-
‘దేవర’ చలో వైజాగ్
వైజాగ్ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్లో ్రపారంభం కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్. ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్లో ఎన్టీఆర్ జాయి న్ అవుతారట. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. -
ఎన్టీఆర్తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
నారాసురుడిది ఆదినుంచీ రక్త చరిత్రే
రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే..జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకోవడం ఒక మార్గం. పూటకో కుట్ర, రోజుకో కుతంత్రం పన్నుతూ.. రాజకీయంగా నీడనిచ్చిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి మట్టుబెడుతూ రక్తపుటేరులు పారించడం రెండో మార్గం.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం కలగలిసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నరెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత ఎస్వీ యూనివర్సిటీని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్గా మారారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే! సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పేదల పక్షాన నిలబడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊరూరా వాడవాడన మేమంతా సిద్ధం అంటూ ప్రజలు తండోపతండాలుగా కదలివస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా క్షేత్రంలో ఒంటరిగా వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి భయపడి జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేక.. రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో శనివారం తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సాయంత్రం 5.20 గంటలకు ప్రసంగిస్తూ రాళ్లు, చేతికి ఏది దొరికితే దాంతో సీఎం జగన్పై దాడి చేయాలని చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కరుడుగట్టిన టీడీపీ మూకల ముఠా విజయవాడ సింగ్నగర్లో డాబా కొట్ల సెంటర్ వద్ద బస్సు యాత్రలో సీఎం జగన్ రోడ్షో నిర్వహిస్తారని ముందే గ్రహించి.. పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ హత్యాయత్నంపై చంద్రబాబు తనయుడు లోకే‹శ్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇందులో బాబు హస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కాంలో అడ్డంగా సీఐడీ పోలీసులకు పట్టుబడి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచి్చనప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి రీతిలో సీఎం జగన్ను దారుణంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో జనం నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో హత్యాయత్నానికి తెగబడేలా కుట్ర చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని పలు ఘటనలను ఉదహరిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో.. నాదెండ్ల భాస్కర్రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. 1984 జనవరి 9 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. ఎన్టీఆర్కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర–కొన్ని నిజాలు’ పేరుతో రాసిన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్గా దొడ్డిదారిన పదవి పొంది.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. తన దోపిడీ గుట్టంతా నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావుకు తెలిసినందున పక్కా ప్రణాళికతో ఆయన్ను మట్టుబెట్టించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అప్పట్లోనే ఓ వర్గం నేతలను చంద్రబాబు చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని ఎన్టీఆర్కు సీనియర్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మహానేత సహకారంతో మంత్రి పదవి దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థ పరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏరులై పారిన రక్తం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యకమమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తార స్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య తమ అక్రమాలు, ఆగడాలను ప్రశి్నంచిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతి, అక్రమాలను తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్ను గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య చేయించింది చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగది్వదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి. వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. మహానేత కుటుంబంపై ఎప్పుడూ కక్షే ► రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ► 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి ముద్ర బలమైంది. ఆయన్ను హత్య చేస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్రెడ్డిని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్షమాభిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది. ► 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పని చేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్ను కడతేర్చేందుకు 2018 అక్టోబర్ 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ► 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వేరుపడిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాతో కాళ్లబేరానికి దిగి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. తాజాగా దుష్టచతుష్టయంతో కలిసి చెలరేగిపోతున్నారు. 2014–19 మధ్య అధికారం అండతో హత్యాకాండ ► రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచి్చంది. 2014–19 మధ్య టీడీపీ పాలనలో సాగిన హత్యాకాండలో 30 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలను మట్టుబెట్టారు. ► 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు. ► 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ► 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. ► 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు. ► 2014 సెపె్టంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు. ► 2014 సెపె్టంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త గోవింద్రెడ్డి హత్యకు గురయ్యాడు. ► 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్నాయుడు హత్యకు గురయ్యారు. ► 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్రను హత్య చేశారు. ► 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి. ► 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ మండల మాజీ కనీ్వనర్ ప్రసాద్రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగాయి. ► 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు. ► 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు. ► 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. ► 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్సీపీ నేత ఇందూరి ప్రభాకర్రెడ్డి, ఆయన బావ మరిదిని దారుణంగా హత్య చేశారు. ► 2017 మే 21న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద హత్య చేశారు. -
టీడీపీకి అచ్చిరాని తంబళ్లపల్లె!
