online transactions
-
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్పార్టీ యూపీఐ యాప్లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్ల పవర్ తెలుసా..?ఫిజికల్గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్పార్టీ యూపీఐ యాప్లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు. -
యూపీఐ పేమెంట్స్లో కొత్త రూల్స్.. అవేంటో మీకు తెలుసా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్ అకౌంట్ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్టే చేయాలని బ్యాంకులను కోరింది. ఎన్పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేలా ఆర్బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్పే నెంబర్ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్పే నెంబర్కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్లో యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాయంతో పేమెంట్ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్ఎఫ్సీ ఫీచర్ను తప్పని సరి త్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్ను వినియోగించి ఏటీఎం మెషిన్ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్ చేసి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది. -
యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం!
యూపీఐ ఖాతాదారులకు శుభర్తవార్త. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా యూపీఐ ద్వారా చేసే జరిపే కొన్ని ట్రాన్సాక్షన్లకు సంబంధించిన లావాదేవీల లిమిట్ను పెంచుతున్నట్లు తెలిపారు. తాజాగా, జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో రోజుకు రూ.25,000 నుంచి రూ.1లక్ష వరకు చేసుకునే అవకాశం ఉంది. తాజాగా, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్లలో హాస్పిటల్స్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజులు సైతం ఉన్నాయి. ‘‘యూపీఏ ద్వారా జరిపే వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూపీఐ రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్ను పెంచాలని ప్రతిపాదించాం. ఈ నిర్ణయం ఎవరైతే వినియోగదారులు హాస్పిటల్స్, కాలేజీల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది’’ అని శక్తికాంత్ అన్నారు. ఈ-మ్యాన్డేట్ తప్పని సరి బ్యాంక్ ఖాతాదారులు కేబుల్ బిల్స్, మొబైల్ బిల్స్, ఓటీటీ సబ్స్కిప్షన్, ఇతర నిత్యవసరాలకు చెల్లింపులు జరుపుతుంటారు. వాటినే రికరింగ్ ట్రాన్సాక్షన్ అంటారు. సాధారంగా బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా ఈ రికరింగ్ పేమెంట్స్ లిమిట్ గతంలో నెలకు రూ.15,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని ఆర్బీఐ యోచిస్తుంది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ‘ఈ- మ్యాన్డేట్’ తప్పని చేసింది. ఈ-మ్యాన్డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఈ-మ్యాన్డేట్ ఫారమ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఈ- మ్యాన్డేట్ ఆన్లైన్ ఎస్బీఐ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూపించిన వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఈ -మ్యాన్డేట్ కోసం తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసిన ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తప్పని సరి .ఈ విధానంలో బ్యాంక్ అడిగిన వివరాల్ని ఖాతాదారులు అందించాల్సి ఉంటుంది. అనంతరం, రికరింగ్ పేమెంట్స్ను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. చదవండి👉 నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం -
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది. -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తోంది?
what is upi lite x and how does it work : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 లో యూపీఐ లైట్ ఎక్స్ అనే కొత్త యూపీఐ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ కొత్త యూపీఐ టెక్నాలజీతో వ్యాపారులు, కస్టమర్లు ఆఫ్లైన్లో ఉన్నా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్లో గేమ్ ఛేంజర్గా నిలుస్తున్న యూపీఐ పేమెంట్స్లో మరో టెక్నాలజీ పరంగా మరో అడుగు ముందుకు వేసింది. యూపీఐ లైట్ ఎక్స్ వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో దేశంలో చెల్లింపులకు ప్రధాన వనరుగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విస్తరణకు ఈ విప్లవాత్మక సాంకేతికత మార్గం సుగమం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ లైట్ గత ఏడాది ఆర్బీఐ పరిధిలో ఉన్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ncpi) యూపీఐ లైట్ను ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో యూపీఐ పిన్ అవసరం లేకుండా రూ.200 పేమెంట్స్ చేసుకునే వెసలు బాటు కల్పించ్చింది. తర్వాత ఆ మొత్తాన్ని రూ.500కి పెంచింది. యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏమిటి? యూపీఐ టెక్నాలజీ దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది. అయితే, ఇంటర్నెట్ సదుపాయాలు లేని పల్లెల్లో యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా కేంద్రం యూపీఐ లైట్ ఎక్స్ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు జరిపేందుకు వీలుకలగనుంది. ఈ సదుపాయంతో మీరు పూర్తిగా ఆఫ్లైన్లో ఉన్నప్పుడు డబ్బును పంపవచ్చు లేదంటే రిసీవ్ చేసుకోవచ్చు. కాగా, యూపీఐ లైట్ ఎక్స్ కింద వినియోగదారుడు ఎంత వరకు పంపవచ్చనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్మన్ కు ఉంటుంది. అంబుడ్స్మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వామ్మె అంత నగదు ఉందా! నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం! -
బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్!
పేటీఎం.. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం కస్టమర్లకు అనుగుణంగా సేవలందిస్తు తన వ్యాపారాంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. వన్ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్ను అనేక రెట్లు పెంచుకుంది. కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. అదే క్రమంలో Paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
రూ. 11 లక్షల కోట్లకు చేరిన యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా సెప్టెంబర్లో జరిగిన పేమెంట్ల విలువ రూ. 11 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. 678 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మే నెలతో పోలిస్తే (రూ. 10,41,506 కోట్లు) జూన్లో యూపీఐ డిజిటల్ పేమెంట్లు రూ. 10,14,384 కోట్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలైలో రూ. 10,62,747 కోట్లకు పెరిగాయి. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల విలువ చేసే 657.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తాజా గా పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్లో ఇటు విలువపరంగా అటు పరిమాణంపరంగా యూపీఐ సరికొత్త రికార్డులు నమోదు చేయొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
డబ్బులు వద్దు.. డిజిటల్ ముద్దు
సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు. అన్నిచోట్ల ఆన్లైన్ లావాదేవీలు కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్పే అంటున్నారు. సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు. ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్ల సాయంతో ప్రజలు ఆన్లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్యాంకులలో డిజిటల్కే ప్రాధాన్యం జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది. సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప. -
పేటీఎం చెల్లింపులు ఇక మరింత భద్రం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సేవల్లోని వన్97 కమ్యూనికేష న్స్ (పేటీఎం) జూన్ 30 నాటికి వీసా, మాస్టర్ కార్డ్, రూపేకు సంబంధించి 2.8 కోట్ల కార్డుల టోకెనైజేషన్ను తన ప్లాట్ఫామ్పై పూర్తి చేసినట్టు ప్రకటించింది. పేటీఎం యాప్పై యాక్టివ్గా ఉన్న కార్డుల్లో 80 శాతం కార్డుల టోకెనైజేషన్ ముగిసినట్టు తెలిపింది. చెల్లింపుల వ్యవస్థ మరింత భద్రంగా, సురక్షితంగా చేసే లక్ష్యంతో తీసుకొచ్చిందే టోకెనైజేషన్. ఈ విధానంలో అసలైన కార్డు వివరాలను ప్రత్యామ్నాయ రీడింగ్ కోడ్ (దీన్నే టోకెన్గా పిలుస్తున్నారు)తో భర్తీ చేస్తారు. అసలైన కార్డు వివరాలతో లావాదేవీలు జరగవు కనుక మోసాలకు అవకాశం ఉండదు. పీవోఎస్లు, క్యూఆర్ కోడ్ చెల్లింపులు ఈ టోకెనైజేషన్ విధానంలో జరుగుతున్నాయి. కార్డు, టోకెన్ కోసం అభ్యర్థించిన సంస్థ (మర్చంట్), గుర్తింపు డివైజ్ (మర్చంట్లు వినియోగించే) కలగలసి ఈ కోడ్ ఉంటుంది. దీన్నే టోకెనైజేషన్గా పేర్కొంటారు. ‘‘సురక్షిత, భద్రతతో కూడిన ఆన్లైన్ చెల్లింపులకు పేటీఎం కట్టుబడి ఉంది. ఈ దిశగా ఆర్బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ అన్నది పరిశ్రమకు కీలకమైన మైలురాయి వంటిది. కార్డులను టోకెనైజేజ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, పేటీఎం యాప్పై అమ లు చేశాం’’అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటన విడుదల చేశారు. చదవండి: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్ మహీంద్రా -
డిజిటల్ మోసాలతో జాగ్రత్త..
న్యూఢిల్లీ: ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇందుకోసం పాటించతగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికీ ఎప్పుడూ పాస్వర్డ్లు వెల్లడించరాదని, తమ పరికరాల్లో ’ఆటో సేవ్’, ’రిమెంబర్ (గుర్తుపెట్టుకో)’ ఆప్షన్లను డిజేబుల్ చేయడం ద్వారా డివైజ్లో కీలక వివరాలు ఉండకుండా చూసుకోవాలని సూచించింది. ఖాతాదారులు తమ డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు, సోషల్ మీడియా సెక్యూరిటీకి సంబంధించి అన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. సంక్లిష్టమైన, విశిష్టమైన పాస్వర్డ్ ఉపయోగించాలని, తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ‘ఎన్నడూ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను డివైజ్లో భద్రపర్చుకోవడం లేదా రాసిపెట్టుకోవడం, ఎవరికైనా చెప్పడం లాంటివి చేయొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎన్నడూ మీ యూజర్ ఐడీ/పాస్వర్డ్లు/కార్డ్ నంబరు/పిన్/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలు అడగదు‘ అని ఎస్బీఐ పేర్కొంది. మార్గదర్శకాల్లో మరిన్ని.. ► ఆన్లైన్ లావాదేవీల్లో భద్రత కోసం బ్యాంక్ వెబ్సైట్ అడ్రెస్లో ’https’ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వై–ఫై నెట్వర్క్ల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవద్దు. లావాదేవీ పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ అవ్వాలి. బ్రౌజర్ను మూసివేయాలి. ► యూపీఐ లావాదేవీలకు సంబంధించి మొబైల్ పిన్, యూపీఐ పిన్ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ► గుర్తు తెలియని యూపీఐ అభ్యర్థనలకు స్పందించవద్దు. ఇలాంటి వాటిని తక్షణమే బ్యాంకు దృష్టికి తీసుకురావాలి. నగదును పంపేందుకు మాత్రమే పిన్ అవసరం, అందుకునేందుకు అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ► కస్టమర్లు తమకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగిందని గుర్తిస్తే వెంటనే తమ ఖాతా నుండి యూపీఐ సర్వీసును డిజేబుల్ చేయాలి. ► ఏటీఎం మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజ్ల దగ్గర లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ► ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు, పీవోఎస్, ఏటీఎం మెషీన్లలో లావాదేవీలకు సంబంధించి పరిమితులు సెట్ చేసి ఉంచుకోవాలి. ► మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ విషయానికొస్తే కస్టమర్లు పటిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. తమ ఫోన్లు మొదలైన వాటిల్లో వీలైతే బయోమెట్రిక్ ధ్రువీకరణను ఉపయోగించాలి. ► సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎవరికైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం వెల్లడించడం లేదా వ్యక్తిగత వివరాలను చర్చించడం వంటివి చేయొద్దు. -
Alert: జనవరి 1నుంచి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్!
