passengers suffers
-
Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన -
విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం
సియోల్: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్ హెచ్ఎల్ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
రోడ్డుకు రెండు దిక్కులా బారికేడ్లు ఎందుకు?
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చుట్టూ తిరిగి వెళ్లాలి.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. వందల వాహనాలు వెనక్కి ఇటీవల పశ్చిమ ఎక్స్ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్సేన్ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. -
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్ఫామ్పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పొగమంచు ప్రధాన కారణంగా నిలిచింది. తాజాగా భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ 11 గంటలు ఆలస్యమైంది. ఇలా రైలు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి సాంకేతిక లోపం కారణంగా సుమారు 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది.ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుండి ఉదయం 5.40 గంటలకు బయలుదేరుతుంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ సెమీ-హై స్పీడ్ రైలు ఉదయం నిర్ణీత సమయానికి బదులుగా సాయంత్రం గమ్యస్థానానికి చేరేందుకు బయలుదేరిందని పశ్చిమ మధ్య రైల్వే తాత్కాలిక ప్రజా సంబంధాల అధికారి (భోపాల్ డివిజన్) నావల్ అగర్వాల్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందన్నారు. అయితే రైలు సంబంధిత యాప్లతో సహా పలు మార్గాల ద్వారా ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్కు బయలుదేరాల్సిన రైలు రాకపోవడంతో రాణి కమలపాటి స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు నిరసన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో కొంతమంది ప్రయాణికులు శతాబ్ది ఎక్స్ప్రెస్ (న్యూఢిల్లీకి వెళ్లేది)లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు బ్యాగులు పట్టుకుని పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి 10.20 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్కు రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (20172)లో సాంకేతిక లోపం తలెత్తిందని, సీ11 కోచ్ స్ప్రింగ్ పాడైందని అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం రైలును యార్డుకు తరలించామని, అయితే లోపాన్ని సకాలంలో సరిదిద్దలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రైలు బయలుదేరలేదన్నారు.ఇది కూడా చదవండి: దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా -
HYD: మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ ఫీడర్లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్జామ్ -
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
ఇండిగో, ముంబై ఎయిర్పోర్ట్లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్పోర్ట్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్పోర్ట్పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
రన్వేపైనే భోజనం.. ఇండిగోకు నోటీసులు
ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది. passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS — JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024 పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్జెట్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్కి బయలుదేరిన నేపాల్ ఎయిర్లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్పూర్ చేరుకుంది. ఈ ఎక్స్ప్రెస్కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
స్టేషన్కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్ప్రెస్ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్ప్రెస్ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!
IRCTC down: ఐఆర్సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్సైట్, యాప్లో రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్షాట్లతో సోషల్ మీడియా హోరెత్తితింది. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. ప్లాట్ఫారమ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ల కోసం కేటాయించిన స్లాట్లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E) తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదులు మొదలైనాయి. "సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము." ఐఆర్సీటీసీ ట్వీట్లో తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్మైట్రిప్ తదితర B2C ప్లేయర్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. Not able to tatkal booking ticket... Facing some error in #IRCTC app... Please dot the something... I have emergency to back to my home...@IRCTCofficial @RailwaySeva#railways — Vijay Arya (@Im_vijayarya) July 25, 2023 #irctc As usual down ... Can't book tickets Two times banking transactions failed.... Waiting for refund and no further booking @AshwiniVaishnaw@RailwaySeva @RailMinIndia pic.twitter.com/TOPJdXiuy8 — Dhimant Bhatt (@dhimantbhatt) July 25, 2023 కాగా ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా. Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.— IRCTC (@IRCTCofficial) July 25, 2023 -
ఇదేందయ్యా పోలీస్ సార్..!
-
ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ స్టాక్హోమ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు. చదవండి: స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. -
స్పైస్జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్జెట్కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్తో కలిసి ఫస్ట్టైం విమానం ట్రిప్కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్రూమ్లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
