Mercedes-Benz
-
మెర్సిడెస్ కొత్త మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్లో మరో రెండు టాప్ ఎండ్ మోడళ్లను గురువారం విడుదల చేసింది. వీటిలో ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే, సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎక్స్షోరూంలో ప్రారంభ ధర రూ.1.10 కోట్లు. ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే మోడల్కు 1,991 సీసీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, ఏఎంజీ స్పీడ్íÙఫ్ట్ ఎంసీటీ 9జీ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ మోడల్ 1,999 సీసీ ఇన్లైన్–4 టర్బోచార్జ్డ్ ఇంజన్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో చేరుకుంటుంది. కాగా, 2023–24లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయంగా 18,123 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరి–జూన్లో 9 శాతం వృద్ధితో 9,262 యూనిట్లు రోడ్డెక్కాయి. 2024లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మైబాహ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబరులో భారత్లో అడుగు పెడుతుందని వెల్లడించారు. -
మెర్సిడెస్ బెంజ్ రికార్డు విక్రయాలు..
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి. నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు. -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
లగ్జరీ కార్ల సేల్స్ బీభత్సం.. ఏ వెహికల్ను ఎక్కువగా కొన్నారంటే
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్తో పోలిస్తే 97% ఎక్కువ. సుమారు 47,000 యూనిట్లు.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు. రికార్డులు బ్రేక్ అవుతాయి.. ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు. 2030 నాటికి రెండింతలు.. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు, ధర అక్షరాల రూ. 1,117 కోట్లు
ఓ బ్రిడ్జిని కట్టేందుకు రూ. వెయ్యి కోట్లు కావాలి. పేద్ద లగ్జరీ హోటల్ కట్టాలంటే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి. చిన్న పథకం అమలు చేయాలన్నారూ. వెయ్యి కోట్లయితే కావాలి. అయితే కొన్ని కొన్నిసార్లు కారు కొనాలన్నారూ. వెయ్యి కోట్లుండాలండోయ్. మీరు సరిగానే చదివారు. ఇటీవలి వేలంలో ఓ పాత కాలం బెంజ్ కారు అక్షరాలా రూ. వెయ్యి కోట్లపైనే పలికింది. 1955 నాటి 300 ఎస్ఎల్ఆర్ మర్సిడీజ్ బెంజ్ (ఉహ్లెన్హాట్) కారును మే 5న ఆర్ఎమ్ సదబీజ్ సంస్థ వేలం వేస్తే ఒకాయన రూ. 1,117 కోట్లు పెట్టి కొన్నాడు. తద్వారా ఈ కారును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చేశాడు. గతంలోని రూ.500 కోట్ల రికార్డు (1963 నాటి ఫెరారీ 250 జీటీవో)ను తిరగరాశాడు. జర్మనీలోని స్టట్గాట్లో ఉన్న మర్సిడీజ్ మ్యూజి యంలో ఈ వేలమూ రహస్యంగానే జరిగింది.. కొన్నాయన పేరూ రహస్యంగానే ఉంది. రెండంటే రెండే కార్లు 300 ఎస్ఎల్ఆర్ కార్లను మర్సిడీజ్ బెంజ్ కంపెనీ రెండంటే రెండే తయారు చేసింది. రెండూ కూడా కంపెనీ దగ్గరే ఉన్నాయి. కంపెనీతో ఈ మాస్టర్ పీస్ను వేలం వేయించేందుకు 18 నెలలు పెద్ద లాబీయింగే జరిగిందట. ఎట్టకేలకు కంపెనీ ఒప్పుకోవడం, రహస్యంగా వేలం వేయడం చకచకా జరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కార్లను సేకరించే హాబీ ఉన్న వారు, కారును పెద్ద మొత్తం ధర పెట్టి కొనే వాళ్లలో 10 మందిని ఈ వేలం కోసం ఎంపిక చేశారట. వీరందరినీ ప్రైవేట్ జెట్లో వేలంకు తీసుకెళ్లారట. వేలం కోసం స్టట్గాట్లోని మ్యూజియంను వారం పాటు మూసేశారట. కారును కొనేవాళ్లు కొన్నేళ్ల వరకు దాన్ని అమ్మకుండా, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ కారును ప్రదర్శనకు తీసుకొచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. డబ్బుతో స్కాలర్షిప్లు వేలంలో వచ్చిన డబ్బుతో ప్రపంచవ్యాప్త మర్సిడీజ్ బెంజ్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చెప్పింది. పర్యావరణం, డీకార్బనైజేషన్పై పరిశోధన చేసే యువతకు స్కాలర్షిప్గా ఈ డబ్బును అందిస్తామని తెలిపింది. కంపెనీ దగ్గర ఉన్న రెండో కారును స్టట్గాట్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇంతకీ ఈ కారు పేరులో ఉహ్లెన్హాట్ ఎందుకు ఉందనుకుంటున్నారు? అప్పటి మెర్సెడెస్ టెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్, కారు సృష్టికర్త రుడాల్ఫ్ ఉహ్లెన్హాట్ వీటిల్లో ఓ కారును కంపెనీ కారుగా వాడారు. అందుకే ఈ కార్లను ఉహ్లెన్హాట్ కార్లు అని పిలుస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఈ కారు ప్రత్యేకతలేంటి? ►1955లో రెండంటే రెండే కార్లను తయారు చేశారు. చూడటానికి రేసింగ్ కారులా ఉంటాయి. వీటికి పైకి తెరుచుకునే గల్వింగ్ డోర్లు ఉన్నాయి. బాడీని అల్యూమినియంతో చేశారు. ►మూడు లీటర్ల స్ట్రైట్ 8 సిలిండర్ ఇంజిన్తో నడుస్తాయి. ►అత్యధిక వేగం గంటకు 286 కిలోమీటర్లు. బరువు 1,117 కిలోలు. ►పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.74 మీటర్లు, ఎత్తు 1.21 మీటర్లు. ►300 ఎస్ఎల్ఆర్ బెంజ్.. రెండు ప్రపంచ చాంపియన్షిప్ కార్ రేసులను గెలిచింది. సరాసరి గంటకు 157 కిలోమీటర్ల వేగంతో 1,600 కిలోమీటర్ల దూరాన్ని కారు చేరుకుంది. -
ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే బంపరాఫర్, రూ.7లక్షల భారీ డిస్కౌంట్!
భారతీయులకు శుభవార్త. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్పై బంపరాఫర్ ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మెర్సిడెజ్ బెంజ్ సంపన్నులను టార్గెట్ చేస్తూ 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో ఎక్స్ షోరూమ్ ధర రూ.99.3లక్షలతో మెర్సిడెజ్ బెంజ్ఈక్యూసీని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మ్యానిఫ్యాక్చరింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగడంతో రెండు సార్లు ఆ వెహికల్ ధరల్ని పెంచింది. దీంతో బెంజ్ కారు ధర రూ.1.06కి చేరింది. తాజాగా ఆ కారుపై రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు కారణంగా దేశీయ మార్కెట్లో ఈ కారు తరహా ఫీచర్లతో బీఈవీ ఎస్యూవీ వెహికల్స్ విడుదలయ్యాయి. ఆ వెహికల్స్ దెబ్బతో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ వెహికల్స్ సేల్స్ తగ్గాయి. అందుకే ఆ పోటీ తట్టుకొని సేల్స్ జరిపేలా భారీ డిస్కౌంట్ ఇస్తూ ఈ కీలకం నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంతంటే? 80కేడ్ల్యూహెచ్ బ్యాటరీ, 20.8-19.7కేడబ్ల్యూహెచ్/100కేఎం..402.3బీపీహెచ్ ఉండగా మ్యాక్స్ పవర్ 760ఎన్ఎంతో పీక్ టార్క్ అందిస్తుంది. స్పీడ్ 5.1 సెకండ్స్లో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్లగా టాప్ స్పీడ్ గంటకు 180కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇక ఈ కారును సింగిల్ ఛార్జ్తో 471కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయోచ్చు. అంతేకాదు ఈ కారులో మూడు ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని మెర్సిడెంజ్ బెంజ్ ప్రతినిధులు చెబుతున్నారు అందులో హోమ్ ఛార్జింగ్, ఏసీ వాల్ అవుట్లెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలున్నాయి. 50కేడ్ల్యూహెచ్ టైప్ కార్ ఫుల్ ఛార్జింగ్ 90నిమిషాల్లో ఎక్కుతుంది.హోమ్ ఛార్జింగ్ యూనిట్ 2.4కేడ్ల్యూహెచ్ ఫుల్ చార్జింగ్ పెట్టేందుకు 21 గంటలు పడుతుండగా..7.4కేడ్ల్యూహెచ్ ఏసీ వాల్ ఛార్జర్ సైతం ఫుల్ ఛార్జింగ్ పెట్టేందుకు 21గంటల సమయం పడుతుంది. ఇక లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ కారుపై అపరిమితంగా సర్వీసింగ్తో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్తో 5ఏళ్ల వారంటీని..ఈక్యూసీ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని అందిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. చదవండి: సంచలనం! ఎలన్ మస్క్కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు! -
ఐదేళ్లలో తొలిసారిగా..! మెర్సిడెజ్ బెంజ్ స్థానం ఆ కంపెనీ కైవసం..!