బి.కొత్తకోట: తెలుగుదేశం పార్టీకి తంబళ్లపల్లె అచ్చిరావడం లేదా.. పోటీచేసిన నేతలకు కష్టాలు తప్పవా?. రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందా? జరిగిన ఘటనలు, జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే అవుననే చెప్పాలి. టీడీపీ టికెట్పై పోటీ చేశాక ఎవరి భవిష్యత్త ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. టీడీపీ చరిత్రలో అనిపిరెడ్డి కుటుంబం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా సారధ్య బాధ్యతలను నిర్వర్తించింది. పార్టీకి గట్టి పునాదులు వేసింది. ప్రస్తుతం ఈ కుటుంబం రాజకీయాలకు దూరమైంది. బీసీ నేత శంకర్ను టీడీపీలోకి రప్పించుకుని వాడుకున్నఅధిష్టానం గెంటేసినంత పనిచేసింది. కొత్త వ్యక్తికి టికెట్ ప్రకటించిన చంద్రబాబు, ఆ వ్యక్తి ప్రచారంలో ఉండగానే పొత్తులో తంబళ్లపల్లెను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో తంబళ్లపల్లెలో టీడీపీ తరపున పనిచేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ ప్రభంజనంలో పరాజయం 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాయనే చెప్పొచ్చు. అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవగా తంబళ్లపల్లెలో పరాజయం పాలైంది. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఏవీ ఉమాశంకర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల మోహన్రెడ్డి బరిలో నిలవగా, ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి టీఎన్.శ్రీనివాసులురెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఇద్దరు అభ్యర్థులను ఓడించారు. టీడీపీకి పునాది ఉమాశంకర్రెడ్డి టీడీపీ తరపున తంబళ్లపల్లె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉమాశంకర్రెడ్డిది ములకలచెరువు మండలంలోని గూడుపల్లె. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైనప్పటికి ఎన్టీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా మారుతున్న సమయంలో 1984 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగా తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె వద్ద దారుణహత్యకు గురయ్యారు. తెరపైకి లక్ష్మిదేవమ్మ భర్త ఉమాశంకర్రెడ్డి హత్యతో గృహిణిగా ఉన్న లక్ష్మీదేవమ్మ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 1989 ఎన్నికలో ఓడిపోగా 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి టీఎన్, కలిచర్ల కుటుంబాలపై పైచేయి సాధించడం అప్పట్లో సంచలనం. అయితే బీజేపీ రూపంలో ఆమె రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది. టీడీపీ–బీజేపీ పొత్తుతో తంబళ్లపల్లె స్థానం 1999, 2004లో బీజేపీకి ఇవ్వడంతో పోటీకి దూరమయ్యారు. 2004 ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాక అవే ఆమెకు చివరి ఎన్నికలు. ఐదేళ్లు గడవకనే అనర్హత తండ్రి ఉమాశంకర్రెడ్డి ఎమ్మెల్సీగా, తల్లి లక్ష్మి దేవమ్మ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయగా వీరి కుమారుడు ఏవీ ప్రవీణ్కుమార్రెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగలేకపోగా 10 ఏళ్లుగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రవీణ్ 2009 ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేసి టీడీపీ అభ్యరి్థగా పోటిచేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరడం, చంద్రబాబు విభజనకు లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ప్రవీణ్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీలో చేరగా అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవకనే అనర్హత వేటు వేసింది. 2014లో వైఎస్సార్సీపీ అభ్యరి్థగా పోటీచేసి ఓటమిపాలై రాజకీయాలకు దూర మయ్యారు. మెరిసి మసకబారిన శంకర్ 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన జి.శంకర్ యాదవ్..ప్రవీణ్ చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత బెంగళూరులో వ్యాపారాలతో స్థిరపడ్డారు. 