pcc president
-
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్కుమార్గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి నుంచి మహేశ్గౌడ్ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్పార్కు వద్దకు రానున్న మహేశ్గౌడ్ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్కు చేరుకుంటారని తెలిపాయి.బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్లతో పాటు రాష్ట్ర కేబినెట్లోని మంత్రులు హాజరుకానున్నారు. ముస్తాబైన గాందీభవన్.. కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్మెన్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్సాగర్రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. వచ్చే నెల తొలివారంలో నియామకాలు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు. రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్హౌజ్లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు.. హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు. -
చివరి దశకు ‘పీసీసీ’ కసరత్తు!
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఢిల్లీలో విస్తృతంగా చర్చలు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబులతోపాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్, సంపత్కుమార్ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీని మహేశ్గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ చర్చించారు. తెలంగాణ భవన్లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా..పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు. -
ఎమ్మెల్యేలు జంప్.. పీసీసీ చీఫ్ రాజీనామా
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు. నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్డాంగ్ బీజేపీలో చేరారు. -
ఆరేళ్లలోనే... అత్యున్నత హోదాకు
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. వైఫల్యాలను అధిగమిస్తూ.. కాంగ్రెస్ పార్టిలో చేరిన తర్వాత రేవంత్రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. -
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్సింగ్ వారింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా అమరీందర్సింగ్ రాజా వారింగ్ను పార్టీ అధినేత సోనియా గాంధీ శనివారం నియమించారు. ప్రతాప్సింగ్ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) కొత్త నాయకుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్సింగ్ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్సింగ్ రాజా వారింగ్ పంజాబ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్లోని పాటియాలాలో వాహనం పార్కింగ్పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్గా..) -
ఈనెల 23న పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న సిద్దూ
చంఢీగడ్: పంజాబ్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 23న పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్ రావత్ సహా పలువురు ప్రముఖలకు ఆయన ఆహ్వానం పంపారు. ఇదిలా ఉంటే, సీఎం అమరీందర్పై సిద్దూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు సిద్దును సీఎం కలిసే అవకాశమే లేదని ప్రభుత్వ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ కోసం అమరీందర్ సింగ్ ఎలాంటి సమయాన్ని కేటాయించలేదనినాయన అన్నారు. మరోవైపు సిద్దూ ఇవాళ 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్సర్లోని తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతో పాటు పలు ఆథ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. -
చచ్చినా కాంగ్రెస్ను వీడను: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, జహీరాబాద్: కాంగ్రెస్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, చచ్చినా పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేయడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. పీసీసీ పదవి భర్తీలో జాప్యం వల్లే కొంత మంది సీనియర్లు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలను సాకుగా చూపుతూ ఇంకా జాప్యం చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తోందని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్కుమార్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను ఏఐసీసీ దాదాపు పూర్తి చేసింది. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ మరికొద్ది రోజులు సాగనుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సుమారు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ల బృందం అధిష్టానానికి తమ నివేదికను సమర్పించింది. అయితే గత రెండ్రోజులుగా ఠాగూర్ సమర్పించిన ఆశావహుల జాబితా నివేదికపై ఏఐసీసీ స్థాయిలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసన్లు రెండుసార్లు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఇతర రాజకీయపక్షాలకు ధీటుగా పార్టీని నడిపించగల సామర్థ్యం ఉన్న వారినే నియమించాలని ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ కీలక నేత తెలిపారు. మరోవైపు ఈ విషయంపై చర్చించేందుకు అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అనేకసార్లు భేటీ అయ్యారు. చదవండి: (వాజ్పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం) అసంతృప్తి తగ్గించడం ఎలా..? అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయిలో లేదా ఏఐసీసీ స్థాయిలో మెరుగైన పదవులు కట్టబెట్టడం ద్వారా అసంతృప్తి తగ్గించవచ్చని పెద్దలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాహుల్ గాంధీ స్వయం గా ఆశావహులతో మాట్లాడిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటారని, శని, ఆదివారాల్లో ఆయన వారితో మాట్లాడుతారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్బాబు, జీవన్రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) పార్టీ బలోపేతంపై దృష్టి.. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై వచ్చిన వ్యతిరేకతను బీజేపీ కంటే ముందే తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. అందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 2021 జనవరి 1 నుంచి కొత్త యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత మండల స్థాయి అ«ధ్యక్షుల నియామకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేదా కొత్త అధ్యక్షులను నియమించాలా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయ్యాక జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరుగుతాయని తెలిసింది. పీసీసీ కమిటీల్లో భారీ కోతలు.. ప్రస్తు తం భారీగా ఉన్న పీసీసీ కమిటీలో కోతలు ఉండే అవకాశం ఉంది. 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, 27 మం ది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను కుదించనున్నారు. జిల్లా స్థాయి లో ఓ అధికార ప్రతినిధి, పీసీసీ స్థాయిలో 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను కొత్త కమిటీలో నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. -
శివకుమార్పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలకు పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం ఉండదని, తనంతట తాను ఉత్తమ్ తప్పుకుంటే తప్ప పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండ దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ తప్పుకుంటే పీసీసీ రేసులో రేవంత్రెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలుంటారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటి ఇచ్చిందని చెప్పిన జగ్గారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 20–25 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలు స్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే సానుకూలత ఉంటుందని, అయినా కాంగ్రెస్ కూడా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం లో యూపీఏ అధికారంలోకి వస్తుందన్నారు. -
ఢిల్లీ పీసీసీ చీఫ్గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను పార్టీ అధిష్టానం నియమించింది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు. -
సంక్షేమ పథకం అందని కుటుంబమే లేదు
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకం, సహాయం పొందని కుటుంబమే లేదని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వైఎస్సార్ను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేశాయని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దివంగత నేతకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిసిస్తోందన్నారు. నిరంతరం పేదల సంక్షేమం గురించే ఆలోచించే వారని, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్కే చెందుతుందని అన్నారు. ఆయన ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని తెలిపారు. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కమల్నాథ్కు పగ్గాలు!
భోపాల్: గతకొంతకాలంగా సాగిన తర్జనభర్జనలకు తెరదించుతూ మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా సీనియర్ నేత కమల్నాథ్కు కాంగ్రెస్ అధిష్టానం పగ్గాలు అప్పగించింది. 2003 నుంచి కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అధికారానికి దూరంగా ఉంది. పార్టీలో సీనియర్ నేతలు అనేకమంది ఉన్నా.. క్యాడర్ మాత్రం దినదినానికి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. పార్టీ సీనియర్ నేత, ఎంపీ కమల్నాథ్కు పగ్గాలు అప్పగించింది. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన కమల్కు సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. అన్నింటికీ మించి సోనియాగాంధీకి ఆయన నమ్మిన బంటు. పార్టీని పునర్నిర్మించి.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తన ముందున్న అతిపెద్ద సవాలు అని నియామకం అనంతరం కమల్నాథ్ పేర్కొన్నారు. పార్టీలో అందరూ తనకు స్నేహితులేనని, పెద్దలు, పిన్నలు, అందరినీ కలుపుకొని ముందుకువెళుతానని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా కమల్నాథ్ నియామకం వెనుక దిగ్విజయ్సింగ్ హస్తమున్నట్టు భావిస్తున్నారు. డిగ్గి రాజా, కమల్ మంచి స్నేహితులు. కమల్ను దిగ్విజయ్ ‘సోదరుడి’గా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో బలమైన నేతగా ఎదుగుతున్న జ్యోతిరాదిత్య సింధియాకు చెక్ పెట్టేందుకే దిగ్విజయ్ కమల్నాథ్కు అండగా నిలిచి.. పీసీసీ పగ్గాలు ఆయనకు దక్కేలా చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
చేవెళ్ల సెంటిమెంట్!
