురాలు మరణించారన్న విషయంతో సంబంధం లేదు. చనిపోయిన వారికి కూడా గౌరవం ఉంటుంది. చనిపోతే గౌరవం అక్కర్లేదని భావించడం భావ్యం కాదు’ అని సుప్రీం కోర్టుకు చెందిన జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలు గత డిసెంబర్లో ‘నిపున్ సక్సేనా వర్సెస్ కేంద్ర హోం శాఖ’ కేసులో భారతీయ శిక్షా స్మతిలోని 228(ఏ) సెక్షన్కు స్పష్టమైన భాష్యం చెప్పారు. రేప్ బాధితురాలి పేరును కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లో పోలీసులుగానీ, మీడియాగానీ వెల్లడించరాదు. ఆమె ఎవరో సమాజంలో నలుగురికి తెలిసేలా ఆమె ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, కనీసం కుటుంబసభ్యుల వివరాలను కూడా బహిర్గతం చేయరాదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఐపీసీ 228 (ఏ) సెక్షన్ తెలియజేస్తోంది. బాధితురాలు చనిపోతే, మైనరయితే, బుద్ధి మాంద్యం ఉంటే పేరు వెల్లడించడానికి సమీప బంధువుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని 228ఏ (2)(సీ) సెక్షన్ చెబుతోంది. ‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో అటు పోలీసు వ్యవస్థ, ఇటు మీడియాతోపాటు మహిళా సంఘాలు కూడా ఈ నిబంధనను పూర్తిగా ఉల్లంఘించాయి. చాలా ఆలస్యంగా బాధితురాలి పేరును ‘దిశ’గా మార్చాయి. ఆ పని ముందే చేయాల్సింది. ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆమె అసలు పేరేకాదు, కుటుంబం వివరాలను కూడా వెల్లడించకుండా పోలీసులు, మీడియా ఎంతో సంయమనం పాటించాయి. నిర్భయ తల్లిదండ్రులు ఆ తర్వాత నిర్భయంగా మీడియా ముందుకు వచ్చినప్పడే వారి వివరాలను బహిర్గతం చేశారు. ఇప్పటికీ ‘నిర్భయ’ అసలు పేరు సమాజానికి తెలియదు. లైంగిక దాడులకు సంబంధించిన కేసులను గోప్యంగా విచారించేందుకు ఐపీసీ 327 (2) సెక్షన్ జడ్జీలకు అధికారం ఇచ్చింది. ఈ విచారణలను కోర్టు అనుమతి లేకుండా మీడియా బహిర్గతం చేయరాదు. అలా చేస్తే శిక్షలు విధించే అధికారం కోర్టులకుంది. రేప్ బాధితులు దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లాలనుకున్నప్పుడు వారు మారు పేరును కూడా వాడుకోవచ్చు. ఈ కేసులకు సంబంధించిన వైద్య పరీక్షలు, డీఎన్ఏ పరీక్షల విషయంలోనే కాకుండా ఎఫ్ఐఆర్ విషయంలోనూ గోప్యత పాటించాల్సి ఉంటుంది. లైంగిక దాడుల నుంచి మైనర్లను రక్షించడం కోసం 2012లో తీసుకొచ్చిన ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’లో కూడా ఈ నిబంధనలన్నింటిని పొందుపర్చారు. ‘కథువా అత్యాచారం–హత్య’లో ఈ నిబంధనలను అతిక్రమించినందుకు సుప్రీం కోర్టు గత ఏప్రిల్ నెలలో దేశంలోని 12 మీడియా సంస్థలకు జరిమానాలు విధించింది. ‘కోల్కతా పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్’ కేసులో బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అలాంటప్పుడు అలాంటి వారి అనుమతితో పేరు, వివరాలు బహిర్గతం చేయవచ్చు. ‘మన సమాజంలో లైంగిక దాడులకు పాల్పడిన నేరస్థులకన్నా ఆ దాడులకు గురైన బాధితులను నీచంగా చూస్తారు. అందుకని రేప్ కేసుల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. -
సంచలన కేసులో రానున్న తీర్పు : భారీ భద్రత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో తుది తీర్పు నేడు (సోమవారం, జూన్ 10) వెలువడనుంది. పంజాబ్లోని పఠాన్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్కోట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు. కాగా జమ్ముకశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్షీట్ దాఖలైంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ కూడా ఊపందుకున్న సంగతి తెలిసిందే. Punjab: Security heightened outside Pathankot court ahead of verdict in Kathua rape-murder case pic.twitter.com/XaCdsSMnKd — ANI (@ANI) June 10, 2019 -
కథువా కేసు; దీపికా రజావత్కు ఊహించని షాక్!
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా సామూహిక అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్న లాయర్ దీపికా రజావత్కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రాణాలకు తెగించి మరీ ఈ కేసును వాదిసున్న దీపికాకు.. ఇకపై ఆమె సేవలు తమకు అక్కర్లేదంటూ బాధిత కుటుంబం షాక్ ఇచ్చింది. ముస్లిం తెగకు చెందిన చిన్నారి తరపున వాదిస్తున్నందుకు దీపికాను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. కాగా సున్నితమైన ఈ ఘటన కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున పంజాబ్లోని పఠాన్ ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో దీపిక కేవలం రెండుసార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారని, ఇలా అయితే తమకు న్యాయం జరగదని చిన్నారి తండ్రి భావిస్తున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా 100 సార్లు కేసు విచారణకు వచ్చిందని, 100 మంది సాక్ష్యులను విచారించినా ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆరోపిస్తూ లాయర్ను మార్చుకుంటున్నట్లు ఆయన పఠాన్ కోర్టుకు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. -
‘వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’
‘నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం’ - ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టే వారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు చక్కని ఉదాహరణ దీపికా రజావత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె. అడుగడుగునా అవరోధాలే.. ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికాకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది ఈసడించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. కచ్చితంగా చంపేస్తారు.. నాకు తెలుసు ‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. ఈ ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా. (చదవండి : ‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’) అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను. అంటూ ‘వోగ్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్- 2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్ తన అనుభవాలను పంచుకున్నారు. కేసు పూర్వాపరాలు... కశ్మీర్లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చిన ఎమిమిది మంది మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను హత్యచేశారు. బాకర్వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన 5 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. కథువాకు చెందిన సాంజీరాం, అతడి కొడుకు విశాల్, స్పెషల్ పోలీసు ఆఫీసర్ దీపక్ ఖజురియా, సురీందర్ వర్మ, పర్వేశ్ కుమార్, తిలక్ రాజ్, ఎస్సై అరవింద్ దత్తా తదితరులను నిందితులుగా తేల్చారు. కాగా బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిన కారణంగా ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్లోని పఠాన్ ఫాస్ట్ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’
కశ్మీర్ : సబీనా, యాకూబ్ దంపతులు ఓ నెల రోజుల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించారు. కార్గిల్ శిఖరాల అంచుల నుంచి సాంబ మైదానాలకు చేరుకున్నారు. చివరకు తమ స్వగ్రామం రసనాకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఆగిపోయారు. తమ స్వగ్రామానికి వెళ్లాలని వారు ఎదురుచూస్తున్నారు. రసన.. ఆ పేరు తలచుకుంటేనే వారికి భయంతోపాటు బాధ కూడా తన్నుకోస్తుంది. అక్కడే తమ ఏనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా ఆడిపాడింది. పశువుల వెంట, గొర్రెపిల్లల వెనక పరుగు తీసింది. కానీ ఆకస్మాత్తుగా ఆ అందమైన దృశ్యాల స్థానే ఓ భయంకరమైన సంఘటన వచ్చి చేరింది. ఆసిఫా ఎనిమిదేళ్ల చిన్నారి.. ప్రపంచం అంటే ఏంటో తెలియని పసిపాప.. లోకమంతా తనలానే ఉంటుందని నమ్మిన అమాయకురాలి మీద కొన్ని మృగాళ్లు దాడి చేశాయి. తనకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిట్టితల్లి మూడు రోజుల పాటు దేవాలయంలోనే దయ్యాలకు ఆహారమయ్యింది. జరుగుతున్న ఘోరాన్ని చూడలేక ఆ దేవత నిజంగానే శిలయ్యింది. మూడురోజుల పాటు దైవసాక్షిగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. ఈ సంఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా కావాల్సినంతా టీఆర్పీ సాధించింది. ప్రతిపక్షాలు అధికారి పార్టీ మీద తనివి తీరా దుమ్మెత్తి పోశాయి. మేం సిగ్గుపడుతున్నాం అంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రెండు కన్నీటి బొట్లు రాల్చారు. చిత్రమేంటంటే అన్యాయం జరిగిన కుటుంబాన్నే సమాజం శిక్ష విధించింది. పోయిన ప్రాణం.. పడిన వేదన గ్రామస్తులకు కనిపించలేదు. మా వాళ్లనే జైలుకు పంపిస్తారా మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులు. ఆఖరికి తమ స్థలంలోనే బిడ్డను ఖననం చేసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించి అక్కడ ఖననం చేశారు. చేతుల్లో ఉన్న భారాన్ని భూమాతకు అప్పగించారు. తిరిగి సొంత గ్రామానికి వెళ్లలేక ఎక్కడో సాంబ మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ దారుణం జరిగి ఇప్పటికి 10నెలలు గడిచాయి. క్రమంగా ఆ సంఘటన ప్రజల మనసుల నుంచి చెరిగిపోయింది. ఆదుకుంటామన్న ప్రభుత్వాలు ఆ మాటే మర్చిపోయాయి. తల్లి ఆ శోకం నుంచి ఇంకా కోలుకోలేదు.. తండ్రి కూతుర్ని కలవరిస్తున్నాడు. సమాజం ఇప్పడు కూడా వారిని వదలడం లేదు. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ బెదిరింపులు. ఒంటరిగా సమీప నదికి వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాలన్నా వెళ్లలేని పరిస్థితులు. వీటన్నింటి కంటే ఎక్కువగా ఆ తల్లిదండ్రులను భయపెడుతున్నది తాము చనిపోయేలోపైనా తమ కూతురికి న్యాయం జరుగుతుందా.. చివర వరకూ పోరాడే శక్తి తమకు ఉందా అనే విషయం గురించే. ఎందుకంటే ప్రస్తుతం హాసీన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశం.. ఈ కేసు విచారణ జరుగుతున్న పఠాన్కోట్ కోర్టుకు దాదాపు 530 కిలోమీటర్ల దూరాన ఉంది. కోర్టు ట్రయల్స్కి హాజరు కావడానికి డబ్బు లేదు. సంపాదించే పరిస్థితులు కూడా లేవు. చేసేదేం లేక ఉన్న గొర్రెలను.. పశువులను అమ్ముకుంటున్నారు. తమ ఆస్తి అంతా అమ్మకున్నా పర్వాలేదు. కానీ తమ కూతురికి న్యాయం జరిగితే చాలు అంటున్నారు. అదేంటి ప్రభుత్వం సాయం అందలేదా అంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చోలేము. నా చిట్టితల్లి కోసం మేమే పోరాడతాం. ఆ మృగాళ్లకు శిక్ష పడితేనే నా కుమార్తె ఆత్మ శాంతిస్తుందంటున్నారు కథువా బాధితురాలి తల్లిదండ్రులు యాకూబ్, సబీనా. కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్లో ఆసిఫా అనే బాలికను ఆరుగురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా డ్రగ్స్ ఇచ్చి కొన్ని రోజుల పాటు లైగింక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. ఆసిఫా ఒక గిరిజన ముస్లిం తెగకు చెందిన బాలిక. హిందువులు అధికంగా ఉండే కథువా ప్రాంతంలో కొంతమంది దుండగులు బాలికను కిడ్నాప్ చేసి ‘దేవిస్థాన్’ అనే దేవాలయంలో ఉంచి అత్యాచారం చేసి, అంతమొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసిఫా తల్లిదండ్రుల దుర్భర జీవితం గడుపుతూ కూడా కూతురికి న్యాయం జరిగేలా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. -
‘కథువా’ లైంగిక దాడి నిజమే: వైద్యులు