జెట్ స్పీడ్తో దూసుకెళ్లిన ఆటో.. ఛేజ్ చేసిన పోలీసులకు షాక్
వైరల్: ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం. అంతేనా.. మరో ఏడాదిలో మన జనాభా.. చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతోందని సర్వేలు వెల్లడించాయి కూడా. అదే సమయంలో సోషల్ మీడియాలో జనాభా పెరుగుదల మీద ఇవాళ రకరకాల చర్చలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. రోడ్డు మీద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు.. స్పీడ్ గన్ వేగాన్ని మించి దూసుకుపోయిన ఓ ఆటో కనిపించింది. దీంతో ఆ ఆటోను ఛేజ్ చేశారు పోలీసులు. ఎట్టకేలకు దానిని ఆపి.. అందులోంచి ప్యాసింజర్లను దించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 27 మంది(డ్రైవర్తో పాటు) ప్రయాణికులు దిగారు ఆ ఆటో నుంచి. ఇంకేం షాక్ కావడం పోలీసుల వంతు అయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేకున్నా.. ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ బిండ్కీ కోట్వాలి రీజియన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలను పెద్దలతో కలిపి కుక్కేసి మరీ ఆ త్రీవీలర్లో తీసుకెళ్లే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అశ్విని ఉపాధ్యాయ అనే ట్విటర్ యూజర్ దానిని పోస్ట్ చేయగా.. విపరీతమైన లైకులు,షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. जनसंख्या विस्फोट का दुष्परिणाम ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp — Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022 -
స్పైస్జెట్: ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ స్పైస్జెట్ లిమిటెడ్కు ఊరట లభించింది. క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య పెండింగ్లో ఉన్న వివాదానికి తెర దించింది. దీంతో బుధవారంనాటి మార్కెట్లో స్పైస్జెట్ షేర్ 4 శాతం లాభపడింది. క్రెడిట్ సూయిస్తో పాటు, ఇటీవల కెనడా లిమిటెడ్, బోయింగ్, సీడీబీ ఏవియేషన్, బీఓసీ ఏవియేషన్, అవోలాన్లతో సెటిల్మెంట్లతో సంస్థ వృద్ధికి, విస్తరణకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్ఛేంజ్లకిచ్చిన సమాచారం ప్రకారం స్పైస్జెట్ లిమిటెడ్, క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య వివాద సెటిల్మెంట్, అంగీకారం నిబంధనలపై (మే 23) సంతకాలు ముగిసాయి. తుది ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిసింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని స్పైస్జెట్ తెలిపింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్పైస్జెట్ ఇప్పటికే 5 మిలియన్ల డాలర్ల బ్యాంక్ గ్యారెంటీని అందించిందని, దీనికి సంబంధించి తమపై ఎలాంటి ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉండదని తెలిపింది. స్విస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాలింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎస్ఆర్ టెక్నిక్స్కు 24 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లింపులు చేయడంలో ఎయిర్లైన్ విఫలమవడంతో క్రెడిట్ సూయిస్ స్పైస్జెట్పై గత సంవత్సరం మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. స్పైస్జెట్ బోయింగ్ 737లు, క్యూ-400లు,ఫ్రైటర్ విమానాలను నడుపుతుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద 63 రోజువారీ విమాన సర్వీసులతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ స్పైస్జెట్. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ప్రవేశ పెడుతుందని, త్వరలో తమ విమానాల్లో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఎండీ అజయ్ సింగ్ సోమవారం తెలిపారు. కాగా కరోనా సంబందిత ప్రయాణ ఆంక్షలు సడలింపులతో దేశీయ విమానయాన ట్రాఫిక్ కోలుకుంటోంది. ఏప్రిల్లో దాదాపు 1.08 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారని, మార్చిలో ప్రయాణించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైగా 2 శాతం ఎక్కువ అని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇటీవల వెల్లడించింది. ఈ ఏప్రిల్లో స్పైస్జెట్, ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిరిండియా,ఎయిర్ ఏషియా ఇండియా ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 85.9 శాతం, 78.7, 82.9, 80.3, 79.5, 79.6 శాతంగా ఉన్నాయన్నారు. ర్యాన్సమ్వేర్ ఎటాక్, ప్రయాణీకుల గగ్గోలు స్పైస్జెట్ సిస్టమ్స్పై ర్యాన్సమ్వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్ వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు రాన్సమ్వేర్ అటాక్తో బుధవారం ఉదయం స్పైస్జెట్ డిపార్చర్స్ ఇబ్బందులు, ప్రయాణికులు చిక్కుకుపోవడంపై అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అటాక్ కారణంగా బుధవారం ఉదయం నాటి విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని ట్విట్ చేశారు. ఈ పరిణామాన్ని తమ ఐటీ టీం సరిదిద్దిందని, విమాన సేవలు సజావుగానే ఉన్నాయంటూ స్పైస్జెట్ ట్విట్ చేసింది. Operating normally?? We are stuck here since 3 hrs and 45 mins? Neither cancelling nor operating, sitting in the flight not even the airport. No breakfast, no response! pic.twitter.com/dAfdIjzVzH — Mudit Shejwar (@mudit_shejwar) May 25, 2022 #ImportantUpdate: Certain SpiceJet systems faced an attempted ransomware attack last night that impacted and slowed down morning flight departures today. Our IT team has contained and rectified the situation and flights are operating normally now. — SpiceJet (@flyspicejet) May 25, 2022 Hi @flyspicejet we were supposed to depart from IXB at 9 am today and there are still no updates from anyone. Worst part we boarded the flight and then this update came when the attack was last night and my wife is here with me with fractured leg waiting in vain pic.twitter.com/UBZmxCaWCu — Himanshu Maheshwari (@himannshum) May 25, 2022 -