చేవెళ్ల: మరోసారి ‘చేవెళ్ల సెంటిమెంట్’ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ ఇక్కడి నుంచే రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈనెల 26న చేవెళ్లలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర మే 15 వరకు కొనసాగనుంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటకు కారణమైన వైఎస్ ప్రజాప్రస్థానం, జైత్రయాత్రల తరహాలోనే ఈ సారి ఎన్నికలకు చేవెళ్ల సెటింమెంట్ అస్త్రాన్ని హస్తం పార్టీ ప్రయోగించనుంది. వైఎస్ హఠాన్మరణంతో కాం గ్రెస్ పార్టీకి పరాజయాలే ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకునేందుకు బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై గాంధీభవన్లో తర్జనభర్జనలు పడిన నేతలు చివరకు.. కాంగ్రెస్కు తిరుగులేని విజయాలను అందించిన చేవెళ్ల సెంటిమెంట్కే ఓకే చెప్పారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించి పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చారు. తదనంతరం ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చారు. దీంతో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా మారింది. 2009 ఎన్నికల్లో కూడా ప్రచార యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. బస్సు యాత్ర సాగేదిలా.. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు ఇతర ముఖ్యనేతలు అంతా కలిసి ఈ బస్సు యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈనెల 26న మధ్యాహ్నం చేవెళ్లలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం వికారాబాద్ జిల్లాకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 27న తాండూరుకు చేరుకొని అదే రోజు రాత్రికి సంగారెడ్డి జిల్లాలోకి వెళ్తుంది. -
గ్రాఫిక్స్తో మభ్యపెడుతున్న సీఎం
మడకశిర: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్తో మభ్యపెడుతున్నారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి, నిపుణులు గ్రాఫిక్స్ చేసినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా సీఎం దత్తత తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు గెలిపిస్తే రాష్ట్ర స్థూల ఆదాయంలో 13వ స్థానంలో నిలిపారన్నారు. 175 నియోజకవర్గాల తలసరి ఆదాయంలో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా అవగాహన లేని జీఎస్టీ, నోట్ల రద్దువల్ల దేశంలో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుదేలైందన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. -
అంతా ఎన్నికల స్టంటే
ఉప ఎన్నికలో గెలిచేందుకు గడ్డితినేందుకైనా చంద్రబాబు సిద్ధమే గుంతకల్లు మహాధర్నాలో చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీర ఫైర్ గుంతకల్లు : సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఎలాంటి గడ్డి తినడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒక్క నంద్యాల పట్టణంలోనే 13 వేల నివాస గృహాలు మంజూరు చేశారని, కరువు జిల్లా అనంతపురంలో మూడేళ్ల కాలంలో ఎన్ని పక్కాగృహాలు నిర్మించారని ప్రశ్నించారు. ఈ సమాధానమే చంద్రబాబు ఎన్నికల స్టంట్ను బహిర్గతం చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లులో మహాధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అజంతా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి దౌల్తాపురం ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని పంటలకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేస్తుంటే అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 250కి పైగా చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సాధించడానికే ఈ ధర్నా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణయాదవ్, నాయకులు ఆలంనవాజ్, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారిని బాబు సర్కార్ గాలికొదిలేసింది: రఘవీరా
-
వారిని బాబు సర్కార్ గాలికొదిలేసింది: రఘవీరా
-
వారిని బాబు సర్కార్ గాలికొదిలేసింది: రఘవీరా
హైదరాబాద్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కౌలు రైతులను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ఠ్రంలో 5 లక్షల హెక్టార్ల వరిసాగు తగ్గిందని ఆరోపించారు. నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. వారం లోపల రైతు సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రాజధానిలో మొదలైన కబ్జాలు ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించాయన్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను సీఎం కుమారుడు లోకేష్, మంత్రులు దొచుకుంటున్నారని ఆరోపించారు. హుద్హుద్ తుఫాన్ లో కొట్టుకు పోయిన భూముల డాక్యుమెంట్స్ ను టీడీపీ నేతలు తమ అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఒక్క విశాఖలోనే రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని, సిట్ ను రెండు గ్రామాల స్కామ్ కు పరిమిత చేస్తూ.. కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ తో జరిగేది శూన్యమన్నారు. హైకోర్టు పర్యవేక్షణ లో సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. విశాఖ కలెక్టర్ పై సీఎం వత్తిడి చేస్తున్నారని, చినబాబు జ్యోక్యంతో కలెక్టర్ స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్నారని చెప్పారు. మా దగ్గర ఉన్న ఆధారాలను రేపు కలెక్టర్ కు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను తండ్రీ కుమారులు, పాతర వేస్తున్నారని ఆరోపించారు. -
రహస్య ఒప్పందాలతో దోపిడీ:రఘువీరా
అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్తో రహస్య ఒప్పందాలు చేసుకొని సీఎం చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి రాజధాని నిర్మాణానికి చేసుకున్న ఏకపక్ష, రహస్య స్విస్ చాలెంజ్ ఒప్పందాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల పాలన పాపాలపై జూన్ 8వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా చార్జిషీట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి హోదా సాధించి తీరుతామని, అందుకు గాను వచ్చే నెల మొదటి వారం భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రత్యేక హోదాను బలపర్చిన 14 జాతీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగమైన ప్రత్యేక హోదా అమలు చేయకుండా నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించడం సరికాదన్నారు.