2021గాను ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్కు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదిలో వాహనాల విక్రయాల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెజ్ బెంజ్కు ఉన్న క్రేజ్ను 2021గాను బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. గత ఏడాదిగాను లగ్జరీ కార్ల కేటాగిరీలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్గా బీఎండబ్ల్యూ నిలిచింది. తగ్గిన అమ్మకాలు..! ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడైన ప్రీమియం లగ్జరీ కార్లలో బెంజ్ మొదటిస్థానాన్ని కోల్పోయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలను మెర్సిడెజ్ బెంజ్ విక్రయించినట్లు తెలుస్తోంది. అదే ఏడాదిగాను సుమారు రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ వాహనాల అమ్మకాలను బీఎండబ్ల్యూ జరిపింది. ప్రీమియం కార్లలో మెర్సిడెజ్-బెంజ్ స్థానాన్ని బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. మరోవైపు అనూహ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో మెర్సిడెజ్ బెంజ్ 90 శాతం మేర అధికంగా అమ్మకాలను జరపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బెంజ్ సుమారు 99,301 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. యూరప్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మెర్సిడెజ్ బెంజ్ ఈ ఏడాదిగాను అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఇది దాదాపు 11.2 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో విక్రయాల్లో అతి తక్కువ వృద్ధిని మెర్సిడెస్-బెంజ్ సాధించింది. 2021గాను అమెరికాలో 0.4 శాతం పెరుగుదలను నమోదుచేసింది. బీఎండబ్ల్యూ అమ్మకాల్లో భారత్లో భేష్..! 2021 భారత్లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. చదవండి: రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 235 కి.మీ..! -
ప్రపంచంలోని తొలి ఆటోమొబైల్ కంపెనీగా రికార్డు సృష్టించిన మెర్సిడెస్ బెంజ్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్కు ఆమోదం పొందిన కంపెనీగా మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి ఆటోమోటివ్ కంపెనీగా బెంజ్ అవతరించింది. లెవెల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సాంకేతికత ప్రమాణాలను సెట్ చేసే ఐక్యరాజ్యసమితి నియంత్రణ సంస్థ UN-R157 ఆమోదం తెలిపింది. 2022 ప్రథమార్థంలో మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, ఈక్యూఎస్ మోడల్స్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ను ‘డ్రైవ్ పైలట్’గా పేరుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థతో వాహనదారులు ఆటోమేటెడ్ మోడ్లో 60 kmph వేగంతో డ్రైవ్ చేయగలరు. సురక్షితమైన ఆటోనామస్ డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకుగాను అదనపు సెన్సార్లను డ్రైవ్ పైలట్లో మెర్సిడెస్ బెంజ్ అమర్చింది. వీటిలో లైడర్, వెనుక విండోలో కెమెరా, అత్యవసర వాహనాల నుంచి బ్లూ లైట్లు, ఇతర ప్రత్యేక సిగ్నల్లను గుర్తించడానికి రూపొందించబడిన మైక్రోఫోన్స్ను ఏర్పాటుచేశారు. అసాధారణమైన పరిస్థితులో ట్రాఫిక్ను గుర్తించడానికి డిజిటల్ హెచ్డీ మ్యాప్ను కూడా అందుబాటులో ఉంచారు. జర్మనీలో డ్రైవ్ పైలట్ రెడీ..! ఇప్పటికే జర్మనీలో 13,191 కి.మీ హైవేలపై డ్రైవ్ పైలట్ను అందిస్తున్నట్లు బెంజ్ పేర్కొంది. యూఎస్ఏ , చైనా వంటి దేశాలలో డ్రైవ్ పైలట్ సిస్టమ్ విస్తృతమైన టెస్ట్ డ్రైవ్లను కూడా నిర్వహిస్తోన్నట్లు వెల్లడిచింది. లెవల్-3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ అంటే..! పలు దిగ్గజ కంపెనీలు ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్ను రూపొందిస్తున్నాయి. కాగా ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్లో టెస్లా ముందుంది. టెస్లా కేవలం లెవల్-2 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. లెవల్ 2 ఆటోనామస్ కార్లను నడుపుతున్న వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ వీల్పై చేతులను ఉంచుతూ ఉండాలి. ఒక వేళ అలా చేయకపోతే ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ వాహనదారుడిని హెచ్చరిస్తుంది. కాగా ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్ డెవలప్ చేసిన లెవల్-3 డ్రైవ్ పైలట్తో వాహనదారుడు డ్రైవింగ్పై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ -
ఎలక్ట్రిక్ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్తో 1000 కిమీ ప్రయాణం..!
ఎలక్ట్రిక్ కార్లలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పొచ్చు...! రానున్న రోజుల్లో టెస్లా స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సిద్దమైనాయి. టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే కార్ల రేంజ్ చాలా ముఖ్యమైనది. ఆయా కంపెనీలు రూపొందిస్తోన్న ఈవీ కార్లల్లో రేంజ్ ఎక్కువగా ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలను చేస్తున్నాయి. రేంజ్ను ముఖ్యంగా భావించిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈవీ కార్ల ఉత్పత్తిలో ఒక ముందడుగు వేసింది. ఒక్కసారి ఛార్జ్తో ఏకంగా 1000 కిమీ ప్రయాణం...! ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ సంచలన విజయాన్ని నమోదుచేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్తో ఏకంగా 1000కిమీ మేర ప్రయాణం సాగించే ఈవీ కారును వచ్చే ఏడాది జనవరి 3 మెర్సిడెజ్ ఆవిష్కరించనుంది. మెర్సిడెజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన టీజర్ను కంపెనీ లాంచ్ చేసింది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ వెల్లడించారు.మెర్సిడెజ్లోని ఈక్యూఎస్ కానెస్ట్కారు కంటే తక్కువ డ్రాగ్ కోఫిషియంట్ ఈక్యూఎక్స్ఎక్స్ కల్గి ఉంటుందని మార్కస్ పేర్కొన్నారు. చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్! -
ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!