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్
పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్లాట్ఫారం ఎత్తు పెంచేదెన్నడో..? పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్ ఎక్కేందుకు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చదవండి: అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్ లేఖ -
మాల్దీవ్స్లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే
సాక్షి, హిమాయత్నగర్(హైదరాబాద్): మాల్దీవ్స్లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్ కోసం ఓ ట్రావెల్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు. అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! -
ఈక్వెడర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
క్విటో: ఈక్వెడర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెజోనియన్ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బొల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందినవారిని మార్చురీకి తరలించారు. కాగా, బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్ -
ట్వీట్ చేస్తే.. బస్సొచ్చె.. భలె భలె!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. డిపాజిట్ కూడా రద్దు చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణికులు ఇటీవల ట్వీట్ చేసిన సమస్యలపై అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన సమస్యలివీ... సమయానికి బస్సు రావడం లేదంటూ ఓ ప్రయాణికుడి ఫిర్యాదు.. మా ఊరికి బస్సు రాక ఏళ్లు అయితుంది.. మీరు బస్సు వేయిస్తారా?.. ఓ గ్రామ యువకుడి ప్రశ్న.. బస్సు సమయానికి రాక కాలేజీకి టైంకు చేరుకోలేకపోతున్నం.. పాఠ్యాంశాలు నష్టపోతున్నం.. ఓ విద్యార్థి వినతి.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.. మెస్సేజ్ రావడమే ఆలస్యం అన్నట్లు.. వెంటనే ఆయన స్పందించి రిప్లయ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సాక్షి,నెన్నెల(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్ 16 నుంచి బస్సు ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది. కష్టాలు దూరమయ్యాయి మా ఊరికి 30ఏళ్ల కిందట సర్కార్ బస్సు వచ్చేది. అప్పట్లో రాకపోకలకు సౌలత్ ఉండేది. అధికారులు బస్సు బంద్ చేయడంతో ఇబ్బంది పడ్డాం. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడక, ఎడ్లబండే దిక్కయ్యేది. ప్రస్తుతం మా ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి. – చాపిడి పెంటక్క, కోనంపేట చదువులు మానొద్దని.. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశాడు. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర బస్సు ప్రారంభించారు. దీంతో 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంతోషంగా ఉంది దాదాపు 26 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు బాగాలేక ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 108 వాహనం కూడా వస్తోంది. పోలీసులకు రుణపడి ఉంటాం. – బోజ్జిరావు, ఉప సర్పంచ్, మంగి రెండ్రోజుల్లోనే.. సిరికొండ(బోథ్): మండల కేంద్రంతోపా టు చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇక్కట్లకు గురయ్యేవాళ్లం. మండల కేంద్రం నుంచి నిత్యం దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఉన్నత చదువులకోసం వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులేక పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సామాజిక కర్యకర్త రాథోడ్ మౌనిక సమస్యను ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేసింది. సజ్జనార్ రెండు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించారు. నిర్మల్ నుంచి బోథ్కు లింక్బస్సు బోథ్: హైదరాబాద్ నుంచి బోథ్కు రాత్రి సమయంలో నడిచే బస్సును లాభాలు రావడం లేదని గతంలో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ప్రజల ఇబ్బందులు గమనించిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్కుమార్ బస్సు పునరుద్ధరించాలని అక్టోబర్ 29న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ నిర్మల్ నుంచి బోథ్కు ఉదయం 5 గంటలకు లింక్ బస్సును ఏర్పాటు చేశారు. గిరి గ్రామాలకు ఆర్టీసీ బస్సు పెంచికల్పేట్: మండలంలోని గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ గ్రామాలకు గతేడాది మే నుంచి ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలు లేక పడుతున్న ఇబ్బందులపై నవంబరు 16న ‘సాక్షి’లో ‘అందని ఆర్టీసీ సేవలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన యువకులు కథనాన్ని ఎండీ సజ్జనా ర్కు ట్వీట్ చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత అధికారులు నవంబరు 19 నుంచి గిరి గ్రామాలకు బస్సు పునరుద్ధరించారు. హైదరాబాద్ బస్సు పునరుద్ధరణ ఖానాపూర్: ప్రతీరోజు ఉదయం 5 గంటలకు కడెం, ఖానాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోయింది. బస్సు సేవలు పునరుద్ధరించాలని గత నెల 19న ఖానాపూర్కు చెందిన బీసీ యువజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోట సుమీత్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్విట్ చేశాడు. స్పందించిన ఆర్టీసీ అధికారులు ఈ నెల 22 నుంచి బస్సు పునరుద్ధరించారు. చదవండి: డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి.. -