పఠాన్కోట్: ‘కథువా’ ఘటనలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యుల బృందం ధ్రువీకరించింది. బాధిత బాలిక ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్లు తేల్చింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ వివరాలను చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు ఇటీవల వివరించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్లోని కథువాలో ఓ బాలిక(8) సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిందనీ, ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. -
కథువాలో మరో దారుణం : చర్చి పాస్టర్ అరెస్ట్
కథువాలో మరో దారుణం చోటు చేసుకుంది. అనాథశ్రమంలో మైనర్ బాలికలను ఓ చర్చి పాస్టర్ లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తమల్ని తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాలికల ఫిర్యాదు అనంతరం, చర్చి పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్ జిల్లాలోని కథువాలో నిర్వహిస్తున్న ఈ అనాథశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించి, 19 మంది పిల్లల్ని రక్షించారు. వారిలో ఎనిమిది మంది బాలికలు ఉన్నారు. కేరళ నుంచి వచ్చిన ఆంటోని థామస్ అనే పాస్టర్ ఈ అనాథశ్రమాన్ని నడుపుతున్నాడు. తమల్ని లైంగికంగా వేధిస్తున్నాడని కొంతమంది చిన్నారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు శుక్రవారం ఆ అనాథశ్రమంపై దాడులు నిర్వహించారు. అంతేకాక ఆంటోని థామస్ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని థామస్ కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆ అనాథశ్రమంలో మొత్తం 21 మంది చిన్నారులున్నారు. వారిలో ఇద్దరు స్వగ్రామంలో(పంజాబ్లో) ఓ పెళ్లి వేడుకకు హాజరు కావడానికి తమ స్వస్థలానికి వెళ్లారు. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న మిగతా చిన్నారులను ప్రభుత్వం నడిపించే బాల ఆశ్రమ్, నారి నికేతన్లకు తరలించినట్టు అధికారులు చెప్పారు. వారందరూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు కథువా సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీదర్ పటీల్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ ఆశ్రమం నడుస్తుందని, ఓ ఎన్జీవో సంస్థతో ఇది లింక్ అయి ఉండేందని, కానీ కొన్ని రోజుల క్రితం దాంతో కూడా సంబంధాలు తెంచుకున్నట్టు పటీల్ పేర్కొన్నారు. అనాథశ్రమంలోని కొన్ని వస్తువులును అధికారులు సీజ్ చేశారు. కాపాడిన చిన్నారులను మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్కు తరలించారు. పాస్టర్ భార్య కేరళలో సంభవించిన వరదల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో ఆమె తిరిగి రావొచ్చని చెప్పారు. చిన్నారుల కుటుంబ సభ్యులను అధికారులు కాంటాక్ట్ అవుతున్నారు. ఈ ఆశ్రమం కూడా అనధికారికంగా నడుస్తున్నట్టు తెలిసింది. దీన్ని నడిపేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ను థామస్ తీసుకోలేదని కథువా అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ, జితేంద్ర మిశ్రా చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని రాష్ట్రీయ భజరంగ్ దళ్ కార్యకర్తలు జమ్మూలోని ప్రెస్ క్లబ్ ఎదుట ఆందోళన చేశారు. -
బాలికల రేపిస్టులకు మరణశిక్ష
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే కీలకమైన క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ బిల్లులో 12, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ‘12 ఏళ్లలోపు బాలికలపై రేప్నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష’ అమలవుతుంది’ అని చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూకహత్యల దోషులకు మరణ శిక్ష: మంత్రి మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ వెల్లడించారు. -
‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు
బనిహాల్(జమ్ముకశ్మీర్): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి కీలక తీర్పులు వెలువడనున్నాయి. కేసు విచారణను జమ్ముకశ్మీర్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలన్న బాధిత కుటుంబం అభ్యర్థన, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాన్న నిందితుల డిమాండ్.. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. కాగా, తమ కుటుంబానికి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ మృతురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని కాల్చిచంపండి: కథువాలో దారుణ సంఘటన, అనంతర పరిణామాల తరువాత బాధిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వారు కథువాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్(రంబాన్ జిల్లా)లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. కనీస అవసరాలు కూడా లేని చిన్న గుడారంలో కాలం వెళ్లదీస్తోన్న ఆ కుటుంబం.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నది. ‘‘నా బిడ్డను పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గులు బయటికొస్తే మిగిలిన మా నలుగురినీ(తను, భర్త, ఇద్దరు పిల్లు) చంపేస్తారు. మాకు కావాల్సిందల్లా న్యాయమే. ఒకవేళ న్యాయం చేయలేరనుకుంటే మమ్మల్ని కాల్చిచంపేయండి’’ అని కన్నీటిపర్యంతం అయిందా తల్లి. అమాయకులు కాదు.. దుర్మార్గులు: రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవని, సాంజీరామ్(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా ప్రవర్తించేవారని మృతురాలి తల్లి గుర్తుచేశారు. ‘‘ ఊరి బయట పచ్చికలోనూ మా పశువుల్ని మేపనిచ్చేవారు కాదు. చివరికి నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. అక్కడ(రసానాలో) మాకున్న ఇల్లు, ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కోర్టులో చెప్పుకున్నట్టు వాళ్లేమీ(నిందితులేమీ) అమాయకులు కాదు. పచ్చి దుర్మార్గులు. వాళ్లను ఉరితీయాల్సిందే. పొరపాటున బయటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు’’ అని బాలిక తల్లి అన్నారు. పశువుల పెంపకమే వృత్తిగా జీవించే బకర్వాల్ సంచార తెగకు చెందిన కుటుంబాలు.. చాలా కాలం కిందటే కథువా ప్రాంతంలో శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. విశాలమైన పచ్చకబయళ్లున్న ఆ ప్రాంతంలో తమ గొర్రెలు, మేకలు, గుర్రాలను మేపేవారు. ముస్లిం తెగల వ్యాప్తిని జీర్ణించుకోలేని స్థానికులు కొందరు.. బకర్వాల్లను అక్కడి నుంచి వెళ్లగొట్టాలనుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే.. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, కొద్దిరోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపి, చివరికి కొట్టిచంపేశారు. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే, తాము అమాయకులమని, చిన్నారి మరణంతో ఎలాంటి సంబంధంలేదని నిందితులు వాదిస్తున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, ఆమేరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అటు బాధిత కుటుంబం సైతం కేసును జమ్ముకశ్మీర్ నుంచి బయటికి తరలించి విచారించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
కథువా కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, శ్రీనగర్ : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలకు బ్రేక్ పడటం లేదు. జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత కవిందర్ గుప్తా వెనువెంటనే కథువా హత్యాచార కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన చాలా చిన్నదని..దీనికి ఏమంత ప్రాధాన్యత ఇవ్వరాదని గుప్తా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ నేత వివరణ ఇచ్చారు. కథువా వంటి కేసులు చాలా ఉన్నాయని మాత్రమే తాను అన్నానని దీన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు. కథువా కేసు సర్వోన్నత న్యాయస్ధానం పరిథిలో ఉన్నందున దీన్ని పదేపదే ప్రస్తావించడం సరైంది కాదన్నారు. కథువా కేసు విచారణను ఛండీగర్కు బదలాయించాలని, సీబీఐకి అప్పగించాలని పలు పిటిషన్లు దాఖలైన క్రమంలో మే 7వరకూ ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీపంలోని గ్రామం నుంచి 8 ఏళ్ల మైనర్ బాలికను అపహరించిన దుండగులు లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
కథువా కేసు : విచారణపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు విచారణను చండీఘర్కు బదలాయించాలన్న అప్పీల్పై స్పందించాలని నిందితుడిని కోరింది. కథువాలో శనివారం జరగాల్సిన విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఇందూ మల్హోత్రాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. కేసు బదలాయింపు పిటిషన్పై మే 7న తాము విచారణ చేపడతామని ప్రకటించింది. గతంలో కేసు విచారణను చండీఘర్కు బదలాయించాలన్న ప్రతిపాదనను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్లో విభిన్న పీనల్ కోడ్ ఉందని, విచారణను బదలాయిస్తే సాక్షులకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. అయితే కేసు విచారణలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కథువాలో మైనర్ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
‘కథువా’ కేసు; సంచలన ఆధారాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్(డీఎఫ్ఎల్) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. దీంతో చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది. చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఫోనెన్సిక్ నివేదికలో తేలింది. హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి. -
ఆగని అకృత్యాలు.. వసివాడుతున్న పసిమొగ్గలు
లక్నో/రాయ్పూర్ : కథువా, ఉన్నావో సంఘటనలతో ఓవైపు దేశమంతా అట్టుడికిపోతుంటే మరోవైపు బాలలపై జరిగే లైంగిక నేరాలు మాత్రం తగ్గటంలేదు. తాజాగా ఇలాంటివే మరో రెండు సంఘటనలు వెలుగుచూశాయి. ఈ రెండు ఘటనలు రెండు వేర్వేరు రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి. ఛత్తీస్గడ్లో ఓ వివాహానికి హజరైన పదకొండేళ్ల బాలికపై అదే వేడుకకు వచ్చిన ఓ పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాయ్పూర్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కబీర్ధామ్ జిల్లాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తమ్ సాహూ(25) అనే వ్యక్తి పెళ్లి కుమారుడు తరుపు బంధువు. సాహూ ఇదే వివాహానికి వచ్చిన ఓ పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి ఊరవతలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తలపై బండతో మోదీ చంపేశాడు. కాసేపటి తరువాత వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. గురువారం ఉదయం బాలిక మృతదేహం ఒక కాలువ దగ్గర కనిపించింది. బాలిక చివరిసారిగా సాహూతో కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని విచారించగా తానే బాలికపై అత్యాచారం చేసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడిపై అత్యాచార, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి లాల్ ఉమెద్ సింగ్ తెలిపారు. ఇటువంటి సంఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు వివరాల ప్రకారం బాధిత బాలిక ఎటాలో ఓ పెళ్లికి హజరవ్వడానికి వచ్చింది. అదే వేడుకకు వంటలు చేయడానికి వచ్చిన పింటూ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పింటూపై కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కథువా కేసు : వారికి ఉరే సరి..