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. చేసిన మార్పులు జనవరి 1 నుంచి అమలవుతాయని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు చేసిన మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్ లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో కార్డ్,వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్ను ఎంటర్ చేసే పనిలేకుండా టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోకనైజేషన్ అంటే ఏమిటీ? ఆ టోకనైజేషన్ను ఎలా పొందాలో తెలుసుకుందాం. టోకనైజేషన్ అంటే ? వినియోగదారుల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్ జరిపే సమయంలో కార్డ్ వివరాలు సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్ గా ఉంచే వ్యవస్థనే టోకెన్ అంటారు. ట్రాన్సాక్షన్ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్ నెంబర్ను ఎంట్రి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి? ►ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ►ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ► ఇవి కస్టమర్ డివైజ్తో లింక్ అవుతాయి. ►తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది చదవండి: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి -
హ్యాకర్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్
కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్ అటాక్స్ చేసి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్ దాడులకు గురవుతున్నారు. సైబర్ నేరస్తులు దాడులు చేసే విధానం అయితే ఇలాంటి సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. ►ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తారు. ► వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ► బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్లోకి వెళతాయి. ► ఆ మెయిల్స్లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ► ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్వర్డ్ను ఎంటర్ చేయమని అడుగుతారు. ► ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు. సైబర్ దాడుల నుంచి సేఫ్గా ఉండాలంటే ► ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు. ► https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది. ► నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి. ► మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్లపై క్లిక్ చేయవద్దు ► ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్వర్డ్ను ఎప్పుడూ అందించవద్దు. ► ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్వర్డ్లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్నేమ్లు,పాస్వర్డ్లు మీ రహస్యం.మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్వర్డ్ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్ను, సూచనల్ని పాటించి స్కామ్ల నుంచి సురక్షితంగా ఉండండి. -
సంక్షోభంలోనూ రికార్డ్లు, రూ.6.50 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్
కరోనా సంక్షోభంలోనూ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల విలువ రూ.6.50 లక్షల కోట్లకు చేరింది. ఒక్క సెప్టెంబర్లోనే రూ.365 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్సీపీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ అస్బే మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి , లాక్ డౌన్ కారణంగా బ్యాంక్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో యూపీఐ పేమెంట్స్ పెరిగేందుకు దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2021 జనవరి నెల ప్రారంభ సమయంలో 52 శాతంతో యూపీఐ పేమెంట్స్ రూ.4.31లక్షల కోట్లు చేరుకోగా..నెల ముగిసే సమయానికి 58 శాతం పెరిగి రూ.230కోట్ల మేర యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు వెల్లడించారు. ‘యూపీఐ లావాదేవీల విలువ దేశంలో వార్షిక ప్రాతిపదికన రూ.74.34 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నాం. గతేడాది మొత్తం డిజిటల్ పేమెంట్స్ సంఖ్య 5,500 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఇది 7,000 కోట్లు ఉండొచ్చు. ఈ వ్యవస్థలో నెలకు 30 కోట్ల యాక్టివ్ కస్టమర్లు ఉన్నారని అంచనా. ఇందులో యూపీఐ వాటా 20 కోట్లు. దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా వర్తకులు డిజిటల్ విధానంలో పేమెంట్లు చేస్తున్నట్లు దిలీప్ అస్బే చెప్పారు. ప్రారంభంలో అలా.. ఇప్పుడు ఇలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏప్రిల్11,2016 నుంచి యూపీఐ పేమెంట్స్ ప్రారంభమయ్యాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తొలి ప్రారంభ నెల నుంచి ఇప్పటి వరకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2016 ఏప్రిల్ నెల నుంచి ట్రాన్సాక్షన్లు కోట్లతో ప్రారంభం కాగా 2020 సెప్టెంబర్ నెలకు రూ.3 లక్షల కోట్లుకు చేరింది. ఆ నెంబర్ డబుల్ త్రిబులై జులై 2021కి రూ.6లక్షల కోట్లతో రికార్డ్లను క్రియేట్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు చెబుతున్నాయి. చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్ -
అలర్ట్: యోనో యాప్ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే
కరోనా కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) యాప్ యోనోలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను పెంచి, వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు ఎస్బీఐ యోనో యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్లు చేస్తుంది.తాజాగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా యోనోలైట్ యాప్లో 'సిమ్ బైండింగ్' ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. Now online banking is more secure than ever with SBI! Download the latest YONO Lite app now: https://t.co/uP7JXenNsP #YONOLite #YONO #OnlineBanking #SafeBanking #BeSafe pic.twitter.com/lsLluyYXoq — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 'ఇప్పుడు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ గతంలో కంటే మరింత సురక్షితం! సరికొత్త యోనో లైట్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి' అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో ఒక యూజర్కి మాత్రమే అనుమతి ఉంది. యూజర్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కాకుండా వేరే నెంబర్ను ఉపయోగించి లాగిన్ చేసి లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి లేదు. యోనో లైట్ యాప్లో రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం ►ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఎస్బీఐ యోనో లైట్ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి ►యాప్ ఓపెన్ చేసిన తరువాత ఎస్బిఐలో సిమ్ 1 లేదా సిమ్ 2 ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకే సిమ్ ఉంటే సిమ్ సెలక్షన్ అవసరం లేదు. ► అనంతరం మొబైల్ నంబర్ కన్ఫాం కోసం ఓటీపీ అడుగుతుంది. ►ఓటీపీ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ నెంబర్కు ఓటీపీ వస్తుంది ►ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మీ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ►అనంతరం కండీషన్స్కు ఓకే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ►దీంతో మరో సారి మీ నెంబర్కు యాక్టివేషన్ ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి యోనోలైట్ యాప్ను వినియోగించుకోవచ్చు. చదవండి: Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు -
ఆశ పడ్డారా.. అంతా గోవిందా!
శ్రీకాకుళం: కోటి రూపాయల లాటరీ అని మెసేజ్ వస్తుంది. మీ నంబర్ మా లక్కీ డ్రాలో ఎంపికైందని కాల్ వస్తుంది. అకౌంట్ నంబర్ చెప్తే డబ్బులు పంపిస్తామని తీయటి కబురొకటి వస్తుంది.. ఆశ పడ్డారా..? అంతా గోవిందా. ఆన్లైన్ మోసాలు మితిమీరిపోతున్నాయి. మెసేజీలు, కాల్స్ రూపంలో ఖాతాలు ఖాళీ చేయడానికి చోరులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. అప్రమత్తంగా ఉంటే ఈ మోసాల నుంచి బయటపడవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సమాచార తస్కరణ ఏదైనా ఒక సైబర్ నేరం చేయాలంటే మన వ్యక్తిగత సమాచారం అవతలి వ్యక్తికి చాలా అవసరం. ఇలాంటి సమాచారాలను మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించడం ఇప్పుడు ఎక్కువైంది. ఈ విధంగా సేకరించిన సమాచారం ఉపయోగించి ఆర్థిక మోసాలకు, నేరాలకు పాల్పడటం, ఆ వ్యక్తి పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేసి బ్లాక్మెయిల్ చేయటం వంటివి ప్రధానంగా ఉన్నాయి. చోరులు అవలంబించే పద్ధతులు ►సైబర్ నేరగాడు చాలా ఓర్పుగా అవతలి వ్యక్తితో మాట్లాడతాడు. మన బలహీనతలను గుర్తించి కావాల్సిన సమాచారం రాబడతాడు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నంబర్లు, గడువు తేదీ, సీవీవీ కోడ్, ఓటీపీ వంటివి సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి సొమ్మ కాజేస్తాడు. కొన్ని సార్లు సమాచారం పొందేందుకు తను పంపించే లింక్ ఓపెన్ చేసేలా ప్రేరేపించి తన పని కానిస్తాడు. ►మెయిల్, ఎస్ఎంఎస్ పంపించటం, లింక్లు పంపించటం, బ్యాంక్, కస్టమర్ కేర్ ప్రతినిధులమని ఫోన్ చేసి మోసం చేస్తుంటారు. డెబిట్, క్రెడిట్ కార్డు క్లోనింగ్ విధానంలో స్కిమ్మర్ అనే చిన్న ఎల్రక్టానిక్ సాధనం ఉపయోగించి డెబిట్, క్రిడిట్ కార్డు వెనుక వైపు ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్లో ఉన్న కార్డు సమాచారాన్ని అక్రమంగా దొంగలిస్తారు. ►సైబర్ నేరగాళ్లు కీలోగ్గెర్స్ అనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాన్ని ఉపయోగించి ఈ–కామర్స్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్, మెయిల్ సర్వీసెస్ వంటి వాటిలో మన యూజర్ నేమ్, పాస్వర్డ్లను తెలుసుకుంటారు. మనం కంప్యూటర్పై టైప్ చేసే ప్రతి కీస్ట్రోక్, చాట్స్, స్క్రీన్ షాట్లను రికార్డు చేసి ఆ కాని్ఫడెన్షియల్ డాటాను తీసుకుంటారు. ఇలాంటివి సాధారణంగా ఇంటర్నెట్ కేఫ్ సెంటర్లు, స్మార్ట్ ఫోన్ సరీ్వసింగ్ సెంటర్లలో జరుగుతుంటాయి. ఫోన్ రిఫేర్ చేసే వ్యక్తి సెల్ఫోన్లో ఉన్న సమాచారం, ఫొటోలు సేకరించి సైబర్ సంబంధిత నేరాలు చేసేందుకు ఉపయోగించే అవకాశం ఉంది. ►ఫ్రీ పబ్లిక్ వైఫై, ఫ్రీ నెట్వర్క్, హాట్స్పాట్లు వాడటం వల్ల కూడా డేటా, వ్యక్తిగత సమాచారం సేకరించే ప్రమాదం ఉంది. ఇలాంటి నెట్వర్క్ల్లో ఉంటే అన్ సెక్యూరిటీని ఉపయోగించి సైబర్ నేరస్తులు మన సున్నితమైన, పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారంతో పాటు పాస్వర్డ్లను సేకరిస్తుంటారు. ఎలా మెలగాలి..? ►బ్యాంక్, ఫైనాన్షియల్, కస్టమర్ కేర్ ప్రతినిధులమని ఎరైనా ఫోన్ చేసినా మాట్లాడకూడదు. ఈ–మెయిల్, ఎస్ఎంఎస్లు పంపించినా వాటిని ఓపెన్ చేయకూడదు. ఓటీపీలు, పాస్వర్డ్లు, కార్డు నంబర్లు, గడువు తేదీలు నమోదు చేయవద్దు, ఫోన్ చేస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను భద్రంగా రక్షించుకోవాలి. ►ఓపెన్, పబ్లిక్ వైఫై నెట్వర్క్లకు ఎప్పుడూ కనెక్టు కావద్దు. ►సెల్ఫోన్ రిఫేర్కు ఇచ్చేటప్పుడు సిమ్కార్డు, మెమొరీ కార్డులను తీసివేయాలి. ఫోన్ మెమొరీ పూర్తిగా డిలీట్ చేయాలి. సోషల్ మీడియా వంటివి లాగ్ అవుట్ కావాలి. ►బాగా నమ్మకం ఉన్న వారికే రిఫేర్కు ఇవ్వాలి. ►ఇంటర్నెట్లో దొరికే సాఫ్ట్వేర్లను ఎప్పుడు ఇన్స్టాల్ చేయకూడదు. లేటెస్ట్ యాంటీ వైరస్తో అప్డేట్ చేసి ఉంచుకోవాలి. -
