machine
-
పత్తి తీసే యంత్రం రెడీ!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.పత్తి తీతలో 95% సామర్థ్యంట్రాక్టర్కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.అనువైన వంగడాల లేమి!పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు. -
నింగి నుంచి ఊడిపడ్డ భారీ యంత్రం..ఉలిక్కిపడ్డ గ్రామస్తులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బీదర్(Bidar)లోని జల్సంగి గ్రామ వాసులకు శనివారం(జనవరి 18) ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద బెలూన్(Baloon) పడింది. బెలూన్కు పెద్ద పేలోడ్ యంత్రం కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి తోడు బెలూన్కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్ లైట్ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తులకు భయం ఎక్కువైంది. వెంటనే బెలూన్తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్ తాలూకా పోలీసులు స్పాట్కు చేరుకుని బెలూన్ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్ యంత్రం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(Tifr)కు చెందినదని పోలీసులు తేల్చారు. విషయం క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్ఆర్ ఆకాశంలోకి బెలూన్ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్ పోలీసులు బెలూన్ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్ఆర్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్మీడియాలో పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. A satellite payload #baloon of #TIFR , #Hyderabad fell on a house from sky in Bidar with a huge machine.A huge size balloon (looks like an airbag) fell from the sky, created panic among the villagers Jalsangi village in #Homnabad Taluk, #Bidar district, #Karnataka , early… pic.twitter.com/Dri4CikSdE— Surya Reddy (@jsuryareddy) January 18, 2025 -
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్లెస్గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!
మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్వేర్లను రూపొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్లోని బ్రాండ్ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్గా మారింది. 2015లో ఏఎన్డీ పేరుతో డిజైన్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.సంపద పరంగా..భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్గా పేర్కొంది. (చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!) -
మోటు సరసం !.. మద్యం మత్తులో బావబామ్మర్దుల పరాచకం
ఐనవోలు: బావబామ్మర్ధి పరాచకాలు.. ఆటపట్టించుకోవడాలు సాధారణంగా చూస్తుంటాం.. కానీ, ఏకంగా ఓ బావబామ్మర్ధుల జంట సరసం పరా కాష్టకు చేరింది. దీంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఒంటిమామిడిపల్లికి చెందిన ఓ మెకానిక్, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మంచి స్నేహితులు. ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (27) ఈ నెల 20వ తేదీన రాత్రి మెకానిక్ షెడ్డులో ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటున్నాడు. అదే సమయంలో మిగతా ఇద్దరు అక్కడకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆకతాయి తనంతో ఏం చేస్తున్నామో తె లియని స్ధితిలో ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ను నువ్వు బక్కగా ఉన్నావు.. లావు కావాలి.. అంటూ గేలి చేస్తూ ఆట పట్టించారు. నీకు గాలి పె ట్టి దొడ్డయ్యేలాగా(లావు) చేస్తాం.. అంటూ పరా చకాలు అడుతూ చివరకు బలవంతంగా మెకానిక్ షాపులో ఉన్న హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ పైపు మలద్వారం వద్ద ఉంచి ఒక్కసారిగా గాలి వది లారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పొట్టలోకి గాలి చేరడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు టాక్టర్ డ్రైవర్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పెద్ద పేగులోకి గాలి చేరి ఉబ్బిందని ఆపరేషన్ చేయడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే సదరు వ్యక్తి ఆహారం తీసుకుని.. మలవిసర్జన చేసే వరకు ఆస్పత్రిలోనే ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో అయ్యే ఖ ర్చంతా ఒంటిమామిడిపల్లికి చెందిన ఇద్దరు భరి స్తున్నారు. అయితే ఆరు రోజులైనా డిశ్చార్జ్ కాకపోవడంతో విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయి.. చర్చనీయాంశంగా మారింది. -
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అనంతపురంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేసింది. స్థానిక ఆదిమూర్తి నగర్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రాంగణంలో నిరుపేద మహిళలకు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలనేదే నాట్స్ ఆశయమని బాపు నూతి అన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ కృషి చేస్తుందన్నారు. అనంతపురం ఆర్డీటితో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళల కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాపు నూతి తెలిపారు. ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల అధినేత ఆంజనేయులు, నాయుడు, సాయి, అనిల్ కుమార్ నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్ -
గీతా ప్రెస్కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్పూర్లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!
ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. మృతుడిని పితోర్గఢ్ జిల్లా గోవింద్ కుమార్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్తో వీరిని బయటకు తీసుకువచ్చారు. -
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్గా పని చేస్తుంది ఇది. డివైస్కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్మెంట్ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్క్రీమ్ తయారీ..
క్లైమేట్తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్క్రీమ్ ఎవర్గ్రీన్! అలాంటి ఐస్క్రీమ్ లవర్స్కి ఈ మెషిన్ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్క్రీమ్ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్క్రీమ్ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్ ఫంక్షన్స్ యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్ లేడల్ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్క్రీమ్ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. ఈ మేకర్ని క్లీన్ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! ) -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
భారత్లో రెట్టింపు రేడియో థెరపీ మెషీన్లు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్–లినాక్ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
రిమోట్ ఓటింగ్ మెషిన్ ను సిద్ధం చేసిన ఈసీ
-
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్
ముంబై: సంతకాలను అచ్చుగుద్దినట్టుగా కాపీ చేసే కేటుగాళ్లను చూశాం. ఫోర్జరీ సంతకాలతో అవతలి వాళ్లకే కాదు, ఆ సంతకంగల వారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా అనేక లావాదేవీలతో భారీ మోసాలకు పాల్పడే నేరగాళ్లు మన చుట్టూ చాలామందే అన్నారు. తాజాగా సిగ్నేచర్లను కాపీ చేస్తున్న మెషీన్ ఒకటి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్వర్మ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. సంతకాల రోజులు పోయాయి ..ఈ మెషీన్ సంతకాన్ని ఖచ్చితంగా కాపీ చేయగలదు అంటూ ట్వీట్ చేశారు. పెన్ను పట్టుకుని అక్కుడున్న సంతకాన్ని అచ్చంగా దించేస్తున్న వైనంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ మెషీన్లోని టెక్నాలజీ ఏంటి, ఏ కంపెనీ మెషీన్ అనే దానిపై క్లారిటీ లేదు. ఇది చాలా ప్రమాదకరమని కొందరు, నిశానీ (వేలిముద్రల) రోజులే బావున్నాయని కొందరు, ఓటీపీ ఉందిగా అంటూ మరికొందరు కమెంట్ చేశారు. కానీ సాధారణంగా సంతకంలోని స్ట్రోక్ ఒక సంతకానికి మరో సంతకానికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి సంతకాన్ని మాత్రమే యంత్రం కాపీ చేయగలదు కానీ, స్ట్రోక్ను కాపీ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే మరో యూజర్ దమ్ముంటే దీన్ని కాపీ చేయండి అంటూ సినీనటుడు, బాలకృష్ట సంతకాన్ని షేర్ చేయడం నవ్వులు పూయిస్తోంది. GONE are the days of signatures ..This machine can copy a signature exactly pic.twitter.com/mNQI0v8fbc — Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2022 Try copy this pic.twitter.com/vAwoT5jVsq — Mr.an's (@anildicon) October 22, 2022 But a machine can copy a signature but generally the stroke in a signature is different from one signature to another signature, the machine can follow only one signature but can’t copy the stroke of the signature who is signing, machines can’t — CA MSR (@MUNAGAS) October 22, 2022 -
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
స్టాంప్ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్’ తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో ఫ్రాంకింగ్ మిషన్ సేవలు అందని ద్రాక్షగా తయారయ్యాయి. డిజిటలైజేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ఫ్రాంకింగ్ మిషన్లు అందుబాటులో తెచ్చినప్పటికీ ఆచరణలో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది. పాత మిషన్లు మొరాయిస్తుండటంతో ఆధునిక యంత్రాల సరఫరా జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో వినియోగంలోకి తేవడం లేదు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మొక్కుబడిగా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో మూలన పడిపోయాయి. ఫలితంగా దస్తావేజుదారులు ప్రైవేటు ఫ్రాంకింగ్ మిషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. స్టాంప్ డ్యూటీ కడితేనే.. ఇళ్లు, వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 0.5 శాతం హైపోతిక్ చార్జీ (స్టాంప్ డ్యూటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించిన తర్వాతనే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాన్ని విడుదల చేస్తాయి. రూ.1000 లోపు అయితే స్థానికంగా ఉండే లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద చెల్లించవచ్చు. అంతకన్నా మించి అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా ముట్టినట్టు స్టాంప్ వేసి ఇస్తారు. నిండా నిర్లక్ష్యం.. ఫ్రాంకింగ్ మిషన్లో డిపాజిట్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దస్తావేజుదారులు ఆరోపిస్తున్నారు. చిన్న డిజిటల్ యంత్రమైన ఫ్రాంకింగ్ మిషన్ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలను ప్రభుత్వానికి ముందస్తుగా డిపాజిట్ చేస్తే అంత విలువైన స్టాంపుల స్టాంపింగ్కు కావాల్సిన ముడిసరుకును (ఇంక్) సరఫరా అవుతోంది. అయిపోతే మళ్లీ చార్జీ చేసుకోవాలి. ప్రైవేటు స్టాంప్ వెండర్ల విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఆయితే వారి దగ్గర రూ. వెయ్యికి మించి స్టాంపింగ్కు వీలు లేదు. రిజిస్ట్రేషన్ అధికారులు మిషన్లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయించకపోవడమే కాకుండా రీచార్జి చేయించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదాయం సమకూరుతున్నా.. ప్రస్తుతం రూ.100 మించిన స్టాంపులను అమ్మడం లేదు. స్టాంప్ డ్యూటీకి సరిపడా స్టాంపులను కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఆ మొత్తాన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లిస్తే అందుకు సరిసమానమైన స్టాంప్ను ఈ ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా వేస్తారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద నెలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అవసరమైన ఫ్రాంకింగ్ మిషన్ల నిర్వహణపై శ్రద్ధ కనబర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