సాక్షి, న్యూఢిల్లీ : 12 సంవత్సరాల వయసులోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడే వారికి మరణ దండన విధించేలా పోస్కో చట్టాన్ని సవరించే ప్రక్రియను ప్రారంభించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్ధానానికి లిఖితపూర్వక వివరణ ఇచ్చింది. కథువా హత్యాచార కేసుకు సంబంధించి ఓ పిటిషన్పై స్పందిస్తూ కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ అంశంపై ఈనెల 27న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం పేర్కొంది. కథువాలో ఎనిమిదేళ్ల బాలికను గుడిలో నిర్భందించిన దుండగులు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. మరోవైపు మైనర్ బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీలో ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి హతమార్చగా, మూడు రోజుల వ్యవధిలోనే అదే తరహాలో అదే ప్రాంతంలో మరో బాలికనూ కామాంధులు బలిగొన్నారు. -
నువ్వేనా ఆసిఫా?
అమృతం తాగిన ఆడదేవతల ముఖాలతో నర్తన నడకలతో గగన మేఘధూళి ఎగజిమ్ముతూ పోతున్న గుర్రాల గుంపు వీపుల మీద ఊరేగుతున్నది భయవిహ్వల నేత్రాలతో నువ్వేనా మా బంగారు తల్లి ఆసిఫా? ఏకపత్నీవ్రత స్వాముల నామ జపాలతో తనివితీరని దైత్య జిహ్వల రక్త తృష్ణకి పసినెత్తుటి నిండు దోసిలివయింది నువ్వేనా మా గారాల తల్లి ఆసిఫా? కన్నతల్లులనీ, కన్నకూతుళ్లనీ, అక్కచెల్లెళ్లనీ మరిచి హోమ సురాపానోన్మత్తులయి నీ లేలేత మృదుపుష్పవాటిక మీద క్రూర విహంగాలయి ఇనుపగోళ్లతో విరుచుకుపడిన నవపావన ధూర్త దురంత భూత ప్రేత ఆలయ పాలక అధముల వికటహాసాలకి కకావికలయిన చూర్ణదృక్కులతో కనిపించని నిర్వికార సృష్టికారకుడికీ కనిపిస్తున్న కుంకుమచర్చిత విగ్రహానికీ శబ్దహీన రోదనలతో కరుణ కోసం వేడుకున్నది నువ్వేనా మా పిచ్చిమాలచ్చిమి ఆసిఫా? ఏలినవారికి, ఎక్కడో లండన్లో ప్రవాస యోషల హారతి పళ్లేల వెలుగులో వెండిలా వికసిస్తున్న గడ్డం, వందేమాతర నినాద నాదాలతో ఉప్పొంగుతున్న విశాల వక్ష వృక్షపత్రాలలో ప్రతిఫలిస్తున్న వైరి ధనుర్భంగ ద్వితీయ విజయోత్సవ మధుర స్వప్న సంరంభంలో ఏ నిస్సహాయ ఆక్రందనలూ వినిపించడం లేదని లక్షలాది కొవ్వొత్తుల నడుమ నిలుచుని వెక్కివెక్కి విలపిస్తున్నది నువ్వేనా మా చిన్నారి ఆసిఫా? ప్రపంచంలోని తల్లులందరూ ప్రపంచంలోని తండ్రులందరూ ప్రపంచంలోని మనుషులందరూ ఇప్పుడు నీకోసం ఘోషించే సముద్రాలయి తీరశిలలమీద తలలు బాదుకుని వ్రయ్యలవుతున్నారమ్మా ఆసిఫా? ఏడెనిమిదేళ్ల ఏ పసిపాప ముఖం చూసినా నాకు నువ్వే కనిపిస్తున్నావెందుకమ్మా ఆసిఫా? ఏ ప్రవక్తలూ, ఏ వియోగులూ, ఏ యోధులూ ఏ విధ్వంసకారులూ, ఏ విప్లవవీరులూ చేయలేకపోయినదేదో నీ బలిదానాన్ని ఆయుధంగా ధరించి నీ పూదీవ చేతులతో నువ్వు చేస్తావని ఈ నవదిన నవ ఘడియలో ఈ దివ్య నిముషంలో నాకనిపిస్తున్నదెందుకమ్మా, మా ఆశాదీప ఆసిఫా?? (ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న, కశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫా దారుణ హత్యపై స్పందించి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత) (ఒక తక్షణ నిర్ఘాంత స్థితి నుంచి నన్ను తట్టి లేపిన డా‘‘పాలేరు శ్రీనివాస్కు ధన్యవాదాలతో) – దేవిప్రియ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మొబైల్ : 98661 11874 -
కథువాపై బాలీవుడ్ మెగాస్టార్ స్పందన..
సాక్షి, ముంబయి : కథువాలో మైనర్ బాలికపై హత్యాచార ఘటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడటమే బాధాకరమని బేటీ బచావో..బేటీ పఢావో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన అమితాబ్ వ్యాఖ్యానించారు. ‘ కథువా ఘటన అత్యంత హేయం..దీనిపై మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇది మాటలకందని ఘోర’మని అన్నారు. రిషీకపూర్తో కలిసి తాను నటించిన ‘102 నాట్అవుట్’ మూవీ సాంగ్ లాంఛ్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథువా, ఉన్నావ్, సూరత్ అత్యాచార ఘటనలపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ మైనర్ బాలికలపై లైంగిక దాడులను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కథువా, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా పెనుప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. -
కథువా ఘటనను ఖండించిన కోవింద్
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : కథువా గ్యాంగ్ రేప్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. దేశం ఎటు ప్రయాణిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇలాంటి ఘోరాలు దేశంలో జరగుతుండటం బాధాకరమని అన్నారు. శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా కథువా ఘటనను ఖండించారు. -
అగని మరణాలు
-
‘కథువా’ కేసు: మీడియా అత్యుత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ : 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ రేప్, హత్య కేసులో బాధితురాలు అసలు పేరు వెల్లడించకుండా, ఆమె ఫొటోను ప్రచురించకుండా మీడియా ఎంతో సంయమనం పాటించింది. తమ కూతురు తప్పు చేయనప్పుడు పేరు వెల్లడిస్తే తప్పేమిటంటూ నిర్భయం తల్లిదండ్రులు ఆంగ్ల మీడియాకు అసలు పేరు వెల్లడించినప్పటికీ మీడియా ఆ పేరును బహిర్గతం చేయకుండా సంయమనం చూపింది. అదే కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటనలో మీడియా ఆ పాప ఫొటోతో సహా ఆమె పేరును బహిర్గతం చేసింది. ఈ విషయంపై దేశంలోని పలు దినపత్రికలు, టీవీ ఛానళ్లను వివరణ ఇవ్వాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతామిట్టల్, హరి శంకర్లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ఆ బెంచీ ఈ విషయాన్ని ‘సూమోటా’గా విచారణకు స్వీకరించింది. బాధితుల పేర్లను ముఖ్యంగా మైనర్ల పేర్లను వెల్లడించకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 228ఏ ఆంక్షలు విధించింది. బాధితుల పేర్లను వెల్లడించాలంటే వారి అతి దగ్గరి రక్త సంబంధికుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఏదైనా రిజస్టర్డ్ ప్రజా సంక్షేమ సంస్థ లేదా సంఘం ప్రధాన కార్యదర్శి లేదా చైర్మన్ల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. కథువా దారుణ, రేప్ హత్య కేసులో బాధితురాలి ఫొటోను ఇచ్చి పేరు వెల్లడించిందీ ఆ పాప తండ్రే. అయితే ఆయన నుంచి ఎవరు కూడా లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. నీలిరంగు సెల్వార్ కమీజ్ దుస్తుల్లో కెమేరావైపే చూస్తున్న కథువా బాధితురాలి ఫొటోను వివరాలను ముందుగా ‘రైజింగ్ కశ్మీర్, గ్రేటర్ కశ్మీర్’ అనే స్థానిక ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత రెండు నెలలకు జాతీయ మీడియా స్పందించి ఆ పాప ఫొటోను, జరిగిన ఘటనపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. బాధితురాలి పేరు వెల్లడించకుండా కశ్మీర్ మీడియా సంయమనం పాటించక పోవడానికి కారణం ‘మతం’ దృష్టితో సంఘటనను చూడడమేనని స్పష్టం అవుతుంది. బాధితుల పేర్లను వెల్లడించినందుకు గతంలో ఒక్క జర్నలిస్టులపైనే కాకుండా పోలీసులు, ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బాధితురాలి పేరును వెల్లడించినందుకు 2016లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతిమలివాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు పంపించిన నోటీసులోనే ఆమె 14 ఏళ్ల బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. ఓ రేప్ కేసులో బాధితురాలి పేరు వెల్లడించినందుకు గతేడాది ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా మందలించింది. 2017 సంవత్సరంలో జరిగిన రేప్ సంఘటనల్లో 34 కేసుల్లో జాతీయ పత్రికలు పేర్లు, వివరాలను వెల్లడించాయని ఓ నివేదిక తెలియజేస్తోంది. వాటిల్లో దళితులపై జరిగిన రేప్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. కథువా కేసులో పాప ఫొటోను ప్రచురించడం వల్లనే ఆ వార్త ఎక్కువ సంచలనం సృష్టించిందనే వాదన కూడా ఉంది. అయితే మరి, ఢిల్లీ నిర్భయ కేసు కూడా ఇంతకన్నా ఎక్కువ సంచలనమే సృష్టించిందికదా! ఇక్కడ సంచలనానికి పేర్లు, ఫొటోలకన్నా జరిగిన దారుణం తీరు కారణంగానే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
నేనూ బాధితురాలినే..! నటి
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్త్రీలకు భద్రత కరువైంది. కామాంధుల పసివాళ్లను కూడా వదలడం లేదు. జమ్మూ కశ్మీర్లోని కథువా అనే ప్రాంతంలో చిన్నారిపై జరిగిన అత్యాచార దుర్ఘటన దేశంలో సంచలనం రేపింది. ఈ దురాఘాతాన్ని చాలా మంది ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అదే విధంగా అత్యాచారాలపై పలువురు సినీతారలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్లో హీరోయిన్గా ఎదుగుతున్న నివేథా పేతురాజ్ నేనూ అత్యాచార బాధితురాలినే అని పేర్కొంది. ఆమె ఏమన్నారంటే..‘తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అందులో కొన్ని సమస్యలు జాగ్రత్త వహిస్తే మనం అడ్డుకోవచ్చు. అలాంటి వాటిలో స్త్రీల రక్షణ. చిన్నతనంలోనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ బాధింపుకు నేను ఐదేళ్ల వయసులోనే గురయ్యాను. ఆ విషయాన్ని అప్పుడు అమ్మానాన్నలకు ఎలా చెప్పగలను. అసలు ఎం జరిగిందో తెలియని వయసు’ అని చెప్పారు. ‘తల్లిదండ్రులకు నేను చెప్పెదేమిటంటే.. మీ పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయంపై శ్రద్ధ చూపండి. పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. మనం పోలీసులను నమ్మి ఉండలేం. మీ వీధిలో యువకులు చర్యలపైనా ఒక కన్నేసి ఉండాలి. ఏమైనా తప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి. ఇప్పుడు కూడా నాకు బయటకు వెళ్లాలంటే భయం. అత్యాచార చర్యలు బాలా బాధాకరం. ఇలాంటి వాటిని అణచివేస్తేనే ప్రశాంతంగా జీవించగలం’ అని నటి నివేథా పేతురాజ్ పేర్కొన్నారు. -