Mercedes-Benz EQS 450+ Electric Car: ఇప్పటి వరకు ప్రపంచంలో ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే కంపెనీ టెస్లా. ఎందుకంటే, టెస్లా కారును ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం ప్రయాణిస్తుంది. అలాగే, ఈ కారులో అత్యధునిక సదుపాయాలు కూడా ఉంటాయి. అందుకే, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టెస్లా కార్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే, టెస్లా కంపెనీకి చెక్ పెట్టేందుకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ రంగంలోకి దిగింది. మెర్సిడెస్ బెంజ్ తన ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ ఎస్యువి, సెడాన్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావడం ద్వారా టెస్లా చెక్ చెప్పాలని చూస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ మెర్సిడెస్ కొత్త ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారు ఈక్యూఎస్ ప్రారంభ పరీక్షలలో ఎలోన్ మస్క్ టెస్లా కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చింది. 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో422 మైళ్లు ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310(రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. (చదవండి: అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..) -
మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్. ధర ఎక్స్షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్ ఇంజన్, 612 హెచ్పీ పవర్, అదనంగా 22 హెచ్పీ అందించే 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, 3 స్టేజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ న్యూ మోడల్ : ప్రత్యేకత ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బుధవారం తన ఎస్యూవీ విభాగంలో ‘‘2021 జీఎల్సీ’’ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 పెట్రోల్ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్సీ 200డి డీజిల్ వేరియంట్ ధర రూ. 63.15 లక్షలుగా ఉంది. అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్ సిస్టమ్తో పాటు పార్కింగ్ లొకేషన్లు కనుకొనే ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ అనే అధునాతన ఫీచర్లు కలిగిన యాప్ను పొందుపరిచారు. రిమోట్ సాయంతో ఇంజిన్ను ప్రారంభించే సదుపాయం ఉంది. ఇందులో ఫ్రంట్ సీట్లను మసాజ్ ఫంక్షన్తో తయారు చేశారు. మెర్సిడెస్ బెంజ్ భారత ఉత్పత్తుల లైన్అప్లో ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘బెంజ్ ఎస్యూవీ విభాగంలో జీఎల్సీ మోడల్ మూలస్తంభంగా నిలిచింది. గతేడాది మా పోర్ట్ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది’’ అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ ఈ సందర్బంగా తెలిపారు. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్ఈ ఎల్డబ్ల్యూబీ
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన టాప్ ఎండ్ ఎస్యూవీ ‘జీఎల్ఈ లాంగ్ వీల్బేస్ (ఎల్డబ్ల్యూబీ)’ కారులో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జీఎల్ఈ 450 4మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ, జీఎల్ఈ 400 డీ 4మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ పేర్లతో రెండు వేరియంట్లలో వీటిని విడుదలచేసింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమౌతున్న ఈ నూతన కార్ల ధరల శ్రేణి రూ. 88.80 లక్షలు – రూ. 89.90 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇవి కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని, ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ ఎల్డబ్ల్యూబీ కంపెనీకి మూల స్తంభం లాంటిదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. -
భారత్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ బ్రాండ్
పుణే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్కు సంబంధించిన అన్ని వాహనాలను ఇదే బ్రాండ్ నుంచి విడుదలచేయనున్నామని చెప్పారు. -
లాస్ వెగాస్ ‘అవతార్’ షో!
లాస్ వెగాస్: అమెరికాలోని లాస్ వెగాస్లో ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. మెర్సిడెస్ బెంజ్ ’ఏఐ’ కాన్సెప్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్ ఉత్పత్తులతో రూపొందించారు. హ్యుందాయ్ ఎయిర్ ట్యాక్సీ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్ ‘డిజిటల్ అవతార్’ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్లను సృష్టించవచ్చని, డిస్ప్లేలు లేదా వీడియో గేమ్స్లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాంసంగ్ డిజిటల్ మనిషి -
బెంజ్ కంపెనీ ‘అవతార్’ కారు లాంచ్
-
బెంజ్ కంపెనీ నుంచి ‘అవతార్’ కారు
సాక్షి, న్యూఢిల్లీ : జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ కాన్సెప్ట్తో తయారుచేసిన ఎలక్ట్రిక్ కార్ డైమ్లర్–బెంజ్ను లాస్ వెగాస్లో సోమవారం నాడు ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. ‘విజన్ అవతార్’గా పిలిచే ఈ కారు పూర్తి పక్కకు తిరగడంతోపాటు డ్రైవర్ స్పర్శకు కూడా స్పందించడం విశేషం. ఇందులో కొత్తరకమైన ఆర్గానిక్ బ్యాటరీని కూడా ఉపయోగించారు. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్న జేమ్స్ కామెరాన్ ‘విజన్ అవతార్’ కాన్సెప్ట్ కారు ఆవిష్కరణకు రావడం విశేషం. 30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులను తయారు చేశారు. దాన్ని ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగ గలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ‘ఈ కారులో నేను కూర్చొని చూశాను. దీనికి నిజంగా ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటోంది’ జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యానించారు. ఈ కారుకు నడిపేందుకు చక్రం లేకపోవడం మరో విశేషం. సెంట్రల్ కంట్రోల్ యూనిట్ను చేతితో పట్టుకోవడం ద్వారా నడపవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్ కంప్యూటర్ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్ ఇస్తూ కారును నడపవచ్చు. ఈ కారు మనిషిలాగా శ్వాస తీసుకున్నట్లు అనిపించడానికి కారణం వెనక భాగాన చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్ చేసి ఉండడం. ఇలాంటి కారు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం ప్రకటించలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎలైట్, ధర ఎంతంటే
సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త వి-క్లాస్ ఎలైట్ను విడుదల చేసింది. ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్క్లూజివ్ కార్లకు అప్గ్రేడ్ వెర్షన్గా వి-క్లాస్ ఎలైట్ను ఆవిష్కరించింది. స్పెయిన్లో రూపొందించిన వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది. వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు. -
బ్రాండ్ బాబులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త బ్రాండు, హైఎండు.. నగరంలోకి వస్తే చాలు.. హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్ కారు వచ్చినా.. బైక్ వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్లు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. హైఎండ్ దూకుడు.. హై ఎండ్ కార్లు, బైక్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్కు చెందిన జీఎల్ఎస్ 350డీ 4 మాటిక్ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎక్స్డ్రైవ్ 30డీ డీపీఈ విత్ ఎట్ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 69, వోల్వో ఎక్స్ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి. ద్విచక్రంలో దీనిదే పైచేయి.. హైఎండ్ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్సన్ రారాజులా దూసుకుపోతోంది. హార్లీడేవిడ్సన్ ఎక్స్జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్సన్ ఎక్స్జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్కే మోటార్ వీల్స్ టీఎన్ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్ (జపాన్), ఇండియా కవాసకి మోటార్స్కు చెందిన నింజా 650 తదితర బైక్ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్ బైక్లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్ డీలర్లు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భాగంగానే హైదరాబాద్లోనూ రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలు మందగించాయని చెప్పారు. కాగా, 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ –6 మోడల్ మార్కెట్లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్లైన్లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్గ్రెడేషన్కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