హైదరాబాద్లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా (డెల్టా వేరియంట్) వైరస్....తాజాగా ‘ఒమిక్రాన్’ రూపంలో నగరవాసులను మళ్లీ కలవర పెడుతోంది. ఇప్పటికే యూకే సహా సింగపూర్, కెనడా, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన 13 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గ్రేటర్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందని, వైరస్ తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతోందని ప్రభుత్వం సహా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభలు, సమావేశాలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకల పేరుతోపెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, వినోదాలు, విహార యాత్రల పేరుతో ఇష్టారీతిగా తిరుగుతున్నారు. మధ్య వయస్కులు, యువతీ, యువకుల నిర్లక్ష్యానికి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు వారికి ఇప్పటి వరకు టీకాలు రాకపోవడంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతుండటంతో ప్రత్యక్ష హాజరు శాతం తగ్గిపోతోంది. చదవండి: (Omicron: హైదరాబాద్లో ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు) స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే... ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదైనప్పటికీ..ఆ తర్వాతి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రజల ఆర్థిక ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిని సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దశల వారీగా కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడం...మార్కెట్లు సహా వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం..ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ను ఎత్తేవేయడంతో. సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు సిటిజన్లు భావించారు. ఇక కోవిడ్ పీడ విరగడైందని భావించి మాస్క్లను పక్కన పడేశారు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే లోపే...ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అప్రమత్తమై విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తోంది. వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపుతోంది. 14 రోజుల పాటు హోం కార్వంటైన్లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. ప్రధానోపాధ్యాయురాలికి కోవిడ్ కంటోన్మెంట్: తిరుమలగిరి మండలం మడ్ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐరిన్ సుప్రదకు కరోనా సోకింది. ఈ మేరకు ర్యాపిడ్ టెస్టులో ఈ విషయం తేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి ఆర్టీపీసీఆర్ టెస్టుకు శాంపిళ్లు పంపించారు. ఇదిలా ఉండగా ఇదే పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి కుమారుడికి ఇటీవల కరోనా సోకగా, 15 రోజుల పాటు సెలవు తీసుకుంది. సదరు ఉపాధ్యాయురాలికి సైతం కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్నాక, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి గురువారమే పాఠశాలలో చేరింది. శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు కరోనా బారిన పడటం గమనార్హం. చదవండి: (Omicron: భారత్లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) విద్యాసంస్థలపై దృష్టి విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, గురు కులాలను హాట్స్పాట్ల జాబితాలో చేర్చి ఆమేరకు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది. విద్యార్థులంతా మాస్క్లు ధరించేలా..ప్రతి పీరియడ్ తర్వాత విధిగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకునేలా..జాగ్రత్తలు సూచిస్తోంది. నిన్న మొన్నటి వరకు బెంచికి నలుగురైదుగురు విద్యార్థులు కూర్చోగా..ప్రస్తుతం ఇద్దరు,ముగ్గురికే పరిమితం చేసింది. పాఠశాలలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆయా యాజమాన్యాలు ఇప్పటికే ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం కోవిడ్ పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాల నుంచి వచ్చిన కోవిడ్ పేషెంట్లకు గాంధీలోనే సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం 150 మంది చికిత్స పొందుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సమకూర్చాం. వైరస్ తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు పడకలు సమకూరుస్తాం. ప్రజలు గతంలో మాదిరిగా కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. లేకుంటే మూల్యం చెల్లించక తప్పదు. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు. -
విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్
సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్ తాగటం వలన.. వారికే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది. ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. ఫోర్ట్లాడర్డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ఆఫ్ అయ్యింది. రన్వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని నిషేదించారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
ఏసీ బస్సా... మేమెక్కం!
సాక్షి, హైదరాబాద్: ఒక్క హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం మధ్యే కాదు... దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ఏసీ బస్సుల పరిస్థితి ఇంచుమించు ఇదే. కోవిడ్ భయంతో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడుతున్నారు. ఏసీలో కోవిడ్ వ్యాప్తి ఉంటుందని జంకుతున్నారు. దీంతో ప్రయాణికులు లేక గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులు వెలవెలబోతున్నాయి. గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 18 నుంచి 23 శాతంగా ఉండగా, రాజధాని బస్సుల్లో ఇది 30– 33 శాతం ఉంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి దూరప్రాంతాలకు తిరిగేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఏసీ బస్సులు తిప్పుతోంది. వీటిల్లో ప్రీమియం కేటగిరీగా గరుడ, గరుడ ప్లస్(మల్టీ యాక్సల్) బస్సులు తిరుగుతున్నాయి. దాదాపు వంద వరకు ఉన్న ఈ బస్సులకు గతంలో సగటున ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నమోదయ్యేది. వీటిలో కొన్ని సర్వీసులకైతే టికెట్లు దొరకటం గగనంగా ఉండేది. వీటి టికెట్ ధర అధికంగా ఉన్నందున ఖర్చుపోను కొంత ఆదాయం మిగిలి ఇవి లాభాల్లో ఉండేవి. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ బస్సుల కంటే ఎక్కువ నష్టాలు వీటితోనే నమోదవుతున్నాయి. ఉదాహరణకు బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి నిత్యం బెంగళూరుకు గరుడ ప్లస్ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 22 శాతమే. దాంతో ఆ బస్సుల ద్వారా కిలోమీటరుకు వచ్చే ఆదాయం (ఈపీకే) రూ.20 నుంచి రూ.23గా నమోదవుతోంది. ఇదే ప్రాంతం నుంచి విజయవాడ వెళ్లే బస్సుల్లో ఈపీకే రూ.31 ఉంటుండగా.. ఆక్యుపెన్సీ రేషియో 32 శాతంగా సగటున నమోదవుతోంది. చదవండి: (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే గరుడ ప్లస్ బస్సుల ఈపీకే రూ.14 గా ఉంటోంది. అదే ఈ బస్సులను నడిపినందుకు సిబ్బంది జీతాలు సహా అన్ని రకాల ఖర్చులు కలిపితే కి.మీ.కు రూ.50 కంటే ఎక్కువే అవుతోంది. అంటే ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగం కూడా ఉండటం లేదు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులతో ప్రస్తుతం ఆర్టీసీకి తీవ్ర నష్టాలు నమోదవుతున్నాయి. చెన్నై, మైసూరులకు వెళ్లే బస్సుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసుకోవటం గమనార్హం. బాగా పుంజుకున్న నాన్ఏసీ బస్సులు ఇటీవలే అంతరరాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదర టంతో ఆంధ్రప్రదేశ్– తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాకు వెళ్లే బస్సుల్లో నాన్ ఏసీ సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో సగటున 70 శాతాన్ని మించిపోయింది. కొన్ని రూట్లలో అంతకంటే ఎక్కువ రద్దీ కనిపిస్తోంది. ప్రైవేటులో ఏంటి? ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఏసీ బస్సుల్లో కూడా జనం పలుచగా కనిపిస్తున్నారు. ప్రయాణికులు లేక నష్టాలొస్తుండటంతో వాటి నిర్వాహకులు చాలా ఏసీ బస్సులను నాన్ఏసీ స్లీపర్ కోచ్లుగా మారుస్తున్నారు. వీటికి డిమాండ్ ఉండటంతో మిగతావారు ఇదే బాట పడుతున్నా రు. కానీ ఆర్టీసీ ఆ సాహసాన్ని చేయలేకపోతోంది. కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కండి: ఆర్టీసీ ప్రయాణికులు ఏసీ బస్సులంటే భయపడాల్సిన అవసరం లేదని ఆర్టీసీ పేర్కొంటోంది. మాస్కు ధరించి బస్సులెక్కొచ్చని ఆర్టీసీ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్లో సీట్లు బుక్ చేసుకున్నవారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదా లు చెబుతూ ఆకట్టుకునే ప్రయ త్నం కూడా చేస్తున్నారు. కోవిడ్ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ బస్సుల్లో ప్రయాణం వల్ల నష్టముండదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. -
ఎయిరిండియాకు కరోనా దెబ్బ : ఏడుగురికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు తాజాగా మరో షాక్ తగిలింది. కరోనా ప్రామాణికాలను సరిగా పాటించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నసమయంలో మరో అంతర్జాతీయ ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన ఏడుగురు కరోనా బారిన పడటం మరిత ఆందోళన రేపింది. ఢిల్లీనుంచి న్యూజిలాండ్ చేరుకున్న మూడు రోజుల తరువాత వీరికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఆగస్టు 23న ఢిల్లీ-ఆక్లాండ్ విమానంలో వచ్చిన ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని ఆక్లాండ్లో రోజువారీ విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కరోలిన్ మెక్ల్నే శుక్రవారం వెల్లడించారు. దీంతో వీరికి ఆక్లాండ్లోని జెట్ పార్క్ హోటల్లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించామన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు ఎయిరిండియా తిరస్కరించింది. ఈ దశలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నిలిపివేసినప్పటికీ, వందే భారత్ మిషన్, వివిధ దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ-హాంకాంగ్ విమానంలో 11 మంది ప్రయాణికులకు కరోనా రావడంతో ఈ నెలాఖరు (ఆగస్టు) చివరి వరకు ఎయిరిండియా విమానాలను హాంకాంగ్ నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. 77,266 తాజా కేసులతో ఈ సంఖ్య 34,63,973 కు చేరుకోగా, 24 గంటల వ్యవధిలో 1,057 కొత్త మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 62,550కి చేరింది. -
తల నొప్పిని భరించి.. ప్రయాణికులను కాపాడి..!
సాక్షి, అమరావతి: ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పింది.. స్టీరింగ్పై డ్రైవర్ చేతులు ఉన్నా నియంత్రణ చేయలేకపోతున్నాడు.. భరించలేని తలనొప్పి, కళ్లు బైర్లుకమ్మడంతో డ్రైవింగ్పై దృష్టిపెట్టలేకపోయాడు.. బస్సు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం.. కనుచూపు మేరలోనే కొండవీటివాగుపై బ్రిడ్జి కనిపించడం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ లేపోవడం.. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారి అరుపులతో స్పృహలోకి వచ్చిన డ్రైవర్ బస్సును పక్కకుతీసి ఆపడంతో ప్రయాణికులు ఊరిపీల్చుకున్నారు. నొప్పి భరించలేని డ్రైవర్ సీటులో కూర్చోలేక రోడ్డుపై పడుకుని తల్లడిల్లాడు. డ్రైవర్ను ప్రయాణికుల సాయంతో బస్సు కండక్టర్ అమరావతి సీహెచ్సీకి తరలించాడు. బస్సు కండక్టర్ కుమారి, ప్రయాణికుల కథనం మేరకు.. గుంటూరు నుంచి అమరావతిగుడి సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్ రవికిరణ్ మధ్యాహ్నం భోజనం తరువాత ఆరోగ్యం బాగాలేదని బస్టాండులో ఆర్టీసీ సంస్థకు చెందిన డాక్టర్కు చూపించుకున్నారు. డాక్టర్ పారాసిటమాల్ మాత్రలు ఇచ్చి పంపించారు. అనంతరం రవికిరణ్ డ్యూటీ ఎక్కాడు. బస్సు గుంటూరు నుంచి అమరావతి వస్తుండగా తాడికొండ అడ్డరోడ్డు దగ్గర తనకు తలనొప్పిగా ఉందని రవికిరణ్ కండక్టర్ కుమారికి చెప్పారు. తీరా ఎండ్రాయి వద్దకు వచ్చేసరికి రవికిరణ్ తలనొప్పిని తట్టుకోలేక తల్లడిల్లాడు. కళ్లు బైర్లుకమ్మడంతో స్టీరింగ్పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు భయపడ్డారు. కొండవీటి వాగుపై ఉన్న వంతెన ఎదురుగా కనిపించడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని హాహాకారాలు చేశారు. వారి అరుపులకు తేరుకున్న రవికిరణ్ బస్సును పక్కకుతీసి నిలిపాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్ను అమరావతి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం డ్రైవర్ కోలుకున్నాడు. కోలు కున్న రవికిరణ్ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగాలేదని ఆర్టీసీ డాక్టర్ వద్దకు వెళ్తే పారాసిటమల్ మాత్రలు ఇచ్చి పంపించారని, ఒక మాత్ర వేసుకుని డ్యూటీకి వచ్చానని చెప్పాడు. -
ఇండిగో మరో నిర్వాకం, ప్రయాణికుల గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో మరో నిర్వాకం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్కు వెళుతున్న ప్రయాణికులకు సంబంధించిన మొత్తం లగేజీని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే వదిలేసి వెళ్లపోయింది. తీరా విమానం ఇస్తాంబుల్కు చేరుకున్నాక సామానుకోసం బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్న వారికి ఒక కాగితం వెక్కిరించింది. సామాన్లు మొత్తం లోడ్ చేయలేదు, క్షమించండి అన్న ఆ సందేశాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యారు. ఒక్కరు కాదు..ఇద్దరుకాదు..మొత్తం ప్రమాణికుల లగేజీని ఎలా మర్చిపోతారంటూ విస్తుపోయారు. 6ఇ11 విమానంలో ఆదివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఇండిగో తీరుపై ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేగింది. షేమ్ ఆన్ఇండిగో హ్యాష్టాగ్ విపరీతంగా ట్రెండవుతోంది. క్షమాపణ నోట్ఫోటోతో పాటు ప్రయాణీకులు తమ భయంకరమైన, అయోమయ పరిస్థితిపై ట్వీటర్ ద్వారా మండిపడుతున్నారు. మా నాన్నకు సుగర్. ఆయనకుఅవసరమైన మందులు అందులో వున్నాయ్..మరికొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్కు వెళ్లాలి..వారి పరిస్థితి ఏంటి అంటూ ఒక యూజర్ వాపోయారు. అటు ఈ వ్యవహరంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఐశ్వర్య గడ్కరీ మరో ప్రయాణికురాలు ట్వీట్ చేస్తూ.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న సోదరుడికివ్వాల్సిన మందులు లగేజీలో ఉండిపోయాయనీ, సమయానికి ఆ మందు తీసుకోకపోతే...మళ్లీ ఫిట్స్ వచ్చి అతను చనిపోయే అవకాశం కూడా వుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండిగో స్పందించడం లేదని, తక్షణమే సహాయం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన ఇండిగో తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. ప్రయాణికుల లగేజీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయ్నతిస్తున్నామని ట్వీట్ చేసింది. Just flew in on @IndiGo6E flight 6E 11 from Delhi to Istanbul last evening. We received this piece of paper when we were waiting for our luggage at the belt. The airline did not load the luggage of the ENTIRE FLIGHT. Not a single passenger got their luggage (1/n) #shameonindigo pic.twitter.com/7KF2VT0f2O — Chinmay Dabke (@chinmaydabke) September 16, 2019 @narendramodi urgent help landed frm Delhi to Istanbul by indigo flght 6E-11 my brother is epileptic medication was in luggage it has not boarded if he doesn't get it seizures will start may result in death . Please help indigo is not replying — Aishwarya Gadkari (@AishwaryaGadka5) September 16, 2019 Pls investigate in indigo airlines turkey flight# they do not load luggage to save fuel and send next day by turkish Airlines#customers stranded at Istanbul# unethical way of making money#flight 6E11#happening daily@DGCAIndia pic.twitter.com/ljcXebARYo — Starfish On Feni (@blissOnFeni) September 16, 2019 They are doing this for all 6E11 flights. We went through the same ordeal on 14 Sep and we are yet to hear anything other than we will get back. We are with 11 month old kid with all his clothes, food, medicines with Indigo! Shameful @DGCAIndia this is fraud!! We are stranded! — Varun (@guptavarun13) September 16, 2019 -
మాకొద్దీ.. పుష్పుల్
సాక్షి, ఓదెల: భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య నడిచే పుష్పుల్ రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని సింగరేణి కార్మికుల సౌకర్యార్థం ప్రారంభించిన సింగరేణి రైలు బోగీలను మార్చి ప్రస్తుతం పుష్పుల్ రైలును నడపుతున్నారు. రెండునెలలుగా సింగరేణి రైలు బోగీలను మార్చి ఎలాంటి సౌకర్యాలు లేని పుష్పుల్ను ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. భద్రాచలం నుంచి సిర్పూర్కాగజ్నగర్ల మధ్య అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. మూత్రశాలలు, మరగుదొడ్లులేని పుష్పుల్ బోగీలను ఏర్పాటు చేయటంతో రైలులో ప్రయాణించేవారు ఒంటికి రెంటికి వస్తే రైలు దిగాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణం. సింగరేణి రైలుకు బోగీలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులువుగా గమ్యం చేరేవారు. ప్రస్తుతం 12 బోగీలు మాత్రమే ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఒకవైపు మరుగుదొడ్ల లేమి, మరోవైపు బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రయాణం చేయటానికి బెంబేలెత్తుతున్నారు. మాకొద్దీ రైలు.. ఓదెల, పెద్దపల్లి, పొత్కపల్లి, కొలనూర్, మంచిర్యాల, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో ఎక్కే ప్రయాణికులు ‘మాకొద్దు ఈ పుష్పుల్ రైలు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దపల్లి, రాంగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులు సింగరేణి రైలును యధావిధిగా నడపాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. 50 ఏళ్లుగా నడస్తున్న సింగరేణి రైలును మార్చటం ఏంటని విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత బోగీలతో సింగరేణి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కొరుతున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు. రెండునెలల నుంచి నడస్తున్న ఎలాంటి సౌకర్యాలు లేని పుష్పుల్ను రద్దు చేయాలని ప్రయాణికులు, సింగరేణి కార్మికులు కోరుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కావున ప్రజాప్రతినిధులు దృష్టిసారించి సింగరేణి రైలును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. -
నిలువ నీడ లేక..