కథువా కేసు: సందిగ్ధంలో వారి పెళ్లి
జమ్మూ: ‘అతడి కళ్లలోకి సూటిగా చూస్తూ.. నువ్వు నేరం చేశావా అని అడుగుతాను. నాపై అతడికి నమ్మకముందని నాకు తెలుసు. తను నేరం చేయలేదని చెబితే అతడు తిరిగొచ్చే వరకు వేచి చూస్తాను. ఒకవేళ అతడు నేరం చేశాడని చెబితే మరో సంబంధం చూడమని మా అమ్మానాన్నతో చెబుతాన’నని 24 ఏళ్ల రేణు శర్మ అనే పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థిని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు దీపక్ ఖాజురియాకు కాబోయే భార్య ఆమె. గతేడాది డిసెంబర్ 7న వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈనెల 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపిన కేసులో దీపక్ జైలు పాలవడంతో వీరి పెళ్లి సందిగ్ధంలో పడింది. క్రైం బ్రాంచ్ పోలీసుల చార్జిషీటు ప్రకారం ఈ కేసులో దీపక్ ప్రధాన నిందితుడు. అయితే తనకు కాబోయే భర్త ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నారని రేణుక పేర్కొన్నారు. బాలికను రేప్ చేసి చంపేంత క్రూరుడు కాదని ఆమె చెబుతున్నారు. అతడితో ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు. ‘ నిశ్చితార్థం రోజున అతడిని ఒకసారి మాత్రమే అతి సమీపం నుంచి చూశాను. తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. పోలీసులు చెబుతున్నట్టుగా అతడికి ప్రవర్తన నాకెపుడూ కనబడలేదు. వీడియో చాట్ చేద్దామని అతడు కోరినప్పుడు నేను తిరస్కరిస్తే మళ్లీ బలవంతం చేయలేద’ని రేణుక వెల్లడించారు. దీపక్ను తప్పుబట్టడం కానీ సమర్థించడం కానీ చేయబోనని అన్నారు. ‘వాస్తవమేంటో నాకు తెలియదు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడితేనే నిజాలు వెల్లడవుతాయ’ని ఆమె అభిప్రాయపడ్డారు. దీపక్ నాలుగేళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. తర్వాత అతడికి హీరానగర్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ)గా నియమించారు. రసన గ్రామంలో బాలిక దారుణ హత్యాచారానికి గురైనప్పుడు అతడు పరిసర ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. మెలితిరిన మీసాలు, కత్తిరించిన గడ్డంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై రసన గ్రామం దాటుతుండగా అతడిని చూసినట్టు సాక్షులు చెబుతున్నారు. ఈ కిరాతక ఘటన జరగడానికి ముందు బకర్వాల్ ముస్లిం మహిళలతో దీపక్ రెండుసార్లు గొడవ పడినట్టు అతడి తల్లి దర్శనాదేవి, సోదరి శివాని వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. హత్యాచారం కేసులో అరెస్టైన నలుగురు పోలీసుల్లో దీపక్ ఒకరు. మిగిలిన ముగ్గురు నిందితులు లంచం కోసం కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దీపక్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో పాసయ్యేందుకు సాయం చేస్తానని నమ్మబలికి 15 ఏళ్ల బాలుడి సహాయంతో బాలికను దీపక్ కిడ్నాప్ చేశాడని క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
‘ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరం’
సాక్షి, ఢిల్లీ : కథువా హత్యాచార బాధితురాలికి న్యాయం జరగుతుందని.. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులు బయటే ఉన్నారన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రతి సమస్యను పెద్దది చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. గులాం నబీ ఆజాద్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదనే బీజేపీ మంత్రులను రాజీనామా చేయించామని పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఆరోపనలను కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షాల విధి అని కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా అన్నారు. గత 14రోజుల వ్యవధిలో ఉత్తర్ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లో మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రతిపక్షాలు, సోషల్ మీడియా చొరవ చూపడంతోనే ప్రధాని స్పందించారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు -
కథువా కిరాతకం; కఠిన వాస్తవం
జమ్మూ: ‘ఎనిమిదేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎంత నేల కావాలి? అత్యాచారానికి గురై కిరాతంగా హత్య చేయబడిన పాప మృతదేహం మా చేతుల్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రామస్తులు మా మీద కనికరం చూపాల్సింద’ని కథువా హత్యాచార బాధితురాలి తాత వేడుకున్నారు. జమ్మూకశ్మీర్ కథువా జిల్లా, రసన గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె పెంపుడు తండ్రి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంత్యక్రియల కోసం ఎంచుకున్న స్థలం గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందనది కాదంటూ అడ్డుపడ్డారు. ‘అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలైంది. అంత్యక్రియల కోసం సగం గొయ్యి తీయడం పూర్తైంది. అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఖననం చేయడానికి కుదరదని అడ్డుచెప్పారు. ఆ స్థలం మాది కాదంటూ పత్రాలు చూపించార’ని మృతురాలి తాత ఆరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భూమి వాళ్లదే.. ‘అంత్యక్రియలు జరిపాలకున్న స్థలం మృతురాలి పెంపుడు తండ్రిదే. దశాబ్దం క్రితమే ఓ హిందూ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో గ్రామస్తులు అవకాశంగా తీసుకుని ఈ భూమి మా దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటున్నార’ని అంత్యక్రియలం కోసం భూమి ఇచ్చిన వ్యక్తి తెలిపారు. మేము అంగీకరించం ఈ భూమి మృతురాలి కుటుంబానిది కాదని హిందువులు వాదిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అక్రమంగా ఇక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘బకర్వాల్ ముస్లింలు ఒక్కొక్కటిగా మా భూములను ఆక్రమించేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము అంగీకరించబోము. బాలిక అంత్యక్రియలకు ప్రత్యామ్నాయం చూపించామ’ని రసన గ్రామస్తుడు రోహిత్ ఖజూరియా తెలిపారు. వణికించే చలిలో.. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించారు. చీకటిలో పర్వత ప్రాంతం మీదకు మోసుకెళ్లి ఖననం చేశారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసిఫా పెంపుడు తల్లిదండ్రులు తెల్లవారుజామున 3 గంటలకు వరకు అక్కడే ఉన్నారని వారి బంధువు ఒకరు వెల్లడించారు. రెండుమూడు రోజులకొకసారి సమాధి వద్దకు వెళ్లి గంటల తరబడి మృతురాలి పెంపుడు తల్లి శోకిస్తోందని, ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకురావాల్సి వస్తోందని తెలిపారు. తల్లికి తీరని శోకం రసన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో గోధుమ పంట ఉన్న పొలంలో 5 అడుగుల గొతిలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. సమాధిని ఇంకా సిమెంట్ చేయంచలేదు. సమాధికి రెండు చివరల పెద్ద రాళ్లను ఉంచారు. ‘మా మతాచారం ప్రకారం సమాధిని వెంటనే సిమెంట్ చేయించం. తమ పశువులను తోలుకుని పర్వత ప్రాంతాల్లో సంచారానికి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత సమాధిని సిమెంట్ చేస్తామ’ని వారి బంధువొకరు వెల్లడించారు. కాగా, కఠువా బాధితురాలికి న్యాయం చేయాలని, నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. -
లోపాలు సరిదిద్దితేనే అఘాయిత్యాలు ఆగుతాయి
లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నది మనం ఒక్కరం మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేశాల్లోనూ బాధితులకుండే ఉమ్మడి సమస్య... ఆ నేరం జరిగిందని బయటికి చెప్పుకోలేకపోవడం. అందువల్లే అమెరికా వంటి దేశంలో కూడా వేయి నేరాలు జరుగుతుంటే సగటున 310 వెల్లడవుతాయి. ఇక శిక్షల శాతం మరింత తక్కువ. ఆ 310 మందిలో ఆరుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో పనిచేసి భారీ మార్పులు చేస్తే ఈ స్థితి మారుతుంది. కథువా, ఉన్నావ్లలో జరిగిన ఉదంతాల విషయంలో ఒక సమాజంగా మనం ఎలా స్పందించాలి? ప్రపంచ దేశాల్లో లైంగిక హింస పరంగా చూస్తే ఆడవాళ్లకూ, పిల్లలకూ భారత్ అరక్షిత దేశమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. వాస్తవం ఇది కాకపోయినా ఇది స్థిరపడింది. మనం ఎంత నిజాయితీగా ఉంటు న్నామో, ఎంత మారాల్సి ఉన్నదో విదేశీ మాధ్యమాలు చెప్పే స్థితి రాకూడదు. ఇలాంటి సిగ్గుమాలిన ఉదంతాలను మనమెందుకు నివారించలేకపోతున్నాం? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గించగలుగుతాం? కేవలం న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మాత్రమే వీటిని నివారించలేవని ముందుగా మనం తెలుసు కోవాలి. విలువలు విచ్ఛిన్నమయ్యాయి. మహిళల్ని, అల్పసంఖ్యాకుల్ని గౌరవించే చోట పశు ప్రవృత్తికి ప్రోత్సాహం ఉండదు. మనం అలాంటిచోటే ఉంటున్నామా? నిజాయితీగా చెప్పాలంటే జవాబేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. ప్రభుత్వమే ఇలాంటి హింసను అరికట్టాలనడం మనం మన పాత్రను విస్మరించడమే అవు తుంది. ఆ అవగాహనతో ఏం చేయమని ప్రభుత్వాన్ని ఒప్పించాలో చూద్దాం. లైంగిక దాడుల్ని, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రధానంగా రెండు అవసరమవుతాయి. అందులో ఒకటి చట్టం. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ రేపిస్టులను ఉరి తీయాలన్న డిమాండ్ తరచూ వినిపిస్తుంటుంది. కఠినమైన శిక్ష ఉంటే ఈ తరహా నేరాల్ని నివారించవచ్చునని, నేరగాడు తన చర్య పర్యవసానా లను గ్రహించి భయపడతాడని, కనుక తప్పు చేయడానికి సాహసించడని ఈ వాదన లోని ఆంతర్యం. దీనికి అనేక ప్రతివాదాలున్నాయి. అత్యాచారానికైనా, హత్యకైనా ఒకటే శిక్ష గనుక సాక్ష్యం లేకుండా చేయడానికి బాధితురాలిని రేపిస్టు హతమారు స్తాడని దీన్ని వ్యతిరేకించేవారంటారు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. రేపిస్టులకు ఉరిశిక్షే సరైందని రాజకీయ నాయకులు ఎక్కువగా చెబుతుంటారు. మీరు ఇటీవలి పత్రికలు తిరగేస్తే ఈ వాదన సమర్థుకులే అధికంగా కనిపిస్తారు. మన దేశంలో హంతకులకు మరణశిక్ష ఉంది. ఇది నివారణగా పనిచేసి హత్యలు ఆగుతున్నాయా? గణాంకాలు ఒకసారి చూద్దాం. 2016లో 136 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 30,000 హత్యలు జరిగాయి. మరణశిక్షల విధింపు హంతకులను తగ్గించలేకపోయింది. మన చట్టాల్లో అప్పీళ్లకూ, రెమిషన్లకూ అవకాశం ఉంది. అందుకే ఆ ఏడాది ఎవరూ ఉరికంబం ఎక్కలేదు. మరణశిక్ష మంత్ర దండమని భావించేవారంతా దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఆ సంవత్సరం దేశంలో మొత్తం 38,947 అత్యాచారాలు జరిగాయి. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. అత్యాచారాల సంఖ్యతో వచ్చే ఇబ్బందే మంటే 99 శాతంమంది బాధితులు వాటిపై ఫిర్యాదు చేయరు. ప్రభుత్వ డేటాయే ఈ సంగతి చెబుతోంది. అమెరికాలో ప్రతి వెయ్యి అత్యాచారాలు, లైంగిక నేరాల్లో 310(31 శాతం) మాత్రమే పోలీసుల వరకూ వస్తాయి. అందులో కేవలం ఆరు గురు దోషులకు (అంటే 1 శాతం కన్నా తక్కువ) మాత్రమే శిక్షపడుతుంది. దీనర్ధం ఏమంటే... జరుగుతున్న నేరాల విషయంలో బాధితులకు న్యాయం చేయలేక పోతున్నది మనం ఒక్కరమే కాదు. కనుక ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన, గట్టిగా పనిచేయాల్సిన సంక్లిష్ట సమస్య అని మనం గుర్తించాలి. ఇందులో అనేకానేక అంశాలున్నాయి. అందులో కొన్ని సామాజికమైనవి, మరికొన్ని ప్రభుత్వం సరి దిద్దాల్సినవి. మన దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ లైంగిక నేరాల బాధితులకుండే ఉమ్మడి సమస్య– అది బాగా వ్యక్తిగతమైన నేరం. తమకు అలా జరిగిందని ఎవరితోనైనా చెప్పుకోవడం అంత సులభం కాదు. ఇక మన దేశానికే ప్రత్యేకమైన సామాజిక అంశాలు కోకొల్లలు. అందులో మన సమాజంలో మహిళల కుండే స్థానం, వారిపట్ల వ్యవహరించే తీరు ప్రధానమైనది. రెండోది– కుటుంబ పరువు, ప్రతిష్టలు మొత్తం వారి శరీరాల్లో ఉన్నాయనుకునే విశ్వాసం. మహిళపై దాడి జరిగితే అది ‘కోల్పోయినట్టే’నని మన భావన. పర్యవసానంగా తనకు జరి గిన అన్యాయాన్ని పోలీస్స్టేషన్లోని అపరిచితులకు చెప్పడం సంగతలా ఉంచి చివరకు తన కుటుంబానికి కూడా ఏ మహిళా వెల్లడించలేదు. పోలీసులు చేయగలిగింది ఒకటుంది–అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం. చట్టం ప్రకారం బాధితులెవరైనా తమకు నచ్చిన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్లో మాత్రమే ఫిర్యాదు చేయనవసరం లేదు. రెండు–బాధితురాలు తాను ఎంపిక చేసుకున్న భాషలో తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చు. ఇది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే చాలా పోలీ స్స్టేషన్లలో ఇంగ్లిష్ కూడా సరిగా మాట్లాడలేనివారే ఉంటారు. వారు ఎఫ్ఐఆర్ను స్థానిక భాషలోనే రికార్డు చేస్తామంటారు. మూడు–బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి మాత్రమే రికార్డు చేయాలి. ఇది జరగడం లేదు. తగినంతమంది మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా పోలీసు అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ‘కనీస ప్రభుత్వం–గరిష్ట పాలన’ వంటి నినాదాలు అర్ధం లేనివి. ఎందు కంటే మనకున్న పోలీసులు, డాక్టర్లు, నర్సుల సంఖ్య ప్రపంచంలోని మరే ఇతర దేశాల తలసరి సగటు కన్నా చాలా తక్కువ. లైంగిక నేరాలను అరికట్టాలంటే మన సమాజంలో, మహిళలపట్ల వ్యవహరించే తీరులో భారీ మార్పులు తీసుకురావా లని వాస్తవాంశాలు చెబుతున్నాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లోని అంశాలను దేశంలోని పోలీస్స్టేషన్లన్నీ సక్రమంగా పాటించేలా చూడాలి. ఇది చాలా కష్టసాధ్యమైనదే. కానీ అలా చేయగలిగితే–కనీసం ఇతర ప్రపంచ దేశాలతో సమానంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదులు పెరిగాక వాటిపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలి. అందుకు వనరులు అవసరం. ఇప్పుడున్న పోలీసుల సంఖ్యతో, ఈ బడ్జెట్తో అది సాధ్యపడదు. అది చేస్తే శిక్షల సూచీ పెరుగుతుంది. ఇదంతా చాలా కష్టం. మన రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సంగతి తెలుసు. కనుక ‘రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలి’ అని వారు సులభంగా అంటుం టారు. హంతకులకు మరణశిక్ష విధిస్తున్నా హత్యలపై వాటి ప్రభావం లేదన్న వాస్తవం వారిని కలతపెట్టదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
మనదేశం ఎటు పోతోంది? తమన్నా
మనదేశం ఎటు పోతుందని మిల్కీ బ్యూటీ తమన్నా చాలా వేదనతో ప్రశ్నిస్తోంది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లాలో 8ఏళ్ల బాలికపై అత్యాచార దుర్ఘటన ఈ మిల్కీ బ్యూటీని కలత చెందేలా చేసింది. ఆసిఫా అనే బాలికను 6గురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశాన్ని కదిలిస్తోంది. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ ఘటనపై హీరోయిన్ తమన్నా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీరులో 8ఏళ్ల బాలిక, మరో చోట 16ఏళ్ల యువతి అత్యాచారానికి గురయ్యారు. ‘దీనిపై పోరాడిన ఆమె తండ్రిని దారుణంగా కొట్టి చంపేశారు. నేరస్తులను కాపాడటానికే ఈ విధంగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘోరాలను చూస్తుంటే మనదేశం ఎటు పోతోందని ప్రశ్నించింది. స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశం తిరోగమన దశకు చేరుతోంది. దీనికి చాలా తోందరగా చికిత్స చేయాల’ని తమన్నా పేర్కొన్నారు. ఈ అత్యాచారాలను పలువురు ప్రముఖులు కూడా ఖండించారు. -
కథువా రేప్ కేసు లాయర్కు బెదిరింపులు
-
మోదీ.. మాట్లాడు
న్యూఢిల్లీ: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ ఆలయంలో బంధించి ఎనిమిది రోజులపాటు గ్యాంగ్ రేప్ చేసి చివరికి కొట్టిచంపేసిన దారుణ ఘటన దేశాన్ని కదిలిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ‘మోదీ.. మాట్లాడు’ అంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ మండల పరిధిలోని రస్సానాలో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల బాలిక హత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది. అన్ని మాట్లాడతారుగా ఇప్పుడేమైంది మోదీజీ?: ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీ మౌనం ఏమాత్రం అంగీకారం కాదు. చిన్నపిల్లలు, మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దురాగతాల గురించి మీరేమనుకుంటున్నారు? దారుణాలకు పాల్పడిన నిందితులకు ప్రభుత్వాలు అండగా నిలవడం ఎంతవరకు సమంజసం?’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మరో అడుగు ముందుకేసి మోదీని తూర్పారబట్టారు. ‘‘మన్కీ బాత్ అనో, ఇంకో పేరుతోనో నిత్యం మీ ఆలోచనలను, మాటలను దేశ ప్రజలతో పంచుకుంటారే.. మరి ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా చిదిమేస్తే, నిందితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కాపాడుతుంటే మీరు నోరు తెరవకపోవడం ఏమైనా బాగుందా? ఎప్పుడూ మీకు అవసరమైన విషయాలమీదే మాట్లాడతారా? ఇతరులకు అత్యవసరమైన విషయాలమీద నోరు మెదపరా?’’ అని అబ్దుల్లా ఫైరయ్యారు. అసలేం జరిగింది?: జనవరి 11న కథువాకు చెందిన ముస్లిం బాలిక ఆసిఫా(8) ఇంటి పరిసరాల్లో గుర్రాలను మేపుతుండగా అదృశ్యమైంది. పాప తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జనవరి 17న సమీపంలోని అడవిలో పాప మృతదేహం దొరికింది. బాలికకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు పోస్ట్మార్టంలో తేలింది. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సాంజీరామ్.. ఆసిఫాపై అత్యాచారం చేయాలంటూ తన కుటుంబీకులను ఉసిగొల్పాడు. బాలికను క్రూరమృగాలకంటే దారుణంగా చిదిమేసినవారిలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. సాంజీరామ్కే చెందిన ఆలయంలో పాపను బంధించి మత్తుమందు ఇస్తూ ఒకరితర్వాత మరొకరు అత్యాచారం చేశారు. తొలుత సాంజీరామ్ మేనల్లుడు, వాడి స్నేహితుడు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరట్(యూపీ) నుంచి వచ్చిన సాంజీరామ్ కుమారుడు విశాల్, పోలీసు అధికారి దీపక్ ఖజూరియా, మరో ఇద్దరు స్పెషల్ పోలీసులూ చిన్నారిపైకి ఎగబడ్డారు. చివరికి జనవరి 14న సాంజీ మేనల్లుడు.. పాపను కర్రతో కొట్టి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిదితులుగా చేర్చారు. ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు.. : ఆసిఫాపై అకృత్యానికి కొద్దిరోజుల ముందు కథువా గ్రామంలో నివసిస్తోన్న బకర్వాల్ వర్గానికి చెందిన ముస్లింలను అక్కడి నుంచి తరిమేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. ముస్లింలు గోవధ, డ్రగ్స్ స్మగ్లింగ్ తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దానివల్ల తమ పిల్లలు చెడిపోతున్నారన్నది గ్రామపెద్దల ఆలోచన. ఈ క్రమంలోనే ముస్లిముల గుర్రాలను పొలాల్లో మేపనివ్వరాదని, వాళ్లకు భూములు సైతం అమ్మకూడదని సాంజీరామ్, ఇంకొందరు సూచనలు చేశారు. తీర్మానాలు జరిగిన కొన్ని గంటలకే.. తన ఇంటి బయట గుర్రాలను మేపుతున్న ఆసిఫా అపహరణకు గురైంది. -
కథువా రేప్ కేసు లాయర్కు బెదిరింపులు