ఆన్లైన్ చెల్లింపులకే సై
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ ఆరి్థక లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని నాబార్డ్ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. కోవిడ్–19 లాక్డౌన్, ఆ తరువాత ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది నగదు లావాదేవీలు, కార్యకలాపాలకు డిజిటల్, ఆన్లైన్లనే ఎంచుకున్నారు. 2019 డిసెంబర్లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే గత ఏడాది అక్టోబర్లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి. గతంలో పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి సమయంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్లో ఆర్థిక కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికన్నా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని తెలిపింది. -
డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి భాగా విస్తరించడంతో అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చింది. నగదు చెల్లింపుల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి చిన్న వస్తువు కొనడానికి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. దీంతో ప్రతి రోజు లావాదేవీలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. ఇటువంటి సైబర్ నేరగాళ్ల భారిన పడకండా సౌకర్యవంతంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కార్డు వివరాలను సేవ్ చేయకండి మీరు ఆన్లైన్లో కొనుగోళ్లు చేసేటప్పుడు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయకుండా చూసుకోవడం మంచిది. మనలో చాలా మంది ఆన్లైన్లో త్వరగా చెల్లింపులు చేయడానికి వారి వివరాలను సేవ్ చేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల మీ ఆన్లైన్ కొనుగోలు పూర్తైన తర్వాత మీ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువ. అందుకని, మీ ఆన్లైన్ కొనుగోలు తర్వాత కార్డు వివరాలు సేవ్ చేయకపోవడం లేదా క్లియర్ చేయడం మంచిది. లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడండి డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైనది అనుమానాస్పద యాప్లు, వెబ్సైట్లను వాడకపోవడం. యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న విశ్వసనీయ అధికారిక యాప్లను మాత్రమే ఉపయోగించడం మంచిది. అలాగే, ప్రైవేట్/వర్చువల్ బ్రౌజర్లను, HTTPS://తో ప్రారంభమయ్యే సురక్షిత కనక్షన్లను ఎంచుకుని మరింత భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఆన్లైన్ లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడటం మంచిది. దీనివల్ల మీ కార్డు వివరాలు సేవ్ కావు. పాస్వర్డ్లు షేర్ చేయవద్దు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లు ఎల్లప్పుడూ బలంగా ఉంచేలా చూసుకోవడం మంచిది. పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం, సైబర్ దాడులకు గురికాకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పాస్వర్డ్లు మార్చుతూ ఉండాలి. అలాగే, మీ పాస్వర్డ్లు లేదా ఎటిఎం పిన్ వంటి వివరాలను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంకుకు తెలియజేయండి. ఒన్-టైమ్-పాస్వర్డ్(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. పేవరల్డ్ సీఈఓ ప్రవీణ్ దాబాయ్ మాట్లాడుతూ - "సురక్షితమైన లావాదేవీల కోసం విశ్వనీయ వెబ్సైట్లలో మాత్రమే డెబిట్/ క్రెడిట్ కార్డులను ఉపయోగించాలని, ఓటీపీని ఎవరితోనూ పంచుకోకూడదని, వెర్చువల్ కీ బోర్డును మాత్రమే ఉపయోగించాలని, వెబ్సైట్ నుంచి తప్పనిసరిగా లాగవుట్ అవ్వాలి" అని తెలిపారు. పబ్లిక్ కంప్యూటర్లు/వై-ఫై నెట్వర్క్లు వాడొద్దు ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, ఇతర మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ. కావున పబ్లిక్ పరికరాలు లేదా వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అలాగే ధృవీకరించబడిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్సైట్లు ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలకు ఎక్కువ రక్షణను అందిస్తాయి. మోసపూరిత యాప్లతో జాగ్రత్త.. యాప్ స్టోర్, ప్లే స్టోర్లో కూడా చాలా నకిలీ యాప్లు ఉన్నాయి. వీటిని నెగటివ్ రివ్యూలు, తక్కువ సంఖ్యలో డౌన్లోడ్లు, 'ధృవీకరించబడిన' బ్యాడ్జ్ లేకపోవడం ద్వారా గుర్తించవచ్చు. మీరు మీ స్మార్ట్ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో దృవీకరించబడిందా లేదా అని నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్లను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్, ఎస్ఎమ్ఎస్ మొదలైన వాటికి అనుమతి నిరాకరించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
అలర్ట్ : సిమ్ బ్లాక్ అంటూ లక్షలు మాయం
సాక్షి, భువనేశ్వర్ : మొబైల్ సిమ్కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సాక్షాత్తూ ఒక వైద్యుడిని నిలువునా ముంచేసిన వైనం కలకలం రేపింది. బ్యాంకు అధికారులు, ఇతర నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. చదువుకున్న వారు సైతం సైబర్ మాయగాళ్ల వలలో పడి లక్షల రూపాయలను పోగొట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్కు చెందిన డాక్టర్ సనతాన్ మొహంతి సైబర్ మోసానికి దారుణంగా బలయ్యాడు. కేటుగాడి మాయలోపడి రూ .77 లక్షలకు పైగా నష్టపోయారు. తన మొబైల్ సిమ్ కార్డును త్వరగా యాక్టివేట్ చేసుకోవాలని., లేదంటే బ్లాక్ అవుతుందంటూ ఫిబ్రవరి 9 మహంతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘క్విక్ సపోర్ట్’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంక్ వివరాలను ఇవ్వమని తానే స్వయంగా సిమ్ యాక్టివేట్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతని మాటల్ని విశ్వసించిన మహంతి మరో ఆలోచన చేయకుండా డెబిట్ కార్డు నంబర్, ఇతర బ్యాంక్ వివరాలను యాప్లోని షేర్ చేశారు. అంతే...అదే రోజు సాయంత్రం ఏటీఎం లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు అకస్మాత్తుగా ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఈ వ్యవహారంపై బ్యాంకులో ఫిర్యాదు చేసిన తరువాత కూడా అతని ఖాతాలోని నగదు సర్వం గోవిందా అయిపోయింది. దీంతో ఖంగుతిన్న మహంతి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత తులసీపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో మహంతి మొదట ఫిర్యాదు చేశారు. 25 వేల రూపాయల చొప్పున రెండుసార్లు తన ఖాతాలనుంచి నగదు విత్డ్రా అయిందని డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొత్త ఎటిఎం కార్డు జారీ చేస్తామని, ఇకపై మెసపూరిత లావాదేవీలు జరగవని బ్రాంచ్ మేనేజర్ హామీ ఇచ్చారు. కానీ ఫిబ్రవరి 9నుండి ఫిబ్రవరి 15 వరకు తనకు సంబంధం లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ .67లక్షలు మాయమయ్యాయని తెలిపారు. మొత్తం జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న రూ. 77,86,727 రూపాయలు నష్టపోయానని మహంతి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి తన డబ్బును తిరిగి ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఐఈని ఆశ్రయించారు. -
బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా దేశీ బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో పలువురు నిపుణులు ఈ అంశాలపై దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) డిజిటల్ లావాదేవీలకు ఇటీవల అంతరాయాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కూడా. గత రెండేళ్లలో మూడుసార్లు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలలో కస్టమర్లకు సమస్యలు ఎదురుకావడంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సూచించింది. ఇక మరోపక్క ఇటీవల ఎస్బీఐ డిజిటల్ విభాగం యోనో యాప్లోనూ రెండు రోజులపాటు సమస్యలు ఎదురయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎదురయ్యే డిజిటల్ సమస్యలకు ప్రధానంగా నాలుగు అంశాలు కారణంకావచ్చునంటూ సాంకేతిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. కోవిడ్-19 ఎఫెక్ట్ కొద్ది నెలల క్రితం కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డవున్లకు తెరలేచింది. దీంతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ లావాదేవీలు మరింత జోరందుకున్నాయి. లాక్డవున్ ప్రభావంతో సీనియర్ సిటిజన్లు సైతం డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గు చూపినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా బ్యాంకుల ఆన్లైన్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదాహరణకు రోజుకి 10 లక్షల లావాదేవీలు నమోదయ్యే కొన్ని బ్యాంకులలో గత నెలలో ఈ సంఖ్య 13 లక్షలకు చేరినట్లు ఇండస్వన్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్ శరత్ వర్ఘీస్ పేర్కొన్నారు. స్వల్ప కాలంలో పెరిగిన ఈ డిజిటల్ ట్రాఫిక్ను బ్యాంకులు అంచనా వేయలేకపోయి ఉండవచ్చునంటున్నారు పరీఖ్ కన్సల్టింగ్ నిపుణులు పరీఖ్ జైన్. అదనపు సర్వర్లు కోవిడ్-19 కారనంగా ఉన్నట్టుండి పెరిగిన ఆన్లైన్ ట్రాఫిక్ను తట్టుకునేందుకు బ్యాంకులు అదనపు సర్వర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సుమారు రెండు గంటల సమయంలో ఇందుకు వీలున్నప్పటికీ ఇతర సమస్యలుంటాయి. అయితే సర్వర్ల ఏర్పాటు అవసరం, ఇందుకు అనుమతులు, ఆదేశాల వంటి ప్రాసెస్కు నెల రోజులవరకూ సమయం పట్టవచ్చునంటున్నారు శరత్. ఇలాంటి సమస్యలను బ్యాంకులు తప్పించుకోలేకపోవచ్చు. సర్వర్ల నిర్వహణ బ్యాంకులకు సంబంధించిన డేటాను నిల్వ(స్టోర్) చేసే సర్వర్లను థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. సర్వర్ల ఆధారంగానే రోజువారీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. సాధారణంగా ఈ సర్వర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులకు నియంత్రణలు ఉండవు. ఇటీవల బ్యాంకింగ్ రంగానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్ఙతుల నేపథ్యంలో వ్యయాల తగ్గింపుపై బ్యాంకులు దృష్టిపెట్టాయి. దీంతో సర్వర్ల సామర్థ్యం, నిర్వహణ వంటి అంశాల విషయంలో థర్డ్ పార్టీ సేవలు సైతం కొంతమేర సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సర్వర్లను పర్యవేక్షించే వారి సంఖ్య తగ్గడం, షిఫ్టుల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు శరత్. చదవండి: (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి) అనలిటిక్స్ కీలకం బ్యాంకులు బిజినెస్ను పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఇదేవిధంగా పండుగల వంటి సీజన్లు వీటికి జత కలుస్తుంటాయి. అయితే పెరుగుతున్న కస్టమర్లు, డిజిటల్ లావాదేవీల వంటివి అంచనా వేసేందుకు బ్యాంకులు డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. తద్వారా ఏ సమయంలో ట్రాఫిక్ పెరుగుతున్నదీ లేదా తగ్గుతున్నదీ వంటి అంశాలపై అంచనాలకు అవకాశముంటుంది. దీంతో సిబ్బంది, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునే ప్రణాళికలకు వీలుంటుందని బ్యాంకులకు సాంకేతిక సేవలు అందించే టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలియజేశారు. అయితే కొన్ని సందర్భాలలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అంచనాలు తప్పే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో బ్యాంకులకు సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వేగంగా కొన్ని నివేదికల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం రోజువారీ 10 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి విలువ రూ. 