2014లో టీడీపీ తరపున పోటీచేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితిలో శంకర్ను టీడీపీ నేతలు ఒప్పించి పోటీ చేయించగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు శంకర్ పోరాటమే చేయాల్సి వచ్చింది. చివరకు టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. 2024లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా ఊహించని విధంగా శంకర్ను కాదని రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడంతో టీడీపీలో శంకర్ ఎపిసోడ్ ముగిసింది. కొత్త అభ్యర్థి మూన్నాళ్ల ముచ్చట ఊహించని విధంగా టీడీపీ టికెట్ దక్కించుకున్న జయచంద్రారెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఫిబ్రవరి 24న టికెట్ ప్రకటించగా, అప్పటినుంచి పోటీచేసేది నేనే అంటూ ప్రచారం చేసుకున్నారు. అభ్యరి్థత్వ ప్రకటన వెలువడిన రోజునుంచే టీడీపీ క్యాడర్ ఆయనకు వ్యతిరేకమైంది. క్యాడర్కు కొత్త కావడం, పరిచయాలు లేకపోవడం, మాజీ ఎమ్మెల్యే శంకర్, సీనియర్ నేతల వ్యతిరేకతతో ఇన్నాళ్లు గడచిపోగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తులో టికెట్ బీజేపీకి కేటాయించే పరిస్థితి వచ్చింది. ఇదంతా టీడీపీకి తంబళ్లపల్లె అచ్చిరాకపోడమే అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
గోవాలో ఆటా పాటా
గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్లో రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఓ మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త మాస్ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా
గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. -
రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ టైటిల్?
రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలారోజుల నుంచి అప్డేట్, అప్డేట్ అని కలవరిస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు RC16 లాంచింగ్ డేట్, టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది. గతంలో ఎన్టీఆర్ కోసం అనుకున్న టైటిల్ని ఇప్పుడు చరణ్ మూవీ కోసం ఖరారు చేసుకున్నారనే విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం) 'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'దేవర'.. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న రావాల్సింది. కానీ అక్టోబరుకి వాయిదా వేశారు. మరోవైపు చరణ్ పుట్టినరోజున 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలి. అలానే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కూడా తెగ గింజుకుంటున్నారు. 'గేమ్ ఛేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఇది ఖరారైనప్పటికీ అధికారికంగా మాత్రం ఈ నెల 20న ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే రోజుల 'పెద్ది' అనే టైటిల్తో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ టైటిల్ని గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు దాన్నే చరణ్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం లేదు! కాస్త ఓల్డ్ స్టైల్లో ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
అదన్న మాట మ్యాటర్
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
బాక్సాఫీస్ బద్దలు చేస్తా అంటున్న ఎన్టీఆర్
-
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే
-
దిగజారుడుతనానికి కేరాఫ్ చంద్రబాబే