జమ్మూ : ‘న్యాయ వ్యవస్థపై, లాయర్లపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఉండాలంటే వారి చేతుల్లో కూడా న్యాయదండాలు ఉండాలేమో!’ అని కశ్మీర్లోని కథువా జిల్లాలో దారుణంగా సామూహిక అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక తరఫున కేసును వాదిస్తున్న దీపికా సింగ్ రజావత్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. బాలిక కేసును వాదించకుండా, ఆ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా ఆమెకు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆమె అసహనంతో ఈ వ్యాఖ్య చేశారు. ఆమెకు బెదిరింపులు ఎదురైనవి ఎవరి నుంచో కావు. సాక్షాత్తు జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ సతాథియా నుంచి. ఈ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా మొదటి నుంచి అడ్డుకుంటున్న భూపిందర్ సింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తనను తీవ్రంగా బెదిరించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు ఆమె ఆ తర్వాత తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. తాను ఎవరి పక్షం కానని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు... అందరి కేసులను వాదిస్తానని చెప్పారు. పిల్లలకు జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటుందో తాను ఊహించగలనని, తనకు ఓ ఐదేళ్ల పాప ఉందని, భూపిందర్ సింగ్కు కూడా ఓ పాప ఉండే ఉంటుందని ఆమె అన్నారు. బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం నాడు జమ్మూలో బంద్ నిర్వహించిన హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం నాడు కూడా తన ఆందోళనను కొనసాగించింది. బాలిక రేప్ కేసును స్థానిక క్రైమ్బ్రాంచ్ పోలీసులు సవ్యంగానే దర్యాప్తు జరుపుతున్నారని, కేసును మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే నేడు కేసును సీబీఐకి అప్పగించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నదని రజావత్ ఆరోపించారు. తనను బెదిరించడంపై తాను జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. -
కథువా రేప్ కేసులో ఎవరి పాపం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, వారం రోజుల పాటు రేప్ చేసి, చివరకు హత్య చేసిన దారుణ సంఘటనల క్రమంలో ఒళ్లు విరుచుకుంటూ మూడు నెలల తర్వాత జాతీయ మీడియా మేల్కొంది. దాంతో తప్పనిసరై రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. పరస్పరం బురద చల్లుకోవడం మొదలైంది. ఈ దారుణ రేప్ సంఘటనకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద గురువారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తన టార్గెట్ అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకే కాకుండా పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మైనర్ బాలికలను రేప్ చేసిన సంఘటనల్లో నేరస్థులకు ఉరిశిక్షలు విధించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ముఫ్తీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీలో ఇద్దరు మంత్రులు రేప్ నిందితులకు మద్దతుగా నిర్వహించిన పలు ర్యాలీలో పాల్గొన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముఫ్తీ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దారుణ రేప్ ఘటనపై ఇప్పటి వరకు పెదవి విప్పకుండా మౌనం వహిస్తూ వస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కశ్మీర్ రాష్ట్ర పాలకులైన బీజేపీ, ముఫ్తీలతోపాటు కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణంలో పాపం ఉంది. జనవరి 11వ కథువా జిల్లా, రసన గ్రామంలో గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో అదృశ్యమైంది. వెంటనే ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. జనవరి 17వ తేదీన సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ పాప మృతదేహం దొరికింది. దాన్ని పోస్ట్మార్టమ్కు పంపించగా, ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసినట్లు తేలింది. దీనిపై దర్యాప్తు జరిపిన స్థానిక పోలీసులు దీపు భయ్యా అనే 15 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా కేసు దాఖలు చేశారు. ఆ బాలుడు అమాయకుడని స్థానికులు చెప్పడం, మొదట పోలీసుల చిత్రహింసలకు నేరాన్ని తనపై వేసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత తాను కాదని చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును క్రైమ్బ్రాంచ్కి అప్పగించాల్సిందిగా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు గొడవ చేశారు. సీఎం ముఫ్తీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కేసును అప్పగించారు. జనవరి 23వ తేదీన ఈ కేసును టేకప్ చేసిన ఆ పోలీసులు మూడు రోజుల్లోనే కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడి వారో, ఏ బెటాలియన్కు చెందిన వారో, వారి హోదా ఏమిటో ఇంతవరకు దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు. వీరిద్దరు కూడా అగ్రవర్ణానికి చెందిన హిందువులవడంతో వీరికి మద్దతుగా ఫిబ్రవరి 14, 17 తేదేల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శనలు జరిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కొత్తగా ‘హిందూ ఏక్తా మార్చ్’ను ఏర్పాటు చేసిన కశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది విజయ్ వర్మ ఫిబ్రవరి 17న నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో కథువా బీజేపీ అధ్యక్షుడు విజయ్ శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు హాజరయ్యారు. నాలుగువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ఆశ్చర్యం. ఇదే ర్యాలీలో ‘భారత మాతాకీ జై, పాకిస్తాన్ మురదాబాద్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జాతీయ జెండాలను ప్రదర్శించడం మరింత ఆశ్చర్యం. ఫిబ్రవరి 17వ తేదీనే కథువా జిల్లా హీరానగర్లో కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన హిందూ పెద్దలు సమావేశమై గుజ్జార్ బకర్వాల్ ముస్లిం కుటుంబాలను వెలివేయాలని తీర్మానించారు. ఆ కుటుంబాల్లో ఎవరిని వ్యవసాయ కూలీలుగా కూడా తీసుకోరాదని కట్టుబాటు విధించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బీజేపీ మంత్రి రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ వర్మతోపాటు కథువా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గుప్తా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా రేప్ కేసును నీరుకార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా రాహుల్ గాంధీ సదరు నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కథువా రేప్ కేసు తనకు తెలియనట్లుగానే నటిస్తూ వచ్చారు. మీడియా వార్తలతో ఇప్పుడు వీధిలోకి వచ్చారు. జమ్మూలోని హిందూ మెజారిటీ, కశ్మీర్లోని ముస్లిం మెజారిటీ నాటకాలకు తెరపడనంత కాలం ఈ రాజకీయ పార్టీల తీరు ఇంతే! (గమనిక: సాక్షి వెబ్సైట్ కథువా రేప్ ఘటనపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూ వస్తోంది. ‘ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరో’ చదవండి) -
‘కథువా కేసుకు మతం రంగు’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లోని కథువాలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, దారుణ హత్య కేసుకు మతం రంగు పులుముతున్నారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి విపక్షాలపై మండిపడ్డారు. గతంలో దళితులు, మైనారిటీలపై దాడులంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ తాజాగా మహిళల అంశాలపై మొసలికన్నీరు కారుస్తోందన్నారు. కథువా ఘటనలో నిందితులకు అనుకూలంగా మాట్లాడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కొందరు తప్పుదారి పట్టించారని, వారు అలా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. ఈ ఘటనను బీజేపీ ఇప్పటికే ఖండించిందని, నిందితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడతాయని చెప్పారు. మరోవైపు ఉన్నావ్ ఘటనను లేఖి ప్రస్తావించారు. ఈ ఘటన గత ఏడాది జరిగిందని, అప్పట్లో బాధితురాలు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పేరును మేజిస్ర్టేట్ ఎదుట ప్రస్తావించలేదని చెప్పారు. ఆ తర్వాతే ఆమె సెంగార్పై ఫిర్యాదు చేశారని, ప్రస్తుతం ఆయనను సీబీఐ ప్రశ్నిస్తోందని, బాధితురాలి తండ్రిని వేధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్ను అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. లైంగిక దాడికి లోనయ్యే వారంతా బాధితులేనని..వీటికి మతం రంగు పులమవద్దని కోరారు. అస్సాంలో ఐదో తరగతి విద్యార్థినిపై జాకీర్ హుస్సేన్ అనే యువకుడితో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసి, సజీవంగా హతమార్చారని దీనిపై విపక్షాలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. -
ఆ కేసును డీల్ చేసేందుకు సుప్రీం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్ బాలికపై లైంగిక దాడి కేసును చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకొచ్చింది. న్యాయస్థానానికి కేసుకు సంబంధించిన వాస్తవాలను లిఖితపూర్వకంగా అందిస్తే ఈ కేసును పరిశీలించేందుకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా న్యాయవాదులు చేపడుతున్న ఆందోళనలు, బాధితురాలి కుటుంబాన్ని న్యాయవాదులు బెదిరింపులకు లోనుచేయడం గురించి లిఖితపూర్వకంగా తమకు సమర్పిస్తే కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దేశాన్ని కుదిపివేసిన మైనర్ బాలికపై లైంగిక దాడి, దారుణ హత్య కేసును సమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టు న్యాయవాదుల బృందం సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశాన్ని చేపట్టాలని ఢిల్లీ న్యాయవాదులు కోరిన మీదట కోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ కేసులో వాస్తవాలన్నింటినీ తాము లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తామని న్యాయవాదులు తెలిపారు. కథువా కేసులో ఏడుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలును అడ్డుకునేందుకు ఓ వర్గానికి చెందిన న్యాయవాదులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. -