5 లక్షల కోట్లుగా అంచనా. డిజిటల్ లావాదేవీలలో ఇటీవల కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న ఐదేళ్లలో లావాదేవీలు 150 కోట్లకు చేరే అవకాశముంది. విలువలో రూ. 15 ట్రిలియన్లను తాకవచ్చని అంచనా. ఈ స్థాయిలో లావాదేవీలను నిర్వహించాలంటే.. బ్యాంకింగ్, ఐటీ మౌలిక సదుపాయాలను భారీగా పెంపొందించుకోవలసి ఉంటుంది. డేటా సెంటర్లు, క్లౌడ్ తదితర సేవలు, ఏఐ వంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవలసి ఉంటుంది. తద్వారా లావాదేవీల నిర్వహణలో కస్టమర్లతోపాటు.. బ్యాంకులకూ భద్రత, ప్రమాణాలు, నిలకడ, అవసరానికి తగ్గ నిర్వహణకు వీలుంటుందని సాంకేతిక నిపుణులు వివరించారు. -
ఫోనే.. పర్సులాగా
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణిని తగ్గించి, ఆన్లైన్ లావాదేవీలు పెంచాలనే లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం రంగ ప్రవేశంతో చెల్లింపులు చాలా సులభమయ్యాయి. చివరికి కిరాణా షాపులో అర్ధ రూపాయి పెట్టి చాక్లెట్ కొనుక్కున్నా సరే మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి క్షణాల్లోనే రియల్టైమ్లో నగదు పంపించే యూపీఐ విధానం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. ఇప్పటికే సింగపూర్ప్రభుత్వం యూపీఐ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. విజయవంతం కావడంతో వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా యూపీఐ విధానం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అంతర్జాతీయ ఐటీ కంపెనీ గూగుల్ కూడా యూపీఐ విధానాన్ని అమెరికాలో అమలు చేయాలంటూ ఫెడరల్ బ్యాంకుకు లేఖ రాసింది. అమెరికా ఫెడరల్ బ్యాంకు 24 గంటలు నగదు బదిలీ చేసే విధంగా ఆర్టీజీఎస్ను అభివృద్ధి చేయనున్నట్లు గత నవంబర్లో ప్రకటించడంతో గూగుల్ ఈ సూచన చేసింది. కార్డులను దాటేసిన యూపీఐ లావాదేవీలు 2018 వరకు ఆన్లైన్ లావాదేవీల్లో అగ్రస్థానంలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులు ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఆ హోదాను కోల్పోయాయి. జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య కార్డు లావాదేవీల సంఖ్యను మించిపోయింది. ఆ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లు కాగా, కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఏప్రిల్లో రూ.1.42 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా, నవంబర్ నాటికి రూ.1.89 లక్షల కోట్లకు చేరాయి. సంఖ్యాపరంగా చూస్తే 2019 నవంబర్లో 121.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2016లో యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు ఈ సంఖ్య నెలకు కేవలం లక్ష వరకు ఉండేది. రెండు రెట్లు పెరిగిన లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 2019 జూలై–సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో యూపీఐ లావాదేవీలు సుమారు రెట్టింపయ్యాయి. 2019లో సంఖ్యాపరంగా ఇప్పటిదాకా 270 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే కాలంలో లావాదేవీల విలువ 189 శాతం వృద్ధితో రూ.4.6 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఇండియా డిజిటల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. ప్రవేశపెట్టిన మూడేళ్లలోనే యూపీఐ లావాదేవీల విలువ జీడీపీలో 10 శాతానికి చేరుకుంది. వచ్చే నాలుగేళ్లలో యూపీఐ లావాదేవీల విలువ రెట్టింపు అవుతుందని అసోచామ్–పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. 2019లో యూపీఐ లావాదేవీల సంఖ్య -
ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..!
భోపాల్ : విదేశాల నుంచి బ్లాక్ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారని హుకుం సింగ్ అనుకున్నాడు. తన ఖాతాలో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు మోదీజీయే ఇస్తున్నారని దర్జాగా ఖర్చు చేసుకున్నాడు. తీరా చూస్తే.. అవి తన పేరుతోనే ఉన్న మరొకరివని, బ్యాంకు అధికారుల పొరపాటుతో తన ఖాతాలోకి వచ్చిన సొమ్ము అని తేలడంతో అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్ లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరగడం రోజూ చూస్తునే ఉన్నాం.. అకస్మాత్తుగా అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవడం.. అనుకోకుండా డబ్బులు జమ అవ్వడం సర్వసాధారణమైన విషయంగా మారింది. తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బింద్ జిల్లా రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ తను సంపాదించిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆరు నెలల్లో మొత్తం రూ. 140,000 వేలు జమచేశాడు. అనంతరం ఊరికి తిరిగి వచ్చిన సదరు వ్యక్తికి డబ్బులు విత్ డ్రా చేద్ధామని ప్రయత్నించగా అకౌంట్లో కేవలం రూ. 35,400 ఉన్నట్లు కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై బ్యాంకు అధికారులు విచారించగా.. ఒకే అకౌంట్ నెంబర్పై రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హుకుం సింగ్(రురై గ్రామం).. హుకుం సింగ్ (రోనీ గ్రామం). ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు ఒకే బ్రాంచ్ ఆలంపూర్లో అకౌంట్ తీయడంతోపాటు ఇద్దరు పేర్లు కుడా ఒకటే అవ్వడంతో కంగారుపడ్డ బ్యాంకు మేనేజర్ ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్ కేటాయించాడు. ఇక రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఖాతాలో వేసిన డబ్బులు..రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్ విత్ డ్రా చేశాడని నిర్ధారణకు వచ్చిన బ్యాంకు అదికారులు ఈ తప్పిదమంతా బ్యాంకు మేనేజర్ రాజేష్ సోంకర్ వల్లే జరిగిందని అంగీకరించారు. అనంతరం అతడిని పిలిచి బ్యాంకు అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎన్నికల సమయంలో నల్లధనాన్నివెనక్కి తీసుకు వచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానని అప్పట్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రస్తుతం తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. అందుకే ప్రతి నెల అకౌంట్లో వచ్చిన డబ్బులను తీసుకున్నానని, అవి తనకు చాలా అవసరమయ్యాయని వెల్లడించాడు. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. చివరికి వాస్తవం తెలుసుకున్న హుకుం సింగ్ నిరాశపడ్డాడు. అయితే తమ తప్పిదాన్ని అంగీకరించిన బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రయత్నించారని బాధితుడు ఆరోపించాడు. ఇక ఈ సమస్యను బ్యాంకు అదికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి!.. -
ధరాభారానికి ఆన్లైన్ ‘ఔషధం’!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయంలో ఈ–కామర్స్ లావాదేవీలు పెరుగుతున్నట్టే... ఫార్మసీ రంగంలోనూ ఆన్లైన్ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో... అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్ 18.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందనేది కన్సల్టెన్సీ సంస్థ ఈవై (ఎర్నస్ట్ అండ్ యంగ్) అంచనా. స్మార్ట్ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై అభిప్రాయపడింది. ఈ నివేదిక మేరకు... ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందు బాటులో ఉన్న మార్కెట్ పరిమాణం సుమారు 9.3 బిలియన్ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్ ప్లాట్ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయాలు పెరుగుతుండటం సైతం ఈ–ఫార్మసీ మార్కెట్కు తోడ్పడుతోంది. ‘మొబైల్స్ వినియోగం పెరగటం, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్లో ఈ–కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్లో భాగమైన ఆన్లైన్ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి‘ అని ఈవై ఇండియా పార్ట్నర్ (ఈ–కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ విభాగం) అంకుర్ పహ్వా చెప్పారు. ప్రభుత్వ వ్యయాల తోడ్పాటు.. వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటం వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35 శాతం ఫార్మా మార్కెట్ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65 శాతం.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్లో 85 శాతం వాటాను, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్లో 40 శాతాన్ని ఈ– ఫార్మసీలు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది. అంతర్జాతీయ సంస్థల దూకుడు.. రాబోయే రోజుల్లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొంది. ఫిన్టెక్, హెల్త్టెక్ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్లోకల్ సంస్థలు (ఫుడ్ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది. -
ఖాతాల్లోకి.. ఎన్నికల భత్యం