'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే తన వయసుకు తగ్గట్లు మాట్లాడడం లేదు. ఏదేదో, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి తీసుకు వెళుతున్నారు. రా.. కదలిరా..! అంటూ జరుపుతున్న సభలలో ఎందుకు ప్రజలు కదలి రావాలో చెప్పకుండా, ఎంత సేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిను దూషించే పనిలో ఉంటున్నారు దీంతో టీడీపీ క్యాడర్ ఇంతకీ చంద్రబాబు ఏమి చెప్పారన్న సంశయంలో పడిపోతున్నారు.' కొద్ది రోజుల క్రితం ఇంకొల్లులో జరిగిన సభలో ఆయన తన వయసు, తాను గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానన్న సంగతిని విస్మరించి వైఎస్ జగన్మోహన్రెడ్డిను నోటికి వచ్చినట్లు తిట్టడం శోచనీయం అని చెప్పాలి. ఈ దిగజారుడు మాటల్లో హైలైట్ ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరానికి కాళ్లు పట్టుకుంటాడు.. తర్వాత కాళ్లు లాగేస్తాడు.. అని చంద్రబాబు అనడం. ఇది తన గురించి తాను చెప్పుకోబోయి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నింద మోపినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ఎవరి కాళ్లు పట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఒక్కశాతం కూడా ఓట్లు లేని బీజేపీతో పొత్తుకోసం ఎవరు కాళ్లా, వేళ్ల పడుతున్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. జనసేన సీట్లు, టీడీపీ సీట్లు, అభ్యర్దులను ఖరారు చేయకుండా దేవుడా, దేవుడా అంటూ ప్రార్ధన చేస్తూ కూర్చున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తాను చేసే పనులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబు గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లు ప్రధాని మోదికి దత్తపుత్రులు అని, మోది అంటే భయపడుతున్నారని రంకెలు వేస్తూ స్పీచ్లు ఇచ్చేవారు. చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీకి సరెండర్ అవుతున్నారు? మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడైనా తనకు బీజేపీతో పొత్తు కావాలని మోదిని కాని, అమిత్షాను కాని బతిమలాడారా? లేదే! అయినా చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు పిలుస్తారా.. అన్నట్లుగా, ఆయన కంటి చూపు పడితే చాలు.. అన్నట్లుగా చకోర పక్షిలా వేచి ఉన్న చంద్రబాబు ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. చంద్రబాబు బీజేపీని అవసరమైనప్పుడు కాళ్లావేళ్లపడి బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిని చీ కొట్టి, అవమానించి విడిపోయారు. దానిని కదా అనాల్సింది. అవసరమైతే జుట్టు.. లేకుంటే కాళ్లు అని.. అయినా ఆయన దబాయించి ఎదుటివారిపై నోరుపారేసుకుంటున్నారు.తాను స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా వద్దకు ఎందుకు చంద్రబాబు పంపించారు. కాళ్లు పట్టుకోవడానికా? లేక అమిత్షా చొక్కా పట్టుకోవడానికా? ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్లి అమిత్షాతో సరదా కబుర్లు చెప్పి వచ్చారా? లేక ఆయన వద్ద చేతులు కట్టుకుని కూర్చుని కాళ్లా, వేళ్లాపడి పొత్తు ప్లీజ్ అని బతిమలాడారా? ఏదో తన బినామీ పత్రికలు ఉన్నాయి కదా అని అమిత్షానే రమ్మంటే వెళ్లానని ప్రచారం చేసుకున్నారు. అదే మాట 'షా' తో ఎందుకు చెప్పించలేకపోయారు! తనను కలిసిన పదిరోజులు దాటినా, పొత్తు గురించి చంద్రబాబు ఎదురుచూసేలా అమిత్షా చేశారంటే ఏమిటి దాని అర్ధం!. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ మసీదులు కూల్చేపార్టీ అని ప్రచారం చేశారు. 1998 ఎన్నికల తర్వాత వారి గూట్లో చేరిపోయారు. 2004లో ఓటమి తర్వాత ముస్లీంలకు ద్రోహం చేసే బీజేపీతో కలిసి తప్పు చేశానని, జీవితంలో ఎప్పుడూ కలవబోనని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదిని నరహంతకుడు అనే వరకు వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంటులో దీనికి సంబంధించి ఓటింగ్ జరిగినప్పుడు తన ఎంపీలు జారుకునేలా చేశారు. దీనిని కాళ్లబేరం అని కదా అనాల్సింది. 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసిపొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్లను గాలికి వదలివేసి మళ్లీ బీజేపీ వైపు పరుగులు తీశారు. ఏ మోదినైతే తిట్టారో తిరిగి ఆయన దేశంలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బాబ్బాబు.. ప్లీజ్.. ఈ ఒక్కసారి మన్నించండని కోరింది చంద్రబాబు కాదా! మళ్లీ 2018 నాటికి మోదిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి మోదిని ఉగ్రవాది అని కూడా దూషించిన చరిత్ర చంద్రబాబుది. దానిని కాళ్లులాగడమంటే అనేది. అవన్ని