నిమిషాల్లో వంటలు చేసే రోబో మెషిన్
ఎంతటి టెక్నాలజీ అయినా, ఎలాంటి సౌకర్యమైనా.. అందరికీ సులభంగా, సౌలభ్యంగా ఉండే మెషిన్స్కి ఓ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న మేకరే ఈ రోబో మెషిన్(ఆటోమెటిక్ డ్రమ్ కుకింగ్ మెషిన్). ఇది 360 డిగ్రీస్ గిర్రున తిరుగుతూ ఎలాంటి వంటకాన్నైనా నిమిషాల్లో చేసేస్తుంది. ఈ నాన్ స్టిక్ పాట్ రోబో కమర్షియల్ ఫ్రైయింగ్ కుకర్.. అడుగు భాగంలో రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. చిత్రాన్ని గమనించినట్లైతే.. ఇరువైపులా స్టాండ్కి పైభాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ చాలా టేస్టీగా వండేస్తుంది ఈ గాడ్జెట్. 85 డిగ్రీల నుంచి 230 డిగ్రీల వరకూ 7 లెవల్స్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. ఈ ఇంటెలిజెంట్ రోలింగ్ మెషిన్ ప్రత్యేకమైన పాత్ర(నాన్ స్టిక్ డ్రమ్) కలిగి ఉంటుంది. దాన్ని మేకర్ నుంచి సులభంగా వేరు చేసుకుని.. క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన మూత ఉంటుంది. దాంతో 360 డిగ్రీస్ తిరిగినా దీనిలోని ఆహారం సురక్షితంగా ఉంటుంది. మూతకు పైభాగంలో యాంటీ-స్కాల్డింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాని పక్కనే ఎయిర్ వాల్వ్ ఉండటం వల్ల ఇందులో వంట వేగంగా కుక్ అవుతుంది. చదవండి: ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మాయదారి మహమ్మారి విజృంభణ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం ఈ మూడు విషయాలు అత్యంత కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా మాస్క్లు. జేబులో రూపాయి లేకున్నా బయటకు వెళ్లవచ్చేమో కానీ ముఖానికి మాస్క్ లేకుండా మాత్రం అడుగు బయట పెట్టలేం. మాస్కుల్లో.. సర్జికల్, ఎన్ 95, కుట్టిన మాస్కులు, లేదా చేతి రుమాళ్ల వంటి వివిధ రకాల వాటిని వాడుతున్నారు ఇటీవల బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ప్రజలకు మాస్కులు పెట్టే యంత్రానికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో యంత్రం ముందు ఓ వ్యక్తి కూర్చొని ఉంటే కొన్ని సెకన్లకు యంత్రం దానంతట అదే మనిషి కూర్చున్న దిశగా ముఖానికి మాస్కును విసురుతుంది. ఈ మాస్కు వ్యక్తి ముఖానికి సరిగ్గా ఇముడుతుంది. ఈ యంత్రాన్ని అలెన్ పాన్ అనే వ్యక్తి తయారు చేశాడు. దీనికి ది కరేనేటర్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దాకా వీక్షించగా అనేక మంది కామెంట్ చేస్తున్నారు. (మాస్కు.. మరిచితిరా!) My man invented “The Karenator”. A machine to blast masks onto mask-less people. Hilarious...🤣🤣🤣pic.twitter.com/bzSsy7vhXy — Rex Chapman🏇🏼 (@RexChapman) August 17, 2020 -
వరి నాట్లేసే పరికరం
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పట్టభద్రుడైన ఓ యువకుడు చిన్న కమతాల్లో వరి సాగు చేసే రైతుల ఇబ్బందులు, ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు అందిస్తున్నారు. అతని పేరు యడ్ల ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గున్నతోట వలస స్వస్థలం. దేశ విదేశాల్లో వాడుతున్న యంత్రాలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేశాడు. చిన్న రైతులకు ఉపకయోగపడే వరి నాటే పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాడు. సాక్షి, బొబ్బిలి :ప్రయోగాలకు అవసరమైన పట్టుదల, ఆలోచన ఉన్నాయి కానీ చేతిలో డబ్బు లేదు. ఇతరు సహాయం కోసం ఉమామహేశ్వరరావు ఎదురు చూడలేదు. ఆరు నెలలు ప్రైవేటు ఉద్యోగం చేసి కూడబెట్టిన రూ. 30 వేలతో వెల్డింగ్ మెషిన్, ఇనుప సామగ్రిని కొనుగోలు చేసి, ప్రయోగాలు కొనసాగించారు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. వెల్డింగ్ పనిలో తన స్నేహితుడు మెండి సత్యనారాయణ సహాయపడ్డారన్నారు. ఒక మనిషి ఈడ్చుకుంటూ వెళ్తూ వరి నాట్లు వేసే చిన్న పరికరం సిద్ధం అయింది. దీనికి ఎటువంటి ఇంజిన్ లేదు. పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. తమ గ్రామంలోనే ఇటీవల ఓ రైతు పొలంలో తాను తయారు చేసిన పరికరంతో ఇటీవలే తొలిసారి వరి నాట్లు వేసి అందరితోనే శెభాష్ అనిపించుకున్నారు. విత్తనాలను ట్రేలో వేసి మొలక గడ్డి రీతిలో వరి నారు పెంచి, ఈ పరికరంతో నాట్లు వేసుకోవచ్చు. ఈ పరికరాన్ని నడపడానికి ఒక మనిషి చాలు. ఎకరా పొలంలో నాలుగు గంటల్లో నాట్లు పూర్తి చేశానని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. వరుసల మధ్య 14 సెం.మీ. దూరం ఉంటుంది. వరుసల్లో మొక్కల మధ్య 7 సెం.మీ. దూరం పెట్టామని, దీన్ని రైతు వసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని అన్నారు. ఈ వరుసల మధ్య పెరిగే కలుపు తీసే ఇనుప పరికరలను కూడా రూపొందించటం విశేషం. వరి నాటే పరికరం పనితీరును పరిశీలించిన బొబ్బిలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మాల కొండయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న కమతాల్లో వరి నాట్లు వేసే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వరి నాట్లు వేసే పరికరాన్ని రైతులకు రూ.10 నుంచి 15వేల మధ్య విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇతరులెవరయినా తోడై పెట్టుబడి పెడితే స్టార్టప్ కంపెనీని నెలకొల్పి చిన్న రైతులకు ఉపయోగపడే పరికరాలను పెద్ద సంఖ్యలో తయారు చేసి రైతులకు అందించాలన్నది తన అభిమతమని ఉమామహేశ్వరరావు(93989 02285) తెలిపారు. – రేగులవలస వ్యాస్బాబు, సాక్షి, బొబ్బిలి -
ఇక.. చూస్తుండగానే బూడిద!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్–19 మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 650కిపైగా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్తో వ్యాధి తీవ్రమైన వారు ఎక్కువ మంది నగరానికే వస్తుండటం.. ఇక్కడ మరణించిన వారిని తిరిగి తమ స్వగ్రామాలకు తీసుకెళ్లలేక చాలామంది అంత్యక్రియల భారాన్ని ఆస్పత్రులపైనే వదిలివేస్తున్నారు. వీరి అంత్యక్రియలకు ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటమే కాక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం వీలైనన్ని దహన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న గ్యాస్ ఆధారిత దహన వాటికను గత నెలలో ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. పలు లోపాలుండటంతో వాటిని సరిచేస్తామని సంబంధిత ఏజెన్సీ తెలిపింది. కానీ.. దానివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటాన్ని దృష్టిలో ఉంచుకొని విరమించుకున్నారు. ఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో వాడుతున్న దహనవాటికలను పరిశీలించిన అధికారులు అవి ఉపయోగకరంగా ఉన్నాయని భావించి అలాంటివి నాలుగు తెప్పించారు. ఒక్కో విద్యుత్ దహన వాటికకు దాదాపు రూ. 45 లక్షలు వ్యయం కాగా, అవసరమైన షెడ్డు, ఇన్స్టలేషన్ పనులు తదితరమైన వాటికి వెరసి రూ. 88 లక్షలవుతుంది. వీటిని చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోన్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాటి అమరిక పనులు జరుగుతున్నాయి. ఈ వారాంతంలోగా ఇన్స్టలేషన్ పనులన్నీ పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్తో పనిచేసే వీటికి ఒక్కో మృతదేహానికి ఒక గ్యాస్ సిలిండర్ సరిపోతుందని, దాదాపు 75 నిమిషాల్లో మృతదేహం దహనం అవుతుందని అధికారులు తెలిపారు. దహనం చేయాల్సిన మృతదేహాలు పెరిగే కొద్దీ.. ఈ సమయం 45 నిమిషాలకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. గతంలో మూతపడ్డ అంబర్పేట, బన్సీలాల్పేట, ఎర్రగడ్డ శ్మశానవాటికల్లోని విద్యుత్ దహన వాటికలను కూడా వినియోగంలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఈ పరికరంతో కరోనా వైరస్.. మటాష్
నిజాంపేట్: కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రగతినగర్లోని ఎలీప్ పారిశ్రామికవాడలో ఓ స్టార్టప్ కంపెనీ జెర్మీబ్యాన్ పరికరాన్ని తయారు చేసింది. నియో ఇన్వెంట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఈ పరికరం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలాంటి వైరస్నైనా 15 నిముషాల్లో నాశనం చేస్తుంది. ఈ పరికరంలో అల్ట్రా వైలెట్ కిరణాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈ పరికరం 99.9 శాతం వరకు ఉపరితలం, వాయువులో ఉన్న ఎలాంటి సూక్ష్మ జీవులనైనా చంపేస్తుంది. దీంతో కరోనా వైరస్కు సైతం చెక్ పెట్టే సామర్థ్యం ఈ పరికరానికి ఉందని సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జెర్మీబ్యాన్ను ఐసోలేషన్ కేంద్రాలు, ఆస్పత్రులు, ఇతర సాధారణ ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని రిమోట్ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది. జెర్మీబ్యాన్ను ఆన్ చేసినపుడు పరిసర ప్రదేశాల్లో మనుష్యులు ఉండకూడదు. పరికరాన్ని ఆఫ్ చేసిన 15 నిముషాల తరువాత మాత్రమే వెళ్లాలి. నియో ఇన్వెంట్రానిక్స్ సంస్థకు చెందిన శిరీష చక్రవర్తి ఈ పరికరాన్ని అటల్ ఇంక్యూబేషన్ సెంటర్, ఎలీప్ వీహబ్ సహకారంతో తయారు చేశారు. ఈ జెర్మీబాన్ పరికరాన్ని మార్చి రూపొందించిన నిర్వాహకులు ఏప్రిల్ నెలలో బ్యాక్టీరియా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం వీరుకున్న సామర్థ్యంతో రోజుకు 10 జెర్మీ బాన్లు తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే రోజుకు 50 వరకు పరికరాలను తయారు చేస్తామంటున్నారు. అదే విధంగా రోబొటిక్ జెర్మీబాన్, డొమాస్టిక్ ఎయిర్ స్టెరిలైజర్ లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించాలి.. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఈ జెర్మీబ్యాన్ లను కరోనా నియంత్రణకు విరివిగా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్కొ జెర్మీబ్యాన్ రూపకల్పనకు రూ.75 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతోంది. అదే విధంగా ఇళ్లల్లో వాడుకునేందుకు డొమెస్టిక్ స్టెరిౖలైజర్ను తయారు చేస్తున్నాం. మనుషుల అవసరం లేకుండా సంబంధిత ప్రదేశంలో వైరస్ను నాశనం చేసే రొబొటిక్ జెర్మీబ్యాన్ లను తయారు చేస్తాం. – శిరీష చక్రవర్తి, నియో ఇన్వెంట్రానిక్స్ నిర్వాహకురాలు -
25 రోజులు.. వేలమార్లు ప్రయోగం..