సాక్షి, చోడవరం(విశాఖ) : ఒక పక్క ఎండలు..మరో పక్క వర్షాలు...ప్రయాణికులకు మాత్రం అవస్థలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జంక్షన్లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్తితి. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ వారు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. 80 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు చోడవరం నియోజకవర్గంలో సుమారు 80 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోగా మిగతా 100 గ్రామాలకు బస్సులు వెళుతున్నా 60 శాతానికి పైగా గ్రామాలకు బస్ షెల్టర్లు లేవు. నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 40 వేలకు మందికి పైగా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రోజువారీ పనులు, ఇతర కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఎండలకు మండుతూ, వర్షాలకు తడుస్తూ ఎప్పుడో వచ్చే బస్సులు, ఆటోల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రూట్లలో సైతం కనిపించని షెల్టర్లు చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, మాడుగుల ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బీఎన్రోడ్డు, మాడుగుల రోడ్డు, అనకాపల్లి –బంగారు మెట్ట, తోటకూపాలెం, రావికమతం రోడ్లులో సైతం చాలా గ్రామాల వద్ద బస్ షెల్టరు లేవు. నాలుగైదు గ్రామాల్లో స్థానిక దాతల సాయంతో బస్షెల్టర్లు నిర్మించగా, మరో ఏడు చోట్ల గతంలో పార్లమెంటు సభ్యుల నిధులతో నిర్మించారు. మిగతా గ్రామాల్లో కనీసం నిలబడడానికి నీడ కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం పరుగులు చోడవరం మండలంలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, గంధవరం, లక్కవరం, గాంధీగ్రామం, నర్సయ్యపేట, గౌరీపట్నం జంక్షన్, నర్సాపురం జంక్షన్, రాయపురాజుపేట, శీమునాపల్లి, ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి ఉండడానికి బస్ షెల్టర్లు లేవు. కొన్ని చోట్ల గ్రామాలు దూరంగా ఉండడంతో ఆయా జంక్షన్లలో మరీ దయనీయంగా ఉంది. స్కూళ్లు ప్రారంభం కావడం, వర్షాకాలం వచ్చేయడంతో సాధారణ ప్రయాణికులతోపాటు రోజూ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. షెల్టర్లు లేక వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు ప్రయాణికుల దుస్థితి గమనించి బస్ షెల్టర్లు కట్టించాలని జనం కోరుతున్నారు. ఐదేళ్లుగా నిర్లక్ష్యం గడిచిన ఐదేళ్లలో ఒక్క బస్షెల్డర్ కూడా గత ప్రభుత్వం నిర్మించలేదు. అసలే ఎండలు మండిపోవడం, అకాల వర్షాలు కురవడంతో ప్రయాణికులు తలదాచుకోడానికి నిలువు నీడలేకుండా ఉంది. చెట్ల కింద ఉన్నా, కొన్ని గ్రామాలకు జంక్షన్ల వద్ద చెట్లు కూడా లేవు. బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నాం. మా గ్రామం అనకాపల్లి –చోడవరం రోడ్డులో ఉన్నప్పటికీ బస్ షెల్టర్ లేదు. – మొల్లి ప్రసాద్, గంధవరం షెల్టరు నిర్మించాలి మా రూట్లో ఒకటి రెండు బస్సులే నడుస్తున్నాయి. అవికూడా సకాలంలోరావు. ఆ బస్సుకోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. ఎండకి ఎండి, వర్షానికి తడిసి నిలబడాల్సి వస్తుంది. బస్ షెల్టర్ కోసం పలుమార్లు గత ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాం. కానీ ఆయన పట్టించుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకొని మా జంక్షన్ వద్ద బస్షెల్టర్ నిర్మించాలని కోరుతున్నాం. –అప్పారావు, వీఆర్పేట -
ఎక్స్ప్రెస్లొస్తే ఒట్టు..