భూపాలపల్లి అర్బన్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఆన్లైన్లోనే అలవెన్స్లు చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు రోజుల విధులకు సంబంధించిన టీఏ, డీఏలను నేరుగా సిబ్బం ది వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరిస్తున్నారు. డిసెంబర్ 7న నిర్వహించే పోలింగ్ కోసం అధికారం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈవీఎంలు వీవీ ప్యాట్లు జిల్లాకు చేరాయి. ప్రతి ఉద్యోగి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. మొత్తం 42 అంశాలతో ఎన్నికల సిబ్బంది వివరాలను వెబ్సైట్లో పొందుపర్చుతున్నారు.సర్వం సన్నద్ధంజిల్లాలో 4,44,445 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 572 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పూర్తిస్థాయి నియోజకవర్గాల్లో 2,288 మంది పోలింగ్ ఆఫీసర్లు, 572 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 572 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల కేటాయింపు పూర్తి చేశారు. రెండు దశల్లో ఈవీఎంల పరిశీలన సైతం చేపట్టారు. జిల్లా స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్ఓ), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఏఆర్ఓ)కు శిక్షణ పూర్తి అయ్యింది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి సంబంధించిన కరదీపికలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు చేరాయి. పోలింగ్ బూత్ల వారీగా అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపా«ధ్యాయులకు ఈనెల 15 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగుల వివరాల సేకరణ.. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉద్యోగి పేరు, పనిచేస్తున్న గ్రామం లేదా పట్టణం వివరాలు, ఉద్యోగ విరమణ సమయం, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా..? జీతభత్యాలు, బ్యాంకు ఖాతా, సదరు బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ లాంటి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు. అలవెన్స్ పంపిణీలో పారదర్శకత ఈ ఎన్నికల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలవెన్స్లు నేరుగా వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. ఇతర సిబ్బందికి వ్యక్తిగత ఖాతాల్లోనే జమా చేస్తారు. అధికారులు, ఉద్యోగుల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలనే లక్ష్యంతో నమోదు ప్రక్రియను వేగం చేశారు.ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 572 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పూర్తిస్థాయి నియోజకవర్గాల్లో 2,288 మంది పోలింగ్ ఆఫీసర్లు, 572 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 572 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల కేటాయింపు పూర్తి చేశారు. రెండు దశల్లో ఈవీఎంల పరిశీలన సైతం చేపట్టారు. జిల్లా స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్ఓ), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఏఆర్ఓ)కు శిక్షణ పూర్తి అయ్యింది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి సంబంధించిన కరదీపికలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు చేరాయి. పోలింగ్ బూత్ల వారీగా అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపా«ధ్యాయులకు ఈనెల 15 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగుల వివరాల సేకరణ.. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉద్యోగి పేరు, పనిచేస్తున్న గ్రామం లేదా పట్టణం వివరాలు, ఉద్యోగ విరమణ సమయం, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా..? జీతభత్యాలు, బ్యాంకు ఖాతా, సదరు బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ లాంటి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు. అలవెన్స్ పంపిణీలో పారదర్శకత ఈ ఎన్నికల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలవెన్స్లు నేరుగా వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. ఇతర సిబ్బందికి వ్యక్తిగత ఖాతాల్లోనే జమా చేస్తారు. అధికారులు, ఉద్యోగుల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలనే లక్ష్యంతో నమోదు ప్రక్రియను వేగం చేశారు. -
చెక్బౌన్స్ అయితే.. తక్షణ పరిహారం
సాక్షి, అమరావతి: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్నా బ్యాంకు చెక్కులకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గడం లేదు. న్యాయస్థానాల్లో పెరిగిపోతున్న చెక్ బౌన్స్ కేసులే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 45 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులున్నాయని అంచనా. ఒక చెక్ బౌన్స్ కేసు పరిష్కారం కావడానికి సగటున నాలుగేళ్లు పడుతోందని ఒక సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కేసుల సంఖ్య పెరిగి పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుండటం బాధితుడికి సరైన ప్రయోజనం లభించడం లేదు. దీంతో నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ 1881కి కీలక సవరణలు చేశారు. ఈ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. దీనివల్ల చెక్ బౌన్స్ కేసుల విచారణ వేగంగా పరిష్కారమై విలువైన సమయంతో పాటు కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా.. ఆర్థిక లావాదేవీల్లో హామీగా చెక్కులివ్వడం పరిపాటి. ఒక వ్యక్తి నుంచి నగదు తీసుకున్నా, లేక సరుకు తీసుకున్నా ఆ మొత్తానికి హామీగా పోస్ట్డేటెడ్ చెక్కులు తీసుకుంటారు. కానీ లావాదేవీల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుంటాయి. ఇలా బౌన్స్ అయిన వాటిపై కోర్టులకు వెళుతుంటారు. కానీ ఇక నుంచి చెక్బౌన్స్ అయితే ముందుగా చెక్ ఇచ్చిన మొత్తంలో 20 శాతం కట్టడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్లో సెక్షన్ 143ఏ వచ్చి చేరింది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం చెక్బౌన్స్ కేసులను క్రిమినల్ నేరంగా భావించి గరిష్టంగా రెండేళ్ల వరకు జైళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ కేసు తేలే వరకూ బాధితుడికి ఒక్క పైసా కూడా రావడం లేదు. కింది కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా.. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనివల్ల చెక్ తీసుకున్న వాళ్లు సరుకులు, డబ్బులు ఇచ్చి అవి తిరిగిరాక ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిని అరికట్టడానికి చట్టంలో మూడు కీలక మార్పులు చేశారు. 1. మధ్యంతర పరిహారం చెక్ బౌన్స్ అయ్యిందంటూ కోర్టుకు వెళితే తక్షణమే మధ్యంతర పరిహారం ఇచ్చే హక్కులను సెక్షన్ 143ఏ కల్పిస్తోంది. దీని ప్రకారం చెక్ ఇచ్చిన మొత్తంలో 20 శాతం వరకు బాధితుడికి చెల్లించేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేయవచ్చు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కేసు పూర్తయ్యేలోగా కనీసం కొంత మొత్తమైనా బాధితుడికి లభించనుంది. ఇప్పటి వరకు కేసు పూర్తి విచారణ అయ్యి తుది తీర్పు వచ్చే వరకూ ఎటువంటి చెల్లింపులు చేయడానికి అవకావం ఉండేది కాదు. 2. అప్పీల్కి వెళితే డిపాజిట్ చేయాలి ఒక వేళ కింది కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని చెక్ ఇచ్చిన వ్యక్తి భావించి పై కోర్టులో సవాల్ చేయాలంటే.. కింది కోర్టు తీర్పు ఇచ్చిన నష్టపరిహారంలో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. 3. ఓడిపోతే వడ్డీతో సహా చెల్లించాలి ఒకవేళ చెక్ బౌన్స్ అయ్యిందంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి సహేతుక కారణాలు చూపించలేకపోతే.. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీతో సహా చెక్ ఇచ్చిన వారికి చెల్లించాల్సి ఉంటుంది. -
ఖజానాలో ఆన్లైన్ లావాదేవీలు
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ ఈ నెల రెండు నుంచి ప్రారంభమైంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు, పింఛన్లను ఖజానాల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఉద్యోగుల వేతనాలను ఈ – కుబేర్ విధానంలో చెల్లించనున్నారు. గతంలో సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఖజానా కార్యాలయాల్లోని ఎస్టీఓలకు బిల్లులు సమర్పించే వారు. వారు పరిశీలించి ఏటీఓలకు, అక్కడ ఆమోదించిన అనంతరం బిల్లులను బ్యాంకులకు పంపించేవారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగేది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే వేతనాల చెల్లింపు నాలుగైదు రోజుల పాటు జాప్యం జరిగేది. ఈ – కుబేర్తో అక్రమాలకు చెక్ తాజాగా చేపట్టిన ఈ – కుబేర్ విధానంలో అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. దీని వల్ల డీడీఓలకు జవాబుదారీతనం పెరగనుంది. గతంలో బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వోద్యోగులు రోజుల తరబడి ఖజానా కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. అయితే ప్రస్తుత విధానంతో సమస్య తీరనుంది. వేతనాలు, ఇతర బిల్లులను ఈ – కుబేర్ విధానంలో ఆన్లైన్లో పొందుపరిస్తే ఖజానా అధికారులు బిల్లులను పరిశీలించి ఆయా బ్యాంకులకు నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులదే బాధ్యత జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయం, 15 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 26400 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెలా రూ.96 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 23500 మంది పింఛనర్లకు ప్రతి నెలా రూ.54 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి నెలా రూ.25 నుంచి రూ.30 కోట్ల ఇతర బిల్లులను మంజూరు చేస్తున్నారు. ఈ – కుబేర్ విధానంలో వేతనాలు, బిల్లులు అధికంగా లేదా తక్కువగా చెల్లించినా దానికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా ఖజానా, సబ్ ట్రెజరీ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఒకట్రెండు శాఖల మినహా అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను చెల్లించారు. ఇతర బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఆన్లైన్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏ సెక్షన్ వారు ఏయే శాఖల బిల్లులు చెల్లిస్తున్నారనే వివరాలను సేకరించాల్సి ఉంది. సెక్షన్ల వారీగా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు పాస్వర్డ్ను కేటాయించాల్సి ఉంది. దీని తర్వాత శాఖల వారీగా ప్రత్యేక నంబర్లను కేటాయించి పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ యథావిధిగా జరగనుంది. ప్రక్రియ ద్వారా అక్రమాలు జరిగే అవకాశం లేకపోయినా ఈ – కుబేర్లో లోపాలను కనుగొని మామూళ్లు వసూలు చేసే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే కానీ బిల్లులు కదలని శాఖలో ఈ – కుబేర్ ఎంత వరకు ఫలితాలను తీసుకొస్తుందో వేచ్చి చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ప్రభుత్వోద్యోగుల వేతనాల చెల్లింపు, పింఛన్లను ఈ నెల రెండు నుంచి ఈ – కుబేర్ విధానంలో చెల్లిస్తున్నాం. ఒకట్రెండు రోజులు జాప్యం జరిగినా వేతనాలు, పింఛన్లను చెల్లించాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సెక్షన్ల వారీగా ప్రత్యేక పాస్వర్డ్లను కేటాయించాల్సి ఉంది. ప్రక్రియ పూర్తయి బిల్లులు మంజూరు చేయడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. –ఉదయలక్ష్మి, జిల్లా ఖజానా శాఖ డీడీ -
డిమానిటైజేషన్కు ఏడాది.. ఇప్పటికీ కింగ్ అదే..!