రెండు నెలల క్రితం మాస్క్, శానిటైజర్ అంటే తెలియని వారు సైతం.. ప్రస్తుతం అవి లేకుండా ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిత్యం జాగ్రత్తలు తప్పనిసరిగా మారింది. కరోనాను అడ్డుకునేందుకుఏకమైన మార్గం ఫిజికల్ డిస్టెన్స్ – హ్యాండ్ శానిటైజేషన్ మాత్రమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే మన చేతులతో వస్తువులనుతాకుతుంటాం. అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో మనం చెప్పుకుంటున్న హ్యాండ్ శానిటైజర్ల వినియోగం సందర్భంలోనే మన చేతులతో హ్యాండ్ శానిటైజర్ పంపును తాకడమో లేక మరోవ్యక్తి దాన్ని చేతులకు అందించే క్రమంలోమన దగ్గరకు రావడమో జరుగుతోంది. కొన్నిచోట్ల లెగ్ ప్రెషర్ డిస్పెన్సర్ ఉన్నా అవి కొన్ని ప్రెస్ల తర్వాత పనిచేయకపోవడంతో చేతికి పనిచెప్పాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన ఓ యువ ఇంజినీర్ ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులోలేని పూర్తి ఆటోమేటెడ్ శానిటైజేషన్ డిస్పెన్సర్ను రూపొందించాడు. కుత్బుల్లాపూర్ :మన చేతులతో ఏమాత్రం తాకకుండా డిస్పెన్సర్కు దగ్గరగా చేతులను తీసుకెళ్లినప్పుడు ఆటోమెటిక్గా 4 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ చేతుల్లో పడటమే దీని ప్రత్యేకత. ఇందులో జెల్ బేస్డ్ శానిటైజర్తో పాటు లిక్విడ్ బేస్డ్ శానిటైజర్ను కూడా ఉపయోగించవచ్చు. పది లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ డిస్పెన్సరీని ఒక్కసారి ఫిల్ చేస్తే దాదాపు రెండు వేలసార్లు లిక్విడ్ను పొందవచ్చు. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ ఉపకరణానికి నెలకు ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చు కావడం విశేషం. ఉమ్మడి కుటుంబాలు, అధిక సంఖ్యలో సిబ్బంది ఉండే కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పలుచోట్ల దీన్ని ఉపయోగించవచ్చు. ఆలోచన వచ్చింది ఇలా.. నగరంలోని సాగర్రోడ్డు గుర్రంగూడకు చెందిన మెకానికల్ ఇంజినీర్ రాయంచి అభినవ్ కుమార్ లాక్డౌన్ సందర్భంలో ఓసారి బ్యాంక్కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన వారికి బ్యాంక్ సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేస్తూ కనిపించారు. ఈ సందర్భంలో సంబంధిత వ్యక్తులు దగ్గరగా రావడం, ప్రత్యేకంగా శానిటైజర్ను అందించేందుకు ఏకంగా ఓ వ్యక్తిని కేటాయించడం గమనించి ఆటోమేటెడ్ డిస్పెన్సరీని రూపొందించే ఆలోచనకు కార్యరూపం దాల్చాడు. తొలుత ఇంట్లో ఉన్న పాత ఆయిల్ క్యాన్తో ఈ ప్రయోగం మొదలు పెట్టారు అభినవ్ కుమార్. పలుమార్లు చేసిన ప్రయత్నాల్లో పలు రకాల నీటి పంప్లను, సబ్మెర్సిబుల్ పంప్లను వినియోగించి విఫలమయ్యాడు. చివరకు ఫుడ్గ్రేడ్ డీసీ పంప్, ఇండస్ట్రీయల్ గ్రేడ్ సెన్సార్, ఇతర పరికరాలతో విజయవంతంగా రూపొందించాడు. 25 రోజులు.. వేలమార్లు ప్రయోగం.. ఈ పరికరంలో ప్రధానమైన హార్డ్వేర్ డిజైన్ను రూపొందించేందుకు 25 రోజుల సమయం పట్టింది. అనంతరం రోబొటెక్ సహాయంతో సెన్సార్, మోటార్లను వేలమార్లు పరీక్షించి చూశాను. ఇప్పటి వరకు మార్కెట్ రకాల డిస్పెన్సరీలు రూ.8 నుంచి రూ.18 వేల వరకు ధర ఉన్నప్పటికీ అవి కేవలం లిక్విడ్ బేస్డ్ డిస్పెన్సరీలు మాత్రమే. వినాగో ఇన్నోవేషన్ బ్రాండ్ పేరిట ‘శాని–సెన్స్’ పేరుతో ఈ కాంటాక్ట్ లెస్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీని కేవలం రూ.6 వేలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఇండిపెండెంట్ ఇళ్లకు స్మాల్ డిస్ ఇన్స్పెన్షన్ టెన్నల్ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. – రాయంచి అభినవ్ కుమార్, శాని–సెన్స్కాంటాక్ట్ లెస్హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీ రూపకర్త -
తొలి దేశీ కరోనా టెస్టింగ్ పరికరం..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్ 6800 టెస్టింగ్ మెషీన్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్-19 టెస్ట్ల కోసం దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ పరికరాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు పీపీఈ కిట్లను దేశీయంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత వాయుసేన ఆధ్వర్యంలో భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో పేటెంట్కు దరఖాస్తు చేశారు. చదవండి : ఫాసీ వ్యాఖ్యలతో ఏకీభవించను: ట్రంప్ -
పదివేల రూపాయలకే ఆక్సిజన్ యంత్రం!
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్రావు, కె.భాస్కర్తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. -
ఆ పిల్లలకు దిక్కెవరు!
పెదపూడి(అమృతలూరు): ప్రమాదవశాత్తూ మొక్కజొన్న యంత్రంలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెదపూడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పెదపూడి మరియమ్మ(35) ఉదయం రోజూలానే తెల్లజొన్న నూర్పిడి పనులకు తోటి కూలీలతో కలిసి వెళ్లింది. యంత్రం వద్ద పనిచేస్తున్న సమయంలో చీరకొంగు యంత్రానికి చుట్టుకుపోయి లోనికి లాగేసింది. ఈ క్రమంలో తల మెండెం నుంచి వేరుపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తోటి కూలీలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మరియమ్మ భర్త జయపాల్ ఏడాది కిందట ఇంటి వద్ద ప్రమాదవశాత్తూ్త విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చుండూరు సీఐ రమేష్బాబు, ఎస్ఐలు పాపారావు, కె.రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పిల్లలకు దిక్కెవరు! పెదపూడికి చెందిన జయపాల్తో చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన మరియమ్మకు 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. ఉన్నంతలో తమ పిల్లలను చదివించుకునేవారు. గత ఏడాది తన పూరింట్లో కరెంట్ వైరు ఊడిపోవడంతో దానిని కలిపే ప్రయత్నం చేస్తుండగా జయపాల్ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. దీంతో కుటుంబ భారం మరియమ్మపై పడింది. పిల్లల చదువుకు, కుటుంబ అవసరాల కోసం పనికి వెళ్లకతప్పని పరిస్థితి. ప్రస్తుతం కుమారుడు రవికుమార్ తెనాలిలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతుండగా, శ్రావణి పెదపూడి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఏడాది కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. -
శానిటైజర్ యంత్రం..ఏవైనా శుభ్రం చేయచ్చు
-
చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు కార్మికుడి చెయ్యి చెరకు రసం తీసే యంత్రంలో చిక్కుకుని చేతి వేళ్లు తెగిపోయిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన యూసుఫ్ (28) చేతి వేళ్లు పోగొట్టుకున్న కార్మికుడు. పట్టణ పరిధిలోని తిరుమల రోడ్డులో యూసుఫ్ చెరకు రసం యంత్రం బండి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం యూసుఫ్ యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుంది. యూసుఫ్ కేకలు విన్న స్థానికులు గ్యాస్ కట్టర్ సాయంతో రెండు గంటలపాటు శ్రమించి చెయ్యి విడిపించారు. అయితే యూసుఫ్ చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. యూసుఫ్ రెండు గంటలపాటు బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి అంబులెన్స్ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు విక్టోరియాకు తరలించారు. -
ఫీల్ ది పీల్..
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నారింజ రసాన్ని ఎంచక్కా ఆస్వాదించే ఉంటాం మనం. రసం తాగేసిన తర్వాత మిగిలిపోయే పిప్పి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. కానీ.. ఇటలీ డిజైనింగ్ కంపెనీ కార్లో రట్టీ అసోసియాటీ మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంది. అందుకే వృథాగా పారబోసే పిప్పితోనే గ్లాస్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ యంత్రం అదే. ‘ఫీల్ ద పీల్’అని పిలుస్తున్న ఈ యంత్రం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. పైన ఉన్న గుండ్రటి ఛత్రం వంటి నిర్మాణంలో సుమారు 1500 నారింజ పండ్లు ఉంటాయి. అవసరమైనప్పుడు ఇవి నేరుగా కిందకు వస్తాయి. ఒక్కో పండును రెండుగా కోసేందుకు బ్లేడ్ ఉంటే.. రసం తీసేందుకు ఇంకో యంత్రం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిపోయే తోలును, పిప్పిని అక్కడికక్కడే సూక్ష్మస్థాయి పోగులుగా మార్చి, త్రీడీ ప్రింటర్ సాయంతో కప్పులు తయారు చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. -
పాత పరికరాలతో కలుపుతీత యంత్రం
రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరలు లేక ఓ వైపు, కలుపు కూలీల కొరతతో మరో వైపు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కమ్మరి ఆంజనేయులు పాత ఇనుము పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు. ఆంజనేయులు బాల్యం నుంచే వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. ఓ కోళ్ల ఫాంను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కోళ్ల ఫాంలో వరి పొట్టు తిరగేయడం సమస్యాత్మకంగా మారడంతో తన దగ్గర ఉన్న పాత ఇనుము పరికరాలతో వరి పొట్టును దున్నేందుకు ఓ చిన్న యంత్రాన్ని తయారు చేశాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో రైతులు కూలీల కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను చూసి ఎలాగైనా∙ఆరుతడి పంటల్లో ఉపయోగపడే కలుపుతీత యంత్రాన్ని తయారు చేయాలని సంకల్పించుకున్నాడు. దీనిలో భాగంగానే తన షెడ్డులో ఉన్న పాత పరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశాడు. 4 అశ్వశక్తి గల ఇంజిన్ను కొనుగోలు చేసి దానికి జోడించాడు. కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న వంటి పంటల్లో కలుపుతీసేందుకు వీలుగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రం తయారీకి రూ.35 వేలు ఖర్చు అవుతున్నది. రైతులకు రూ.40 వేలకు విక్రయిస్తున్నాడు. ఈ యంత్రం ద్వారా లీటర్ పెట్రోల్తో ఎకరం పొలంలో అంతరకృషి చేసి కలుపును నిర్మూలించవచ్చని ఆంజనేయులు తెలిపాడు. ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఆరు నుండి 10 మంది కూలీలు కలుపుతీస్తుంటారు. ఒక్కో కూలి మనిషికి రూ.300 ఖర్చయ్యేది. ఎకరం పొలం కలుపు తీసేందుకు రూ.3 వేలు ఖర్చయ్యేదని స్థానిక రైతులు తెలుపుతున్నారు. ఈ యంత్రం ద్వారా రూ.100తో ఎకరం పొలంలో కలుపు తీసుకునేందుకు వీలవుతోందని, దీనిపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. తన వద్ద ఉన్న పాతపరికరాలతో కలుపుతీత యంత్రాన్ని తయారుచేశానని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు ఉపయోగపడే వివిధ రకాల యంత్రాలను తయారుచేస్తానని ఆంజనేయులు (95427 74287) అంటున్నాడు. – గడ్డం కాంతారావు, సాక్షి, చిన్నచింత కుంట, మహబూబ్నగర్‡ కలుపుతీత యంత్రం (ఇన్సెట్లో) ఆంజనేయులు -
వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతి
సాక్షి, గణపురం : వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మరావుపేట గ్రామానికి చెందిన చిన్నపాక సమ్మక్క(50) అదే గ్రామానికి చెందిన రైతు పోశాల రాజయ్య పొలంలోకి కూలీ పనులకు వెళ్లింది. వరికోత మిషన్ వరిని కోస్తూ వెనుక వైపు వెళ్లడంతో వెనుక పనిచేస్తున్న సమ్మక్కపై నుంచి మిషన్ వెళ్లింది. దీంతో సమ్మక్క అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణపురం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. అధికారులు స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సిద్ధిపేటలో 90 టైర్ల లారీ..
ప్రశాంత్నగర్(సిద్దిపేట) : భారీ వాహనాలపై పెద్ద పెద్ద యంత్రాలను తరలిస్తుండటంతో పట్టణ ప్రజలు ఆసక్తితో గమనించారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రంగధాంపల్లి మీదుగా ఈ భారీ వాహనాలు వెళ్లాయి. వాహనానికి మొత్తం 90 టైర్లు ఉండటం విశేషం. యంత్రాలను మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నట్టు వాహనదారులు పేర్కొన్నారు. -
కుట్టు చిత్రం భళారే విచిత్రం.!
పెయింటింగ్ ఎలా వేస్తారు? అదేం ప్రశ్న చేతితోనే కదా వేస్తాం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం చూడండి. అచ్చం పెయింటింగ్ లాగే ఉంది కదూ! అయితే ఇది కలర్స్తో వేసిన పెయింటింగ్ కాదు. కుట్టు మిషన్తో వేసిన ఎంబ్రాయిడరీ..! చేతితోనే కాదు.. కుట్టు మిషన్తో కూడా అందమైన పెయింటింగ్స్ లాగా ఉండే చిత్రాలను వేయొచ్చని నిరూపించాడు హరియాణాలోని పాటియాలాకు చెందిన అరుణ్ కుమార్ బజాజ్.. చిత్రలేఖనం అంటే చాలా ఇష్టపడే అరుణ్ బాగా పెయింటింగ్స్ వేసి పెద్ద చిత్రకారుడు అవుదామనుకున్నాడట. కానీ చిన్నతనం లోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. కుటుంబ భారం తన పైనే పడింది. తన తండ్రి దర్జీ కావడంతో 16వ ఏటనే అరుణ్ దర్జీ వృత్తిలోకి అడుగుపెట్టాడు. కానీ చిత్రలేఖనంపై ఉన్న ఇష్టాన్ని వదలకుండా తను పనిచేసే కుట్టు మిషన్తోనే అందమైన చిత్రాలను వేయడం ప్రారంభించాడు. ఇలా ఎంబ్రాయిడరీ ద్వారా పెయింటింగ్స్ వేసిన మొదటి వ్యక్తిగా అరుణ్ నిలిచాడు. -
చల్లగాలి కోసం.. బుల్లి యంత్రం!
ఇప్పుడంటే చలికాలం. ఇంకో నాలుగు నెలలు పోనివ్వండి.. ఫ్యానెక్కడ? ఏసీ పనిచేస్తోందా? కూలర్లోకి ఐస్ ఎప్పుడేద్దాం? అని నానా హైరానా పడిపోతాం. వేసవి తాపం అలాంటిది మరి. ఇప్పుడు పై ఫొటో చూడండి. ఈ బుల్లి యంత్రం మీ దగ్గరుంటే ఉక్కపోత అస్సలు ఉండదు. పైగా ఎంత వేడి వాతావరణంలో తిరిగినా ఒళ్లు మాత్రం చల్లగానే ఉంటుంది. పేరు ‘బ్లో’. ఏం మాయ చేస్తుంది ఈ యంత్రం అంటున్నారా? చాలా సింపుల్. మోటార్ కార్లలో సువాసనలు వెదజల్లేందుకు వాడే డిఫ్యూజర్లా ఉంటుంది ఇది. మోటార్ పనిచేసేందుకు ఓ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. కార్లలో మాదిరిగానే డిఫ్యూజర్లో పిప్పర్మెంట్ నూనెను వాడారనుకోండి. సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే పిప్పర్మెంట్ నూనెకు గాలి కలిసి ఒళ్లంత చల్లగా అయిపోతుందన్నమాట. షర్ట్ కు తగిలించుకోగలగడం, రీఛార్జిబుల్ బ్యాటరీ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. బయటి ఉష్ణోగ్రత కంటే కనీసం ఆరు డిగ్రీలు తక్కువ చేస్తుంది ఈ యంత్రం. ముగ్గురు యువకుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ బుల్లి ఏసీ యంత్రం ప్రస్తుతానికి మార్కెట్లోకి రాలేదు. అయితే వాణిజ్యస్థాయి అభివృద్ధికి 5000 డాలర్లు కావాలని కిక్స్టార్టర్లో పిలుపునిచ్చారు. ఆ వెంటనే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిపడటం, ఈ ఉత్పత్తిపై అందరి ఆసక్తి ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
అడవి పందులు, కోతుల పీడ విరగడయ్యేదెలా?
అడవిలోని పందులు, కోతుల వంటి జంతువులకు ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది? అవి దగ్గర్లోని పంట పొలాలపై వచ్చి పడుతూ ఉంటాయి. అడవి బలహీనమవుతున్న కొద్దీ పంటల మీద వీటి దాడి తీవ్రమవుతూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో రైతులకు అడవి పందులు, కోతుల బెడద గత ఐదారేళ్ల నుంచి పెను సమస్యగా పరిణమించింది. వీటిని పారదోలి పంటలను కాపాడుకునే పద్ధతులపై ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నది. విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అడవి పందులు, కోతులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలేందుకు అనేక పద్ధతులను రూపొందించింది. ఇవి రైతులకు ఊరటనిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటున్న అడవి పందులు, కోతులను నిర్మూలిస్తే తప్ప తమ కష్టాలు తీరవని కొందరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటి కాల్చివేత నేరం. కిం కర్తవ్యం?! అడవి పందులు, కోతుల సంఖ్య ఎంత? వీటి వల్ల ఏయే పంటల్లో జరుగుతున్న నష్టం ఎంత? స్పష్టంగా తెలియదు! గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకావడం లేదన్నది ఒక వాదన. సమస్య తీవ్రతపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించినప్పుడే వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనే మరింత సమర్థవంతమైన మార్గాలు వెదకడం సాధ్యమవుతుందని అఖిల భారత సకశేరుక చీడల(వెర్బట్రేట్ పెస్ట్) యాజమాన్య విభాగం అధిపతి డా. వాసుదేవరావు స్పష్టం చేస్తున్నారు. పాలకులారా వింటున్నారా..?! అడవి పందులు పంటల వాసనను పసిగట్టి పొలాలపై దాడి చేస్తుంటాయి.. అడవి పల్చబడిపోవటం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటున్నది. అడవిలో మానులు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దాంతో అవి ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలపైకి దాడి చేస్తున్నాయి. ఇందువల్లనే అడవి పందులు, కోతుల వంటి జంతువుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులకు జరుగుతున్న పంట నష్టం ఏటేటా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. అయితే, ఈ సమస్యపై పాలకులు అంతగా దృష్టి పెట్టకపోవటంతో రైతులకు కష్టనష్టాలే మిగులుతున్నాయి. ∙మన దేశంతోపాటు బర్మా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వీటిని కాల్చి లేదా విషం పెట్టి చంపుతున్నారు. కానీ, మన దేశంలో వివిధ కారణాల వల్ల వన్యప్రాణి సంరక్షణకే అధికంగా మొగ్గు చూపుతున్నాం ► అడవి పందులు సామాన్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత పంట పొలాలపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. గడ్డి భూములు, అటవీ పరిసర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, పంట పొలాల సమీపంలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి ► అనేక రకాల పంటలు, దుంపలు, మట్టిలోని వేరు పురుగులు, పాములు, చిన్న జంతువులను తింటాయి. కలుపు మొక్క తుంగ గడ్డలను ఇష్టపడతాయి ► పరిపక్వ దశలోని మొక్కజొన్నకు 23–47%, వేరుశనగకు 20–48%, చెరకుకు 18–36%, వరికి 11–30%, జొన్నకు 10–20% చొప్పున పంట దిగుబడి నష్టం కలిగిస్తాయి. కంది, పెసర, వరి, శనగ, కూరగాయ పంటలకు కూడా అడవి పందులు నష్టం చేస్తాయి ► ఘాటైన వాసనను వెదజల్లే పసుపు, అల్లం, వాము, ఆవాలు.. ముళ్లను కలిగి ఉండే వాక్కాయ, కుసుమ, ఆముదం పంటల జోలికి అడవి పందులు రావు ► పంటలకు నష్టం కలిగించడంతోపాటు వైరస్ సంబంధమైన జబ్బులను ఇతర జంతువుల్లో వ్యాపింప చేస్తాయి ► అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం ఎక్కువ. కాబట్టి, దూరం నుంచే ఎక్కడ ఏ పంట ఉందో గ్రహిస్తాయి. చూపు, వినికిడి శక్తి తక్కువ ► ఆహార సేకరణకు 15–35 వరకు కలసి గుంపులుగా సంచరిస్తాయి. ఆడ పందులు నాయకత్వం వహిస్తాయి ► అడవి పందులు వర్షాకాలంలో 4–12 పిల్లలను కంటాయి ∙అడవి నుంచి బయటకు వచ్చిన అడవి పందులు సర్కారు తుమ్మ చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకొని.. రాత్రుళ్లు పంటల పైకి దాడి చేస్తున్నాయి. ఆర్తనాదాల యంత్రంతో అడవి పందులకు చెక్ అడవి పందులను సమర్థవంతంగా పారదోలేందుకు శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘ఆర్తనాదాల యంత్రం’(బయో అకౌస్టిక్స్). బెంగళూరుకు చెందిన గ్రుస్ ఎకోసైన్సెస్ సంస్థతో కలసి దీన్ని రూపొందించారు. గత మూడేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో 155 మంది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. రైతుల అనుభవాలు, సూచనలకు అనుగుణంగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున త్వరలో కంపెనీతో అవగాహన ఒప్పందం జరగబోతోంది. పులి, అడవి పంది తదితర అటవీ జంతువులు ఆపదలో ఉన్నప్పుడు బిగ్గరగా అరిచే ఆర్తనాదాలను 33 నిమిషాలపాటు రికార్డు చేశారు. ప్రతి జంతువు ఆర్తనాదాలకు మధ్యలో కొద్ది నిమిషాలపాటు.. ఇవి నిజమైన ఆర్తనాదాలేనని భ్రమింపజేయటం కోసం.. విరామం ఇచ్చారు. ఆర్తనాదాల యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి లేదా మరేదైనా కర్రకు బిగించవచ్చు. విద్యుత్తో నడుస్తుంది. కరెంట్పోతే సౌరశక్తితో నడుస్తుంది. బ్యాటరీ 12–14 గంటలు పనిచేస్తుంది. జీఎస్ఎం సిమ్ టెక్నాలజీని వాడారు. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్ ద్వారా ఆన్/ ఆఫ్ చేయొచ్చు. అరుపులు బాగా బిగ్గరగా (42–37 డెసిబుల్స్) 10–15 ఎకరాల వరకు వినిపిస్తాయి. అడవి పందులను అరికట్టే జీవకంచెలు: మొక్కజొన్న, జొన్న పంటల చుట్టూ ఆముదం మొక్కలను 4 వరుసలు దగ్గర దగ్గరగా విత్తుకొని అడవి పందులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఆముదం పంటపై ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. వేరుశనగ పొలానికి చుట్టూ కుసుమ పంటను 4 వరుసలు వత్తుగా విత్తుకోవాలి. పొలం చుట్టూతా దగ్గర దగ్గరగా వాక్కాయ చెట్లు పెంచటం ద్వారా పొలంలోపలికి అడవి పందులు రాకుండా అడ్డుకోవచ్చు. వాక్కాయ చెట్టుకు ఉండే ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. ఈ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇనుప ముళ్ల కంచెలు: చిన్న కమతాల్లో పంటలు పండించుకునే రైతులు ముళ్ల కంచెలు వేసుకోవడం ద్వారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. బార్బ్డ్ వైర్తో 3 వరుసలుగా పంట చుట్టూ కంచెగా నిర్మించాలి. 2 అడుగుల గుండ్రటి కంచెను పంట చుట్టూ వేయాలి. దీన్నే పోలీస్ కంచె అని కూడా అంటారు. చైన్ లింక్ ఫెన్స్ను పొలం చుట్టూ వేసుకొని పంటను రక్షించుకోవచ్చు. భూమి లోపలికి 9 అంగుళాల మేరకు దీన్ని పాతాలి. లేకపోతే కంచె కింద మట్టిని తవ్వి.. కంత చేసుకొని పొలంలోకి పందులు వస్తాయి. హెచ్.డి.పి.ఇ. చేపల వలను పొలం చుట్టూ వేసుకోవచ్చు. 3 ఇంచుల కన్ను ఉండే వలను వాడాలి. 3 అడుగుల ఎత్తు, 2 అడుగుల వలను భూమి మీద పరచి.. మేకులు కొట్టాలి. ఈ వలలో అడవి పందుల గిట్టలు ఇరుక్కుంటాయి. కందకాలు: పొలం చుట్టూ కందకాలు తవ్వటం ద్వారా అడవి పందులను అడ్డుకోవచ్చు. కందకం 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉండాలి. పొలం చుట్టూతా ఒకటే కందకం తవ్వాలి. ఎక్కడా గట్టు వదలకూడదు. పొలం గట్టుకు అడుగు దూరంలో తవ్వాలి. పందులు దూకి రాలేవు. వాన నీటి సంరక్షణ జరుగుతుంది. పక్క పొలాల నుంచి పురుగులు కూడా మన పొలంలోకి రావు. విషగుళికలు: పొలం చుట్టూ కర్రలు పాతి ఫోరేట్ గుళికలను గుడ్డ మూటల్లో వేలాడగట్టాలి. 200 గ్రా. గుళికలను కిలో ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రా. చొప్పున తీసుకొని చిన్న, చిన్న రంధ్రాలు పెట్టిన గుడ్డలో మూట గట్టాలి. 3 – 5 మీటర్ల దూరంలో కర్రలు పాతి వాటికి వేలాడ గట్టాలి.ఈ గుళికల ఘాటు వాసన పందులు పంట వాసనను పసిగట్టకుండా గందరగోళపరుస్తాయి. కాబట్టి పొలంలోకి రావు. కోడిగుడ్డు ద్రావణం పిచికారీ: పంట చుట్టూ అడుగు వెడల్పున నేలపై గడ్డిని తవ్వేసి.. కోడిగుడ్డు ద్రావణాన్ని పిచికారీ చేస్తే పొలంలోకి పందులు రావు. కుళ్లిన లేదా మామూలు కోడిగుడ్లను పగలగొట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. 25 మి.లీ. కోడిగుడ్డు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పొలం చుట్టూ పిచికారీ చేయాలి. పంది కొవ్వు + గంధకం పూత: పొలం చుట్టూ 3 వరుసల నిలువు కంచె మాదిరిగా కొబ్బరి తాళ్లు కట్టాలి. పంది కొవ్వులో గంధకాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని తాళ్లకు పూయాలి. పందులైనా ఇతర జంతువులైనా ఒక గుంపు ఉన్న చోటకు మరొక గుంపు రావు. పంది కొవ్వు–గంధకం వాసన తగలగానే ఇక్కడ వేరే గుంపు ఉందని భ్రమపడి పందులు వెళ్లిపోతాయి. వెంట్రుకలు: మనుషులు క్షవరం చేయించుకున్నప్పుడు రాలే వెంట్రుకలు తీసుకువచ్చి.. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పున వేయాలి. గడ్డిని చెక్కి శుభ్రం చేసిన నేలపై వెంట్రుకలు వేయాలి. అడవి పందులు ముట్టెతో వాసన చూసినప్పుడు ఈ వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి గుచ్చుకుంటాయి. దాంతో వెనుదిరిగి వెళ్లిపోతాయి. కోతులకు తిండి పెట్టటం మానితే 30% పంట నష్టం తగ్గుతుంది! తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు అడవి పందులతోపాటు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వీటి సంతతి వేగంగా పెరుగుతుండటంతో పంట నష్టం ఏటేటా పెరుగుతున్నది. అడవుల్లో, రోడ్ల పక్కన వివిధ రకాల పండ్ల చెట్లను అభివృద్ధి పేరిట నరికివేస్తుండటం వల్ల కోతులు ఆహారం కోసం పంటల మీదకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో కొన్ని రకాల సెంటిమెంట్ల కారణంగా కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించడం కూడా కోతుల సంతతి తామరతంపరగా పెరిగి సమస్యాత్మకంగా తయారవుతున్నదన్నది నిపుణుల మాట. కోతులకు మనుషులు ఆహారం వేయటం మానేస్తే వీటి మూలంగా జరుగుతున్న పంట నష్టం 30% మేరకు తగ్గిపోతుందని గత రెండేళ్లుగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యశాస్త్రవేత్త డా. వాసుదేవరావు చెప్పారు. మన ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కోతులకు తోక పొట్టిగా, ముడ్డి ఎర్రగా ఉంటుంది. ఆగస్టు – అక్టోబర్ నెలల మధ్య ఇవి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆడ కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వీటి సంతతి వేగంగా పెరగటానికి ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా ఒక మగ కోతికి 2.8 ఆడ కోతుల చొప్పున ఉండాలి. కానీ, తాము నిర్వహించిన సర్వేలో ప్రతి మగ కోతికి 6.7 ఆడకోతులు ఉన్నాయని తేలినట్లు డా. వాసుదేవరావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కోతులు తినని పంటలు: కోతుల బెడద బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి నచ్చని పంటలను సాగు చేయటం మేలని డా. వాసుదేవరావు సూచిస్తున్నారు. పసుపు, అల్లం, కంద, చేమగడ్డ, బంతి, మిర్చి, ఆవాలు, సజ్జ వంటి పంటల జోలికి కోతులు రావని ఆయన తెలిపారు. ఇతర పంటలను సాగు చేసే రైతులు కోతులు తినని పంటలను సరిహద్దు రక్షక పంటలుగా వత్తుగా కొన్ని సాళ్లు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్న కోణంలో అధ్యయనం జరుగుతోంది. రోడ్ల వెంట చెట్ల నరికివేతతో సమస్య తీవ్రం..: మన పూర్వీకులు రోడ్లకు ఇరువైపులా నేరేడు, చింత, మద్ది, రావి తదితర పండ్ల జాతులు, మోదుగ, బూరుగ వంటి మకరందాన్ని అందించే పూల చెట్లను ఎంతో ముందు చూపుతో నాటేవారు. ఆ చెట్లపై ఆధారపడి కోతులు ఆకలి తీర్చుకుంటుండేవి. అయితే, రోడ్ల విస్తరణలో భాగంగా మన ముందు తరాల వారు నాటిన పెద్ద చెట్లన్నిటినీ నరికేశాం. అదే విధంగా అడవిలో కూడా పెద్ద మాన్లు నరికివేతకు గురయ్యాయి. చిన్న చెట్లతో కూడిన అడవులే పల్చగా మిగిలాయి. దీంతో కోతులకు చెట్ల ద్వారా ఆహారం లభించక పంటల మీదే ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని డా. వాసుదేవరావు అంటున్నారు. హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర పరాయి ప్రాంతపు వృక్ష జాతులకు బదులు సంప్రదాయక పండ్ల జాతుల మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచిస్తున్నారు. వాణిజ్యదృష్టితో టేకు, యూకలిప్టస్ వంటి మొక్కలను నాటడం కన్నా పండ్లు, పూల జాతి చెట్లను ఎక్కువగా పెంచి, కోతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ప్రణాళికలన్నీ మనుషుల ఆర్థిక అవసరాలు, సౌలభ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచిస్తున్నారని.. సకల జీవరాశి మనుగడను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఆయన సూచన. సోలార్ ఫెన్సింగ్: కోతులు, అడవి పందులు పంటను పాడు చేయకుండా పొలం చుట్టూ జీఏ వైరుతో సోలార్ ఫెన్సింగ్ వేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న పొలాలకు ఇది ఉపకరిస్తుంది. ఇది షాక్ కొడుతుంది, అయితే చనిపోయే అంత తీవ్రత ఉండదు. కాబట్టి, జంతువులు బెదిరి పారిపోతాయి. ఎకరానికి రూ. 15 వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్తనాదాల యంత్రాన్ని కూడా ఈ సోలార్ ఫెన్సింగ్కు అనుసంధానం చేసే యోచన ఉందని డా. వాసుదేవరావు తెలిపారు. కోతులను, పక్షులను పారదోలే గన్: కోతులను, పక్షులను బెదరగొట్టి పారదోలటానికి నల్లని పెద్ద తుపాకీని డా. వాసుదేవరావు రూపొందించారు. అనేక పరీక్షల అనంతరం, ప్రయోగాత్మకంగా వాడి చూసిన రైతుల అనుభవాలను బట్టి దీన్ని మెరుగుపరుస్తున్నారు. కోతుల మీదకు ఈ తుపాకీతో పేపర్ బాల్స్ను ప్రయోగిస్తే.. దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది. బాల్స్ దెబ్బ తిన్న కోతులు మళ్లీ ఆ పొలం వైపు రావని చెబుతున్నారు. ప్రయోగాలు పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. అడవి పందులు కోతుల లెక్కలు తీయాలి అడవి పందులు, కోతులు తదితర అటవీ జంతువులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం మనుషులమే. కాబట్టి వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ ఆహార పంటలను పండిస్తూ వన్య జీవుల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా గుర్తించి నిర్వర్తించటం మన కర్తవ్యం. జంతువులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలే పద్ధతులపై పరిశోధనలు చేపట్టాం. వన్య ప్రాణులకు ముప్పు కలిగించని పర్యావరణ హిత పద్ధతులను రూపొందిస్తున్నాం. వాటికి పునరావాస ప్రాంతాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా వివిధ వన్యజాతులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా రైతులోకానికి కూడా మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట వన్యజీవుల ఆవాసాలలోకి చొచ్చుకొని పోయిన మానవులు వన్య జీవుల ఉనికిని ప్రశ్నిస్తున్నారు. సమస్త జీవకోటికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాసే అధికారం మానవునికి నిక్కచ్చిగా లేదు. మానవజాతి ఇప్పటికైనా వన్యజీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చెయ్యకుండా.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.. అడవి పందులు, కోతులు ఎన్ని ఉన్నాయి? వీటి వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఎంత? వంటి విషయాలపై ఇప్పటి వరకు అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వాలు పూనికతో కచ్చితమైన గణాంకాలను సేకరిస్తే.. అడవి పందులు, కోతుల బారి నుంచి పంటలను పూర్తిగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. అడవిలో పులులు, చిరుత పులుల మాదిరిగా అడవి పందులు, కోతుల కచ్చితమైన గణాంకాల సేకరణ అసాధ్యమేమీ కాదు. గణాంకాలు సేకరిస్తే.. పంట నష్టాలను పూర్తిగా నివారించటం సాధ్యమవుతుంది. ఆర్తనాదాల యంత్రం వరి పంటను కాపాడింది! 4 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాను. పంట వేసిన 30 రోజుల తర్వాత ప్రొ. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదం యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి బిగించాను. అడవి జంతువుల ఆర్తనాదాలను వినిపించటం ద్వారా అడవి పందులు పంట జోలికి రాకుండా ఇది కాపాడింది. ఈ యంత్రం లేకపోతే ఎకరానికి కనీసం రూ. 5 వేల పంట నష్టం జరిగి ఉండేది. పదేళ్ల నుంచి అడవి పందులతోపాటు కోతుల సమస్య కూడా బాగా పెరిగిపోయింది. మూసీ నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోవటానికి కూడా కోతుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పు చేపల వాసనకు కోతులు పరారీ! మా ఇంటి పెరట్లో జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ వంటి అనేక పండ్ల చెట్లున్నాయి. కాయలను కోతులు బతకనివ్వటం లేదు. ఐదారు ఉప్పు చేపలను గుడ్డలో మూటలు కట్టి నెల క్రితం 6 చోట్ల వేలాడదీశాను. కోతులు ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయో అక్కడ కట్టాను. అప్పటి నుంచి కోతులు ఆప్రాంతానికి వచ్చినా మా చెట్ల మీదకు రాలేదు. ఉప్పు చేపల వాసనతో తమకు ముప్పు పొంచి ఉందని భీతిల్లి కోతులు వెళ్లిపోతున్నాయి. ఈ చేపలను వాసన తగ్గిపోయిన తర్వాత రెండు నెలలకోసారి మార్చాలి. వర్షాకాలంలో నెలకోసారి మార్చాలి... మా తోటకు అడవి పందుల బెడద ఉంది. పంది కొవ్వు+గంధకం మిశ్రమంలో తాడును ముంచి.. ఆ తాళ్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు కట్టాం. తల వెంట్రుకలను సేకరించి పొలం చుట్టూ వేసిన తర్వాత అడవి పందులు రావటం లేదు. అడవి పందులు పంటలను బతకనివ్వటం లేదు.. ఎమ్మే, బీఈడీ చదివా. ఉద్యోగం రాలేదు. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఐదారేళ్ల నుంచి అడవి పందుల సమస్య పెరుగుతూ వచ్చింది. అడవిలో తినటానికి గడ్డల్లేక పొలాల మీదకు వస్తున్నాయి. ఏ పంట వేసినా కష్టంగానే ఉంది. మొదట్లో మొక్కజొన్న కంకులను మాత్రమే తినేవి. ఇప్పుడు వరి కంకులను, చివరికి పత్తి కాయలను కూడా నమిలేస్తున్నాయి. అన్ని ఊళ్లలో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. సంవత్సరం క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదాల యంత్రాన్ని 8 ఎకరాల వరి పొలంలో పెట్టా. అడవి పందులు రాలేదు. పొలం చుట్టూ వేసుకోవటానికి ఫెన్సింగ్ జాలీని ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. కొరకరాని కొయ్యలుగా మారిన అడవి పందులను చంపటమే శాశ్వత పరిష్కారం. – తోట రఘు (81848 60707), రైతు, కుంటాల, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం – డా. వైద్యుల వాసుదేవరావు (94404 11166), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ – కాల్య రవికుమార్ (80749 19204), రైతు, శోభనాద్రిపురం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం – ప్రవీణ్కుమార్ రెడ్డి, రైతు, (94924 23875), పెబ్బేరు, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం కథనం: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం యాజమాన్యం పరిమళ ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకంగా మిషనరీని తెప్పించింది. పరిమళ ప్రసాదాలను భక్తులు మహా పవిత్రంగా స్వీకరిస్తారు. నెలలో కనీసం 2 లక్షల ప్యాకెట్ల వరకు ప్రసాదాలు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుతోంది. భక్తుల డిమాండ్కు తగ్గట్టు ప్రసాదం తయారీని వేగవంతం చేసేందుకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లో రెండు మిషన్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్యాకింగ్ చేసి కౌంటర్లలో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. -
ప్రాధాన్యతా పనులకు ముందస్తు ప్రణాళిక
కలెక్టర్ అరుణ్కుమార్ కాకినాడ సిటీ : ఉపాధి హామీ, నీరు–చెట్టు పథకాల ద్వారా వచ్చే ఏడాది జల సంరక్షణ మిషన్ కింద జిల్లాలో చేపట్టే ప్రాధాన్యతా పనులకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ అరుణ్కుమార్ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. పథకం కింద పనులను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డిసెంబర్ ఒకటి నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి రంగం సిద్ధం చేసి డీలర్లు, ప్రజలలో సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు, హార్టికల్చర్, ఇరిగేషన్ తదితర అంశాల వారీగా నిర్వహించిన పనులు, నిధుల వినియోగంపై విశ్లేషణ చేసి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీకి సూచించారు. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు పనితీరుపై నిర్దేశించిన కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్ల సాధన నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేసి, గ్రేడింగ్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేడియోలు కనబడవు... పాఠాలు వినబడవు
తొలి రోజు సగం పాఠశాలలకే పరిమితం ఉపాధ్యాయుల్లో కానరాని చైతన్యం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ‘విందాం–నేర్చుకుందాం’ కార్యక్రమం తొలి రోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి, సులభంగా పాఠాలు అర్థమయ్యేందుకు రూపొందించిన ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయి సిబ్బందిలో చిత్తశుద్ధి కొరవడడం, అ«ధికారులు– ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పాఠశాలల పనివేళల్లో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానుంది. విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్, ఆకాశవాణి, దూరదర్శన్ చానళ్ల సంయుక్త పర్యవేక్షణలో ఉండే ఈ కార్యక్రమానికి రాజీవ్ విద్యామిషన్ పాఠ్యాంశాలకు రూపకల్పన చేయగా, ఆకాశవాణి దూరదర్శన్ చానల్ ప్రసారం చేస్తుంది. ఇదీ కార్యక్రమం... ప్రతి మంగళవారం ఒకటి, రెండు తరగతులకు, బుధ, గురు, శుక్రవారాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొడుపు కథలు, హాస్యోక్తులు, నాటికలతో పాటు విలువైన సమాచారంతో విద్యా సంవత్సరం పొడవునా పాఠాలు ప్రసారమయ్యేలా కార్యక్రమం రూపొందించారు. నిష్ణాతులయిన ఉపాధ్యాయుల ద్వారా రాజీవ్ విద్యామిషన్ పాఠాలను ప్రసారం చేస్తుంది. జిల్లాలో 3751 పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 3320 ప్రాథమిక,, 431 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలిరోజు అధికారిక అంచనా ప్రకారం 1900 పాఠశాలల్లో మాత్రమే రేడియో పాఠాల కార్యక్రమం జరిగినట్టు సమాచారం. కొరవడిన సమన్వయం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు అధికారుల్లో సమన్వయం లేకపోవడం వల్లే సుమారు 1850 పాఠశాలల్లో రేడియో పాఠాలు వినలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఆదేశాలివ్వడం, పాఠశాలల్లో రేడియోలు పనిచేయకపోవడం, కొన్ని చోట్ల రేడియోలే లేకపోవడంతో తొలిరోజు సగం పాఠశాలల్లోని విద్యార్థులు పాఠాలు వినలేకపోయారు. తొలిరోజు కాలం, క్యాలెండర్ తదితర పాఠాలు బోధించారు. పాఠశాలలకు కేటాయించిన మేనేజ్మెంట్ నిధుల్లో రేడియోలను కొనుగోలు చేయాలని, ఆ నిధులతో రేడియోలు రిపేర్ చేయించుకోవాలని అ«ధికారులు ఆదేశాలు జారీ చేసినా ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోలేదన్న ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు గ్రాంట్లను పలు పనులకు ఉపయోగించడం వల్ల నిధుల కొరతతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తాం విందాం– నేర్చుకుందాం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు సమాచారం ఇచ్చాం. ఏడాది పాటు కార్యక్రమానికి గ్యాప్ రావడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. - చామంతి నాగేశ్వరరావు, అకడమిక్ మానటరింగ్ ఆఫీసర్ (రాజీవ్ విద్యామిషన్) చర్యలు తీసుకుంటాం విద్యార్థుల్లోని సృజనకు పదునుపెట్టే ఈ కార్యక్రమం పాఠశాలల్లో ప్రారంభం కాలేదన్న విషయంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలకు డీఈఓకు నివేదిస్తాం. ఈ కార్యక్రమంపై కొన్ని రోజుల ముందే నియమ, నిబంధనలతో పాఠశాలలకు సమాచారం అందించాం. రేడియో పాఠాలు ప్రారంభం కాని పాఠశాలలను గుర్తించాలని మానటరింగ్ అధికారులను ఆదేశించాను. - మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ -
డీలర్లూ.. తూకం బయట ఉంచండి
కరప : రేషన్ డీలర్లు కార్డుదారులకు కనిపించేలా తూకం ఏర్పాటు చేయాలని, అలా చేయని వారిపై చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖాధికారి (డీఎస్ఓ) ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కరపలోని రేషన్ షాపులు తనిఖీ చేశారు. కొందరు డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు, స్టాకులేదని కుంటిసాకులు చెపుతున్నట్టు తెలిసిందని, అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 90 వేల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఒక్కసారి కూడా సరుకులు తీసుకోకపోవడంతో వారు జిల్లాలో లేనట్టుగా గుర్తిచామన్నారు. జిల్లాలోని తెలుపురంగు రేషన్ కార్డుదారులందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్ఓ చెప్పారు. -
మూత్రంతో బీరు తయారీ..!
సాధారణంగా బీరు తాగగానే యూరిన్కు పరిగెత్తేవారిని మనం చూస్తూనే ఉంటాం. మరి అలాంటిది యూరిన్తోనే బీర్ తయారుచేస్తే ఎలా ఉంటుంది. చాలా చండాలంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ బెస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉండే బీర్ను యూరిన్తో తయారుచేసే టెక్నిక్ను కనుగొన్నారు పరిశోధకులు. బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కేవలం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని యూరిన్ను నీరుగా మార్చే మెషిన్ను కనుగొన్నారు. ఈ విధానంలో.. పెద్ద ట్యాంక్లో యూరిన్ను స్టోర్ చేసి సోలార్ పవర్తో పనిచేసే బాయిలర్లో వేడి చేస్తారు. అనంతరం దానిని ఒక పొరగుండా పంపినప్పుడు పొటాషియం, నైట్రోజన్, పాస్పరస్ లాంటి ఖనిజాలతో పాటునీరు వేరవుతుంది. ఇటీవలే సెంట్రల్ ఘెంట్లో 10 రోజుల పాటు నిర్వహించిన మ్యూజిక్, థియెటర్ ఫెస్టివల్లో 'పీ ఫర్ సైన్స్' పేరుతో ఈ మెషిన్ను ఉంచి సుమారు వెయ్యి లీటర్ల యూరిన్ను సేకరించారు. దీంతో బెల్జియంలోనే మాంచి టేస్టున్న బీరును తయారుచేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రక్రియలో వెలువడిన ఖనిజాలను పంటలకు ఎరువులుగా కూడా వాడుకోవచ్చని డాక్టర్ డెరెసి వెల్లడించారు. -
‘తాత్కాలిక’ పనుల్లో ప్రమాదం
♦ యంత్రంలో తల ఇరుక్కొని యూపీ కార్మికుడి దుర్మరణం ♦ గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపుపై కార్మికుల ఆగ్రహం ♦ చెదరగొట్టిన పోలీసులపై రాళ్ల వర్షం.. అంబులెన్స్ దహనం ♦ ఎల్అండ్టీ కార్యాలయంలో విధ్వంసం ♦ నిర్మాణ పనుల్లో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు కార్మికుల బలి సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో నెల రోజుల వ్యవధిలోనే మరో కార్మికుడు బలయ్యాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన మహదేశ్య దేవేందర్(22) ప్రమాదంలో మృతిచెందాడు. మృతదేహాన్ని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించడంతో 400 మందికి పైగా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎల్అండ్టీకి చెందిన ఒక అంబులెన్స్, కార్యాలయంలోని కంప్యూటర్, ఫోన్, కుర్చీలు, సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవేందర్ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తామని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కార్మిక చట్టాలను అమలు చేయాలి తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనిలో మహదేశ్య దేవేందర్ ఆరు రోజుల క్రితం చేరాడు. నెలకు రూ.8 వేల వేతనంతో కాంక్రీట్ మిక్సర్ మిల్లర్(టీఎం)పై హెల్పర్గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం యంత్రాన్ని శుభ్రం చేస్తుండగా అతని చొక్కా కాలర్ మిల్లర్కు బిగుసుకుంది. తల యంత్రం లోపల చిక్కుకొని నలిగిపోయింది. దీంతో దేవేందర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఎల్అండ్టీ ప్రతినిధులు ఉదయం 7.45 గంటల సమయంలో మృతదేహాన్ని రహస్యంగా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు 9 గంటల సమయంలో పనులు నిలిపివేసి విధ్వంసానికి దిగారు. లాఠీలతో చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. ఎల్అండ్టీ కార్యాలయంలోకి ప్రవేశించి చేతికి అందిన వస్తువులను ధ్వంసం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఎల్అండ్టీ ప్రతినిధులు దేవేందర్ మృతదేహాన్ని వెనక్కి రప్పించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు చేస్తున్నవారికి రక్షణ లేకుండా పోయిందని, కార్మిక చట్టాలను అమలు చేశాకే మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లనిస్తామని సీపీఎం, సీఐటీయూ నేతలు, కార్మికులు పట్టుబట్టారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం ఘటనా స్థలానికి వచ్చిన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అదనపు కార్యదర్శి శ్రీధర్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్లు కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. ఎల్అండ్టీ, కార్మిక శాఖలతో చర్చించి బాధితుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమరావతి ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ సంస్థ, కార్మిక శాఖతో చర్చించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే కార్మికుడి మృతి తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఉండగా పశ్చిమ బెంగాల్కు చెందిన సామ్రాట్ రౌత్ (20) ప్రమాదంలో మృతి చెందాడు. గత నెలలో బోర్పైల్స్ వేస్తుండగా దుర్మరణం పాలయ్యాడు. అప్పుడు కూడా ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు తెలుస్తోంది. కార్మికులు, నేతలపై లాఠీచార్జ్ గుంటూరు జేసీ, ఎస్పీలు గుంటూరులో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశాన్ని కార్మికులు, సీపీఎం, సీఐటీయూ నేతలు బహిష్కరించారు. ఘటనా స్థలంలో సమావేశం నిర్వహిస్తేనే తాము హాజరవుతామని స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలోని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో చితకబాదారు. ఉదయం నుంచి కార్మికుల పక్షాన మాట్లాడిన నాయకులను గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు. ఆందోళనకు దిగిన రాజధాని ప్రాంత సీపీఎం కార్యదర్శి సీహెచ్ బాబూరావు, గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి పాశం రామారావు, సీఐటీయూ నాయకులు లెనిన్, నవీన్ప్రకాష్, లక్ష్మీనారాయణతోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసి అమరావతి పోలీస్ స్టేషన్కు తరలించారు. లాఠీచార్జీలో గాయపడ్డ లెనిన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ బౌలర్ ఆడం జెంపా ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఓ మెషిన్ బ్యాటింగ్ చేస్తాడంటూ కితాబిచ్చాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉందని అన్నాడు. పుణెలో శనివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయ సెంచరీ చేసి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. 'కోహ్లీ బ్యాటింగ్ ఓ మెషిన్లా ఉంటుంది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని చూడడు. కొంత సమయం తీసుకుంటాడు. క్రీజులో కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. బెంగళూరులో మ్యాచ్లో విరాట్ అద్భుతంగా ఆడాడు' అని జెంపా అన్నాడు. బెంగళూరు స్టేడియంలో ఆడిన అనుభవం తనకుందని, ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా తరపున ఆడానని చెప్పాడు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని అన్నాడు. -
చోరీకిపోయి ఇరుక్కున్నాడు
పిల్లలు అల్లరి చేస్తుంటారు. అందులోనూ ఎప్పుడూ చూడని వస్తువులు కనిపిస్తే ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేళ్ళ కుర్రాడి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదో ఏమో కొత్తగా కనిపించిన వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టి ఇరుక్కు పోయాడు. అదృష్టం బాగుండి ఆరుగంటలు దాటాక ఎటువంటి అపాయం లేకుండా బయట పడ్డాడు. ఆస్ట్రేలియా బెల్బోర్న్ సిటీ సెంటర్ లో లియో అనే నాలుగేళ్ళ చిన్నారి బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మకానికి వినియోగించే వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టేశాడు. విషయాన్ని గమనించిన అక్కడివారు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనతో చిన్నారి ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, దీంతో సహాయక చర్యలు అతి సున్నితంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే బిస్కెట్లు, చాక్లెట్లను దొంగతనంగా చేజిక్కించుకోవడంకోసం లియో వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని చివరికి అవి దక్కక పోగా చేతులు మెషీన్ లో ఇరుక్కుపోయాయని అధికారులు చెప్తున్నారు. ఆరు గంటలపాలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లియో పలుమార్లు ఆందోళనకర స్థితికి చేరుకున్నాడు. మెషీన్లో ఇరుక్కున్న లియో చేతులను తీసేందుకు మెషీన్ ను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లియో అరుపులను విని ఎంతో భయం వేసిందని, అతని దృష్టిని మరిపించేందుకు స్మార్ట్ ఫోన్లు వంటివి చూపించామని చుట్టుపక్కల వీధుల్లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లియోకు ఎటువంటి ప్రమాదం లేదని, శరీరంపై ఎటువంటి గాయాలుకూడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అతడ్ని పరిశీలించేందుకు మెల్బోర్న్ లోని రాయల్ ఛిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు. ఇదిలా ఉంటే మా అబ్బాయి ఇంతకు ముందెప్పుడూ వెండింగ్ మిషన్ చూసినట్లు లేడని, బహుశా ఇదే మొదటిసారి కావడంతో బిస్కట్లు, చాక్లెట్లకోసం అందులో చేతులు పెట్టి ఉంటాడని నార్తరన్ టెర్రిటరీ ఆర్నెమ్ ల్యాండ్ లో నివసించే లియో తండ్రి ఆరోన్ అంటున్నాడు. ఏది ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
యంత్రం కింద తలపెట్టి ఆత్మహత్య
మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని గోపాలకృష్ణ గ్రానైట్ క్వారీ వద్ద విషాదం చోటుచేసుకుంది. చంద్రమోహన్ మెహతా(40) అనే కార్మికుడు గ్రానైట్ బండరాళ్లను కోసే యంత్రం కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం రెండూ వేరయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న మద్దిపాడు సీఐ సంజీవ్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రమోహన్ స్వస్థలం పశ్చిమబెంగాల్. నాలుగు నెలల క్రితం క్వారీలో చేరాడు. నాలుగు రోజులుగా ఏదో బాధతో ఉన్నట్లు కనిపించిందని తోటి కార్మికులు తెలిపారు. -
అరటి నారలో అర్థముంది!