ఎందుకు! చంద్రబాబుకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు నిత్యం పాద నమస్కారాలు చేస్తున్నట్లు నటించి, లటక్కున ఆయనను కుర్చీ నుంచి లాగిపారేసింది చంద్రబాబే కదా! దానిని కదా కాళ్లు లాగేడయమనేది. ఆ దెబ్బకే కదా ఎన్టీఆర్ గుండె ఆగి మరణించింది! అయినా చంద్రబాబు అవేమీ జరగనట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడైనా ఎవరి కాళ్లమీదైనా పడ్డారా? కాళ్లు పట్టుకుని లాగారా? లేదే! ఆయన శంషేర్గా దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న సోనియాగాంధీని, కాంగ్రెస్తో రహస్య బంధం పెట్టుకున్న చంద్రబాబును ఎదుర్కుని, వారు పెట్టిన అక్రమ కేసులను భరించి జైలుకు వెళ్లి, తదుపరి ఎన్నికలలో నిలబడి గెలిచిన ధీశాలి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న సంగతి అందరికి తెలిసిందే. అందువల్ల చంద్రబాబు తన చరిత్ర ఎవరికి తెలయదనుకుని భ్రమపడి ఏదిపడితే అది మాట్లాడితే , ప్రజలకు పాత చరిత్ర గుర్తుకు వస్తుందని మర్చిపోకూడదు. చంద్రబాబు దెబ్బకు వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడ్డాడట. ఇదొక వండర్! ఇలాంటి మాటలు చెప్పడం అంటే వినేవాడు వెర్రివాడులే అన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. డెబ్బై నాలుగేళ్ల వయసులో ప్రజలను మద్యం తాగవద్దు అని చెప్పకుండా, మంచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను.. నాకే ఓటేయండని ఆయన పిలుపు ఇస్తున్నారంటే ఇంతకంటే అద్వాన పరిస్థితి ఉంటుందా! ఎవరు అడ్డువచ్చిన తొక్కివేస్తారట! ఇదేమి గోలో అర్థం కాదు. ఎవరిని తొక్కుతారు! అసలు చంద్రబాబును ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? తెలుగుదేశంకు అంత సీన్ ఉందా! అని చర్చించుకుంటున్న తరుణంలో ఆయనకు ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా ఆయనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి తన ముందు బచ్చా అని చంద్రబాబు అనడం మరో పిచ్చి వ్యాఖ్య. రాజకీయాలలో బచ్చా, బడా అని ఉండరు. ఎన్టీ రామారావు ముందు ఈయన బచ్చానే కదా! ఆయనను ఎందుకు కుర్చీనుంచి లాగి పారేశారు. 2019లో చంద్రబాబును ఎన్నికలలో ఓడించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా ఎలా అవుతారు! హీరో అవుతారు కాని. ఒంటరిగా పోటీచేయడానికి సిద్ధం అవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా అవుతారా? లేక తాను వాళ్ల మద్దతు, వీళ్ల మద్దతు లేకపోతే ఎన్నికలలో నిలబడలేనని భయపడుతున్న చంద్రబాబు బచ్చా అవుతారా! ఇలాగే ఆయన స్పీచ్లు కొనసాగిస్తే.., మతి స్థిమితం లేని మాటలు చంద్రబాబు నోట పదే, పదే వస్తున్నాయని జనం, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ అనుకుంటారు. ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. మరో వైపు ఆయనకు రాజగురువునని భావించే రామోజీరావు అంతకన్నా మతిలేని వార్తలు రాస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం కక్కుతున్నారు. నిజానికి ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాదు విషం చిమ్ముతున్నది. ఏపీ ప్రజలపైన అని చెప్పాలి. ఉన్నవి, లేనివి కల్పించి అబద్దాలు సృష్టించి నానా చెత్త అంతా పోగు చేసి ప్రజలను మోసం చేయాలని రామోజీ చేస్తున్న వికృతచర్యలు కచ్చితంగా ప్రజలందరు అసహ్యించుకునే దశకు చేరుకున్నాయి. చివరికి తెలుగుదేశం క్యాడర్ కూడా చీదరించుకునే పరిస్థితిని రామోజీ తెచ్చుకున్నారు. రామోజీనేమో తన పిచ్చి రాతలతో, చంద్రబాబేమో తన పిచ్చి మాటలతో ఏపీ ప్రజలను విసిగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిస్తే కానీ, వారి పిచ్చి కుదరదేమో! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఆ ఇద్దరు తెలుగు హీరోలే నా ఫేవరెట్: క్రికెటర్ షమి