మెర్సిడెస్ బెంజ్ కూడా పెంచేసింది
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్మేకర్ మెర్సిడెస్ బెంజ్ కూడా తన వాహనాలపై పెంచుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది. అంతర్జాతీయ రాజకీయ కారణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం,పెరుగుతున్నఇన్పుట్ ఖర్చులు, విదేశీ మారకవిలువ తమపై గణనీయమైన ఒత్తిడిని పెంచిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వాహనాలపై 4శాతం మేర ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పెంచిన ధరలను సెప్టెంబరునుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల్లో రూపాయి విలువ వేగంగా తగ్గుముఖం పట్టిడంతో ధరలను పెంచక తప్పడంలేదని పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లో యూరోకు వ్యతిరేకంగా రూపాయి 5 శాతం పైగా నష్టపోయింది. కాగా మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, హోండా కార్స్ ఇండియా వంటి ఇతర కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెర్సిడెస్ ‘ఏఎంజీ ఈ–63 ఎస్’లో కొత్త వెర్షన్
గ్రేటర్ నోయిడా: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్’ తాజాగా తన ‘ఏఎంజీ ఈ–63 ఎస్’ సెడాన్ కారులో కొత్త వెర్షన్ ‘ఏఎంజీ ఈ–63 ఎస్ 4 మేటిక్ ప్లస్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్షోరూమ్ ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. తాజా కొత్త వెర్షన్తో కలుపుకొని కంపెనీ దేశంలో మొత్తంగా 14 ఏఎంజీ మోడళ్లను విక్రయిస్తోంది. ‘కస్టమర్ల నుంచి ఏఎంజీ మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాదిలో మరిన్ని ఏఎంజీ మోడళ్లను, ఇతర కార్లను మార్కెట్లోకి తీసుకువస్తాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ తెలిపారు. ‘ఏఎంజీ ఈ–63 ఎస్ 4 మేటిక్ ప్లస్’లో 4 లీటర్ ట్విన్టర్బో వీ8 ఇంజిన్ను అమర్చామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొన్నారు. -
మెర్సిడెస్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: టయోటా, రెనో, టాటా మోటార్స్, నిస్సాన్ దారిలోనే మెర్సిడెస్ బెంజ్ కూడా పయనిస్తోంది. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల దిగ్గజం... తన కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలపెంపు నిర్ణయం 2017, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం, ఫారెక్స్ ధరల్లో మార్పు వంటి అంశాలను ధరల పెంపునకు కారణాలుగా పేర్కొంది. కాగామెర్సిడెస్ బెంజ్ రూ.27 లక్షలు నుంచి రూ.2.6 కోట్ల ధర శ్రేణిలో తన కార్లను భారత్లో విక్రయిస్తోంది. -
మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్
ప్రారంభ ధర రూ.31.4 లక్షలు ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘సీఎల్ఏ’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.31.4 లక్షలు-రూ.34.68 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ముంబై) ఉంది. అప్డేటెడ్ వెర్షన్లో కొత్త ఫ్రంట్ బంపర్, డైమండ్ పిన్ రాడియేటర్ గ్రిల్, కార్బన్ ఫైబర్ మిర్రర్స్, కొత్త లుక్తో కూడిన లెడ్ టెరుుల్ ల్యాంప్స్, 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. పెట్రోల్ వేరియంట్లో 2.0 లీటర్ ఇంజిన్ను, డీజిల్ వేరియంట్లో 2.2 లీటర్ ఇంజిన్ను అమర్చినట్లు పేర్కొంది. -
మెర్సిడెజ్ నుంచి 2 కొత్త కన్వర్టబుల్ కార్లు
ధర శ్రేణి రూ.60 లక్షలు- రూ.2.25 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెజ్ బెంజ్’ నుంచి మరో రెండు టాప్లెస్ బ్యూటీ కార్లు మార్కెట్లోకి వచ్చారుు. కంపెనీ తాజాగా రెండు కొత్త కన్వర్టబుల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘సి-300 క్యాబ్రియోలెట్’, ‘ఎస్-500 క్యాబ్రియోలెట్’ అనే ఈ కార్ల ధరలు వరుసగా రూ.60 లక్షలుగా, రూ.2.25 కోట్లుగా (ఎక్స్షోరూమ్ న్యూఢిల్లీ) ఉన్నారుు. తమ ‘టాప్ ఆఫ్ పిరమిడ్’ వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ పోర్ట్ఫోలియోలోని అత్యుత్తమ ప్రొడక్ట్లను భారతీయుల కోసం ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్ ఫాల్గర్ తెలిపారు. తాజా కార్ల ఆవిష్కరణతో భారత్లోని ప్రీమియం కార్ల విభాగంలో తమ స్థానం మరింత పదిలమౌతుందని ధీమావ్యక్తం చేశారు. ఇక ఈ కొత్త కార్లతో భారత్లో అతిపెద్ద కన్వర్టబుల్ పోర్ట్ఫోలియోను కలిగిన వాహన కంపెనీగా అవతరించామని పేర్కొన్నారు. సి-300: ఇందులో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగా న్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్సమిషన్ను పొందుపరిచినట్లు తెలిపింది. ఎస్-500: ఈ కారులో 4.7 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్సమిషన్ను పొందుపరిచినట్లు తెలిపింది. -
ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారత్లో కొత్త అధ్యాయానికి రెడీ అవుతోంది. డీజిల్, పెట్రోల్ కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఫుల్ ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలను సైతం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో కంపెనీ ఈ మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారత్లో వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బీఎస్-5కు బదులుగా, బీఎస్-6 ప్రమాణాలను 2020 నుంచే అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము సైతం మార్కెట్కు అనుగుణంగా వ్యవహరిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఎస్ ఫాల్గర్ తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ ఆయన మాటల్లోనే.. వాహనాలు రెడీ.. పలు దేశాల్లో ఎలక్ట్రికల్, హైబ్రిడ్ మోడళ్లను విజయవంతంగా అమ్ముతున్నాం. ఈ వాహనాల విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాం. ప్రధానంగా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ టెక్నాలజీపై భారీగా వ్యయం చేశాం. భారత్లో ఏటా 30 లక్షలకుపైగా పెట్రోలు, డీజిల్ కార్లు అమ్ముడవుతున్నాయి. పర్యావరణం పట్ల ఇక్కడి కస్టమర్లకు బాగా అవగాహన ఉంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన రంగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. మార్కెట్లో ఉన్న అవకాశాలను వాహన కంపెనీలు ఇంకా రుచి చూడాల్సి ఉంది. మెర్సిడెస్ విషయానికి వస్తే భవిష్యత్ తరం మోడళ్లను ఏ క్షణంలోనైనా భారత విపణిలో ఆవిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే అందుకు మార్కెట్ రెడీగా లేదు. కీలక పాత్ర ప్రభుత్వానిదే.. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల కొనుగోళ్లకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చార్జింగ్ స్టేషన్లు ఎక్కడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఈ మోడళ్ల ఖరీదు ఎక్కువ. తక్కువ యూనిట్ల అమ్మకాల కారణంగానే ధర కాస్త అధికంగా ఉంటోంది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యత వాహన కంపెనీలదే అన్న భావన ప్రభుత్వానిది. వాస్తవానికి ఇంధన సంస్థలే చొరవ చూపాలి. ఈ విషయంలో ప్రభుత్వమూ కీలకంగా వ్యవహరించాలి. చార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటైతేనే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలి. కస్టమర్లు ఎలక్ట్రికల్, హైబ్రిడ్ వాహనాల పట్ల ఆకర్శితులయ్యేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. తయారీ వ్యయం కంటే తక్కువకు నష్టానికి మేం వాహనాలను విక్రయించలేం కదా. రెండేళ్లలో బీఎస్-6.. భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ప్రవేశపెట్టేందుకు మేం రెడీగా ఉన్నాం. అది కూడా 2018 కల్లా కంపెనీ సిద్ధం. ప్లాంటును అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తాం. నూతన ప్రమాణాలు రానున్న రోజుల్లో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తాయి. బీఎస్-6 అమలుకు ప్రభుత్వ తోడ్పాటు అవసరం. ధ్రువీకరణ విధానం వేగిరం చేయడంతోపాటు నాణ్యమైన ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. -
మెర్సిడెస్ నుంచి త్వరలో...మరో నాలుగు మోడళ్లు