సాక్షి, చెన్నై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు పెద్దనోట్ల రద్దును చేపట్టామని పాలకులు ఘనంగా చెప్తున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటికీ నగదురహిత లావాదేవీలు నత్తనడకనే సాగుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నగదురహిత లావాదేవీల్లో కీలకమైన వ్యాలెట్లు, నాన్ యూపీఐ బ్యాంకింగ్ యాప్లు, ఆధార్ సహిత చెల్లింపులు అనుకున్నంతగా ఊపందుకోలేదు. మరోవైపు డెబిట్కార్డు లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. ఇక పెద్దనోట్ల రద్దు తర్వాత.. యూపీఐ చెల్లింపులు పెరుగుతుండటం సానుకూల అంశం. యూపీఐ చెల్లింపుల్లో మొబైల్ ఫోన్ల ఆధారంగా జరుగుతున్న లావాదేవీలే అధికం. మొత్తంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ. 200 ట్రిలియన్లకు చేరాయి. 2016 ఆగస్టుతో పోలిస్తే 5 శాతం పెరుగుదల నమోదైంది. అయితే, పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న గత డిసెంబర్ (రూ. 201 ట్రిలియన్లు)తో పోలిస్తే 0.7శాతం డిజిటల్ చెల్లింపులు తగ్గడం గమనార్హం. కొన్ని క్యాటగిరీల్లో డిజిటల్ చెల్లింపులు పెద్దనోట్ల రద్దు ముందు కన్నా తక్కువస్థాయికి పడిపోవడం గమనార్హం. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే 30శాతానికి పడిపోయింది. పెద్దనోట్ల రద్దు తీవ్రంగా ఉన్న కాలంతో పోల్చుకుంటే 46శాతానికి ఇది పడిపోయింది. ఇక డెబిట్ కార్డు చెల్లింపులు కూడా తగ్గిపోయాయి. గత ఏడాది అక్టోబర్లో డెబిట్ కార్డు చెల్లింపులు రూ. 2,767 బిలియన్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 2.2శాతం తగ్గి.. రూ. 2,706 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ (లావాదేవీలు) మాత్రం నాలుగు శాతం పెరిగాయి. ఇక, పెద్దనోట్ల రద్దు వల్ల మొబైల్ బ్యాంకింగ్, వ్యాలెట్ సేవలు పెరగడం ప్రధాన లబ్ధి చెప్తున్నా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో మొబైల్ బ్యాంకింగ్ వాటా 0.33శాతమే (రూ. 799.13 బిలియన్లు) కావడం గమనార్హం. పేటీఎం, మొబిక్విక్, బ్యాంకింగ్ వ్యాలెట్లు ఇలా.. మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరుగుతున్న చెల్లింపులు కూడా స్వల్పంగానే ఉన్నాయి. మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో మొబైల్ వ్యాలెట్ల వాటా కేవలం 0.051శాతమే (రూ. 102.88 బిలియన్లు)... ఇప్పటికీ కింగ్ క్యాషే..! మొత్తానికి పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా నగదు లావాదేవీలు గణనీయంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రజలు ఇప్పటికీ నగదు కోసం ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఎటీఎంల నుంచి చిన్నచిన్న మొత్తాలను తీసుకొని తమ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా పదిశాతం తక్కువ నగదు ప్రస్తుతం చెలామణిలో ఉంది. అయినా, నగదు లావాదేవీలకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఆన్లైన్ మోసాలపై కస్టమర్లకు భారీ ఊరట
ముంబై: ఆన్లైన్ అక్రమ లావాదేవీలపై కస్టమర్ల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లో అక్రమాల బారిన పడి నగదు నష్టపోతున్న ఖాతాదారులకు భారీ ఊరట నిచ్చేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా చోటు చేసుకునే అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి జాగ్రత్తలు, ఇతర భద్రతా అంశాలపై సూచనలతో కూడిన ఒక నోటిఫికేషన్ను ఆర్బీఐ విడుదల చేసింది. ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీల ద్వారా డబ్బు కోల్పోతున్నామని ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలనే దానిపై ఆర్బీఐ బ్యాంకులకు, ఖాతాదారులకు సూచనలు ఇచ్చింది. ఖాతాదారుల హక్కులు, అభ్యంతరాలను ఎలా పరిష్కరిస్తారో తెలపాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ లావాదేవీల భ్రదత, నష్టనివారణపై హామీ,నిబంధనలపై వివరణ యిస్తూ ఆర్బీఐ ఈ సూచనలు అందించింది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తమ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్బీఐకి తెలియజేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు ఆయా ఖాతాదారులకు వెనక్కి చెల్లించే అవకాశం ఉంది. మూడు పనిదినాలు కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ మోసాలకు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. లోపం బ్యాంకు వైపునుంచి లేదా ఖాతాదారులవైపు నుంచి లేదని తేలితే ఉంటే ఖాతాదారు డబ్బు నష్టపోవాల్సిన పని లేదు. అయితే డబ్బు కోల్పోయిన మూడు పనిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు పనిదినాల్లోగా తెలియజేసినట్లయితే, బ్యాంకు ఖాతాదారు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకూ నష్టాన్ని భరించాల్సి రావచ్చు. ఇది అకౌంట్, క్రెడిట్ కార్డు పరిమితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మోసపూరిత లావాదేవీ గురించి 7 రోజుల తర్వాత బ్యాంకుకు తెలియజేసినట్లయితే అప్పుడు ఖాతాదారు భరించాల్సిన నష్టం బ్యాంకు పాలసీ పైన ఆధారపడి ఉంటుంది. ఖాతాదారు నిర్లక్ష్యంగా ఉంటే ఖాతాదారు నిర్లక్ష్యం( పిన్, ఇన్టైంపాస్వర్డ్ తదితర వివరాలు వెల్లడించడం ద్వారా) కారణంగా మోసం జరిగి ఉంటే మాత్రం ఈ నష్టాన్ని కస్టమరే భరించాల్సి ఉంటుంది. బ్యాంకు భరించదు. అయితే ఇక్కడ కస్టమర్లకు మరో సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఒకసారి అనుమానాస్పద లేదా అనధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియజేసిన వెంటనే మళ్లీ ఏదైనా అనుమానస్పద లావాదేవీ జరిగితే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు ఎలక్ట్రానిక్ లావాదేవీలు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎమ్, పాయింట్ ఆఫ్ సేల్స్ మొదలైన అన్ని రకాలుగా జరిగే నగదు సంబంధిత వ్యవహారాలుగా పరిగణిస్తారు. కస్టమర్కు సంబంధించి నష్టం భరించాల్సి రావడం ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిన తర్వాత బ్యాంకు ఖాతాదారు సదరు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అనధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 పనిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెనక్కు వస్తుందనే అంశం అనధికారిక లావాదేవీ జరిగిన రోజు ఎంత డబ్బు మినహాయించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. నోటిఫికేషన్ తేదీ నుంచి ఫిర్యాదు చేసిన 10 పని రోజులలో అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీ మొత్తాన్ని బ్యాంక్ క్రెడిట్ చేస్తుంది. అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో వినియోగదారు బాధ్యత రుజువు చేసే భారం బ్యాంకుపై ఉంటుందని ఆర్బీఐ తన నోటిషికేషన్ లో తెలిపింది. అటువంటి లావాదేవీల సంభవించిన తరువాత అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలని వినియోగదారులకు సూచించింది. అలాగే బ్యాంకులు కూడా ఖాతాదారులను నిరంతరం అప్రమత్తం చేయాలి. ఆన్లైన్ మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు, బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ ద్వారా అనధికారిక, మోసపూరిత లావాదేవీల గురించి నిత్యం వినియోగదారులకు సమాచారం అందించాలి. అంతేకాదు మోసపూరిత లావాదేవీలు జరిగిన సందర్భంలో కస్టమర్ ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశాన్ని స్పష్టంగా సూచించాలని కోరింది. ఈ ఫిర్యాదు కోసం బ్యాంకు బహుళ ఛానల్స్ ద్వారా (కనీసం, వెబ్ సైట్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్, ఐవీఆర్, ప్రత్యేకమైన టోల్ ఫ్రీ హెల్ప్లైన్లు, హోమ్ బ్రాంచ్కు ) ద్వారా 24x7 వినియోగదారుకు అందుబాటులో ఉంచాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది. -
ఎస్బీఐ బాదుడు షురూ..
♦ ఖాతాల్లో ఎక్కువ డబ్బులుండేవారికి మినహాయింపు ♦ కనీస బ్యాలెన్స్ రూ. 25వేలు దాటితే ఎన్ని లావాదేవీలైనా ఫ్రీ ♦ అంతకన్నా తక్కువుంటే మాత్రం పరిమితులు.. భారీగా చార్జీల వడ్డన ♦ ఆన్లైన్ లావాదేవీలు కూడా నెలకు 40 మాత్రమే ఉచితం ♦ చిరిగిన నోట్లు మార్చాలన్నా డబ్బు కట్టాల్సిందే ♦ పొదుపును ప్రోత్సహించటానికేనంటూ అధికారుల విచిత్ర భాష్యం అమరావతి, సాక్షి బిజినెస్ ప్రతినిధి ఒక వంకేమో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి... వాటి బదులుగా తక్కువ స్థాయిలో నగదు అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఇంతకు ముందు మాదిరిగా ప్రతి లావాదేవీనీ క్యాష్తో చేస్తామంటే కుదరదు. క్యాష్ తక్కువ ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. వీలైనంత వరకూ డిజిటల్ లావాదేవీలే జరపండి’’ అనేది ప్రధానితో సహా దాదాపు ప్రతి మంత్రీ, అధికారీ చెప్పిన మాట. జనం కూడా విధిలేక డిజిటల్ బాట పట్టారు. ఇదే అదనుగా పుంఖాను పుంఖాలుగా డిజిటల్ వాలెట్లు పుట్టుకొచ్చాయి. మన డబ్బుకు సరైన భద్రత ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయా వాలెట్ల ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇంతలో మరో పిడుగు పడింది. దేశంలో అత్యధికులు వినియోగించే ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ప్రతి లావాదేవీకీ పరిమితిని విధిస్తూ... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిని కూడా నడ్డి విరిచే కార్యక్రమానికి తెరతీసింది. ముఖ్యంగా ఆరు రకాల లావాదేవీలపై ఎస్బీఐ విధించిన పరిమితులు, చార్జీలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిమితులను దాటి వినియోగిస్తే లావాదేవీలపై చార్జీలు, సేవా పన్ను రూపంలో ఖాతాదారుడి జేబు గుల్లవటం ఖాయం. దేశీయ అతిపెద్ద బ్యాంకే ఈ విధంగా చార్జీలను అమలు చేస్తుండటంతో ఇదే బాటను అనుసరించడానికి ఇతర బ్యాంకులు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎస్బీఐ చార్జీలపై వచ్చిన స్పందన చూశాక అమలు చేయాలన్నది వీటి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసుకోలేక ఎన్పీఏలుగా ప్రకటిస్తున్న బ్యాంకులు... ఆదాయం పెంచుకోవటానికి ఇలాంటి కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నట్లున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్బీఐ చార్జీల వివరాలివీ... ఏటీఎం లావాదేవీలపై.. ఉచిత ఏటీఎం లావాదేవీలను ఇప్పుడు కనీస నిల్వలతో అనుసంధానం చేశారు. ఖాతాలో ప్రతి నెలా నిల్వ ఉన్న సగటు ఆధారంగా ఈ చార్జీలను విధిస్తారు. కనీస నిల్వ రూ.25,000 దాటి ఉంటే లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. సాధారణ సేవింగ్ అకౌంట్స్పై మెట్రో నగరాల్లో అయితే ప్రతి నెలా 8 లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5 + ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3) ఉచితం. అదే నాన్ మెట్రో పట్టణాలు అయితే 10 లావాదేవీల (5 ఎస్బీఐ ఏటీఎం, 5 ఇతర బ్యాంకుల ఏటీఎంలు) వరకు ఉచితం. ఈ ఏటీఎం లావాదేవీలు కాకుండా ప్రతి నెలా బ్యాంకు శాఖ నుంచి రెండుసార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో అయితే నెలకు 40 లావాదేవీలు మాత్రమే ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇవి దాటితే మాత్రం... చార్జీల వడ్డన తప్పదు. సాధారణ బ్యాంకు ఖాతాదారులు ఈ పరిమితులకు లోబడే లావాదేవీలు చేస్తుంటారని, అందుకని తాజా నిబంధనలతో వారికెలాంటి ఇబ్బందీ ఉండదనేది బ్యాంకు అధికారుల మాట. బేసిక్ సేవింగ్ ఖాతాలైతే... గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లావాదేవీలు పెంచడానికి ప్రారంభించిన బేసిక్ సేవింగ్స్ ఖాతాలైతే చార్జీల ప్రభావం కాస్త ఎక్కువే పడుతుంది. బేసిక్ ఖాతా ఉన్న వారు నెలలో నాలుగు సార్లు (ఏటీఎంతో కలిపి) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే నేరుగా బ్యాంకు శాఖ నుంచి తీసుకుంటే రూ. 50 చార్జీ వేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అయితే రూ. 20, ఎస్బీఐ ఏటీఎం నుంచి అయితే రూ. 10 చెల్లించాలి. ఈ రుసుములకు సేవా పన్ను అదనం. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపును ప్రోత్సహించడానికే విత్డ్రాయల్స్పై పరిమితులు విధించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు!!. బడ్డీ వాలెట్ మరింత భారం ఎస్బీఐ ప్రవేశపెట్టిన బడ్డీ వాలెట్ను ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేసుకుంటే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) ద్వారా వాలెట్లో నగదు జమ చేస్తే.. ఆ విలువపై 0.25 శాతం చార్జీ చెల్లించాలి. ఈ చార్జీని కనిష్టంగా రూ.2, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు. అదే విధంగా బీసీల ద్వారా వాలెట్లోని నగదును తీసుకోవాలంటే రూ. 2,000లోపు నగదుకు కనీస చార్జీ 6గా విధించారు. ఆపై మొత్తానికి విలువలో 2.5 శాతం చార్జీ చెల్లించాల్సి వుంటుంది. అంటే రూ.10వేలు తీసుకుంటే రూ.250 చెల్లించాలన్న మాట. ఆన్లైన్ నగదు బదిలీపై... తక్షణం నగదు బదిలీకై వినియోగించే ఐఎంపీఎస్ సేవలపై కూడా ఎస్బీఐ పరిమితులను విధించింది. ఐఎంపీఎస్ విధానంలో పంపించే లక్ష రూపాయల లోపు మొత్తంపై రూ.5 చార్జీ, సేవా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్ష లోపు లావాదేవీలపై రూ.15, ఆపైన రూ.5 లక్షలలోపు రూ.25 చార్జీ చెల్లించాలి. ఏటీఎం కార్డుల జారీ కొత్తగా జారీ చేసే ఏటీఎం కార్డులపై కూడా చార్జీలను వసూలు చేస్తోంది. కానీ ఖాతాదారులు రూపే క్లాసిక్ కార్డు తీసుకుంటే ఎటువంటి చార్జీలు ఉండవు. అలా..కాకుండా వీసా, మాస్టర్ వంటి ఇతర కార్డులు తీసుకుంటే మాత్రం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చెక్బుక్కుల జారీ.. ఇక నుంచి కొత్త చెక్బుక్ తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. 10 కాగితాలు ఉండే చెక్బుక్ అయితే రూ.30, అదే 25 కాగితాలుంటే రూ.75, ఇంకా పెద్దది 50 చెక్కులు ఉండే పుస్తకమయితే రూ.150 చెల్లించాలి. ఈ రుసుములకు సేవాపన్ను అదనం. చిరిగిన నోట్లు మారిస్తే... చిరిగిన, చెల్లని పాతనోట్లను మార్చుకోవాలన్నా చార్జీలు కట్టాల్సిందే. కానీ ఇక్కడ ఎస్బీఐ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. 20 నోట్లు లేదా విలువ రూ. 5,000 దాటకుండా ఉంటే ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 20 నోట్లు దాటితే ప్రతీ నోటుపై రూ.2 చార్జీ చెల్లించాలి. అలా కాకుండా విలువ రూ.5,000 దాటితే నోటుకు రూ.2 లేదా ప్రతీ రూ.1,000లకు రూ.5 ఈ రెండింటిలో ఈ మొత్తం అధికమైతే ఆ మొత్తాన్ని చార్జీగా వసూలు చేస్తారు. -
ఆన్లైన్లో డబ్బులు పంపినా.. దొరికేస్తారు!
పెద్దమొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఇన్నాళ్లూ మూడో కంటికి తెలియకుండా డబ్బు రూపంలో ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు. తప్పనిసరిగా చెక్కు రూపంలో గానీ, లేదా ఆన్లైన్ చెల్లింపుల ద్వారా గానీ చేయాల్సి వస్తోంది. చెక్కయితే పన్ను పరిధిలోకి వస్తుందని చాలామంది ఈమధ్య ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. కానీ, 2.5 లక్షల రూపాయలు దాటితే ఆన్లైన్ చెల్లింపులు కూడా పన్ను పరిధిలోకి వస్తాయన్నది తాజా కబురు. అలాగే, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో పెద్దమొత్తంలో డబ్బులు ఉన్నా కూడా వాటిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలు, జనధన్ ఖాతాల నుంచి ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయినా కూడా వాటిపై దృష్టిపెడుతున్నారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద పెద్దమొత్తంలో ఖాతాలను తెరిచారు. ప్రస్తుతం దేశంలో 28 కోట్ల జనధన ఖాతాలున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత వాటిలో కొన్నింటిని నల్లధనాన్ని మార్చుకోడానికి ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వలు ఉంటే వాటిపై వివరణ కోరనున్నారు. నగదు ప్రవాహం ఎలా సాగుతోందన్న విషయాన్ని తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటామని, అక్రమాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అదే సమయంలో నిజాయితీపరులు మాత్రం ఈ విషయాలపై ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆదాయపన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. -
పెట్రోల్ బంకుల్లో ఈ–చెల్లింపులతో జాగ్రత్త!
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన తీవ్ర నగదు కొరత కారణంగా ఆన్లైన్ లావాదేవీలు తప్పని సరయ్యాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్తో పాటు మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) సూచిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ వ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ–పాస్) యంత్రాలు వినియోగించే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ పెట్రోల్ బంకుల్లో మొబైల్ వినియోగం నిషిద్ధమన్న విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత కారణంగా పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ఈ– పాస్ యంత్రాలు, మొబైల్ వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మొబైల్ ఎక్కువగా వాడాల్సి రావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమయ్యాయని పీఈఎస్వో హెచ్చరించింది. పీఈఎస్వో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ పీటీ సాహూ స్వయంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని ఇటీవల వివరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తరం పెట్రోలు బంకులు నిర్వహించే పలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం.. పెట్రోల్ బంకుల్లోని జోన్–1, జోన్–2 ప్రాంతాలలో ఈ– పాస్ మెషీన్లు, మొబైల్ వ్యాలెట్లు అనుమతించరాదని పెట్రోలియం మంత్రిత్వశాఖకు పీఈఎస్వో సూచించింది. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. పీఈఎస్వో సిఫార్సు మేరకు నిర్దిష్ట కాల వ్యవధిలో తగిన చర్యలు చేపట్టేలా అన్ని రాష్ట్రాల పెట్రోలియం మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఇది అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. బంకుల్లో ఇవి చేయకూడదు.. 1. మొబైల్ బ్యాటరీలు రేడియేషన్ను విడుదల చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది పెట్రోలియం వేపర్ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ నింపేటప్పుడు సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. 2.పెట్రోల్ నింపేటప్పుడు వాహన ఇంజిన్ని ఆఫ్ చేయాలి. 3.బంక్ పరిసరాల్లో ధూమపానం చేయరాదు. 4.పెట్రోల్ నింపిన తరువాత ఫిల్లింగ్ నాజిల్ బయటకు తీసేవరకు ఇంజిన్ స్టాట్ చేయకూడదు. 5.పెట్రోల్ బంకుల్లో మంటలను ఆర్పే కిట్లు తప్పనిసరిగా ఉండాలి. 6.పెట్రోల్ పంప్కు చిన్నారులను దూరంగా ఉంచాలి. -
ఆన్లైన్ లావాదేవీలపై ఆసక్తి చూపని ఏపీ మంత్రులు
-
బ్యాంకు సైట్లలో నకిలీలు!