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మనవరకు మాత్రమే తెలిసేది. కానీ 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ పెరిగింది. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్' మూవీస్.. సౌత్ ఇండస్ట్రీ రేంజుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు.. తెలుగు చిత్రాలకు ఫిదా అయిపోతున్నాతు. తాజాగా టీమిండియా క్రికెటర్ షమి కూడా.. టాలీవుడ్కి వీరాభిమాని అని తేలిపోయింది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) టీమిండియా క్రికెటర్లలో బౌలర్ షమికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్ల నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. అద్భుతమైన విజయాల్లో పాలుపంచుకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇతడితో తెలుగు మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సౌత్లో మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు అని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పాడు. 'దక్షిణాది సినిమాలు చూడటం నాకు ఇష్టం. జూ.ఎన్టీఆర్, ప్రభాస్.. నా ఫేవరెట్ హీరోలు' అని టీమిండియా క్రికెటర్ షమి చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తుంటే.. షమికి మాత్రమే కాదు మిగతా భారత క్రికెటర్లు కూడా తెలుగు సినిమాలు చూస్తుంటారనిపిస్తుంది. కాకపోతే వాళ్లకు ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు. లేదంటే కోహ్లీ కూడా తనకు అల్లు అర్జునో లేదా ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పే సందర్భం రావొచ్చు. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) My Favourite Actors From South #Junior #NTR 🔥🔥 and #PRABHAS 🔥🔥 - #Shami pic.twitter.com/SLbq94nTbq — CHITRAMBHALARE (@chitrambhalareI) February 19, 2024 -
డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న స్టార్ హీరోలు
అభిమాన హీరో ఒక పాత్రలో కనిపించి సింగిల్ ట్రీట్ ఇస్తేనే అభిమానులు ఖుషీ అయిపోతారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే పట్టరాని ఆనందం వారి సొంతం. అలా డబుల్ రోల్లో కనిపించి, డబుల్ ట్రీట్ ఇవ్వడానికి కొందరు హీరోలు రెడీ అయ్యారు. ఆ స్టార్స్ చేస్తున్న ద్విపాత్రాభినయం గురించి తెలుసుకుందాం ► రెండు, మూడు, నాలుగు, పది... ఇలా ఒకే సినిమాలో ఎన్ని పాత్రల్లో అయినా మెప్పించగలరు కమల్హాసన్. అలా సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతిగా ‘ఇండియన్’ (భారతీయుడు) లో కమల్ రెండు పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సేనాపతి, అతని తండ్రి పాత్ర నేపథ్యంలో ఉంటుంది. అంటే.. సేనాపతికి అంత దేశభక్తి రావడానికి అతని తండ్రి ఎలా కారణం అయ్యాడు? అనేది ఈ చిత్రంలో ఉంటుందట. 1920లలో కథ సాగడంతో పాటు ఇప్పటికాలం టచ్ అయ్యేలా స్క్రీన్ప్లే రెడీ చేశారట శంకర్. ఇక తాజా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా నటిస్తున్నారు. ►‘సలార్’ సినిమా తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’తో ప్రభాస్ మరో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పాత్రలో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే డబుల్ ధమాకానే. ఈ సినిమాకి సీక్వెల్గా రూపొందుతున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’లో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. తండ్రీ కొడుకుగా ప్రభాస్ కనిపించే సీన్స్ సరికొత్త అనుభూతిని పంచుతాయని టాక్. ప్రత్యేకించి 1000 మందితో ఫైట్ చేసే ఒక యాక్షన్ సీన్లో ప్రభాస్ రెండో పాత్ర (తండ్రి) ఎంట్రీ ఉంటుందని సమాచారం. ‘సలార్’ తొలి భాగంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేశారు. రెండో భాగంలో పృథ్వీరాజ్ కూడా రెండు పాత్రల్లో కనిపిస్తారట. తొలి భాగంలో ఉన్న బాబీ సింహా, శ్రియా రెడ్డి తదితరులు మలి భాగంలోనూ కనిపిస్తారు. ► ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ‘దేవర’ సినిమా గ్లింప్స్లో ఉన్నాయి. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర చేస్తు్తన్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ అక్టోబర్ 10న విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎన్టీఆర్ తండ్రీకొడుకుగా సందడి చేస్తారని భోగట్టా. యాక్షన్, ఎమోషన్స్తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో ‘ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్’ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే. ► ఒక్క సినిమాలో కాదు.. వరుసగా రెండు చిత్రాల్లో రామ్చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా. మరొకటి బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం. ఇక రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే... సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని భోగట్టా. తనయుడి పాత్రలో ఎన్నికల అధికారిగా, తండ్రి పాత్రలో రాజకీయ నేతగా కనిపించనున్నారట. రెండో పాత్రకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటికొచ్చాయి. అందులో చరణ్ 70ల్లో వ్యక్తిగా ఖద్దరు వస్త్రాలు ధరించి సైకిల్పై వెళుతూ కనిపించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ ప్రత్యేక పాత్రధారులు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్చరణ్ చేస్తున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్చరణ్ అన్న, తమ్ముడు పాత్రల్లో కనిపించనున్నారట. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది. కాగా ‘మగధీర, నాయక్’ చిత్రాల్లో రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. - పోడూరి నాగ ఆంజనేయులు -
దేవర డేట్ ఫిక్స్
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ‘దేవర’. ఈ ఏడాది అక్టోబరు 10న ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబరు 10న సినిమాని విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించారు మేకర్స్. -
తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర'
అనుకున్నదే జరిగింది. గత కొన్నిరోజుల నుంచి 'దేవర' వాయిదా పడిందనే మాట నిజమైంది. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 5న రావట్లేదని, దసరాకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అక్టోబరు 10న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్లానింగ్ క్రేజీగా అనిపించింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ఆర్ఆర్ఆర్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విలన్గా చేస్తున్న సైఫ్ అలీఖాన్కి గాయం, పాటలు-గ్రాఫిక్ వర్క్ పెండింగ్ వల్ల తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఆగస్టు 11న 'పుష్ప 2'కి పోటీగా దీన్ని బరిలో దింపుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. అయితే దసరా కానుకగా అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తున్న 'దేవర'కు బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్లో ప్రభాస్ 'కల్కి'.. ఆగస్టులో బన్నీ 'పుష్ప 2'.. సెప్టెంబరులో పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ అవుతాయి. అక్టోబరులో 'దేవర' వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు సోలో రిలీజ్ కన్ఫర్మ్. చిరంజీవి, బాలయ్య చేస్తున్న సినిమాలు సంక్రాంతికే రిలీజ్ పెట్టుకున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే 'దేవర' రిలీజ్ విషయంలో టీమ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) #Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7 — Jr NTR (@tarak9999) February 16, 2024 -
ఎన్టీఆర్, రామ్ చరణ్ కి పోటీగా రంగంలోకి మంచి విష్ణు..!
-
దేవర విషయంలో అలా జరిగితేనే.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
-
దేవర రిలీజ్ పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడే అవకాశం ఉంది
-
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఎన్టీఆర్, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్కు అందించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ‘‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారాయన.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement