medigadda
-
కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
రివైజ్డ్ డిజైన్లు ఇవ్వకనే బరాజ్కు నష్టం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ను తొలిసారి 2019లో నీళ్లతో నింపారని, అదే ఏడాది బరాజ్కు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణరాజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు వెల్లడించారు. బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించి, నీటిపారుదల శాఖకు నివేదించామని వివరించారు. బరాజ్లో లోపాలను సరిదిద్దేందుకు రివైజ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్ను నీటిపారుదల శాఖ అందించలేదని, దీంతో సమస్య పెరిగి 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిపోయిందని పేర్కొన్నారు. ముందే రివైజ్డ్ డిజైన్లు ఇచ్చి ఉంటే బరాజ్ను రక్షించుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్లతో మాకు సంబంధం ఉండదు.. ‘‘మేడిగడ్డ, ఇతర బరాజ్లలో 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబోరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్)తో మళ్లీ మోడల్ స్టడీస్ నిర్వహించాలని క్షేత్రస్థాయిలోని ఈఈ పైఅధికారులకు లేఖ రాశారు. 2020 జూన్లో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు బరాజ్లను పరిశీలించారు. బరాజ్ రక్షణ కోసం ఎనర్జీ డిస్సిపేషన్ పనుల డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ.. సీడీఓ సీఈను ఆదేశించారు.టీఎస్ఈఆర్ఎల్ నిర్వహించిన 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగా.. బరాజ్ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లు చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో కోరారు. రిటైర్డ్ ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో బరాజ్లను సందర్శించి షూటింగ్ వెలాసిటీని తగ్గించాలని సూచించింది. కానీ రివైజ్డ్ డిజైన్లు అందించకపోవడంతో బరాజ్ కుంగింది’’అని కమిషన్కు ఎంవీ రామకృష్ణరాజు వివరించారు. పీస్ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదని పేర్కొన్నారు.విజిలెన్స్ విభాగం బరాజ్ నుంచి 90 కాంక్రీట్ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే.. ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపాలపై కమిషన్కు అఫిడవిట్ దాఖలు చేసిన ‘ఎల్ అండ్ టీ’మాజీ ఉన్నతాధికారి అమర్పాల్ సింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణరాజు నిరాకరించారు.మరో ఇద్దరు ప్రతినిధుల క్రాస్ ఎగ్జామినేషన్లో.. ⇒ బరాజ్ గేట్ల నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో నీటి పారుదల శాఖ (సీడీఓ) డిజైన్లను రూపొందించగా.. వాస్తవ వేగం సెకనుకు 16 మీటర్లుగా ఉందని, డిజైన్లలో లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తేలిందని ‘ఎల్ అండ్ టీ’హైడల్ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్.సురేశ్కుమార్ కమిషన్కు వివరించారు.⇒ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రామరాజు బరాజ్ను సందర్శించి 2022 వర్షాకాలానికి ముందే షూటింగ్ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లు చేయాలని, లేకుంటే బరాజ్ దెబ్బతింటుందని హెచ్చరించారని కమిషన్కు ‘ఎల్ అండ్ టీ’డీజీఎం రజనీష్ పి.చౌహాన్ తెలిపారు. 7వ బ్లాక్కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా పునర్నిర్మించక తప్పదని పేర్కొన్నట్టు తెలిసింది. -
‘మేడిగడ్డ’పై ఇక నివేదికలు అక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల కింద ఏర్పడిన బుంగలను తమ సిఫార్సులకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ గ్రౌటింగ్ ద్వారా పూడ్చేయడంతో భూగర్భంలోని స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపు ణుల కమిటీ వెల్లడించింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా బరాజ్ల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవ కారణాలను తెలుసుకోలేమని తేల్చిచెప్పింది. అందువల్ల గతంలో తాము మధ్యంతర నివేదికలో నిర్దేశించిన వివిధ పరీక్షలు, అధ్యయనాల జాబితా నుంచి 5 రకాల అధ్యయన నివేదికలను ఇక సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.తాము సూచించిన అధ్యయనాలను సకాలంలో చేపట్టి నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తోందని తప్పుబట్టింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి/ఎన్డీఎస్ఏ డైరెక్టర్ గత నెల 29న ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు తన అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ తాత్సారం వల్ల బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తాము తుది నివేదిక సమర్పించేందుకు మరింత ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై మిగిలిన నివేదికలైనా సకాలంలో సమర్పించేలా తెలంగాణ నీటిపారుదల శాఖపై ఒత్తిడి తేవాలని ఎన్డీఎస్ఏ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అయ్యర్ ఈ నెల 2న నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సత్వరమే కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు. డిసెంబర్ 31లోగా తుది నివేదిక అనుమానమేగత వానాకాలానికి ముందు బరాజ్లకు నిర్వహించాల్సిన తాత్కాలిక మరమ్మతులతోపాటు వాటిలోని లోపాలను గుర్తించడానికి చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్దేశిస్తూ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏప్రిల్ 30న మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పించింది. బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అధ్యయనాలు అత్యవసరమని అప్పట్లో తెలిపింది. అయితే వానాకాలంలోగా నీటిపారుదల శాఖ ఆయా అధ్యయనాలను చేపట్టి నివేదించకపోవడంతో నిపుణుల కమిటీ తుది సిఫార్సుల గడువును అక్టోబర్ 31 నుంచి ఎన్డీఎస్ఏ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తుది నివేదిక సమర్పించే అంశంపై నిపుణుల కమిటీ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసింది. -
మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కమిషన్ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్ చంద్రఘోష్ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్ ముందు చెప్పారు.కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం. -
వాటిల్లో నీటి నిల్వ ప్రమాదకరం
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లో ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేయడం ప్రమాదకర మని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ మూడు బరా జ్ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం జరిగినందున నీటిని ఏమాత్రం నిలువచేసినా బరాజ్ల మనుగడకే ముప్పని వెల్లడించింది. ప్రస్తుతం దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్లో వినియోగించిన సాంకేతికతనే మిగతా బరాజ్ల్లో నూ వినియోగించినందున ప్రమాదాలకు ఆ స్కారం ఉందని వివరించింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీలు అనిల్, నాగేందర్రావు, సుధాకర్ రె డ్డిలు శుక్రవారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశమయ్యా రు. బరాజ్లకు సంబంధించి ఎన్డీఎస్ఏ సమర్పించాల్సిన తుది నివేదికలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించండి: మంత్రి ఉత్తమ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటి ఎత్తిపోసే అవకాశం లేనందున, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ మినహా ఇతర బరాజ్ల నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరుకు నీటి ఎత్తిపోతలపై ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని కోరారు. దీనిపై ఎన్డీఎస్ఏ అధికారులు స్పందిస్తూ.. మిగతా బరాజ్ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ సాంకేతికతనే వినియోగించినందున ప్రమాదాలకు అవకా శం ఉందని, దిగువన ఉన్న సమ్మక్క సారక్క బరాజ్ సహా భద్రాచలం ఆలయం వరకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసినట్టు తెలిసింది.దీనిపై అన్ని అంశాలను విశ్లేíÙంచి డిసెంబర్ లోగా తుది నివేదికను సమరి్పస్తామని, అప్పటిలోగా ఎలాంటి నీటి నిల్వ చేయొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో తుది నివేదిక సత్వరమే వచ్చేలా చూడాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బరాజ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసిందని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి భేష్: ఎన్డీఎస్ఏ తాత్కాలికంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద చిన్న తరహా నిర్మాణాన్ని చేసుకుని రాష్ట్ర రబీ, తాగునీటి అవసరాలకు అక్కడి నుంచి నీటిని తరలించుకునే అవకాశాలు సూచించాలని మంత్రి ఉత్తమ్తో పాటు రాష్ట్ర అధికారులు కోరినట్టు తెలిసింది. లక్ష కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎన్డీఎస్ఏ స్పందిస్తూ.. గతంలో బరాజ్ నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కారణంగానే బరాజ్లను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, తాము తుది అభిప్రాయం వెల్లడించే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయంలో మంత్రి, ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందించినట్లు సమాచారం. -
ఆగస్టు 2 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, వరంగల్/గోదావరిఖని: గోదావరి నిండుగా పారుతున్నా కన్నెపల్లి (మేడిగడ్డ (లక్ష్మీ)) పంపుహౌస్ నుంచి నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం (క్రిమినల్ నెగ్లిజెన్సీ) ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశం గర్వించే విధంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ను బద్నామ్ చేయాలనే రాజకీయ దురుద్దేశంతో రైతులకు నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.ఆగస్టు 2 వరకు కాళేశ్వరం బరాజ్ల్లో నీరు నింపాలని, లేదంటే 50 వేల మంది రైతులతో తరలివచ్చి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం బరాజ్ల సందర్శనకు బయలుదేరి గురువారం రాత్రి గోదావరిఖని ఎనీ్టపీసీ జ్యోతిభవన్లో బస చేసిన కేటీఆర్..శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్లను, పంపుహౌస్లను సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదు.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. డిసెంబర్–జనవరిలలోనే నీరివ్వాలని ప్రభుత్వానికి సూచించినా భేషజాలకు వెళ్లి యాసంగి పంటలను ఎండబెట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, సింగూరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా కేవలం రాజకీయ దురుద్దేశంతో వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. వానాకాలంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితిని కలి్పస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 70–80 టీఎంసీలు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా.. ‘తెలంగాణలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 70–80 టీఎంసీల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలేరు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, ఆదిలాబాద్, హుజూరాబాద్, హుస్నాబాద్, గజ్వేల్, భువనగిరి.. ఇలా తెలంగాణలోని మెట్ట ప్రాంతాల కు సాగునీరు అందించే అవకాశం ఉంది.ఇందుకోసం రోజు కు రెండు, మూడు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను గోదావరి నీటితో నింపొచ్చు. పైన ఉన్న సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్లలోనూ నీళ్లు లేవు, వీటికీ కాళేశ్వరమే ఆధారం. మరో ప్రత్యామ్నా యం లేదు. ఇవన్నీ తెలిసినా రాజకీయం కోసం రైతులు, ప్ర జలను వంచిస్తున్నారు..’అని మాజీమంత్రి ధ్వజమెత్తారు.ఎన్డీఎస్ఏ రిపోర్టు ఓ ఫార్స్‘నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఓ ఫార్సు. ఆ నివేదికను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఐదేళ్లు గడు స్తున్నా ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. కాళేశ్వరంపై మాత్రం కనీసం ప్రాజెక్టును పరిశీలించకుండా ఒక్కరోజులోనే నివేదిక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒకే విధంగా ఉంది. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పంప్హౌస్లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు చెప్పారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయి.దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉదయం గోదావరిఖని నుంచి చెన్నూరు మీదు గా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లిన కేటీఆర్ దారిలో గోదావరి బ్రిడ్జి వద్ద కొద్దిసేపు ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ వరద లేకపోవడంతో..ప్రస్తుత ప్రభుత్వ తీరుతో గోదావరి నదిలో చిల్లర నాణేలు సమరి్పంచేందుకు నీరు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వ ర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, గోరటి వెంకన్న, వాణిదేవి, ఎలగందుల రమణ, బాల్క సుమన్, దివాకర్రావు, చిన్నయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, ముఠా గోపాల్, కోవ లక్ష్మీ, విజయుడు ఉన్నారు. -
అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ సహా మిగతా రెండు బరాజ్ల గేట్లను పూర్తిగా ఎత్తి పెట్టాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తేలి్చచెప్పింది. ప్రస్తుతం బరాజ్ల్లోకి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని సూచించింది. సోమవారం మరోమారు ఇంజనీర్ల స్థాయిలో చర్చించి, తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో సమావేశమయ్యారు.మంత్రితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల మరమ్మతులు, నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సహా ఇతర బరాజ్ల్లో మరమ్మతులు, పునరుద్ధరణలో భాగంగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేపట్టిన పనుల వివరాలను ఇంజనీర్లకు వివరించారు.సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎమ్మార్ఎస్కు సంబంధించిన నివేదికలు పూర్తి స్థాయిలో అందనందున బరాజ్ల్లో నీటి నిల్వలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేమని, ఈ దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడమే ఉత్తమమని ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు: ఉత్తమ్ కాళేశ్వరం బరాజ్ల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళతామని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ‘బరాజ్లో నీటి నిల్వలు, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించాం. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనులను, పరీక్షలను వివరించాం. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పాం. దీనిపై వారు ఇప్పటికైతే అన్ని గేట్లు ఎత్తిపెట్టి నీళ్లు కిందకి వదిలేయండని చెప్పారు. దానికి అనుగుణంగానే అన్ని గేట్లు ఎత్తినీటిని వదిలేస్తాం.దీనిపై కేబినెట్లోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం’అని వివరించారు. మేడిగడ్డలో మాత్రం ఒక గేటు పనిచేయడం లేదని, దానిని పూర్తిగా కట్ చేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డతో పాటు అన్నారంలో సీపేజీలను, సుందిళ్లలో కొన్ని లోపాలను కేంద్ర సంస్థ గుర్తించిందని, ప్రజా జీవితాలకు సంబంధించిన విషయమైనందున నిపుణుల సూచన మేరకే ముందుకెళ్తామన్నారు. ఎల్లంపల్లి ఎగువన నీటిని వినియోగించుకొని, ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. కుంగిందెప్పుడు..ఆర్కిటెక్ట్ ఎవరు..? ఈ సందర్భంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘కేవలం కమిషన్ల కోసం తుమ్మడిహెట్టి డిజైన్ను మేడిగడ్డకు మార్చారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని రూ.1.50లక్షల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తప్పుడు లెక్కలు చెప్పారు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చని అంచనా వేస్తే, ఇప్పుడు కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీలకే ఏటా రూ.15వేల కోట్లవుతున్నాయి. ఇంతా చేసి ఏడాది 13 టీఎంసీల చొప్పున ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారు. దీనికి కర్త, ఆర్కిటెక్ట్, బిల్డర్ అన్నీ కేసీఆర్ అన్ని గొప్పలు చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగితే మాత్రం ఒక్క మాట మాట్లాడలే. ప్రాజెక్టు నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. అబధా్ధలు చెప్పడానికైనా కేటీఆర్కు హద్దుండాలి’అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. మా హయాంలోనే తుమ్మిడిహెట్టి పూర్తి.. ఇక తమ హయాంలోనే తుమ్మిడిహెట్టి బరాజ్ని పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్ర స్తుత వరద దృష్ట్యా ఏ ప్రాజెక్టులోనూ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజె క్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, 90 శాతం ఆయకట్టు ఏపీలో ఉందని, ఐదు అడుగుల మేర వరద రావడంతో అక్కడ కొన్ని ఇక్కట్లు ఎదురయ్యాయని ఉత్తమ్ వెల్లడించారు. -
శరవేగంగా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ
-
త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. వానాకాలం ప్రారంభానికి ముందే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. తాను, సీఎం రేవంత్రెడ్డి కలసి నాలుగైదు రోజుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శనకు వచ్చి పునరుద్ధరణ పనులను పరిశీలిస్తామని చెప్పారు.గురువారం సచివాలయంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు, మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైరెక్టర్ దేశాయ్లతో ఉత్తమ్ సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో నంబర్ బ్లాకులోని గేట్లను పైకి ఎత్తే ప్రక్రియను ప్రారంభించామని మంత్రికి ఎల్అండ్టీ సంస్థ డైరెక్టర్ వివరించారు. బ్యారేజీకి గ్రౌంటింగ్ పూర్తి చేయడంతోపాటు ఏడో బ్లాకు పునాదుల కింద షీట్పైల్స్ వేస్తామని తెలిపారు.తర్వాత ఏడో నంబర్ బ్లాకులో పగుళ్లు వచ్చిన 19, 20, 21 నంబర్ పియర్ల మధ్య ఉన్న గేట్లను సైతం ఎత్తుతామని వెల్లడించారు. షీట్పైల్స్ను తయారు చేయించి ఇప్పటికే బ్యారేజీ వద్దకు తెప్పించామన్నారు. ఇక సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎగువ, దిగువ భాగంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయని.. చెల్లాచెదురైన సీసీ బ్లాకులను పూర్వస్థితికి చేర్చే పనులు జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. బ్యారేజీల్లో బోర్లు వేసి పరీక్షలు.. జేఎస్ ఎడ్లబడ్కార్ (జియో టెక్నికల్ పరీక్షల నిపుణురాలు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్ పాలీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నిపుణుడు)తో కూడిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణుల బృందం గురువారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్కుమార్, నాగేంద్రరావులతో సమావేశమైంది. బ్యారేజీల పరిశీలనలో తమ దృష్టికి వచి్చన అంశాలు, వాటికి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ చేసిన ప్రతిపాదనలపై తమ సంస్థ డైరెక్టర్కు త్వరలో నివేదిక సమరి్పస్తామని ఈ బృందం తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు నిర్వహించనున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల కోసం బ్యారేజీల లోపల బోర్లను వేయాలని సూచించింది. బోరు రంధ్రాల నుంచి అధునాతన పరికరాల ద్వారా శబ్దాలు పంపించడం ద్వారా.. బ్యారేజీల కింద భూగర్భంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. టెస్టుల్లో భాగంగా బోర్లు వేయడం, ఇతర పనులను నీటిపారుదల శాఖే నిర్వహించాలని.. తమ నిపుణులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. రేపు ఎన్జీఆర్ఐ బృందం పరిశీలన హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల బృందం శనివారం మూడు బ్యారేజీలను పరిశీలించనుంది. సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐతోపా టు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్)తో బ్యారేజీలకు పరీక్షలు జరపాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. -
కాళేశ్వరం పరిశీలించిన శాస్త్రవేత్తలు
-
త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా, ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతుతపై రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు.బ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలా? ఇతర ప్రత్యా మ్నాయాలు ఏమైనా ఉన్నాయా? బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నిర్ణ యాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో కాళే శ్వరం బ్యారేజీలు, వాటికి సంబంధించిన పంప్ హౌస్లను పరిశీలి స్తామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మ ల నాగేశ్వ రరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నిపుణుల కమిటీ సిఫారసులు వివరించిన ఉత్తమ్గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పలుమార్లు బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను, తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫారసు చేసింది. ఈ అంశాలన్నిటినీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. సీఎం, ఇతర మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలు ప్రమాద సంకేతాలు వెలువరించాయని, ఇప్పుడు మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉండదనే అంశాన్ని తోసిపుచ్చలేమని నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్టుగా మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. -
‘కాళేశ్వరా’నికి హాలిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కమిటీలో కీలక విభాగాల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (గేట్స్)/ఎన్డీఎస్ఎఏ డైరెక్టర్ (విపత్తులు) రాహుల్ కుమార్సింగ్లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్ పైల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్ఏ జారీ చేసిన విధివిధానాలు.. ► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. ► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి. ► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. ► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) ► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి. -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8.30కు తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది. అన్నారం బ్యా రేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ప్రజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియా కు వివరిస్తారు. బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటిరంగ నిపుణులు కూడా మేడిగడ్డను సంద ర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి.ప్రకాశ్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్టీ స్తారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులో లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన ద్వారా వాస్తవాలను వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. ఓ వైపు దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్ఎస్ చెప్తోంది. మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా, సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని చెప్తోంది. తొలిసారి కేటీఆర్ రాక.. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్రావు ప దుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్ బ్యారేజీ వద్దకు రానున్నారు. -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్లపై శ్రీరామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్పూల్తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
రాష్ట్రానికి చెదలు పట్టించింది మీరే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని కాదని, అది తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ కలసి తెలంగాణకు చెదలు పట్టించారని, వారు ఎంత ద్రోహం చేశారో ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలోనే పురుగులా పుట్టిందని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని విమ ర్శించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు అవాంఛనీయమని, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఐదుగురు సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఖజానాను కొల్లగొట్టడానికే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో హరీశ్రావు మాట్లాడుతున్న సమయంలో.. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1,850 ఎకరాల పట్టా భూమి మునుగుతుందని, గ్రామాలేవీ ముంపునకు గురికావని తేల్చారు. అదే 150 మీటర్ల ఎత్తుతోనే కడితే 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని గుర్తించారు. ప్రాణహిత–చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు నాటి మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి ఏపీ సీఎం చర్చించారు. 2012లో స్టాండింగ్, కో–ఆర్డినేషన్ కమిటీలు వేశారు. మేడిగడ్డ నిరుపయోగమని చెప్పినా.. తెలంగాణ వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీశ్రావు.. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరామ్ నేతృత్వంలో ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ 14 పేజీలతో నివేదిక ఇచ్చింది. అప్పటికే శంకుస్థాపన కూడా చేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కాకపోతే 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించాలని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు అవాంఛనీయమని తేల్చి చెప్పింది. అయినా మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టడం సరికాదంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచి్చన నివేదిక ఆధారంగా 2015 సెపె్టంబర్లో ‘సాక్షి’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సభలో క్షమాపణలు చెప్పాలి కేసీఆర్, హరీశ్ కలసి ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టారు. రూ.38వేలకోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్రావుకు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశి్నస్తారా? ప్రాజెక్టులు ఫక్కున పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? హరీశ్రావును నేను నిలదీస్తున్నా.. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు వద్దు. ప్రాణహిత–చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. నాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇప్పుడు మౌనంగా హరీశ్రావు గారిని సమరి్ధస్తున్నారా? జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు.. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో నాటి మంత్రులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పులు ఒప్పుకోవాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సభను సజావుగా నడిపించడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. రేవంత్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాగునీటి రంగంపై శాసన సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం ఈ మేర కు ప్రకటన చేశారు. కేంద్రమంత్రి, మంత్రి, సీఎంగా వివిధ హోదాల్లో 40 ఏళ్లు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారని తెలిపారు. -
మేడిగడ్డ పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి
-
కేసీఆర్ కోసం హెలికాప్టర్ సిద్ధం
-
అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి: శ్రీధర్ బాబు
-
Congress vs BRS: ఇరిగేషన్ వార్ తారాస్థాయికి..
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి కేసీఆర్ సభ మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నల్లగొండలో ఉద్రిక్తత! కేసీఆర్ సభకు కౌంటర్గా.. నల్లగొండ క్లాక్ టవర్లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మేడిగడ్డకు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ వ్యూహం అదేనా..?
-
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు.. బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్ను అధికారులు ల్యాబ్కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. ఇదీ చదవండి: Vote for Crore : ఓటుకు కోట్లు కేసులో సుప్రీం నోటీసులు -
మేడిగడ్డ చూద్దాం రండి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు ఈనెల 13వ తేదీన అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. మేడిగడ్డ మేడిపండు ఎలా అయిందో అందరూ చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా రావాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఆ కుర్చిని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. మేడిగడ్డపై విచారణ జరుగుతోందని, కొన్ని నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టే వీలుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కాకుండానే విపక్షం పిల్లి శాపనార్థాలు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు నిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజా ప్రయోజనం కోసం విపక్షం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యమ సమయంలోనే టీజీగా రాసుకున్నారు ‘తెలంగాణ రాష్ట్రానికి సూచికగా టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష. ఉద్యమ సమయంలో యువత రక్తంతో దీన్ని రాసుకుంది. తర్వాత టీజీని కేంద్రం నోటిఫై చేసినా బీఆర్ఎస్ విస్మరించింది. బీఆర్ఎస్ సర్కార్ దానిని టీఎస్గా మార్చడం వారి అహంకారానికి ప్రతీక. అయితే దీన్ని మేము టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాచరికపు ఆనవాళ్ళను స్ఫురింపజేసేలా బీఆర్ఎస్ సర్కార్ అధికార చిహ్నం రూపొందిస్తే, మేం దాన్ని ప్రజాస్వామ్య చిహ్నంగా మార్చాం. అలాగే దళిత బిడ్డ రాసిన తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ’కన్పించకుండా కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది. కానీ మా సర్కార్ దాన్ని రాష్రీ్టయ గీతంగా ఆమోదించింది..’అని సీఎం చెప్పారు. ప్రజాపాలనపై సత్యదూరమైన ఆరోపణలు ‘ప్రజాపాలనపై విపక్షం సత్యదూరమైన ఆరోపణలు చేస్తోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పినదాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 12 శాఖలకు చెందిన 21 మంది అధికారులను అందుబాటులో ఉంచాం. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో అవకతవకల వల్లే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మేము మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన వాళ్ళం కాదు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చాం. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ప్రగతి భవన్ కంచెలు తొలగించాం. కాళోజీ కవిత్వం గురించి చెప్పే బీఆర్ఎస్ నేతల పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి కాలేదు..’అని రేవంత్ ప్రశ్నించారు. ఇక మొదటి తేదీనే జీతాలు ‘మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం దివాలా తీసిందనడం ఏమిటి? పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపోతుందా? ఉద్యోగులు, పెన్షనర్లకు 25వ తేదీ దాకా జీతాలు ఇవ్వలేని చరిత్ర వాళ్ళది. మేము 4వ తేదీలోగానే జీతాలు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మొదటి తేదీనే ఇస్తాం. రైతు బంధు వేయడం లేదంటూ విపక్షం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 2018–19లో యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలలు, 19–20లో 9 నెలలు, 20–21లో 4 నెలలు, 22–23లో 4 నెలలు తీసుకున్నారు. ఇలాంటి వాళ్లు మమ్మల్ని విమర్శించడం ఏమిటి? పెన్షన్లు 80 శాతం చెల్లించాం. మిగిలినవి 15వ తేదీలోగా చెల్లిస్తాం..’అని రేవంత్ తెలిపారు. ఆటోరాముళ్ళ హైడ్రామా ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతోందంటూ వాళ్ళను రెచ్చగొట్టడం రాజకీయమే. జూనియర్ ఆరి్టస్టుల తరహాలో ఆటోరాముళ్ళు ఆటోలెక్కి అసెంబ్లీకి రావడం, ఆటోలో కూడా కెమెరా పెట్టడం ఓ హైడ్రామా. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే 15.21 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. రూ.535.52 కోట్లు ఆరీ్టసికి ఇచ్చాం. మహిళలు ఈ సదుపాయం వినియోగించుకుని గుళ్ళకు వెళ్ళడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం నవంబర్లో రూ.49.28 కోట్లు ఉంటే, డిసెంబర్లో రూ.93.24 కోట్లకు పెరిగింది. జనవరిలో కూడా రూ.68.69 కోట్ల ఆదాయం వచ్చింది..’అని సీఎం వివరించారు. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచుతాం ‘ఉద్యోగాల కల్పన మా విధానం. మేం వచ్చిన రెండు నెలల్లోనే 6,956 స్టాఫ్ నర్సుల నియామకం, సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలోనే 15 వేల పోలీసు నియామకాలు చేపడతాం. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచి నియామకాలు చేపడతాం. పాలక మండలి రాజీనామా చేయకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిందో చెప్పాలి. మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్ సీఎం పేషీలో మైనారీ్టలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. కేసీఆర్ పాలనలో వాళ్ళ కుటుంబ సభ్యులకే కారుణ్య నియామకాలు దక్కాయి. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం చేపడతాం. ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, తాను పుట్టిన ఊరును రెవెన్యూ గ్రామం చేయాలన్న ఆయన చివరి కోరికను కూడా పట్టించుకోలేదు. మేము దాన్ని నెరవేర్చాం. ఆదివాసీల పోరాట యోధుడు కొమరం భీంను కూడా విస్మరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారసులను ఆదుకుంది. ఇంద్రవెల్లి అమర వీరులను కూడా ఆదుకున్నాం. కవి గూడ అంజన్న చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించ లేదు. ప్రగతి భవన్ వద్ద గద్దర్ మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారు. మేము ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తుండేలా ఆయన పేరుతో పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది ఎవరు..’అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై వాగ్వాదం కృష్ణా జలాలపై కేంద్రానికి అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ చేసిన విమర్శ సభలో వాగ్వాదానికి దారి తీసింది. కృష్ణా బోర్డు వద్ద సంతకాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్రావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులపై అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపిందంటూ బోర్డ్ మినిట్స్ను ఆయన ప్రస్తావించారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి బదులిస్తూ తాము దాన్ని వ్యతిరేకించామని, అధికారులు కేంద్రానికి లేఖ కూడా ఇచ్చినట్టు తెలిపారు. బోర్డు నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించి బడ్జెట్లో నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే నిధులు ఇస్తామని చెప్పామని, అది జరగలేదు కాబట్టే నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్రావు బదులిచ్చారు. ఆ తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది. -
శివ బాలకృష్ణ అరెస్ట్ తో HMDA అధికారుల్లో టెన్షన్
-
మేడిగడ్డ దగ్గర టెన్షన్ వాతావరణం
-
కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా? -
పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
-
‘బాహుబలి’ సెంచరీ
రామడుగు/బోయినపల్లి(చొప్పదండి)/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏడాదిలో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్లోని బాహుబలి మోటార్లు బుధవారం రికార్డు సృష్టించాయి. ఇక్కడ లిఫ్ట్ చేసిన నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిధిలోని శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన గాయత్రి పంప్హౌస్లో ఏడు మోటార్లు బిగించారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం వీటి ప్రత్యేకత. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుంచి మిడ్మానేరుకు పంపింగ్ చేస్తున్నారు. బుధవారం నాటికి 100 టీఎంసీల నీరు గాయత్రి పంప్హౌస్ నుంచి మిడ్మానేరుకు ఎత్తిపోసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. గాయత్రి నుంచి విడుదలైన నీటిని శ్రీరాజారాజేశ్వర (మిడ్మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. మిడ్మానేరు ప్రాజెక్టులోకి రెండేళ్లుగా ఎస్సారెస్పీ నుంచి, రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాలువ మీదుగా సుమారు 125 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులోకి చేరిన నీటిలోంచి సుమారు 25 టీఎంసీల నీటిని మిడ్మానేరు ప్రాజెక్టులో నిల్వ చేసుకుని మిగతా 100 టీఎంసీల నీరు దిగువన ఉన్న ఎల్ఎండీ ప్రాజెక్టులోకి, కుడి కాలువ ద్వారా అనంతగరి ప్రాజెక్టుకు సరఫరా చేసినట్లు ఎస్ఈ శ్రీకాంత్రావు తెలిపారు. మరోపక్క కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 17 నుంచి బుధవారం వరకు 21.5 టీఎంసీల నీటిని ఆరు మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. చదవండి: సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు! -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్మానేరు డ్యామ్కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్హౌస్లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్డ్యామ్ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్డ్యామ్లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్డ్యామ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్డ్యామ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్డ్యామ్లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్డ్యామ్లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది. -
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి నాసిక్లోని త్రయంబకేశ్వరుడిని స్పృశిస్తూ తెలంగాణలో బాసర జ్ఞానసరస్వతికి ప్రణమిల్లుతూ గలగలపారుతూ భద్రాద్రిలో శ్రీరామచంద్రుడి పాదాలను తాకుతూ ప్రవహించే గోదావరి ఇప్పుడు దిశ మార్చుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత సంగమ ప్రదేశంలో గోదావరి ప్రవాహ దిక్కు మారింది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి నీరు పల్లమెరుగన్న మాటకు కాలం చెల్లిందని నిరూపించింది ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. గోదావరి దిశ మార్చిన మేఘా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి జలాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలనే సదాశయంతో రూపొందించిన పథకం ఇది. ప్రత్యక్షంగా కొంత ప్రాంతాన్ని, పరోక్షంగా కొంత ప్రాంతాన్ని మొత్తంగా తెలంగాణ అంతటికి నీరందించే ప్రాజెక్టు ఇది. భారీ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేస్తూ సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గోదావరి దిశ మార్చుతూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమిక పోషించింది. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ ఉపయోగించని భారీస్థాయి పంపులు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌజుల్లో ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్కు కొత్త భాష్యం చెప్పింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్రమట్టానికి 300 మీటర్ల ఎగువకు నీరు ఎదురు ప్రవహించేలా చేసిన అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది. మూడేళ్లలో పూర్తి ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ-నీవా, అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్మ్యాన్మేడ్ రివర్ వంటి వాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులుగా గుర్తింపు ఉంది. కాని వాటి పంపింగ్తో పోలిస్తే కాళేశ్వరం తక్కువ సమయంలో వాటికన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోసింది. ప్రపంచ నీటిపారుదల రంగంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అనితర సాధ్యమైన కృషి ఉంది. సాంకేతికంగా, విద్యుత్పరంగా ఎన్నో సంక్లిష్టతలు ఉన్నా అకుంఠిత దీక్షతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మేఘా వాస్తవానికి ఇంత భారీస్థాయి ప్రాజెక్టులు పూర్తికావడానికి దశాబ్దాలు పడుతుంది. నాగార్జున సాగర్, శ్రీరామ్, శ్రీశైలం, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 20 ఏళ్లకు పైగా పట్టింది. అయినా ఇవి ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదని అందరూ అంగీకరిస్తారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్లో క్లిష్టమైన పనులు ఎన్నో ఉన్నప్పటికీ మూడేళ్లలో దాన్ని పూర్తికావడం అరుదైన విషయం. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధారణ సాగునీటి ప్రాజెక్టుల్లాగా సులభంగా ఉండదు. అందులోనూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూగర్భంలో పంప్హౌస్లు, సొరంగాలు ఉన్నాయి. సాంకేతిక పనులు, ఇంజినీరింగ్ రంగంలో ముఫ్పై ఏళ్ల అనుభవం, నైపుణ్యాన్ని రంగరించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో అన్ని సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మేఘా ఇంజినీరింగ్. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగల సామర్ధ్యం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెకుకు ఉంది. నీటిని ఎత్తిపోసేందుకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపులు సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి. నాలుగు పంపు హౌసులు ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పంపు హౌజుల్లో అతి క్లిష్టమైనది లక్ష్మీపూర్ గాయత్రి. భూమికి 470 అడుగుల లోతున నిర్మించిన ఈ పంప్ హౌజ్ అన్ని రిజర్వాయర్లలో ఏడాది అంతా నీరు నిల్వ ఉండేలా చూస్తుంది. జంట సొరంగాలతో కూడిన ఈ పంపు హౌసులో నిర్మించిన భారీ సర్జ్ పూల్స్ ప్రపంచంలోనే అతి పెద్దవి. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 మోటర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటర్లు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేసిన భారీ మోటర్లు ఇవి. ఒక్కో మోటర్ పంపు బరువు 2376 మెట్రిక్ టన్నులు ఉంటుంది. సాధారణంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంప్ హౌసులను నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా భూమికి సమానంగా నది ఒడ్డున నిర్మిస్తారు. కాని భూమి లోపల నిర్మించిన గాయత్రి పంప్ హౌస్ మాత్రం ఎంతో విశిష్టమైన నిర్మాణం. దీని కోసం 21.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. కిలోల్లో చెప్పాలంటే ఇది కోట్లలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, సలహాలు సూచనలు, ప్రోత్సాహంతో ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయగలిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మేడిగడ్డ నుంచి సిరిసిల్ల వరకు ఇసుకమేటలుగా కనిపించే ప్రదేశమంతా ఇప్పుడు సస్యశ్యామలం కాబోతోంది. గోదావరి దశ-దిశను మార్చయడంలో ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా అద్భుతమైన పాత్ర పోషించింది. -
మరో ఘట్టం ఆవిష్కృతం
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహాఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణహిత జలాలను ఎల్లంపల్లి వద్ద గోదావరిలో కలపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమైంది. 20 రోజుల క్రితం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా రివర్స్ పంపింగ్తో మొదలైన కాళేశ్వరం జలాలు.. 120 కిలోమీటర్లు ఎదురెక్కి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంప్హౌస్ డెలివరీ సిస్టం వరకు చేరాయి. దీంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతను ప్రారంభించారు. ఈ నీరు కిలోమీటరు పైపులైన్ ద్వారా.. మరో కిలోమీటరు దూరం గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఘట్టం పూర్తవుతుంది. ఎల్లంపల్లి నుంచి ఈ నెల 5వ తేదీన నీటిని ఎత్తిపోసేందుకు ముహూర్తం ఖరారైంది. 3 బ్యారేజీలు, 3 పంపుహౌస్లు దాటిన కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి చేరుతుండటంతో ఇంజనీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదుల్లో ప్రవాహాలు పెరుగుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని మేడిగడ్డ ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే మేడిగడ్డ పంప్హౌజ్ పరిధిలో మూడు మోటార్లకు ట్రయల్రన్ పూర్తవగా, రెండు పంపులను నిరంతరాయంగా నడుపుతున్నారు. మూడు రోజులుగా వెట్రన్లు పూర్తి చేస్తుకున్న 1వ, 6వ మోటార్ల ద్వారా పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్లో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా 1.5 టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీలో కలిసినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అలాగే మూడు మోటార్లు నడిస్తే మరింత నీరు అన్నారం బ్యారేజీలో నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్మానేరుకు తరలించనున్నారు. మూడో నంబర్ మోటార్కు రాత్రి వరకు వెట్రన్ నిర్వహించి ఎత్తిపోయనున్నారు. తెలంగాణలో ఆశించినమేర వర్షాలు లేనప్పటికీ మహారాష్ట్రలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. గడ్చిరోలి జిల్లా మాలేగావ్ నుంచి భారీగా వరద ప్రాణహిత నదిగుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. ఆదివారం కాళేశ్వరం, కన్నెపల్లి ప్రాంతాల్లో 96 వేల క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల వరద కిందికి పోతోంది. సోమవారం తెల్లవారుజాము వరకు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. దీంతో 4,600 క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. ఆదివారం అర్ధరాత్రినుంచి లేక సోమవారం నుంచి మూడు మోటార్లను నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వారంలో 6 మోటార్లను నడుపుతూ ఒక టీఎంసీకి పైగా నీటిని.. ప్రతిరోజూ, వరద కొనసాగే అన్ని దినాలు నడిపేలా రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్లుగా.. గోదావరిలో జూన్లో ఎక్కడా నీటి ప్రవాహాలు లేకున్నా ప్రస్తుతం క్రమంగా అవి పుంజుకుంటున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో ప్రవాహాలు పుంజుకున్నాయి. రెండ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం 8వేల క్యూసెక్కులుండగా, అది శనివారం 14వేల క్యూసెక్కులకు పెరిగింది. అది మరింత పుంజుకొని ఆదివారం మధ్యాహ్నానికి 26వేల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా.. ఆదివారం సాయంత్రం వరకు 52 గేట్లను కిందికి దించినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగితా గేట్లను సైతం మరో రెండు రోజుల్లో దించి ఉంచనున్నారు. దీంతో వరద ప్రవాహం నిలిచి నీటి నిల్వ పెరుగుతుంది. ఆ నీటిని కన్నెపల్లి వద్ద మోటార్లతో ఎత్తిపోయనున్నారు. మేడిగడ్డ పంప్హౌస్ (కన్నెపల్లి) వద్ద ప్రస్తుతం నీటి మట్టం 96.6 మీటర్లలో ఉంది. మోటార్లు నడిపేంత నీటి మట్టాలు ఉండటంతో ఇక్కడ రెండు మోటార్లను ప్రారంభించారు. మేడిగడ్డ పంపుహౌస్లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 9 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇందులో రెండు మోటార్ల ద్వారా ప్రస్తుతం 4,600 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా అన్నారం బ్యారేజీకి వదులుతున్నారు. మరో మోటార్ను ఆరంభించే అవకాశం ఉంది. ఈ మూడు పంపులు ఒకేమారు నడిస్తే సుమారు అర టీఎంసీ మేర నీరు అన్నారంలోకి చేరుతుంది. సీసీటీవీలతో సీఎం సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ల్లో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ప్రతిగంటకూ వీక్షిస్తున్నట్లు ఇంజనీర్లు వెల్లడించారు. వరద ఉధృతి, ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు గోదావరి గుండా పోయింది? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద గల అండల్ టన్నెల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం నుంచి సూచించినట్లు తెలిసింది. ఆరు మోటార్ల ద్వారా.. ఇక గోదావరిలో ప్రవాహాలు మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ఈ వారంలోనే మరో మోటార్కు ట్రయల్రన్ నిర్వహించి నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అక్కడే ఉండి ట్రయల్రన్ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆరు రోజులుగా పంపుహౌస్ వద్దే మకాం వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ 6 మోటార్ల ద్వారా 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటి మట్టం 100 మీటర్లకు పైన చేరితే.. జులై చివరి నుంచి అన్ని మోటార్లను నడిపించనున్నారు. పంపుహౌస్లో 11 మోటార్లకు గానూ 6 మోటార్లు డెలివరీ సిస్టంలో ఎత్తిపోసే వరకు ఇక్కడే ఉంటానని ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇక గ్రావిటీ కెనాల్ నుంచి నీరంతా అన్నారం బ్యారేజీకి చేరడంతో అక్కడ నీటి మట్టం పెరుగుతోంది. 11 టీఎంసీల సామర్థ్యమున్న అన్నారం బ్యారేజీలో 4.50 టీఎంసీల మేర నిల్వలు చేరితే అన్నారం పంప్హౌజ్లోని మోటార్లను నడపించే వీలుంది. అన్నారం పంపుహౌస్లో 8 మోటార్లకుగాను 7 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరొకటి పురోగతిలో ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఇక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి ఎత్తిపోతలు ఆరంభమయ్యే వకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లుగా వరద కొనసాగి మోటార్లన్నీ నడిస్తే వచ్చే నెల 15 నాటికి ఎల్లంపల్లి నింపే అవకాశం ఉంది. ఆగస్టు చివరికి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ
కాళేశ్వరం: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కీలక ఘట్టం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపుహౌస్లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమి తల్లిని పులకరింపజేసింది. బీడువారిన తెంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేఘా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేడిగడ్డ పంప్ హౌస్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్ నీటిని డెలివరీ సిస్ట్రన్ ద్వారా గురుత్వాకర్షణ కాలువలోకి (13.5 కిలోమీటర్స్) నీటిని విడుదల చేస్తుంది. అంతకుముందు పంప్ నుంచి (ప్రెషర్ మెయిన్) 1.53 కిలోమీటర్ల డెలివరీ మెయిన్ ద్వారా ప్రయాణించి కాలువలోకి చేరిన నీరు అన్నారం బ్యారేజ్లోకి చేరుతుంది. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది. మేడిగడ్డ పంప్హౌస్లో ఒక్కొక్క యూనిట్ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోయానేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్ కేంద్రం పనిచేస్తుంటుంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రోమెకానికల్ పనులతో పాటు సివిల్ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల ఘనపు మీటర్లతోనూ, పంప్హౌస్ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు. ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ఎంఈఐఎల్కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్ మెయిన్కు 10.56, డెలివరీ సిస్టర్న్కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది. గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇప్పటికే లింక్-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ఎంఇఐఎల్ పంపింగ్ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ఎంఈఐఎల్ నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలమ్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ఎంఈఐఎల్ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీతా.. ఇంతపెద్ద పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఎంఈఐఎల్ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్ మ్యాన్మేడ్ వండర్ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కేవలం ఏడాదిన్నర సమయంలోపే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. భారీ విద్యుత్ వ్యవస్థ: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్ అవసరం. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. -
భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం
ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్హౌజ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగుమం చేసింది. ముఖ్యంగా లింక్-1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్- 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది. ప్రపంచంలోనే తొలిసారి.. కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్లను (ప్రతి మెషీన్లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్లను, ప్యాకేజీ-8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేసింది. మొదటిదశలో 63 మెషీన్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంఈఐఎల్ పనులు ప్రారంభించగా రెండేళ్ల కాలంలో 33 మెషీన్లను పంపింగ్కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ-8, ప్యాకేజీ-14లోని పంపుహౌజ్లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్లోని గ్రేట్ మేన్మేడ్ రివర్కు పేరు పొందగా, వీటి పంపు సామర్థ్యం హార్స్పవర్లోనే ఉంది. వీటి నిర్మాణానికి మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, 40 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. కానీ కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను వినియోగిస్తున్నారు. తొలిదశలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సిద్ధం చేసింది. ప్యాకేజీ-8లో ఆవిష్కృతం.. అద్భుతమైన పంపింగ్ స్టేషన్ను భూ ఉపరితలానికి 330 మీటర్ల లోతున మేఘా నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ పంపుల యూనిట్లను ఇక్కడ సిద్ధం చేసింది. ప్రతి పంపు మోటారు బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉందంటే ప్రతి యూనిట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పంప్ హౌజ్లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం చేసింది. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి చొప్పున నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తుల్లో నిర్మించారు. ఈ పంపుమోటార్లను భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా అత్యంత శ్రద్ధతో వీటి నిర్మాణాలు చేశారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద బీహెచ్ఈఎల్, మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ-8 వద్దకు తీసుకొచ్చాక వాటిని బిగించే 60 శాతం పనిని ఎంఈఐఎల్ తన ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. ఇది మా అదృష్టం: బి.శ్రీనివాస్రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ ‘ఈ ఎత్తిపోతల పథకంలో భాగస్వాములం కావడం మా అదృష్టం. ఈ ఇంజనీరింగ్ అద్భుతంలో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్గ్రౌండ్ పంప్హౌజ్ను, మేడిగడ్డ పంప్హౌజ్లో 6 మెషీన్లను 10 నెలల సమయంలో పూర్తిచేయడం ప్రపంచ రికార్డు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలుస్తుంది’ -
‘మేడిగడ్డ’ పనుల్లో వేగం పెంచాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి (మేడిగడ్డ) పంపుహౌస్ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు, ఏజెన్సీ సంస్థలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు కోరారు. బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో నిర్మిస్తున్న మేడిగడ్డ పంపుహౌస్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మెగా క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరన మొదటి పంపు డ్రైరన్ (మోటార్ల పనితీరు పరిశీలన), సెప్టెంబర్ 5న వెట్ రన్, రెండో పంపు సెప్టెంబర్ 10న డ్రైరన్, 15న వెట్ రన్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పంపు హౌస్లో అమర్చనున్న శక్తివంతమైన మోటార్లకు అవసరమున్న సబ్స్టేషన్ నిర్మాణం ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈప్రకాష్, సూర్యప్రకాష్, మెగా సంస్థ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఉన్నారు. -
కదులుతున్న కాళేశ్వరం
► యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీలు, పంప్హౌస్ల నిర్మాణం ► భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. ► రాత్రిపూటా పనులు ► బ్యారేజీలు, పంప్హౌస్ల పనులు సమాంతరంగా.. చకచకా.. ► వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించడమే లక్ష్యం ► వచ్చే మేలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం: అధికారులు కాళేశ్వరం బ్యారేజీ ప్రాంతం నుంచి సోమన్నగారి రాజశేఖరరెడ్డి ఎక్కడ చూసినా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కంకర కుప్పలు.. భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. రాత్రి పూట ఫ్లడ్లైట్ల వెలుగుల్లోనూ పనులు.. 360 డిగ్రీల కోణంలో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..! గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతానికి దిగువన కాళేశ్వరం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల దృశ్యమిదీ!! బ్యారేజీలు, పంప్హౌస్ల మధ్య పోటీ పెట్టారా అన్నట్టుగా నిర్మాణ పనులు మహాయజ్ఞంలా సాగుతున్నాయి. రోజుకు ఒక్కో బ్యారేజీ వద్ద 15 వేల టన్నుల సిమెంట్ వినియోగిస్తూ కాంక్రీట్ పనులు చేస్తున్నారు. వర్షాలు కురిసినా, గోదావరి నుంచి నీరొచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి, డీ వాటరింగ్ పద్ధతిన నీటిని తొలగించే పనులు చకచకా జరుగుతున్నాయి. ఆరునూరైనా వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీల గోదావరి నీటిని ఎల్లంపల్లికి తరలించాలన్న సంకల్పంతో ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మూడు ప్రధాన జలాశయాలు.. మేడిగడ్డ నుంచి 180 టీఎంసీల నీటిని మళ్లించి 18.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నీటి నిల్వల కోసం కొత్తగా 147.71 టీఎంసీల సామర్థ్యం గల 20 జలాశయాలను నిర్మించనుండగా, అందులో ప్రధానమైనవి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల. ఈ మూడింటినీ కలిపి సుమారు 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తంగా రూ.13,811 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇందులో పంప్హౌజ్ల నిర్మాణాలకు రూ.7,998 కోట్లు, బ్యారేజీల నిర్మాణాలకు రూ.5,813 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం మూడు బ్యారేజీలు, పంప్హౌస్ల పనులన్నింటినీ ఒకేమారు ఆరంభించి చేపట్టారు. కీలకం.. మేడిగడ్డ పంప్హౌజ్ 16.17 టీఎంసీల సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 1,650 టీఎంసీల నీటి లభ్యత ఉండనుండగా.. గోదావరి ఏకంగా 1.3 కి.మీ. వెడల్పుతో ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నదిపై 1.63 కి.మీ. పొడవులో బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. ఈ బ్యారేజీ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దు. ఆ రాష్ట్రంలో 170 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఆ రాష్ట్ర సహకారంతో రెండు వైపులా బ్యారేజీ పనులు మొదలు పెట్టారు. మనవైపు (తెలంగాణ) ప్రాంతంలోని పనులు వేగంగా జరుగుతున్నాయి. పనిని మొత్తంగా 8 బ్లాక్లుగా విభజించి 6 బ్లాక్ల పనులు మొదలు పెట్టారు. ఏడో బ్లాక్లో పనులు చేసుకునేందుకు వీలుగా.. గోదావరి సహజ ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా కాపర్ డ్యామ్లు పూర్తి చేశారు. వీటితోపాటే గోదావరి బెడ్లెవల్లో రాఫ్ట్ పనులు పూర్తయ్యాయి. 16 ఎక్స్కవేటర్లు, 55 టిప్పర్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. మొత్తంగా రూ.65 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బ్యారేజీ పనులను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 22 కిలోమీటర్ల దిగువన పంప్హౌస్ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 11 పంపులను ఏర్పాటు చేయనుండగా మరో 6 పంప్లను భవిష్యత్ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ 64 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పని జరగాల్సి ఉండగా 45 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 45 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకున్నా.. పంప్హౌస్ పనులు పూర్తయితే 92 మీటర్ల లెవల్ నుంచి ప్రవహించే గోదావరి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ్నుంచి వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 100 టీఎంసీలు అయినా పంపింగ్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డిప్యూటీ ఇంజనీర్ సూర్యప్రకాశ్ తెలిపారు. పనుల్లో ముందు.. అన్నారం మేడిగడ్డ పంప్హౌస్ నుంచి 13.2 కి.మీ. దూరంలో 11 టీఎంసీల కెపాసిటీతో అన్నారం బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. 1.2 కి.మీ. పొడవుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ పూర్తవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 6 బ్లాక్లుగా పనులు చేపట్టగా 4 బ్లాక్ల్లో పని మొదలైంది. ఇక్కడ రోజుకు 1,600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నారు. రాఫ్ట్ పనులకు అత్యంత అధునాతన వాహనాలు వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి మంది మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా రూ.152 కోట్ల పనులు పూర్తయ్యాయి. జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యారేజీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో 12 పంపులతో పంప్హౌస్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 6 బ్లాక్లుగా పని విభజన చేయగా.. అన్నింటా పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పటికే రూ.200 కోట్ల పనులు పూర్తి చేసినట్లు డీఈ మధు తెలిపారు. 425 ఎకరాలకుగానూ మరో 67 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, పంప్హౌస్ను జూన్ నాటికే సిద్ధం చేస్తామని వివరించారు. సుందిళ్ల ఓకే.. మిగతా బ్యారేజీలు, పంప్హౌస్లతో పోలిస్తే సుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యమైనా వేగంగానే జరుగుతున్నాయి. భూసేకరణకు ఆటంకాలు లేకపోవడంతో బ్యారేజీ పనుల్లో వేగం కనిపిస్తున్నా.. పంప్హౌజ్ పనులు కాస్త నెమ్మదించాయి. అన్నారం పంప్హౌస్కు 3 కిలోమీటర్ల ఎగువన 3.11 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన బ్యారేజీ పనులను 6 బ్లాక్లుగా విభజించగా.. మూడు బ్లాకుల్లో పని మొదలైంది. రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే జూలై నాటికి మొత్తం 68 రేడియల్ గేట్లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. బ్యారేజీ వరకు రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. దీనికి 15 కి.మీ. దూరంలో పంప్హౌస్ నిర్మాణం చేయనుండగా.. 12 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ 51 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పనులు పూర్తవగా.. కాంక్రీట్ పనులు ఈ వారంలో ఆరంభించేలా చర్యలు తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్కు 100 నుంచి 120 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలిస్తామని, మే నెలలో ప్రాజెక్టు ట్రయల్ రన్, జూన్లో వెట్ రన్ నిర్వహిస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘మేడిగడ్డ’ పేరుతో ముంచుతున్న ప్రభుత్వం
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి ఆ తర్వాతే సర్వే చేపట్టాలి కాంగ్రెస్, టీడీపీ నాయకుల డిమాండ్ కన్నేపల్లి గ్రామస్తులతో కలిసి ధర్నా కాళేశ్వరం : మేడిగడ్డ బ్యారేజీ పేరుతో ప్రభుత్వం రైతుల కడుపు కొడుతోందని జిల్లా పరిషత్ ఫ్లోర్లీడర్ చల్లా నారాయణరెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో భాగంగా కన్నెపల్లిలో చేపట్టే పంప్హౌస్ నిర్మాణం కింద భూములు కోల్పోతున్న రైతులతో కలిసి కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా మహదేవపూర్ మడంలం కాళేశ్వరం బస్టాండ్ వద్ద ఆదివారం ధర్నా, రాస్తారోకో చేశారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గ్రామస్తులకు న్యాపరమైన పరిమారం అందించాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.32వేల కోట్లు మంజూరయ్యాయని, అందులో పదిశాతం కమీషన్ కోసమే అధికార పార్టీ నాయకులు నిర్వాసితులకు అనుకూలంగా మాట్లాడడంలేదని ఆరోపించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గుడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కన్నేపల్లి పంప్హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలన్నారు. పూర్తి పరిహారం చెల్లించాకే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాటారం సీఐ సదన్కుమార్, ఎస్పై ఉదయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, సర్పంచులు కోట రాజబాబుగౌడ్, లోకుల పోసక్క, టీడీపీ నాయకులు పోటు సుశీల, నాగుల బాపురెడ్డి, చల్లా రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా బతుకులు ఆగం చేయెుద్దు
గోడు వెల్లబోసుకున్న మేడిగట్ట రైతులు గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే పుట్ట మధు ఆదుకుంటామని భరోసా మంథని : ‘అయ్యా.. తెలంగాణకు నీళ్లిచ్చే మేడిగడ్డ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. మావి అత్యంత విలువైన నల్ల రేగడి భూములు. ఒక రైతు సగటున ఎకరాకు కోటి రూపాయలు సంపాదించుకుంటడు. ఇంత విలువైన భూములను కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మా బతుకులను ఆగం చేయొద్దు. మమ్మల్ని బజారున పడేయకండి’ అని మేడిగడ్ట రైతులు ఎమ్మెల్యే పుట్ట మధు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మంథని గ్రామపంచాయతీ కార్యాలయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరించారు. ఆధారం కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం, చదువుకున్న యువకులకు ఉపాధి, భూములు కోల్పోతున్న వారికి ఉపాధి కల్పించాలని విన్నవించారు. న్యాయం చేస్తారనే నమ్మకంతోనే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడిగడ్డ గ్రామస్తులు తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే గొప్ప వ్యక్తులని వారిని కచ్చితంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. భూములు కోల్పోయే రైతులకు పరిహారంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి ఆదుకుంటామని తెలిపారు. సమావేశంలో అంబట్పల్లి సర్పంచ్ మాధవరావు, మహదేవపూర్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాసరావు, ఆకుల కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ రైతులను భయపెట్టొద్దు మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న మంథని డివిజన్లోని మహదేవపూర్,కాటారం, కమాన్పూర్ మండలాల్లోని రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. మండలంలోని బొమ్మాపూర్, సూరారం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టడాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు. ఈ నిర్మాణంతో వేల ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిపారు. దళితులకు పంచేందుకు మహదేవపూర్ మండలం అంటబ్పల్లి గ్రామంలో ప్రభుత్వమే ఎకరానికి రూ.5.15 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేసిందని తెలిపారు. అదే గ్రామంలో ముంపునకు గురయ్యే అసైన్డ్ భూమికి మాత్రం కేవలం రూ.3 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువ రైతులను సర్వే అధికారులు, పోలీసులు భయపెడుతున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు నీటిని తరలించడానికే సీఎం కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ, సూరారం, కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల, దామెరకుంట, తదితర గ్రామాల రైతులు తమ విలువైన పంట భూములను కోల్పోనున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతామని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్న సూరారం మహిళా రైతు చల్లా స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్బాబు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గోమాస శ్రీనివాస్, విలాస్రావు, గుడాల కృష్ణమూర్తి, కామిడి శ్రీనివాసరెడ్డి, షకీల్, రాణీబాయి, వరప్రసాద్, ప్రభాకర్రెడ్డి, రవిచందర్, గోగుల మధు, కృష్ణమోహన్ ఉన్నారు. -
భూములిచ్చి అడుక్కతినమంటారా..!
కన్నేపల్లిలో పంప్హౌస్ సర్వేను అడ్డుకున్న రైతులు కాళేశ్వరం: .మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామంలో మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన ప్రధానపంప్హౌస్ నిర్మాణం కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే చేయగా.. రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు స్వల్వ వాగ్వాదం నెలకొంది. ప్రాజెక్టులకు తమ భూములిచ్చి అడుక్కతినమంటారా.. అంటూ అధికారులను నిలదీశారు సర్వేనంబర్ 74లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతుల నుంచి 48ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ కింద తీసుకున్నారన్నారు. మళ్లీ అదే సర్వే నంబర్లో పంప్హౌస్ నిర్మాణం కోసం 76ఎకరాల భూమిని మంగళ, బుధవారాల్లో సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో వారు వెనుదిరిగివెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ మనోహర్ కరీంనగర్ నుంచి కన్నేపల్లికి చేరుకున్నారు. భూనిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు 48ఎకరాల్లో వివరాలు తప్పుల తడకగా సర్వే చేశారని, రీసర్వే చేయాలని రైతులు పట్టుబట్టారు. ఆయన స్పందించి అధికారులతో రీ సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని రైతులు కోరారు. అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.3లక్షల2వేలు అందిస్తామని మనోహర్ చెప్పగా.. రైతులు ససేమీరా అంటూ వెనుదిరిగారు. తహసీల్దార్ జయంత్, ఇరిగేషన్ అధికారులు ఓంకార్సింగ్, ప్రకాశ్, వెంకటరమణ, రిటైర్డ్ తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ కృష్ణ, సర్వేయర్ వసియోద్దీన్, మెగా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్, ఉపసర్పంచి మల్లారెడ్డి, మాజీ సర్పంచి చిన్న మల్లారెడ్డి ఉన్నారు. -
మేడిగడ్డ పంపుహౌజ్కు భూములివ్వం
అధికారుల వైఖరిపై రైతుల ఆగ్రహం రసాభాసగా సమీక్ష సమావేశం పనుల అడ్డగింత రామగుండం : మేడిగడ్డ పంప్హౌజ్ నిర్మాణానికి భూములివ్వబోమని రామగుండం మండలం గోలివాడ రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. మంగళవారం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన రెండో దశ సమావేశం రసాభాసగా మారింది. సర్పంచ్ దబ్బెట రమ్య, ఎంపీటీసీ ధర్ని హైమావతి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ బి.విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, ఏఈ మురళికృష్ణ, ఆర్ఐ ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్న సమావేశంలో.. పంప్హౌస్లో భూములు కోల్పోతున్న రైతులు, భూముల్లోని ఇతర ఆస్తుల వివరాలు సర్వే నెంబర్ల ఆధారంగా తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశంలో వెల్లడించారు. సర్వేపై రైతుల అభ్యంతరం, సమావేశం బహిష్కరణ సర్వే అంతా తప్పుల తడకగా ఉందని పలువురు రైతులు ఆరోపించారు. తన భూమిలో ఉన్న బోర్వెల్ వివరాలు జాబితాలో రాలేదని ఒకరు, విస్తీర్ణాన్ని తగ్గించి చూపారని మరోరైతు ఆరోపించారు. స్పందించిన ఆర్డీవో సర్వేయర్తో మాట్లాడించారు. సాంకేతిక సమస్యలతో కొన్ని సర్వేనెంబర్లలో దొర్లిన తప్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ నివేదికలు రూపొందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి వ్యవసాయభూమిని కోల్పోయానని, పంపుహౌజ్లో ఇప్పుడు గుంట భూమికూడా మిగలకుండా కోల్పోతున్నానంటూ ఓ రైతు సహనం కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ అసభ్యకరంగా మాట్లాడొద్దని, నష్టం వివరాలను తమదృష్టికి తెస్తే న్యాయం చేస్తామని అన్నారు. శృతిమించి మాట్లాడితే సుంకరులతో గెంటేయించాల్సి వస్తుందని హెచ్చరించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం తహసీల్దార్ రైతులను చిన్నచూపు చూస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించారు. పంపుహౌజ్ ప్రదేశంలో కొనసాగుతున్న సైటాఫీస్ పనులను అడ్డుకున్నారు. పంపుహౌజ్ కోసం గోదావరి ఒడ్డున సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి మరో సర్వే చేపడుతున్నారని, భూసేకరణ, నిర్మించాల్సిన ప్రదేశాలపై అధికారులు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సమావేశంలో రైతులు కోరారు. స్పందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సుందిళ్ళలో నిర్మించే బ్యారేజితో సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని, గ్రామ రక్షణ కోసం రెండువైపులా కరకట్ట నిర్మాణానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం వాయిదాకే కొందరు రైతుల ప్రయత్నం – అశోక్కుమార్, పెద్దపల్లి ఆర్డీవో సమావేశాన్ని వాయిదా వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ధరపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం. అసభ్యకరమైన వ్యాఖ్యలతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తాం. 2013 చట్టం ప్రకారం, లేదా జీవో 123 ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. -