అరటి బొందల నుంచి తీసే నారకు దేశవిదేశాల్లో గిరాకీ ఎకరానికి రూ. 30 వేల విలువైన నార తీసేందుకు అవకాశం.. ఖర్చులు పోను రూ. 10 వేల వరకు నికరాదాయం కలవచర్ల కేవీకే రూపొందించిన యంత్రంతో అరటి నార తీత చాలా సులువు.. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు సృష్టిలో వృథా అనేదేదీ లేదు. వృథా అనిపించే వాటికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అరటి రైతుకు గెలల అమ్మకం ద్వారానే కాదు.. వృథాగా పారేసే అరటి బొందల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే మార్గం ఉంది. అరటి బొందల నుంచి తీసే నారకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు అరటి నార తీసే యంత్రాన్ని రూపొందించింది. దీంతో అరటి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అరటి తోటలో గెలలు నరికిన తర్వాత బొంద(చెట్టు)లను వృథాగా పారేయడం పరిపాటి. వీటి నుంచి తీసే నార వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. హేండ్ మేడ్ టిష్యూ పేపర్, డెకరేషన్ పేపర్, నర్సరీ పౌచెస్, క్యారీ బ్యాగ్స్, డోర్ మేట్స్, కార్పెట్స్, తాళ్లు, ఆర్ట్ పేపర్, క్రాఫ్ట్ పేపర్, బాండ్ పేపర్లు, పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్స్, ల్యాంప్ షేడ్స్తోపాటు వస్త్రాల తయారీలోనూ అరటి నారను వాడుతున్నారు. యంత్ర సహాయం లేకుండా ఒక మనిషి రోజుకు అర కేజీ వరకు మాత్రమే పొట్టుతో కూడిన నారను తీయడం సాధ్యం. దీంతో రైతులు నార తీతపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలోనే మొట్టమొదటిగా అరటి నార తీసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు ఈ యంత్రం ద్వారా రోజులో 12 నుంచి 15 కిలోల నాణ్యమైన నారను తీయగలుగుతున్నారు. తద్వారా వృథాగా పారేసే అరటి బొందల నుంచి నార తీయడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుండడం విశేషం. కేవీకే యంత్రానికి జాతీయ అవార్డు అరటి బొందల ద్వారా నారను తీసే యంత్రం తయారు చేస్తే చెత్త సమస్య పరిష్కారం కావడంతోపాటు.. అరటి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్న దృష్టితో కలవచర్ల కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు యంత్రం రూపకల్పనకు కృషి చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా 2002లో అరటి నార తీసే యంత్రాన్ని విజయవంతంగా రూపొందించారు. డా. వెంకట సుబ్రమణియన్, డాక్టర్ దేవ్సింగ్, ఇంజినీర్ ఐ. శ్రీనివాస్ల తోడ్పాటుతో డాక్టర్ రూపాకుల సుధాకర్ చేసిన కృషి ఫలితంగా ఈ యంత్రం రూపుదాల్చింది. ఒన్ హెచ్పీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. దీని నిర్వహణ వ్యయం స్వల్పం కావడం విశేషం. 2005లో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్డీసీ) డా. సుధాకర్కు మెరిటోరియస్ ఇన్వెన్షన్ అవార్డుతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని అందించి సత్కరించింది. ఈ యంత్రం ప్రస్తుత ఖరీదు రూ. 55 వేలు. ఇప్పటికి 350 యంత్రాలను కేవీకే విక్రయించింది. మన రాష్టంలో పలువురు రైతు బృందాలతోపాటు 19 రాష్ట్రాలు, వెస్టిండీస్, శ్రీలంక దేశాల్లోని వారికి కూడా ఈ యంత్రాంలను విక్రయించినట్లు డా. సుధాకర్ తెలిపారు. ఆస్ట్రేలియాకూ త్వరలో ఈ యంత్రాన్ని పంపనున్నట్లు చెప్పారు. రాజమండ్రి సీటీఆర్ఐ డెరైక్టర్ కె.దామోదరరెడ్డి, కల్వచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ విఎస్జీఆర్ నాయుడు ప్రోత్సాహంతో కేవీకే శాస్త్రవేత్తలు అరటి నార తీయడంతో పాటు వివిధ చేతి వృత్తుల్లో రైతు మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఎకరానికి 150 కిలోల అరటి నార.. పక్వానికి వచ్చిన గెలలు నరికిన తర్వాత బొందలను కేవీకే రూపొందించిన యంత్రంతో నార తీయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు. ఎకరంలో 1200 వరకు అరటి చెట్లుంటాయి. వీటి నుంచి కనీసం 150 కిలోల నాణ్యమైన అరటి నారను తీయవచ్చు. సాధారణమైన అరటి నారను హేండ్ మేడ్ పేపర్ తయారీదారులు కిలో రూ. 200కు కొనుగోలు చేస్తున్నారు. నారను చక్కగా దువ్వి, పొట్టు లేకుండా ప్రాసెస్ చేసి అమ్మితే కిలోకు రూ. 300 నుంచి 400 వరకు ధర లభిస్తుంది. దేశంలో ఏటా వంద కోట్ల అరటి బొందలను నార తీయకుండానే వృథాగా పారేస్తున్నారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల అరటి బొందలను చెత్తకుప్పలో వృథాగా పడేస్తున్నట్లు అంచనా. ఏడాది పొడవునా అరటి దిగుబడి వస్తుంటుంది కాబట్టి అన్ని కాలాల్లోనూ అరటి నార ఉత్పత్తికి అవకాశం ఉంది. అరటి నార ఎగుమతిలో ఫిలిప్పీన్స్ ముందంజలో ఉంది. జపాన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు, అమెరికా తదితర దేశాల్లో అరటి నారను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి, అరటి నార ఎగుమతులకు అవకాశాలు చాలా ఉన్నాయి. - ఎల్. శ్రీనివాసరావు, బ్యూరో చీఫ్, రాజమండ్రి ఫొటోలు: గంధం వెంకట రమణ డొప్పలు తీసిన రోజే నార తీయాలి బలంగా, దృఢంగా ఉన్న చెట్టు నుంచి నాణ్యమైన నార వస్తుంది. తక్కువ రసాయనిక ఎరువులతో లేదా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగైన అరటి చెట్ల నార బలంగా ఉంటుంది. ఏ రకం అరటి బొందల నుంచైనా 150 గ్రాముల చొప్పున నార తీయవచ్చు. కూర అరటి, అమృతపాణి చెట్ల నుంచి 200 గ్రాముల వరకు వస్తుంది. అరటి తోటలున్న రైతులు బృందాలుగా ఏర్పడి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. అరటి డొప్పలు తీసిన రోజునే నార తీసి నీడపట్టున ఆరబెట్టాలి. ఆలస్యమైతే నార రంగు మారి నాణ్యత తగ్గుతుంది. - డాక్టర్ రూపాకుల సుధాకర్ (98661 06885), అరటి నార తీసే యంత్రం రూపకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూ.గో. జిల్లా -
ప్రేమను కొలిచే సాధనం!
నయా మాల్ ‘‘నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది?’’ అని ప్రేయసి అడిగితే- ‘‘చెప్పలేనంత’’ అనే మాటను ఇక ముందు ప్రియుడు ఉపయోగించనక్కర్లేదు. తనకు ఎంత ప్రేమ ఉందో...లెక్క వేసి మరీ చెప్పవచ్చు. దీని కోసం ‘లవ్ మెజరింగ్’ యంత్రం దగ్గర ఉంటే చాలు! ఆష్లే క్లార్క్ అనే అమెరికన్, స్లోవేకియాకు చెందిన మాటెజ్ వకుళ ఆర్టిస్ట్లు. ప్రేమికులు. ఆ తరువాత దంపతులు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఈ ఇద్దరు కలిసి ‘ప్రేమ కొలత’ యంత్రాన్ని తయారుచేశారు. ఈ లవ్ మెషిన్ మనిషిలో ఉండే ఎలక్ట్రిసిటీ ఆధారంగా పని చేస్తుంది. హార్ట్ట్బీట్ను అంచనా వేయడం ద్వారా ప్రేమ శక్తిని కొలిచి మరీ చెబుతుంది. వీసా సమస్య ఎదురై ఈ దంపతులిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు స్కైప్లో గంటల తరబడి సంభాషించుకునేవారు. ఈ క్రమంలోనే వారికి ‘ప్రేమయంత్రం’ అలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే ఆలస్యం...రకరకాల శాస్త్రీయ, మానసిక విశ్లేషణ పుస్తకాలు చదివి ఎన్నో రోజులు ప్రయోగాలు చేసిన తరువాత ‘లవ్ మెషిన్’ను తయారుచేశారు. తమకు పరిచితమైన జంటలపై ఈ మెషిన్ను ఉపయోగించిన తరువాత... సత్ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లవ్ మెషిన్ అనేది ఒకటి వచ్చిందని, దాని సహాయంతో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చుననే విషయం తెలిసిన తరువాత...మామూలుగానైతే ప్రేమజంటలు మటేజ్-క్లార్క్ల ఇంటి ముందు క్యూ కట్టాలి. చిత్రమేమిటంటే ఒక్క ప్రేమ జంట కూడా వారి దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. ‘‘మీరు తయారుచేసిన యంత్రం మీద వారికి నమ్మకం లేదా?’’ అని అడిగితే ‘‘యంత్రం మీద కాదు... వారి ప్రేమ మీద’’ అని బిగ్గరగా నవ్వుతాడు మటెజ్. ‘‘లవ్ మెషిన్ వచ్చింది అని తెలిసి చాలామంది ప్రేమికులు ఇప్పుడు భయపడుతున్నారు’’ అని మటెజ్ నవ్వుకు తన నవ్వులను జత కలిపారు క్లార్క్. -
రాత మారుస్తున్న గీతలు
కోటగుమ్మం (రాజమండ్రి) :దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించాలనే లక్ష్యంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంలో తలెత్తిన సమస్యల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ మెషీన్ ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిష్ ఆధారంగా పింఛను పంపిణీ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా, అర్బన్ పరిధిలో ఐసీఐసీఐ బ్యాంక్ అనుసంధానంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ చేపడుతున్నారు. పింఛన్లు ఇచ్చేముందు బయోమెట్రిక్ మెషీన్లోని వేలిముద్రలతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరిపోతేనే పింఛను అందిస్తారు. లేకుంటే వారికి పింఛను నిలిచిపోయినట్టే. వేలిముద్రలు సరిపోలక వెనుదిరుగుతూ.. వేలిముద్రలు సరిపోలక జిల్లాలో 11 వేల మందికి పింఛన్లు అందడం లేదు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోయి ఉండడం, బయోమెట్రిక్ మెషీన్లో సరి పోలక (మేచింగ్) పింఛన్లు నిలిపివేస్తున్నారు. ప్రతి నెలా పోస్టాఫీసు, బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన సెంటర్లకు వెళ్లిన వృద్ధులకు మెషీన్ వేలిముద్రలు స్వీకరించకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి నెలకు వచ్చే రూ. 200 పింఛను కోసం రూ.50 ఆటోలకు ఖర్చుచేసి వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ మెషీన్లో లోపాల వల్ల తాము పింఛను కోల్పోవాల్సి వస్తోందని వృద్ధులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్పప్పపై ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ టూ షట్లర్లు క్రిస్టినా పెడెర్సన్, కెమిల్లా రైటర్ ప్రశంసల వర్షం కురింపించారు. ఆటలో జ్వాల 'బ్రెయిన్' అయితే అశ్విని 'మెషిన్' అని అభివర్ణించారు. 'ఆటను అర్థం చేసుకోవడంలో జ్వాల మేటి. అశ్వినితో కలసి ఆమె కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించింది. జ్వాల ఆటతీరును వెంటనే అర్థం చేసుకుంటుంది. అశ్విని ఓ యంత్రంలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అందువల్లే డబుల్స్లో వీరు ఉత్తమ జోడీ కాగలిగారు' కెమిల్లా చెప్పింది. హైదరాబాద్లో 2009లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కెమిల్లా థామస్ లేబోర్న్తో కలసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్లో కెమిల్లా, క్రిస్టినా నెంబర్ వన్ సీడ్గా బరిలోకి దిగుతున్నారు. జ్వాల, అశ్విని జోడీ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, అయితే ఆటలో ఎత్తుపల్లాలు సాధారణమేనని కెమిల్లా చెప్పింది.