పేమెంట్ గేట్వే రూపంలో మాయ • రెండు నెలల తేడాతో రెండు సైట్ల నమోదు • ఏకంగా 26 బ్యాంకులకు నకిలీ లాగిన్ సైట్లు • ఫిషింగ్ సైట్లు, మాల్వేర్తో సైబర్ నేరగాళ్ల ఎత్తులు • బయటపెట్టిన సెక్యూరిటీ సంస్థ ‘ఫైర్ ఐ’ • ఆన్లైన్ బ్యాంకింగ్లో కాస్త తేడా వచ్చినా గల్లంతే బెంగళూరు: పెద్ద నోట్లను రద్దు చేశాక సహజంగానే ఆన్లైన్ లావాదేవీలు పెరిగారుు. బ్యాంకుల వద్ద కూడా కొత్త నోట్లు తగినంతగా లేకపోవటంతో... ఆయా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు లైన్లో నిల్చోలేక చాలావరకూ ఆన్లైన్ బాట పడుతున్నారు. మరోవంక ప్రభుత్వం కూడా ‘నగదు లావాదేవీలొద్దు... డిజిటలే ముద్దు’ అంటూ ఎలక్ట్రానిక్ నగదు లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు సైతం తమ సత్తా చూపిస్తున్నారు. కొత్త వారు, ఆన్లైన్ అలవాటు లేనివారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ను ఆశ్రరుుస్తారు కనుక వారిని తేలిగ్గా దోచుకోవచ్చని జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. మాల్వేర్లు, ఫిషింగ్ వెబ్సైట్లతో తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. యాంటీవైరస్లకు చిక్కకుండా ఫైర్వాల్స్ అడ్డుగోడలకు వెరవకుండా అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ‘ఫైర్ఐ’ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఇలాంటి మోసపూరిత వెబ్సైట్లు చాలా బయటపడ్డారుు. దీనిప్రకారం సిసెక్యూర్పేడాట్కామ్(ఛిట్ఛఛిఠట్ఛఞ్చడ. ఛిౌఝ) అనే మరో డొమైన్ను ఫైర్ఐ కనుగొంది. ఆన్లైన్ పేమెంట్ గేట్వే మాదిరిగా కనిపించే ఈ వెబ్సైట్ వాస్తవానికి ఒక ఫిషింగ్ వెబ్సైట్లోకి ఖాతాదారును మళ్లిస్తున్నట్లు ఫైర్ ఐ గుర్తించింది. ఈ నకిలీ వెబ్సైట్ ఏం చేస్తుందంటే... ఆన్లైన్ లావాదేవీ నిర్వహిస్తున్న ఖాతాదారు నుంచి తన ఖాతా నంబరు, మొబైల్ నంబరు, ఈమెరుుల్ అడ్రస్, వన్ టైమ్ పాస్వర్డ్, ఇతరత్రా వివరాలు మోసపూరితంగా సేకరిస్తుంది. ఖాతాదారు సదరు సమాచారమంతా ఎంటర్ చేశాక లాగిన్ విఫలమైందంటూ వెబ్సైట్లో ఓ నకిలీ మెసేజి ప్రత్యక్షమవుతుంది. అసలు సంగతి అర్థమయ్యే లోగా ఖాతాదారు అకౌంటు వివరాలన్నీ హ్యాకర్ చేతికి చేరిపోతారుు. ఈ ఏడాది అక్టోబర్ 23న రిజిస్టరరుున ఈ ఫిషింగ్ వెబ్సైట్... ఇలా ఏకంగా 26 బ్యాంకులకు సంబంధించి నకిలీ లాగిన్ సైట్లు రూపొందించింది. ఇందులో దిగ్గజ బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితరాలన్నీ ఉన్నారుు. డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం చోరీకి మరో ఫిషింగ్ సైటు.. :ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా ఫైర్ఐ సెక్యూరిటీ బృందం మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఎన్సెక్యూర్పేడాట్కామ్(ట్ఛఛిఠట్ఛఞ్చడ.ఛిౌఝ) అనే మరో నకిలీ డొమైన్ బైటపడింది. సీసెక్యూర్పేడాట్కామ్ని రూపొందించిన వాళ్లే దీన్ని కూడా 2016 ఆగస్టులో రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడరుుంది. ఇది సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ల క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు, వీసా.. మాస్టర్కార్డ్, ఎస్బీఐ డెబిట్ కార్డుల వివరాలను తస్కరించే లక్ష్యంతో రూపొందినట్లుగా స్పష్టమవుతోంది. ఖాతాదారు వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఇది కూడా ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. ఇలాంటి ముప్పుల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స టీమ్ (సీఈఆర్టీ ఐఎన్) దృష్టికి తీసుకెళ్లింది ఫైర్ఐ. కాస్తో కూస్తో టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా ఏది సిసలైనది.. ఏది నకిలీది అని తెలుసుకునే అవకాశం ఉండటం లేదు. ఇలాంటి సందర్భంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో, వారి నగదు ఎంత సురక్షితంగా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చన్నది టెక్నాలజీ నిపుణుల మాట. గూగుల్ అకౌంట్లకు గూలిగన్ మాల్వేర్ ముప్పు పది లక్షల ఖాతాల వివరాలుచోరీ? న్యూఢిల్లీ: సైబర్ దాడుల సమస్య తీవ్రతకు అద్దం పడుతూ తాజాగా మరో మాల్వేర్ తెరపైకొచ్చింది. దాదాపు పదిలక్షల పైగా గూగుల్ ఖాతాలు ’గూలిగన్’ అనే ఆండ్రారుుడ్ మాల్వేర్ కొత్త వేరియంట్ బారిన పడినట్లు చెక్ పారుుంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పేర్కొంది. ఇది ఆండ్రారుుడ్ డివైజ్లలోకి చొరబడి, ఈమెరుుల్ అడ్రస్లు, తత్సంబంధిత సమాచారాన్ని తస్కరిస్తుంది. జీమెరుుల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్లే, గూగుల్ డ్రైవ్, జీ సూట్ మొదలైన వాటన్నింటిలో యూజర్లు భద్రపర్చుకున్న డేటాను హ్యాకర్స్కి చేరవేస్తుంది. చెక్ పారుుంట్ నివేదిక ప్రకారం రోజూ దాదాపు 13,000 పైచిలుకు డివైజ్లు గూలిగన్ బారిన పడుతున్నారుు. ఎక్కువగా ఆండ్రారుుడ్ 4 (జెల్లీ బీన్, కిట్క్యాట్), 5 (లాలీపాప్) డివైజ్లు టార్గెట్గా ఇది విజృంభిస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆండ్రారుుడ్ పరికరాల్లో దాదాపు 74 శాతం డివైజ్లు ఈ ఆపరేటింగ్ సిస్టమ్లతోనే పనిచేస్తున్నారుు. వీటిల్లో దాదాపు 40 శాతం డివైజ్లు ఆసియాలో, 12 శాతం యూరప్లో వినియోగంలో ఉన్నారుు. హ్యాక్ అరుున డివైజ్లలో ప్రతి రోజూ గూలిగన్ కనీసం 30,000 యాప్స్ను ఇన్స్టాల్ చేస్తోందని అంచనా. మరోవైపు మాల్వేర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులు జరిపేటప్పుడు ఈ నకిలీ థర్ట్పార్టీ సైట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత బ్యాంక్ నకిలీ సైట్లో వివరాలు, ఓటీపీ వివరాలను కాజేస్తారు చివరకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దొంగిలించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ సమాచారంతో హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్ నుంచి సొమ్మును మాయం చేస్తారు -
ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్: జిల్లాలో ఆన్లైన్ లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ అంశాలపై ఎల్డీఎం, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. డీఆర్డీఏ ద్వారా పొందుతున్న సామాజిక పింఛన్లు, డ్వామా ద్వారా ఉపాధి హామీ పథకం నుంచి కూలీలు పొందుతున్న నగదు.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే డ్వామాలో 2లక్షల 60వేల ఖాతాలను కూడా అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వేతనం పొందుతున్న వారి బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్తో లింక్ చేయాలని, పోస్టాఫీసుల్లోని ఖాతాలను బ్యాంకు ఖాతాలుగా మార్చాలని సూచించారు. జిల్లాలో జన్ధన్ యోజన పథకం కింద తెరచిన ఖాతాలు ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి, ఎన్ని ఉపయోగంలో లేవో గుర్తించి వివరాలను ఎల్డీఎంకు అందించాలని తెలిపారు. ఎల్డీఎం ద్వారా బ్యాంకు కంట్రోలింగ్ అధికారులకు పంపి యాక్టివేట్ చేయించాలన్నారు. బ్యాంకుల వద్ద ఇంకా రూపే కార్డులు అందించకపోతే వివరాలు తెలుసుకొని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాల నంబర్లు, ఆధార్ నంబర్లతో పాటు బ్యాంకు బాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా తీసుకోవాలని సూచించారు. యూప్లపై అవగాహన పెంచాలి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ మాట్లాడుతూ మొబైల్ బ్యాంకిం సేవల వినియోగం, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానాలపై ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, డీఆర్డీఏ పీడీ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఐసీ డీఐఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ డౌన్లోడ్ వినియోగం గురించి ఆంధ్రాబ్యాంకు ఐటీ ఆఫీసర్ శేఖర్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ నళినికాంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా 50వేల రూపాయల వరకు లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని వివరించారు. సాధారణ మొబైల్ సెల్ ద్వారా రూ. 5వేల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చని తెలిపారు. స్టేట్ బ్యాంకు బడ్డీ అనే యాప్పై డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వివరించారు. -
లావాదేవీలు ఆన్లైన్లో చేయండి
జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఆత్మకూరురూరల్ : రిటైల్ వ్యాపారులందరూ హోల్సేల్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రూ.500, 1000 నోట్లు రద్దుతో ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలపై వ్యాపారుల అభిప్రాయాలు, వారి ఇక్కట్లు తెలుసుకునేందుకు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద నోట్లు చెల్లక కొంత మేర వ్యాపారాలు దెబ్బతిన్న విషయం వాస్తవేమేనన్నారు. ఆన్లైన్లో లావాదేవీలు చేస్తే కొంతమేర ఇబ్బందులు తగ్గుతాయన్నారు. రేషన్షాపు డీలర్లు స్వైప్ మిషన్లు ఉపయోగిస్తే ఇక్కట్లు తగ్గుతాయని సూచించారు. ఇబ్బంది పడుతున్నాం. ఈ సమావేశంలో సంగం, ఆత్మకూరు, ఏఎస్పేట తదితర మండలాలకు చెందిన వ్యాపారులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పొదుపు సభ్యులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. కొత్త రూ.100, 500 నోట్లు విడుదల చేస్తే ఇంత ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డాక్టర్ ఏ నిర్మలాదేవి, రమణయ్య, ఆత్మకూరు తహసీల్దారు సారంగపాణీ, ఏఈలు శాంతకుమార్, శ్రీనివాసరావు, సీడీపీఓ ఉషారాణీ, ఎంఈఓ మణిప్రసాద్, డీటీ శేషయ్య, సూపరింటెండ్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ మనీ జోరు..!
ముంబై: దేశంలో ప్లాస్టిక్ మనీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. భారత్లో ఇప్పటికే దాదాపు 36.9 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు సర్క్యులేషన్లో ఉన్నాయి. వీటిలో 35 కోట్ల కార్డులు డెబిట్ కార్డులు. 1.9 కోట్ల కార్డులు క్రెడిట్ కార్డులు. 10-15 శాతం కార్డులు కేవలం ఆన్లైన్ లావాదేవీల కోసమే వినియోగిస్తున్నారు. చిన్న పట్టణాల్లో సైతం ఈ తరహా లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ‘పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్స్-ఎనేబిలింగ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ)’ పేరుతో ఈ నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ నివేదికలో రెండు ప్రధాన పేమెంట్ నెట్వర్క్లు- మాస్టర్ కార్డ్, వీసాలను ఉటంకించింది. నివేదికలో ముఖ్యాంశాలు... భారత్ ఈ-పేమెంట్స్ విధానంలో ‘కార్డ్ పేమెంట్లు’ అంతర్గత భాగంగా మారాయి. డబ్బు బదలాయింపు, షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి పలు అవసరాలకు కస్టమర్ల ‘కార్డ్’ల వినియోగం పెరుగుతోంది. క్రెడిట్ కార్డును ఆచితూచి చేసే ఖర్చులకు వినియోగిస్తున్నారు. 1998లో దేశంలోకి ప్రవేశిం చిన డెబిట్ కార్డులను రోజూవారీ మామూలు ఖర్చులకు వాడుతున్నారు. క్రెడిట్ కార్డుల్లో దాదాపు 30 శాతం ఆన్లైన్ వినియోగంలో ఉన్నాయి. మాస్టర్ కార్డ్ నెట్వర్క్ ద్వారా లభ్యమవుతున్న సమాచారం ప్రకారం కార్డ్ పేమెంట్లలో 75 శాతం కేవలం 20 పట్టణాల్లో కేంద్రీకృతమయ్యాయి. వీటిలో 43 శాతం వాటా ఢిల్లీ, ముంబై, వాటి సబర్బన్ ప్రాంతాలదే. వీసా అధ్యయనం ప్రకారం- రూ.75,000 నుంచి రూ.1,00,000 శ్రేణిలో నెలవారీ ఆదాయం ఉన్న వారు ఎక్కువమంది ఎలక్ట్రానిక్ కార్డును వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్న వ్యయ విభాగాల్లో రైల్-ఎయిర్ఫేర్ (71 శాతం), మన్నికైన వస్తువులు (61 శాతం), అద్దెలు (49 శాతం), టెలిఫోన్-మొబైల్ (47 శాతం), మెడికల్ ఇన్స్టిట్యూట్ (46 శాతం), దుస్తులు-పాదరక్షలు (44 శాతం), శీతల పానియాలు-రిఫ్రష్మెంట్స్ (35 శాతం) ఉన్నాయి. డెబిట్ కార్డులకన్నా దశాబ్దం ముందు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, వాటితో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. ఆభరణాలు, విందు, షాపింగ్ వంటి వ్యయాలకు క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగిస్తున్నారు.