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంతో ఐదు జిల్లాలకు లబ్ధి
ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ కాటారం(మల్హర్): మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా మంథని ప్రాంతమే కాకుండా తెలంగాణలోని ఐదు జిల్లాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మల్హర్ మండలం కొయ్యూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఈప్రాంతం సస్యశ్యామలంగా మారనుందని అన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.ప్రతిపక్షాలు ప్రాజెక్టు నిర్మాణంపై రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మిషన్ భగీరత ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న దఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. -
'కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఎవరూ ఆపలేరు'
కాళేశ్వరం : ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఏ ప్రాజెక్టు పూర్తి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఎవరూ ఆపలేరని, ప్రాజెక్ట్లో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఒక్కోచోట ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం కేసీఆర్ కన్నెపల్లి వద్ద పంప్హౌజ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్పీకర్ ముధుసుదనా చారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ
కరీంనగర్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు సోమవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు. నీటి టి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆయన నేడు శ్రీకారం చుట్టారు. ఉదయం 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 12 లక్షల స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంటోంది. 2017 నాటికి మెజార్టీ పనులను పూర్తి చేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు పనులను పూర్తి చేసి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. కాగా ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, ఆయకట్టు లక్ష్యాలు ఇప్పటికే కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. -
కాళేశ్వరానికి తొలి అడుగు
► నేడు మేడిగడ్డ వద్ద భూమి పూజ చేయనున్న సీఎం ► పాజెక్టుతో కొత్తగా 18 లక్షల ఎకరాలకు నీరు.. ► 12 లక్షల ఎకరాల స్థిరీకరణ ► రూ. 69,581.33 కోట్ల వ్యయం ► 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ► 185 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీల నిర్మాణం ► రెండేళ్లలో మల్లన్నసాగర్కు నీరివ్వాలని లక్ష్యం సాక్షి, హైదరాబాద్: నీటి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సోమవారం తొలి అడుగు పడనుంది. ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భూమి పూజ చేయనున్నారు. 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 12 లక్షల స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంటోంది. 2017 నాటికి మెజార్టీ పనులను పూర్తి చేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు పనులను పూర్తి చేసి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. పూర్తి స్థాయి లభ్యత!: ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, ఆయకట్టు లక్ష్యాలు ఇప్పటికే కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రాణహిత పాత డిజైన్లో ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతతో పోలిస్తే మేడిగడ్డ వద్ద లభ్యత ఎక్కువగా ఉన్నందున నిర్ణీత 160 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా.. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుంది. తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే.. మేడిగడ్డ వద్ద సామర్థ్యం 101 మీటర్ల ఎత్తులో 19 టీఎంసీలుగా ఉండనుంది. ఇక్కడ్నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముందని ప్రభుత్వం చెబుతోంది. ప్రాణహిత డీపీఆర్ మేరకు తమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డికి నీటి మళ్లించే క్రమంలో మొత్తంగా 10 రిజర్వాయర్లను 16 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పుడు ఏకంగా 185 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, బ్యారేజీలు ప్రతిపాదించారు. వీటి ద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు మరో 12 లక్షల ఎకరాలను స్థిరీకరించి మొత్తంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండగా.. ప్రాజెక్టుకు రూ.69,581.33 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు ఆయకట్టుకు పారేలా ప్రణాళిక ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గదర్శనం చేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు అన్ని పనులను పూర్తి చేయడం, వీలైనంత నీటిని నిల్వ చేసుకోవడం, తక్షణమే కనీసం 5 లక్షల ఎకరాలకు నీరందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. ప్రాజెక్టు పరిధిలో కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెళ్ల పనులన్నీ ఏకకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ముంపు లెక్కలు కొలిక్కి.. మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ఉండే ముంపు ఎంతో తేలింది. 102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 399 హెక్టార్లు, 101.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రను కోరే అవకాశం ఉంది. ఒకవేళ 102 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్ధ్యం 22 టీఎంసీలు ఉండనుంది. 101 మీటర్లకు పరిమితమైతే 19.73 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఈ వారంలోనే తెలంగాణ, మహారాష్ట్రల మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. అధికారుల స్థాయిలో చర్చలు ముగించి, ఈ నెలలోనే ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పాటైన అంతరాష్ట్ర బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీకి అధికారికంగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ద్వారా జిల్లాల వారీగా ప్రతిపాదిత ఆయకట్టు ఇదీ.. జిల్లా ఆయకట్టు ఆదిలాబాద్ 1,00,000 నిజామాబాద్ 4,54,500 కరీంనగర్ 2,01,449 మెదక్ 7,30,646 వరంగల్ 20,595 నల్లగొండ 2,62,360 రంగారెడ్డి 50,000 మొత్తం 18,19,550 (దీంతోపాటు 11,80,450 ఎకరాలను స్థిరీకరించనున్నారు. ఈ లెక్కన మొత్తం ఆయకట్టు 30 లక్షల ఎకరాలవుతుంది) కాళేశ్వరం రిజర్వాయర్లు, సామర్థ్యాలు ఇలా.. రిజర్వాయర్ సామర్థ్యం(టీఎంసీల్లో) మేడిగడ్డ (101మీటర్లు)19.73 అన్నారం 6.22 సుందిళ్ల 2.16 పత్తిపాక 5.50 మలక్పేట 3 అనంతగిరి 3.50 ఇమామాబాద్ 2.50 మల్లన్నసాగర్ 50 కొండపోచమ్మ 21 బస్వాపూర్ 14.16 గంధమల 9.87 మోతె 2.90 గుజ్జుల 1.50 కాటేవాడి 5 తడమడ్ల 5 తిమ్మక్కపల్లి 3 ఖాచాపూర్ 2.50 ఇసాయిపేట 2.50 మంచిప్ప 5 హైదరాబాద్ నీటిసరఫరా 20 మొత్తం 185.19 కాళేశ్వరం ద్వారా వివిధ కింద స్థిరీకరణ ఇలా (టీఎంసీల్లో) ఎల్లంపల్లి 20 మిడ్మానేరు 25 ఎల్ఎండీ 25 నిజాంసాగర్ 17 సింగూరు 29 ఎస్సారెస్పీ 80 గౌరవెల్లి 9 గండిపల్లి 1.50 మొత్తం 206.50 -
నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు
- తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ వద్దే 500 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ - అందుకే మేడిగడ్డ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందునే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. తమ ప్రాంతంలో ముంపును అంగీకరించలేమని మహారాష్ట్ర తేల్చిచెప్పడం కూడా డిజైన్ మార్పుకు కారణమైందన్నారు. గురువారం ప్రాణహిత డిజైన్ మార్పుపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కలను సీఎం కేసీఆర్ వివరించారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా, కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. సరాసరిన 500 టీఎంసీలు ఎక్కువగా ఉంటుందన్నారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరిన 2,430 టీఎంసీల లభ్యత ఉంటుందన్నారు. ‘తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీలు ఉంటుంది. 101 మీటర్లకు ఒప్పుకుంటే మరో 3 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఉంటుంది. ఇక్కడ రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముంది. ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం కడుతున్నాం. మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో ఎప్పుడైనా కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే మిన్న’ అని అన్నారు. ఇకపై ప్రాణహిత-చేవెళ్ల ఉండదని, దాన్ని కాళేశ్వరంగానే భావించాలని చెప్పారు. తానే వ్యతిరేకించానని మహారాష్ట్ర సీఎం చెప్పారు..: ప్రాజెక్టు ముంపు విషయమై మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరిపానని, అయితే తమ ప్రాంతంలో ముంపునకు ఒప్పుకోబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో, కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా అగ్రిమెంట్లు జరగలేదు. బీజేఎల్పీ నేతగా తమ్మిడిహెట్టితో జరిగే ముంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేశానని, పోలీసులు అరెస్ట్ సైతం చేశారని ఉన్న వార్త, ఫొటోలను చూపారు. బీజేపీలో ఉండగా వ్యతిరేకించినవాణ్ని, సీఎంగా ఎలా అంగీకరిస్తాం అని అన్నారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. అంతకుముందే నిర్మాణం ఏకపక్షంగా, మీకు మీరే ఊహించుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారని, సీడబ్ల్యూసీలో అనేక అభ్యంతరాలు చెప్పారని తెలిపారు. గోదావరిలో 160 టీఎంసీలకు మించి మరో 20 టీఎంసీలు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, తమ్మిడిహెట్టి వద్ద మాత్రం 148 మీటర్ల నిర్మాణం ఉండాలని చెప్పడంతో మేడిగడ్డ ప్రతిపాదన తెచ్చామని తెలిపారు. సామర్థ్యం పెంచితే ధర పెరగదా..?: ప్రాజెక్టు వ్యయ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ‘ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారని అంటున్నారు. ప్రాజెక్టులో 16.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను 200 టీఎంసీల కెపాసిటీకి పెంచాం. సామర్థ్యం పెంచితే ఖర్చు పెరగదా’ అని ప్రశ్నించారు. మేడిగడ్డ-ఎస్సారెస్పీల మధ్య లైవ్ స్టోరేజీ పెంచితే ఇక్కడ చేపల పెంపకం, 200 కి.మీ నౌకాయానానికి అనువుగా ఉంటుందన్నారు.