♦ డీజిల్ కార్లకు తరగని ఆదరణ ♦ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫాల్గర్ ♦ భాగ్యనగరిలో రెండో షోరూం ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ డిసెంబరుకల్లా మరో నాలుగు మోడళ్లను భారత్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది ఎనిమిది మోడళ్లను విడుదల చేశామని సంస్థ ఇండియా ఎండీ రోలాండ్ ఎస్ ఫాల్గర్ తెలిపారు. హైదరాబాద్లో మెర్సిడెస్ రెండవ షోరూం సిల్వర్ స్టార్ను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2015లో 13,502 కార్లను విక్రయించామన్నారు. ఈ ఏడాది సైతం ఇదే స్థాయిలో అమ్మకాలను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2016 జనవరి-సెప్టెంబరులో 9,927 కార్లు అమ్ముడయ్యాయి. ఎన్సీఆర్ ప్రాంతంలో డీజిల్ కార్ల అమ్మకాలపై ఇబ్బందులు తలెత్తినప్పటికీ మంచి వృద్ధిని నమోదు చేశామన్నారు. కంపెనీ విక్రయాల్లో హైదరాబాద్ వాటా 5 శాతముంది. డీజిల్ కార్లంటే మక్కువే.. ఢిల్లీలో డీజిల్ కార్ల కొత్త రిజిస్ట్రేషన్లను కొద్ది రోజులు నిషేధించిన సంగతి తెలిసిందే. డీజిల్ కార్లపై ప్రస్తుతం దేశ రాజధానిలో 1 శాతం పర్యావరణ రుసుం వసూలు చేస్తున్నారు. కస్టమర్లు ఈ రుసుం చెల్లించేందుకూ వెనుకాడ్డం లేదని రోలాండ్ వ్యాఖ్యానించారు. డీజిల్ నుంచి పెట్రోల్ వైపు పెద్దగా మొగ్గు చూపడం లేన్నారు. తదుపరి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయోనని చాలా మంది కస్టమర్లు వేచి చూస్తున్నారని వివరించారు. అన్ని ప్రమాణాలకు లోబడే వాహనాలను తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రమాణాల్లో లోపముంటే వాటిని సరిదిద్దాలని సూచించారు. కార్ల ధరలపై జీఎస్టి.. లగ్జరీ కార్లపై జీఎస్టి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదని రోలాండ్ అన్నారు. అందుకే వాహనాల ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అన్న అంశంపై అనిశ్చితి ఉందని చెప్పారు. భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా 2018 కల్లా డీజిల్, పెట్రోల్ కార్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. కాగా, షోరూం ప్రారంభించిన నాడే 30 కార్లు రోడ్డెక్కాయని సిల్వర్ స్టార్ ఎండీ అమిత్ రెడ్డి తెలిపారు. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.37 కోట్ల వ్యయంతో షోరూం నెలకొల్పినట్టు చెప్పారు. కొత్త ‘జీఎల్ఏ’ వేరియంట్ ధర రూ.38.51 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘జీఎల్ఏ’లో ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ‘జీఎల్ఏ 220 డి యాక్టివిటీ ఎడిషన్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.51 లక్షలు (ఎక్స్షోరూమ్ పుణే)గా ఉంది. తాజా వేరియంట్తో కలుపుకుని కంపెనీ ఈ ఏడాది మొత్తంగా మన దేశంలోకి తొమ్మిది ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అలాగే కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన 6వ ఎస్యూవీ ఇది. -
మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.82.90 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. తాజా వేరియంట్తో భారత్లో విక్రయిస్తున్న అన్ని మోడల్ వాహనాలకు డీజిల్తోపాటు పెట్రోల్ వెర్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు అయ్యిందని కంపెనీ తెలిపింది. ‘జీఎల్ఎస్ 400’ పెట్రోల్ వేరియంట్లో 3.0 లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్ను అమర్చామని పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేస్తున్న 5వ ఎస్యూవీ వేరియంట్ ఇదని, సమీప కాలంలో మరిన్ని ప్రొడక్ట్లను మార్కెట్లోకి తెస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు. -
మెర్సిడెస్ అన్ని మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు!
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్’ తాజాగా తను భారత్లో విక్రయించిన అన్ని మోడళ్లకీ పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జీఎల్ఈ 400లో పెట్రోల్ వేరియంట్ కంపెనీ తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘జీఎల్ఈ 400’లో పెట్రోల్ వేరియంట్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.74.90 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇందులో శక్తివంతమైన 2,996 సీసీ ఇంజిన్ను అమర్చారు. ఎస్యూవీ విభాగంలో పెట్రోల్ వేరియంట్ల పోర్ట్ఫోలియోను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ వెహికల్ను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న పెట్రోల్ వేరియంట్ల విక్రయాలు రానున్న కాలంలో 30%కి చేరొచ్చని అంచనా వేసింది. -
స్పెషల్ బెంజ్ కార్లొచ్చాయ్
ఫ్రాన్స్ లో జరగబోయే 2016 యూఈఎఫ్ఏ యూరో చాంపియన్ షిప్ సందర్భంగా జపాన్ కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ స్పెషల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రముఖ ఏ-క్లాస్,జీఎల్ఏ, సీఎల్ఏ మోడల్స్ స్పెషల్ వేరియంట్లను జపాన్ ఫుట్ బాల్ టీమ్ సపోర్టుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం పరిమితి సంఖ్యలోనే ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్స్ ను 2016 జూలై 10వరకు మెర్సిడెస్ విక్రయించనుంది. ఏ-క్లాస్ కు చెందిన స్మాల్ కార్లు ఏ180 లాంటివి ప్రారంభ ధర రూ.25.95లక్షల గా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఏ200డీ ధర రూ.26.95లక్షలకు పెరుగుతుందని తెలిపింది. అలాగే సీఎల్ఏ క్లాస్ సెడాన్స్ లో కొత్త సీఎల్ఏ 200ను రూ.33.4లక్షలకు, సీఎల్ఏ200డీను 34.25లక్షలకు అందుబాటులో ఉంచుతున్నట్టు మెర్సిడెస్ ప్రకటించింది. ఏ-క్లాస్, సీఎల్ఏ, జీఎల్ఏ ప్రత్యేక ఎడిషన్ కార్లు యూఈఎఫ్ఏ యూరో 2016 ను ఇండియాలో కూడా జరుపుకుంటాయని, ఈ కొత్త తరం కార్లను డైనమిజమ్, స్పోర్టినెస్ తో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే నేషనల్ రాజధాని ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ కార్లపై నిషేధం విధించడంతో, ఈ జర్మన్ కార్ల తయారీదారి భారత్ లో కఠిన పరిస్థితులనే ఎదుర్కొంటోంది. -
మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్లు
* ఏ-క్లాస్, జీఎల్ఏ, సీఎల్ఏ మోడళ్లలో * ధర రూ.25.95 లక్షల నుంచి రూ.35.26 లక్షల వరకూ న్యూఢిల్లీ: జర్మీన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ మూడు మోడళ్లలో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఏ-క్లాస్, జీఎల్ఏ, సీఎల్ఏ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోలర్ చెప్పారు. ఇటీవల ప్రారంభమైన ప్రపంచ కప్ ఫుట్బాట్ పోటీల సందర్భంగా ఈ ప్రత్యేక స్పోర్ట్స్ వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ధరలు రూ.25.95 లక్షల నుంచి రూ. 35.26 లక్షల రేంజ్(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై)లో ఉన్నాయని తెలిపారు. స్పోర్ట్స్ ఎడిషన్ బ్యాడ్జ్, స్పోర్ట్స్ పెడల్స్తో రూపొందిన ఈ వేరియంట్లు.. వచ్చే నెల 10 వరకే విక్రయాలకు అందుబాటులో ఉంటాయన్నారు. -
భారత్ కోసం మెర్సిడెస్ ప్రత్యేక మోడల్
♦ 2016లో 12 కొత్త కార్లు తీసుకొస్తాం... ♦ కంపెనీ ఎండీ రోలాండ్ ఫాల్గర్ ♦ భారత మార్కెట్లో ఎస్-400 విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారత్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తోంది. కంపెనీ అమ్మకాల్లో ముంబై, ఢిల్లీ మినహా మిగిలిన ప్రాం తాల వాటా 55% ఉండడమే ఇందుకు కారణం. 2016లో కొత్తగా ఏర్పాటు చేయనున్న డీలర్షిప్లలో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ ఈ నగరాల్లోనే రానున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫాల్గర్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్ వేదికగా సరికొత్త ఎస్-400 కారును భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మహవీర్ మోటార్స్ గ్రూప్ చైర్మన్ యశ్వంత్ జబఖ్తో కలసి మీడియాతో మాట్లాడారు. 2016లో అప్గ్రేడెడ్ వెర్షన్లతోసహా మొత్తం 12 మోడళ్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఎస్-400తో కలిపి కంపెనీ ఇప్పటికే మూడు మోడళ్లను విడుదల చేసింది. 2015లో మెర్సిడెస్ బెంజ్ 32 శాతం వృద్ధి రేటుతో 13,500లపైగా కార్లను విక్రయించింది. ఇందులో 40 శాతం వృద్ధితో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతం ఉంది. భారత్ కోసం ప్రత్యేకంగా..: నెక్స్ట్జనరేషన్ వాహనాలకు యువత ఆకర్షితులవుతున్నారని రోలాండ్ వెల్లడించారు. తమ కస్టమర్ల సగటు వయసు 45 నుంచి ఇప్పుడు 37కు వచ్చి చేరడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ‘మహిళలూ లగ్జరీ కార్లలో దూసుకెళ్తున్నారు. సంస్థ కస్టమర్లలో 12 శాతం వాటా వీరిదే’ అని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అడుగుపెట్టడం తొలుత రిస్క్తో కూడుకున్నదేనని అన్నారు. కానీ భవిష్యత్ ఈ నగరాలదేనని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం ప్రత్యేక మోడల్ను ప్రవేశపెడతామని సాక్షి బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ కారుగా కంపెనీ అభివర్ణిస్తోంది. 3 లీటర్, వి6 పెట్రోల్ ఇంజన్తోపాటు స్మూత్ రైడ్ కోసం ఇందులో అత్యాధునిక ఎయిర్మ్యాటిక్ సస్పెన్షన్ ఉంది. భద్రతకు పెద్ద పీట వేస్తూ 8 ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ప్రి-సేఫ్, డైనమిక్ కార్నరింగ్ కంట్రోల్ సిస్టమ్, హోల్డ్ ఫంక్షన్తో అడాప్టివ్ బ్రేక్, బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు జోడించారు. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, యాక్టివ్ పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్రూఫ్, వీనుల విందైన సంగీతం కోసం 1,520 వాట్స్ సామర్థ్యమున్న 24 స్పీకర్లతో కూడిన బర్మెస్టర్ 3డీ సరౌండ్ సౌండ్ వ్యవస్థ పొందుపరిచారు. హైదరాబాద్ ఎక్స్షోరూంలో కారు ధర రూ.1.31 కోట్లు. -
ఈ ప్రకటన పోలే.. అదిరిపోలే!