భిక్కనూరు : ఆ ఊరికి బస్సుల్లేవని పిల్లనివ్వడం లేదు..నిజమే వింతగా అనిపించినప్పటికీ భిక్కనూరు మండలానికి ఇలాంటి చిక్కొకటి వచ్చిపడింది. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు భిక్కనూరు రాష్ట్రంలోనే ఆదర్శమండలంగా పేరొందింది. నాలుగులైన్ల రోడ్డు ఏర్పాటు కానప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సు భిక్కనూరు మీదుగా వెళ్లేది. ఏ రాత్రయినా భిక్కనూరు రావాలంటే బస్సులుండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. జంకుతున్నారు.. భిక్కనూరు పిల్లనివ్వాలంటే జంకే రోజులొచ్చాయి. ఎప్పుడైతే నిజామాబాద్, హైదరాబాద్కు నాలుగు లైన్ల రోడ్డు వచ్చిందో భిక్కనూరును చూసేవారే కరువయ్యారు. ఎక్స్ప్రెస్ బస్సు కనిపిస్తే ఒట్టు.. ఒకప్పుడు నాల్గులైన్ల రోడ్డును భిక్కనూరు మీదుగా వెళ్ల వద్దని కొందరూ అభ్యంతరం చెప్పడంతో ఎన్హెచ్ అధికారులు భిక్కనూరుకు బైపాస్ను ఏర్పాటు చేశారు. దీంతో భిక్కనూరు మండల కేంద్రానికి ఎక్స్ప్రెస్ బస్సులు రావడం తగ్గాయి. దీంతో ప్రజలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిరాహారదీక్షలు చేశారు. హామీలు రెండ్రోజులకే.. ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టి బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీ అధికారులు వచ్చి బస్సులున్నింటిని భిక్కనూరు మీదుగా వెళ్తాయని హామీ ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత రెండు, మూడురోజుల భిక్కనూరు మీదుగా వెళ్తాయి. అనంతరం షరామూమాలే.. బైపాస్ రోడ్డు మీద దిగి భిక్కనూరుకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లు భిక్కనూరులో స్టాప్ ఉన్నప్పటికి బస్సులను భిక్కనూరు మీదుగా తీసుకెళ్లడం లేదు. కొందరూ ప్రయాణికులు డ్రైవర్లను, కండక్టర్లను నిలదీయడంతో ఆ ఒక్క బస్సు మాత్రమే భిక్కనూరు మీదుగా వెళ్తుంది. తర్వాత మళ్లీ మామూలే. ప్రతిరోజూ గొడవ పడలేం.. ప్రతిరోజు ఏం గొడవ పెట్టుకుంటాం మా ఖర్మ.. అనుకుంటూ ప్రయాణికులు భిక్కనూరు స్టాప్ దగ్గర దిగి ఊళ్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లాపాపలను ఎత్తుకొని అంతదూరం నడుచుకుంటూ ఊళ్లోకి రావడం నరకాన్ని తలపిస్తోంది మహిళలు అంటున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్–1 నిజామాబాద్–2 నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, బాన్స్వాడ, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు ప్రధానంగా వెళ్తాయి. కామారెడ్డి డిపోకు చెందిన కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కూడా భిక్కనూరు మండల కేంద్రం మీదుగా వెళ్లడంలేదు. ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు.. ఎక్స్ప్రెస్ బస్సు ప్రయాణం అంటే భయమేస్తోంది. భిక్కనూరు నుంచి వేరే గ్రామాలకు వెళ్లాలంటే బస్సుల కోసం మం డల కేంద్రంలో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇక కామారెడ్డి హైదరా బాద్ వైపునుంచి బస్సులు బైపాస్ గుండా వెళ్లడంతో అక్కడి దిగి రావడం ఇబ్బందికరంగా ఉంది. – లక్ష్మీనారాయణ ప్రయాణికుడు భిక్కనూరు. చాలా కష్టంగా ఉంది.. మీ భిక్కనూరుకు పిల్లను ఇద్దామంటే బస్సులు రావు ఎలా ఇ స్తాం అని అంటున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులు రావు ఆర్డినరీ బస్సుల్లో వెళ్దామంటే నిల్చోవడానికే జాగా ఉండదు. ఏమి చేస్తాం ఆటోల్లో పోవాల్సి వస్తుంది. అన్ని బస్సులు భిక్కనూరు మీదుగా పోయేలా చేయాలి. అప్పుడే మాకు బస్సుల కష్లాలు పోతాయి. –ప్రమీల, బీడీ కార్మికురాలు భిక్కనూరు. -
డొక్కు బస్సు.. ప్రయాణికుల కస్సు బుస్సు
అనంతపురం న్యూసిటీ: ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లాంగ్ సర్వీసులకు డొక్కు బస్సులు వేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శుక్రవారం జడ్చర్ల టోల్గేట్ వద్ద జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. కదిరి డిపోకు చెందిన (ఏపీ29జడ్ 0649) బస్సు శుక్రవారం హైదరాబాదు నుంచి కదిరికి బయలు దేరింది. బస్సు కండీషన్లో లేకపోగా విపరీతమైన శబ్ధాలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. జడ్చర్ల టోల్గేట్ దాటాక బస్సును నిలిపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బస్సులో విజేయుడు అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగిందనీ, బస్సు శబ్దాలతో ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ వారి కుటుంబీకులు, ప్రయాణికులు డ్రైవర్ రమణను నిలదీశారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ, లేకపోతే వేరే బస్సు పంపాలంటూ కోరారు. అయితే డ్రైవర్ రమణ ‘ ఇష్టముంటే రండి లేకుంటే దిగిపోండి డబ్బులు ఇచ్చేది లేదు’ అని చెప్పారు. దీంతో గంటపాటు డ్రైవర్, ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విజేయుడు కుటుంబీకులు ఆర్ఎం చిట్టిబాబుకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీనిపై శనివారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రయాణికులు తెలిపారు.