కథువా కేసు : మీడియాపై హైకోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం పట్ల మీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన కేసులో బాధితురాలి వివరాలను వెల్లడించిన పలు మీడియా సంస్థలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్లతో కూడిన హైకోర్టు బెంచ్ సుమోటోగా ఈ అంశాన్ని చేపట్టి ఆయా మీడియా సంస్థల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తమపై ఎందుకు చర్యలు చేపట్టరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీప గ్రామం రసానా నుంచి బకేర్వాల్ ముస్లిం వర్గానికి చెందిన బాలిక అదృశ్యమైంది. వారం రోజుల అనంతరం అక్కడికి దగ్గర్లోని అడవుల్లో శవమై తేలింది. ఆమెపై నిందితులు సామూహిక లైంగిక దాడికి తెగబడి, అనంతరం దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు నిందితులపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అభియోగాలు నమోదు చేసింది. -
కథువా కేసులో జమ్మూ పోలీస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాపై లైంగిక దాడి, హత్యోదంతం క్రమంగా రాజకీయ, మత రంగు పులుముకోవడంపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్పీ వైద్ ఆందోళన వ్యక్తం చేశారు. కథువా జిల్లాలోని ఓ గ్రామం నుంచి అసిఫాను కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. మత్తుమందులిచ్చి సామూహిక లైంగిక దాడి జరిపి, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న విమర్శలను రాష్ట్ర పోలీస్ చీఫ్ వైద్ తోసిపుచ్చారు. పోలీసు అధికారులు హిందువులుగానో..ముస్లింలుగానో పనిచేయరని..వృత్తిపరంగా విధులు నిర్వర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. స్ధానిక పోలీసులపై తమకు విశ్వాసం లేదని, సీబీఐ దర్యాప్తును కోరుతూ పలువురు నేతలు, జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ చేసిన డిమాండ్లపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్కు కేసును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హిందూ ప్రాబల్య కథువా ప్రాంతంలో ముస్లింలను భయభ్రాంతులను చేసేందుకు ఈ ఘాతుకం జరిగిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్లు చేయరాదని బీజేపీ నేతలు కోరుతున్నారు. పోలీసులపై స్ధానిక రాజకీయ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుండగా, జమ్మూ సర్కార్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు వారికి వత్తాసు పలుకుతున్నారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఓ వర్గాన్నే టార్గెట్ చేస్తున్నారని ముస్లింలు పోలీసులపై దాడులకు తెగబడుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారి వైద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులకు మతంతో సంబంధం ఉండదని, వృత్తిపరమైన బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. విచారణ బృందానికి కాశ్మీరీ పండిట్ నేతృత్వం వహిస్తుంటే కాశ్మీరీ ముస్లిం అధికారి సభ్యులుగా ఉన్నారని, విచారణలో సిక్కు వర్గానికి చెందిన వారిని ప్రాసిక్యూటర్లుగా నియమించాలని నిష్పాక్షిక విచారణ కోసం పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. దేశాన్ని నివ్వెరపరిచిన మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసును క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక బృందాలు సమర్ధంగా చేపడుతున్నాయని, కేసులో ప్రమేయం ఉన్న సహచర పోలీసులనూ విడిచిపెట్టలేదని ఎస్పీ వైద్ చెప్పారు. సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని తెలిపారు. జమ్మూ బార్ అసోసియేషన్తో పాటు రాజకీయ పార్టీల నేతలు సీబీఐ విచారణ కోరడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నో కేసులను సమర్థవంతంగా చేపట్టిన జమ్మూ పోలీసులపై వారికి విశ్వాసం లేదనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. -
అర్థరాత్రి కొవ్వొత్తుల ర్యాలీ, పాల్గొన్న రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ : ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ గొప్ప, గొప్ప మాటలు చెప్పిన ప్రధాని మోదీ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆయన గురువారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార దారుణాలు బీజేపీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. జమ్ము - కాశ్మీర్లోని కథువా గ్రామానికి చెందిన ఒక ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను మృగాళ్లు మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత క్రూరంగా బండరాళ్లతో మోది చంపారు. మరో రాష్ట్రం యూపీలో స్వయంగా అధికారీ పార్టీ ఎమ్మెల్యేనే 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. చేసిన పనికి సిగ్గుపడక ‘తక్కువ కులం’ వారు అంటూ నోరుపారేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలపై నిరసన తెలుపుతూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు వందాలాది మంది ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధరాత్రి ఇండియా గేట్ వద్దకు వచ్చి తమ మద్దతు తెలిపారు. శాంతియుతంగా, నిశ్శబ్దంగా జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ఐదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తుచేస్తుంది. ఆ సమయంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ముందు ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను అత్యాచారం చేసి, చంపేశారు. ఈ సంఘటన పట్ల దేశమంతా ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇది రాజకీయ అంశం కాదు, దేశానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం దీనిపై తగు చర్య తీసుకోవాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ఆడపిల్లలను రక్షించుకుందాము అనే నినాదం చాలా బాగుంది, కానీ దాన్ని అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానిగా ఇది మీ బాధ్యత అన్నారు. స్పందించిన ఇతర ప్రముఖులు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ అంశం కాదు. ప్రభుత్వం నిద్రపోయినప్పుడు, ఈ దేశ చౌకీదారు (వాచ్మెన్) అయిన ప్రధాని నిద్రపోయినప్పుడు ఆయనను మేల్కొలిపే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది’ అన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ తనను తాను దేశానికి వాచ్మెన్గా వర్ణించుకున్నారు. ఆ విషయాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ఆజాద్ గుర్తుచేశారు. ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు తమ ఆవేదనను, ఆగ్రహన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేశారు. హీరో అక్షయ్ కుమార్, దర్శక నిర్మాత కరణ్ జోహర్, నటి సోనమ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులుగా తాము విఫలమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఒకే ఒక్క బీజేపీ నాయకుడు వీకే సింగ్. అసిఫాకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఖండిస్తూ ‘అసిఫా విషయంలో మేము మనుషులుగా విఫలం అయ్యాము, కానీ ఆమెకు న్యాయం చేసే విషయంలో మాత్రం విఫలం అవ్వము’ అన్నారు. సంఘటన వివరాలు... బఖేర్వాల్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను గత జనవరి 10న కొందరు దుండగులు నమ్మించి అడవికి తీసుకుపోయి అక్కడ ఆమెపై దౌర్జన్యం చేసి, మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగురోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి రాళ్లతో కొట్టి చంపారు. ఈ దురంతంలో పాలుపంచుకున్నవారిలో ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు పోలీసు విభాగానికి సహకరించే ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్పీఓలు) ఉన్నారు. బాలిక గురించి ఆమె కుటుంబసభ్యులు వెదు కుతున్న సమయానికి స్థానిక పోలీసుల్లో కొందరికి ఆమెను ఎక్కడ బంధించారో తెలుసు. అయినా వారు రక్షించేయత్నం చేయలేదు. జనవరిలో ఈ ఉదంతం జరిగాక తొలుత మైనర్ను అరెస్టు చేసిన ప్పుడు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని, దీన్ని క్రైం బ్రాంచ్కు అప్పగించాలని మెహబూబా కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు డిమాండ్ చేశారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇతర నిందితుల గుట్టు రట్టు కావడం మొదలయ్యే సరికి దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ స్వరం మార్చారు. దర్యాప్తు కోసం నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఒక మంత్రి అంత చిన్న వయసున్న వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. మరో మంత్రి ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా... ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో చనిపోవడంలేదని నిలదీశాడు. -
లాయర్ దీపిక సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్ : బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్ దీపికా సింగ్ రాజవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్ రేప్, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో నోమాడియక్ బకెర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బీఎస్ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరు?
సాక్షి, జమ్మూ : ‘వెయ్యి మంది కూడా వస్తారనుకోలేదు. మూడు నుంచి నాలుగు వేల మంది వరకు వచ్చారు. ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో రావడం ఆశ్చర్యం’ అని కథువా జిల్లాలోని హీరానగర్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద వారి రాకకోసం ఎదురు చూస్తున్న విజయ్ శర్మ అనే న్యాయవాది విజయ హాసంతో వ్యాఖ్యానించారు. జుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ కజూరియా, సురీందర్ వర్మలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హీరానగర్, దానికి అనుకుని ఉన్న రసనా గ్రామం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరసన ప్రదర్శనగా మూడు రోజుల క్రితం అక్కడికి తరలి వచ్చారు. న్యాయవాదే కాకుండా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విజయ్ శర్మ ఇటీవలే మరో కొత్త బాధ్యతలను కూడా స్వీకరించారు. జనవరి 23న ఏర్పాటు చేసిన ‘హిందూ ఏక్తా మంచ్’కు ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన హిందూ ఏక్తా మంచ్ పేరిట ఇచ్చిన పిలుపు మేరకు ఆ మూడు, నాలుగువేల మంది ప్రజలు తరలి వచ్చారు. వారు విడిచిపెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్న నిందితులు సాధారణ పౌరులు కాదు, మిలిటెన్సీని అణచివేసేందుకు కశ్మీర్ వచ్చిన ప్రత్యేక పోలీసు దళానికి చెందిన ఇద్దరు అధికారులు. వారిని అరెస్ట్ చేసింది కూడా సాధారణ నేరారోపణలపై కాదు. రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన నేరంపై. ఆ పాపకు డ్రగ్స్ కూడా ఇచ్చి రేప్ చేశారన్నది రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. రసనా గ్రామంలో బాకర్వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన బాలిక అవడం వల్లనే హిందూ మంచ్ ఆధ్వర్యంలో నిందితులను విడుదల చేయాల్సిందిగా నేటికి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 22న) కథువా జాతీయ రహదారి దిగ్బంధనానికి హిందూ మంచ్ పిలుపునిచ్చింది. రసనా సమీపంలోని అటవి ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక శవం జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. ఆ పాపకు డ్రగ్స్ ఎక్కించినట్లు, పలుసార్లు రేప్ చేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ఆచూకీ కోసం పోలీసులు కూడా పెద్దగా ప్రయత్నాలేమీ చేయలేదని తెల్సింది. ఆ తర్వాత జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానేపాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును స్థానిక పోలీసుల నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు జనవరి 23వ తేదీన అప్పగించింది. వారు ప్రత్యేక పోలీసు బలగానికి చెందిన దీపక్ కజూరియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేసింది. వారు ఏ ప్రత్యేక పోలీసు బటాలియన్కు చెందిన వారో, అందులో వారి హోదా ఏమిటో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బహిర్గతం చేయలేదు. వారు హిందులు కావడం, రాష్ట్రస్థాయిలో కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్న అధికారి ముస్లిం కావడంతో కేసు హిందువులు–ముస్లింల గొడవగా మారింది. బీజేపీ, ఆరెస్సెస్ల పిలుపుతో ఫిబ్రవరి 14వ తేదీన, 17వ తేదీన నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఇదో రకమైన జిహాద్ అని, అందులో భాగంగా హిందూ అధికారులను అరెస్ట్ చేశారని లాయర్ విజయ్ శర్మతోపాటు కథువా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్నాథ్ డోగ్రా ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట అరెస్టై, విడుదలైన నిందితుడు హిందువే. తర్వాత అరెస్టయిన అధికారులు హిందువులే. దారుణమైన రేప్కు, హత్యకు గురైన బాలిక మాత్రం ముస్లింకదా! ఆ పాపకు న్యాయం జరగాలి కదా! అంటూ మీడియా ప్రశ్నిస్తే కేసును సీబీఐకి అప్పగించి దోషులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న భారీ ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శనలో భారత్ మాతా జిందాబాద్!, పాకిస్థాన్ ముర్దాబాద్! నినాదాలతోపాటు జాతీయ జెండాలు కనిపించాయి. రేప్ అండ్ మర్డర్ కేసుకు జాతీయవాదానికి సంబంధం ఏమిటని మీడియా ప్రశ్నించగా, ముస్లింలు మన జాతి వ్యతిరేకులని, రసనా గ్రామంలోని బాకర్వాలా ముస్లింలు కూడా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తారని వారన్నారు. రసన గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మీడియా ప్రశ్నలకు పెంపుడు తండ్రి మొహమ్మద్ యూసుఫ్ సమాధానం ఇచ్చారు. తాము ఫలానా వారు నిందితుడు కావచ్చనిగానీ, ఫలానా వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయనిగానీ పోలీసులకు చెప్పలేదన్నారు. తమ పాపకు న్యాయం చేయమని మాత్రమే కోరామని అన్నారు. తమ గ్రామంలో మూడొంతుల మంది హిందువులేనని, వారి పొలాల్లోనే కాయం కష్టం చేసి బతుకుతూ వస్తున్నామని తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగితే శవాన్ని పాతిపెట్టడానికి కూడా ఎవరూ అనుమతించలేదని, దానితో సమీపంలోని కూఠ గ్రామానికి వెళ్లి అక్కడ పజ్వాలా కమ్యూనిటీ స్థలంలో బిడ్డను పాతిపెట్టామని, అందుకు కూడా హిందువులు అడ్డుపడ్డారని మొహమ్మద్ వాపోయారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందన్న బాధ కంటే తన బిడ్డ కారణంగా ఇప్పుడు గ్రామంలో హిందువులు, ముస్లింలు విడిపోవడం ఎక్కువ బాధ కలిగిస్తోందంటూ ఆ వృద్ధుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన హిరానగర్లో హిందూ నాయకులు సమావేశమై ముస్లిలను వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నెరపరాదని, పొలం పనులు, ఎలాంటి పనులకు పిలవరాదని నిర్ణయించారు. ఈ సమావేశానికి సహాయ మంత్రి హోదా అనుభవిస్తున్న రాష్ట్ర ఇతర వెనకబడిన వర్గాల సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ శాసన సభ్యుడు కుల్దీప్ వర్మ, కాంగ్రెస్ పార్టీ కథువా జిల్లా అధ్యక్షుడు సుభాష్ గుప్తా హాజరయ్యారు. మొన్నటి వరకు కలసి ఉన్న ఓ మతస్థులను ఇలా వెలివేయడం ఎంతవరకు సమంజసమని ఓ దుకాణదారు ఓం ప్రకాష్ని ప్రశ్నిస్తే ‘మనగడ్డపై ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్’ అంటారు, వారికి అలాంటి శాస్తి జరగాల్సిందే’ అన్నారు. వారు పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదం ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా? అన్న ప్రశ్నకు తాను ఎన్నడూ వినలేదని, విన్నవాళ్లు చెప్పారని చెప్పారు. రేపటి జాతీయ రహదారి దిగ్బంధం ఎటుదారి తీస్తుందో చూడాలి! -
నిన్న జమ్ములో దాడి తమ పనే: షోహద బ్రిగేడ్
జమ్మూలోని కథువా, సాంబ జిల్లాలోని నిన్న జరిపిన దాడి తమ పనే అని తీవ్రవాద సంస్థ షోహద బ్రిగేడ్ ప్రకటించింది. ఆ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సామి- ఉల్- హక్ ఈ మేరకు మీడియాకు శుక్రవారం ఫోన్ ద్వారా వెల్లడించారు. ఆ రెండు ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఆర్మీ అధికారి సహా 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్రవాదుల దాడి అనంతరం అయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత క్యాంపులు, పోలీసు స్టేషన్లు సహా అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా భద్రత సిబ్బందిని మొహరించారు. -
జమ్మూలో తీవ్రవాదుల దాడి ఖండించిన బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉదయం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భారత్లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్ఛన్న యుద్దానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పాక్ తన భూభాగంలో ఉండి భారత్పై తీవ్రవాదుల దాడికి ఉసిగొల్పుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల జరగకుండ భారత ప్రధాని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఇచ్చిన భరోసా గాలిలో దీపమైందని ఆయన అభివర్ణించారు. ఆ దాడులు అరికట్టేందుకు ప్రధాని కనీసం ఎటువంటి చర్యలు చేపట్టారనేది నేటిని అంతుపట్టని విషయంగా ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్లోని కథువా జిల్లాలోని హీరా నగర్ పోలీసు స్టేషన్పై అలాగే సాంబ సెక్టార్ సైనిక శిబిరంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలలో మొత్తం 9 మంది మరణించారు. వారిలో సైనిక అధికారి కూడా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు తీవ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.