వ్యాపారరంగంలో ప్రకటనలకు ఉన్న ప్రాధాన్యం సాధారణమైంది కాదు. దీనికి ఎయిర్ టెల్ 4జీ ప్రకటన ఓ ఉదాహరణ. తమ రంగంలో సమీప ప్రత్యర్థులను ఢీకొంటూ లౌక్యంగా ముందుకు సాగడం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇచ్చిన ప్రకటన అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. బీయండబ్ల్యూ 100వ వార్షికోత్సవం సందర్భంగా బెంజ్ విడుదల చేసిన ఒక కూల్ ప్రకటన కంపెనీ మార్కెటింగ్ చతురతకు అద్దం పట్టింది. లగ్జరీ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, బీయండబ్ల్యూ టాప్ పోజిషన్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 100 వార్షికోత్సవం సందర్భంగా బీయండబ్ల్యూను అభినందిస్తూ.. అదే సందర్భంగా తాము 130 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని కూల్ గా చెప్పింది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా.. మరో మాటలో చెప్పాలంటే .. మీకంటే మేం 30 ఏళ్లు సీనియర్ బాసూ.. అని చెప్పకనే చెబుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలంటూ భుజం తట్టినట్టుగా ఉంది. అదీ సంగతి.. పోలే.. అదిరిపోలే.. బీయండబ్ల్యూ ఉద్యోగులను తమ మ్యూజియం సందర్శనకు ఆహ్వానించింది మెర్సిడెస్. మార్చి 8 నుంచి 13 వరకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉద్యోగులు బాగానే ఎంజాయ్ చేయడంతోపాటుగా బెంజ్ ఇచ్చిన నోరూరించే విందును ఆరగించారు. ఆటోమొబైల్ చరిత్రలో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, సమకాలీన వినూత్న పరిణామాల విశేషాలతో కూడిన మ్యూజియాన్ని పదేళ్ల క్రితం ప్రారంభించినట్టు మెర్సిడెస్ బెంజ్ ప్రెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ రాల్ఫ్ గ్లాసర్ చెప్పారు. 100 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీయండబ్ల్యూకు అభినందనలు తెలిపామన్నారు. Happy 100th birthday, @BMW! Here’s to another 100 years of competition.https://t.co/4XE7Emh4lM — Mercedes-Benz (@MercedesBenz) March 7, 2016 -
మెర్సిడెస్ ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’
ధర రూ.10.5 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తాజాగా ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’ మోడల్ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.10.5 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అత్యధిక బాలిస్టిక్ రక్షణ స్థాయి వీఆర్ 10 సర్టిఫికెట్ ఈ కారు సొంతం. భారత్లోకి మెర్సిడెస్ బెంజ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన కారు ఇదే. దీని బరువు 4.7 టన్నులు. కారులో 6.0 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజిన్, క్యాబిన్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్, ఆటోమేటిక్గా మంటలను ఆర్పే వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కారు టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లు. ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’ కారు పేలుళ్లు, కాల్పులు, రాకెట్ దాడులు వంటి తదితర ప్రమాదాలను తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. స్పెషల్ ప్రొటెక్షన్ వెహికల్స్ విభాగంలో అధిక వాటాను సొంతం చేసుకోవడానికి ఈ మోడల్ దోహదపడుతుందని తెలిపింది. వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎస్ 600 గార్డ్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి కనబరుస్తారని పేర్కొంది. -
బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..
రూ. 5 లక్షల వరకూ పెంపు... న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కారు ధరలు పెరగనున్నాయి. మార్చి 15 నుంచి వాహన ధరలను రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు, అదనపు లగ్జరీ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించడ మే కారణమని తెలిపింది. మోడల్ను బట్టి ధర పెరుగుదల 3-5%(రూ.లక్ష-5 లక్షలు) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఏ-క్లాస్ నుంచి మేబ్యాక్ వరకు పలు రకాల మోడ ళ్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.28 లక్షలు-రూ.1.67 కోట్లు. ప్రభుత్వపు కొత్త పన్నులు, బలహీనమైన రూపాయి, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వంటి తదితర అంశాల కారణంగా కంపెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, అందుకే ధరల్ని పెంచక తప్పడం లేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా చీఫ్ రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు. కాగా, టాటా మోటార్స్ ఇప్పటికే ప్యాసెంజర్ వాహన ధరలను పెంచింది. హ్యుందాయ్, హోండా కూడా కారు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ.. జీఎల్ఈ
ధరలు రూ. 58.9 లక్షల నుంచి రూ. 69.90 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎస్యూవీని బుధవారం ఆవిష్కరించింది. భారత్లోనే తయారు చేసే ఈ జీఎల్ఈ ఎస్యూవీ ధరలు రూ.58.9 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ చెప్పారు. రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని పేర్కొన్నారు. 250డి (2,143 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్యూవీ ధర రూ.58.90 లక్షలని, 350 డి(2,987 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్యూవీ ధర రూ.69.90 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. ఎంఎల్-క్లాస్ ఎస్యూవీలో మార్పులు, చేర్పులు చేసి ఈ మోడల్ను మెర్సిడెస్ బెంజ్ అందిస్తోంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ కాలానికి తమ ఎస్యూవీ పోర్ట్ఫోలియో 70 శాతం చొప్పున వృద్ధి సాధించిందని రోలాండ్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందిస్తామని చెప్పామని, ఇప్పటివరకూ 13 కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు చెప్పారు. -
మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు
పుణే : మెర్సిడెస్ బెంజ్ ఇండియా(ఎంబీఐ) కంపెనీ సూపర్ లగ్జరీ సలూన్ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. మేబ్యాక్ ఎస్600 పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.6 కోట్లని (ఎక్స్ షోరూమ్, పుణే) కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబర్హర్డ్ కెర్న్ చెప్పారు. దేశీయంగా అసెంబుల్ చేసిన మేబ్యాక్ ఎస్500ను కూడా అందుబాటులోకి తెచ్చామని, ధర రూ.1.67 కోట్లని పేర్కొన్నారు. ఈ కారుతో తాము దేశీయంగా అసెంబుల్ చేస్తున్న మోడళ్ల సంఖ్య ఎనిమిదికి పెరిగిందని చెప్పారు. దేశీయంగా లగ్జరీ కార్లలో అధిక మోడళ్లను అసెంబుల్ చేస్తున్న కంపెనీ తమదేనని వివరించారు. ప్రస్తుతం తాము సి, ఈ, ఎం, ఎస్ క్లాస్ మోడళ్లను, సీఎల్ఏ, జీఎల్ఏ, జీఏ క్లాస్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తున్నామని తెలిపారు.కాగా ఎంబీఐకు ఇప్పటిదాకా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున కెర్న్ యూరప్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రోలాండ్ ఎస్ ఫోల్జ్ రానున్నారు. ఈ కార్యక్రమంలో రోలాండ్ కూడా పాల్గొన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ సి63 ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.1.3 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఏఎంజీ క్లాస్లో భారత్లో తాము అందిస్తున్న పదో మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్హర్డ్ కెర్న్ చెప్పారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో లభించే ఈ 4.0 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ కారు ఇంతకు ముందటి మోడళ్లతో పోల్చితే 32 శాతం అధిక మైలేజీనిస్తుందని వివరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటుందని తెలిపారు. పెర్ఫామెన్స్ కార్ల సెగ్మెంట్లో ఈ కారుతో తమ స్థానం పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మదర్సన్ సుమికి రూ. 15,400 కోట్ల ఆర్డరు
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ మదర్సన్ సుమి సిస్టమ్స్ (ఎంఎస్ఎస్ఎల్) తాజాగా జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం దైమ్లర్ నుంచి భారీ ఆర్డర్లు దక్కించుకుంది. వీటి విలువ రూ. 15,400 కోట్లు. కాంట్రాక్టుల కింద కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ వాహనాలకు వెలుపలి, లోపలి భాగాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అనుబంధ సంస్థ సంవర్ధన మదర్సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్ ఈ ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎంఎస్ఎస్ఎల్ తెలిపింది. 2018 నుంచి మొదలయ్యే ఆర్డర్ల విలువ జీవిత కాలంలో రూ. 15,400 కోట్లు (సుమారు 2.2 బిలియన్ యూరోలు) రాగలవని పేర్కొంది. దైమ్లర్ కాంట్రాక్టులకు సరఫరా కోసం రెండు అమెరికాలో, హంగరీలో చెరొక కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్ఎస్ఎల్ వివరించింది. అయితే, వీటిపై ఎంత ఇన్వెస్ట్ చేయనున్నది కంపెనీ వెల్లడించలేదు. -
మెర్సిడెస్-బెంజ్ నుంచి 2 కొత్త కార్లు
ఈ-క్లాస్ కాబ్రియోలెట్ రూ.78.50 లక్షలు సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే రూ.76.50 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ బుధవారం రెండు కొత్త మోడళ్లు... ఈ-క్లాస్ కాబ్రియోలెట్, సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే(డీజిల్ ఇంజిన్)లను ఆవిష్కరించింది. ఈ-క్లాస్ కాబ్రియోలెట్ ధర రూ.78.50 లక్షలని, సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే ధర రూ.76.50 లక్షలని (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొంది. భారత మార్కెట్కు అనువుగా ఉన్న తమ అంతర్జాతీయ మోడళ్లను ఇక్కడకు తెస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబెర్డ్హర్డ్ కెర్న్ చెప్పారు. ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందించనున్నామని, మరో 15 షోరూమ్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. మెర్సిడెస్-బెంజ్ యాప్ క్లౌడ్ ఆధారిత మెర్సిడెస్-బెంజ్ యాప్లను పరిచయం చేస్తున్నామని కెర్న్ పేర్కొన్నారు. ఈ యాప్లతో ఇంటర్నెట్, వాతావరణం, ఆడియో వార్తలు, ఫేస్బుక్, మెర్సిడెస్-బెంజ్ రేడియోలకు యాక్సెస్ పొందవచ్చని వివరించింది. ప్రస్తుతం సీఎల్ఎస్ కారులో ఈ యాప్ను ఆఫర్ చేస్తున్నామని, భవిష్యత్లో రానున్న కార్లలో దీనిని అందించనున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని తెలిపారు. ప్రస్తుతం 39 నగరాల్లో 71 మంది డీలర్లున్నారని, ఈ సంఖ్యను 80కు పెంచనున్నామని వివరించారు. -
మెర్సిడెస్-బెంజ్... సీఎల్ఏ క్లాస్ సెడాన్
ధర రూ. 31.5-35.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ సీఎల్ఏ క్లాస్ సెడాన్ను ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.31.5-35.9 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని మెర్సిడెస్-బెంజ్ ఎండీ, సీఈఓ ఇబర్హర్డ్ కెర్న్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని వివరించారు. ఈ కారు మంచి అమ్మకాలు సాధిస్తుందని నమ్మకం ఉందని, అందుకే భారత్లోనే ఈకారును ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో భారత్లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా వృద్ధి సాధించాయని, ఈ స్థాయి వృద్ధి మరే దేశంలోనూ లేదని వివరించారు. 2014లో 10,201 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా చెప్పుకోదగ్గ అమ్మకాలు సాధిస్తామని, విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని, ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని కెర్న్ వెల్లడించారు. -
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీ
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ లగ్జరీ ఎస్యూవీ, జీఎల్ఏ క్లాస్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలలో అందిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్హెర్డ్ కెర్న్ చెప్పారు. పెట్రోల్ కారు ధర రూ.36 లక్షలని, డీజిల్ కారు ధర రూ.32.75 లక్షలు, రూ.36.9 లక్షలని వివరించారు. ఈ ఏడాది తామమందిస్తున్న ఎనిమిదో కొత్త ఉత్పత్తి ఇదని తెలిపారు. భారత్లో ఎస్యూవీల విక్రయాలు పెరుగుతుండటంతో ఈ జీఎల్ఏ క్లాస్ ఎస్యూవీని మార్కెట్లోకి తెచ్చామన్నారు. కారు ప్రత్యేకతలు ఈ కారు గరిష్టవేగం గంటకు 205 కి.మీ.అని, 0-100 కి.మీ. వేగాన్ని 7.6 సెకన్లలలో అందుకోగలదని కెర్న్ పేర్కొన్నారు. ఇంకా ఈ కారులో 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్బాక్స్, పెడల్ షిఫ్టర్స్, పెద్ద పనరోమిక్ సన్ రూఫ్, పార్కింగ్ సెన్సర్స్తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రిక్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సెన్సర్లు, 7 ఎయిర్బ్యాగ్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. ఈ కారు మైలేజీ 13.8 కి.మీ.(పెట్రోల్), 17.9 కి.మీ.(డీజిల్) అని తెలిపారు. బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3, ల్యాండ్ రోవర్ ఇవోక్, వొల్వో వీ40లకు ఈ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని వివరించారు. ఈ ఎస్యూవీకి 18 రోజుల్లో 600 బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. -
మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60 శాతం సాక్షితో మెర్సిడెస్ బెంజ్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సేల్స్, నెట్వర్క్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ ఫిజ్ తెలిపారు. ఏ-క్లాస్, బి-క్లాస్ కార్ల లిమిటెడ్ ఎడిషన్ కార్లను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రాబోయే మోడళ్ల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇవి ఉంటాయని చెప్పారు. 2013లో 8 మోడళ్లు విడుదల చేశామన్నారు. గతేడాది 9 వేలకుపైగా కార్లను విక్రయించామని, ఈ ఏడాది రెండింతల వృద్ధి రేటు నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 60 శాతం వాటా.. మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో గతంలో ఢిల్లీ, ముంబై నగరాల వాటా 60 శాతముండేది. ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60%గా ఉందని బోరిస్ తెలిపారు. కొత్త ప్రభుత్వం రాకతో మౌలిక వసతులు, రోడ్లు మరింత విస్తరిస్తాయన్న అంచనాలున్నాయని, దీంతో రానున్న రోజుల్లో లగ్జరీ కార్లకు గిరాకీ పెరుగుతుందని వివరించారు. ప్రీ-ఓన్డ్ విభాగంలో కార్ల అమ్మకాలు గణనీయంగా ఉన్నాయని చెప్పారు. బ్రాండ్ వృద్ధికి దోహదం చేస్తోందని తెలిపారు. ఈ విభాగాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. డాలరు ప్రభావముంది.. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ పలుమార్లు కార్ల ధరల సవరణ చేసింది. రూపాయి ఒడిదుడుకులకు లోనై దిగుమతి వ్యయం పెరగడంతో కార్ల ధరపై ఒత్తిడి ఉందని కంపెనీ తెలిపింది. బడ్జెట్లో ప్రకటించే ఉద్దీపనలనుబట్టి కార్ల ధర నిర్ణయిస్తామని వెల్లడించింది. 40 శాతం విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ హైదరాబాద్ డీలర్ అయిన మహవీర్ మోటార్స్ చైర్మన్ యశ్వంత్ జబఖ్ మాట్లాడుతూ రూ.2 కోట్లు ఖరీదున్న ఏఎంజీ మోడళ్లకు సైతం ఇక్కడ కస్టమర్లున్నారని చెప్పారు. 2013లో మొత్తం 460 కార్లు విక్రయించామని, ఈ ఏడాది 20 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. -
మెర్సిడెస్ పవర్ఫుల్ ఎస్యూవీ
ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ), జీఎల్ 63 ఏఎంజీని మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.66 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్హర్డ్ కెర్న్ చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ భారత్లోకి తెస్తున్న ఏఎంజీ రేంజ్ వాహనాల్లో ఇది మొదటిదని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 5.5 లీటర్ వీ8 బైటర్బో పవర్ ట్రైన్తో రూపొందిన ఈ కారు 0-100 కి.మీ. వేగాన్ని 4.6 సెకన్లలో అందుకుంటుంది. 7 గేర్లు (ఆటోమేటిక్), ఆల్ వీల్ డ్రైవ్, మూల మలుపులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసేలా యాక్టివ్ కర్వ్ కంట్రోల్, బాంగ్ అండ్ ఓలుఫ్సెన్ ఆడియా సిస్టమ్, సిరస్ శాటిలైట్ రేడియో, పనోరమిక్ సన్రూఫ్, ట్రై జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్కు ఈ కొత్త మెర్సిడెస్ ఎస్యూవీ గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ ఏడాది 10 మోడళ్లు కాగా ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 10 కొత్త మోడళ్లను అందించనున్నామని కెర్న్ వివరించారు. ఈ కారు తమ వినియోగదారులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది తమ అమ్మకాలు 32 శాతం వృద్ధి చెంది 9,003కు చేరాయని వివరించారు. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి అమ్మకాలు 27 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని వివరించారు. పుణేలోని చకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఎస్, ఈ, సీ, జీఎల్, ఎం- క్లాస్ మోడల్ కార్లను భారత్లోనే తయారు చేస్తోంది. ఏ, సీఎల్ఎస్, ఎస్ఎల్కే-క్లాస్, లగ్జరీ టూరర్ బి-క్లాస్, లగ్జరీ ఎస్యూవీ జీఎల్ 63 ఏఎంజీలను దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. -
బెంజ్ నుంచి పోర్షే దాకా..!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఇప్పుడు రాజకీయ దర్పానికి చిహ్నం గా మారిపోయూరుు. సంపద సమృద్ధిగా ఉన్న రాజకీయ నాయకులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ లేదా లీటర్ల కొద్దీ పెట్రోలు తాగే విలాసవంతమైన ఎస్వీయూలపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు వారు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను బట్టి స్పష్టమవుతోంది. ఇక స్కార్పియో, టాటా సఫారీ వంటి కార్లు సర్వసాధారణమై పోయూరుు. వృత్తిరీత్యా లాయర్, అమృత్సర్ బీజేపీ అభ్యర్థి అరుున అరుణ్ జైట్లీకి ఓ మెర్సిడెజ్, మరో బీఎండబ్ల్యూతో పాటు పోర్షే, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ ఉన్నారుు. ఇక భోజ్పురి నటుడు, ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి ఉన్న కార్ల శ్రేణిని చూసినా ఆశ్చర్యం వేస్తుంది. ఆడి క్యూ7, మెర్సిడిస్ బెంజ్, టయోటా ఫార్చ్యూనర్, హోండా సిటీ వాటిలో కొన్ని. మథుర బీజేపీ అభ్యర్థి నటి హేమామాలినికి మెర్సిడిస్ బెంజ్, టయోటా ఇన్నోవా కార్లుండగా, ఆమె భర్త, సినీ నటుడు ధర్మేంద్రకు రేంజ్ రోవర్ ఉంది. ఇక హర్యానా జనహిత్ కాంగ్రెస్ అధినేత కుల్దీప్ బిష్ణోయ్కు ఏకంగా ఐదు కార్లు (జాగ్వార్ ఎక్స్ఎఫ్, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ తదితరాలు), కాంగ్రెస్ అభ్యర్థి (టోంక్-సవారుు మాధోపూర్) అజారుద్దీన్కు రెండు కార్లు (బీఎండబ్ల్యూ 650ఐ, హోండా సీఆర్వీ) ఉన్నారుు. -
మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.36.81 లక్షల నుంచి రూ.39.16 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ముంబై) ఉన్నాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్హర్డ్ కెర్న్ తెలిపారు. పుణేలోని చకన్ ప్లాంట్లో 50వేల కార్లు ఉత్పత్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ను అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు..: 2,143 సీసీ (డీజిల్), 1,796 సీసీ (పెట్రోల్), ఇంజిన్ సామర్థ్యం శాటిలైట్ నావిగేషన్తో కూడిన మల్టీ కలర్ డిస్ప్లే. కొత్త పనోరమిక్ సన్రూఫ్. 7జీ-ట్రానిక్ ప్లస్ ఆటోమాటిక్ గేర్ బాక్స్, బై గ్జెనాన్ హెడ్ల్యాంప్స్, ఏఎంజీ బాడీ కిట్ . ఆరు ఎయిర్బ్యాగ్లు, అటెన్షన్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లున్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్@ రూ.1.57 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్లో లేటెస్ట్ వెర్షన్, ఎస్-క్లాస్ ఎస్ 500ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. గతేడాది అక్టోబర్లోనే ఈ కారును అంతర్జాతీయంగా విడుదల చేశామని, మూడు నెలల తర్వాత భారత్లోకి తెస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబెర్హర్డ్ కెర్న్ చెప్పారు. ఈ కారు ధర రూ. 1.57 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). గతేడాది 8 కొత్త కార్లను భారత్లో అందించామని పేర్కొన్నారు. ఈ కారులో 4.6 లీటర్ వీ8 ఇంజిన్, 12 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ప్రయాణాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వైఫై హాట్స్పాట్, 8 ఎయిర్బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
5 లక్షలు తగ్గనున్న మెర్సిడెస్ బెంజ్ ధర
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, జీఎల్-క్లాస్ ధర రూ. 5 లక్షలు తగ్గనున్నది. ఈ ఎస్యూవీని పుణే సమీపంలోని చకన్ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం తెలిపింది. ఫలితంగా ఈ కారు ధర రూ. 5 లక్షలు దిగిరానున్నది. అమెరికాలోని టస్కలూసా ప్లాంట్ వెలుపల ఈ జీఎల్-క్లాస్ ఎస్యూవీని అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను అప్పుడు రూ.77.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎస్యూవీని దేశీయంగా అసెంబుల్ చేస్తుండటంతో దీని ధర రూ. 5 లక్షలు తగ్గి రూ.72.58 లక్షల(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ)కు చేరింది.