prohibition
-
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫ్రీడం లీగ్(జేకేపీఎఫ్ఎల్)తోపాటు వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్తో సంబంధమున్న జమ్మూకశ్మీర్ పీపుల్స్ లీగ్(జేకేపీఎల్)లోని అన్ని గ్రూపులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది. దీంతోపాటు, ఉగ్రవాద ఆరోపణలపై జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పై నిషేధాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఉగ్ర సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఉత్తరాఖండ్లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్ను పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డోపింగ్లో పట్టుబడ్డ దీపా కర్మాకర్పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది. అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్లోనే ఆమె డోపింగ్లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది. -
పీఏఎఫ్ఎఫ్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్కు ఇది మారుపేరు. ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్ఎఫ్పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. -
డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్ కౌర్పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
బిహార్లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్
పట్నా: బిహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం నిషేధ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం నితీశ్కు సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. నితీశ్ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసమే మద్యం నిషేధాన్ని ప్రకటించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వాస్తవానికి మహిళలే నిషేధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం కోసం అడ్డదారులు తొక్కి మగవాళ్లు జైలు పాలైతే వారి కోసం మహిళలు కాళ్లరిగేలా స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పెచ్చుమీరిన అవినీతి కారణంగానే నిషేధం విఫలమైంది. అందుకే గొప్పలకు పోకుండా నిజాయతీగా ఈ విధానంపై సమీక్ష చేపట్టాలని సీఎంను కోరా’అని ఆయన వివరించారు. ‘జన్సురాజ్’ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టబోయే 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రకు ఏర్పాట్లను చంపారన్లో కిశోర్ సమీక్షించారు. మిస్టర్ సుంగోర్కిన్ యొక్క "ఆకస్మిక" మరణం మరొక రష్యన్ ఎలైట్, ఇవాన్ పెచోరిన్, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్, అతను స్పీడ్ బోర్డ్ నుండి ఓవర్బోర్డ్లో పడిపోయిన తర్వాత రహస్యమైన పరిస్థితులలో మరణించిన కొద్ది రోజులకే వచ్చింది. మిస్టర్ పుతిన్ స్వయంగా హత్యాయత్నం నుండి బయటపడినట్లు నివేదించబడిన ఒక రోజు తర్వాత కూడా ఇది వస్తుంది. టెలిగ్రామ్ ఛానెల్లోని ఖాతా ప్రకారం, మిస్టర్ పుతిన్ యొక్క లిమోసిన్ యొక్క ఎడమ ముందు చక్రం పెద్ద చప్పుడుతో కొట్టబడింది, యూరో వీక్లీ నివేదించింది, దాని నుండి పొగ వెలువడినప్పటికీ కారు త్వరగా సురక్షితంగా నడపబడిందని పేర్కొంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడు క్షేమంగా ఉన్నారని, అయితే పలువురిని అరెస్టు చేసినట్లు అవుట్లెట్ తెలిపింది. (చదవండి: వెనెకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా) -
అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం
పట్నా: వర కట్నానికి వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకోలేదని వరుడి తరపు వారు చెబితేనే తాను పెళ్లికి హాజరవుతానని ఆయన అన్నారు. పట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్ను ఈనెల 23న ప్రారంభించిన సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లికొడుకు కట్నం తీసుకోలేదని రాతపూర్వకంగా తెలిపితేనే పెళ్లికి హాజరవుతానని అందరికీ చెప్పినట్టు వెల్లడించారు. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పెళ్లి కోసం కట్నం తీసుకోవడం దారుణం. మీరు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్న మనమంతా తల్లులకు పుట్టాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా?’ అంటూ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. (క్లిక్: 54% మహిళలకే సొంత సెల్ఫోన్) ప్రచార కార్యక్రమాలతో వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమ్మాయిలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిందని నితీశ్ కుమార్ అన్నారు. (క్లిక్: కాంగ్రెస్కు కపిల్ సిబల్ రాజీనామా) -
ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలను నిషేధించాలి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఔషధాలను విక్రయించకుండా నిషేధం విధించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్’ పేరుతో ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే సీఏఐటీ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఆన్లైన్లో ఔషధాలను విక్రయించే ఈ ఫార్మసీలను నిషేధించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయ ల్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశామని.. తక్షణమై దీనిపై దృష్టి సారించాలని కోరినట్టు ప్రకటించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం (డీసీ) ఔషధాల దిగుమతులు, తయా రీ, విక్రయాలు, పంపిణీలను నియంత్రిస్తోందని.. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా కఠిన నిబంధనలు చట్టంలో ఉన్నట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా, ఒరిజినల్ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఔషధాలను విక్రయించడం, పంపిణీ చేయడం నిషేధమని గుర్తు చేశారు. భారతీయ చట్టాల్లోని మధ్యవర్తుల ముసుగులో కల్తీ, నకిలీ ఔషధాలను విక్రయించి బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఈ ఫార్మసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆఫ్లైన్ వర్తకులను దెబ్బతీసే విధంగా భా రీ తగ్గింపులు, దోపిడీ ధరలను అనుసరించే మార్కెట్ప్లేస్లను నిషేధించాలని కోరారు. కనీస పెనాల్టీని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని.. అప్పుడు ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్, ఫ్లిప్కార్ట్, అమె జాన్ ఫార్మసీ, టాటా1ఎంజీ తదితర నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని తగిన విధంగా శిక్షించడానికి వీలు పడుతుందని అభిప్రాయం తెలియజేశారు. -
రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ
లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్ ఫుట్బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ను రద్దు చేసింది. -
రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా!
వాషింగ్టన్/ఐరాస: ఉక్రెయిన్పై రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఆ దేశంపై కఠిన ఆంక్షలకు అమెరికా తెర తీసింది. పాశ్చాత్య దేశాలతో రష్యా ప్రభుత్వ అభివృద్ధి సంస్థ (వీఈబీ), సైనిక బ్యాంకు లావాదేవీలపై పూర్తి నిషేధం విధించింది. రష్యా సావరిన్ రుణాలకు కూడా తమ ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో రష్యా ఇకపై ఎలాంటి వర్తక, వాణిజ్యాలూ జరపలేదన్నారు. తమ మార్కెట్లకు రష్యా ఇక పూర్తిగా దూరమైనట్టేనన్నారు. తమ పాశ్చాత్య మిత్రులతో సన్నిహితంగా చర్చించిన మీదటే ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అతి త్వరలో మరిన్ని వరుస ఆంక్షలుంటాయని హెచ్చరించారు. అవి రష్యా సంపన్నులు, వారి కుటుంబీకులను లక్ష్యం చేసుకుని ఉంటాయని వెల్లడించారు. రష్యా అవినీతిమయ విధానాలతో భారీగా లాభపడే ఈ కుబేరులు ఇప్పుడు నొప్పిని కూడా భరించాల్సి ఉంటుందన్నారు. అలాగే జర్మనీతో కలిసి రష్యా తలపెట్టిన నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ముందుకు సాగే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. రష్యా చర్యలన్నింటికీ అంతకు మించిన ప్రతి చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇచ్చే అధికారం రష్యాకు ఎవరిచ్చారంటూ బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్లోని ఒక పెద్ద భూభూగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తనంత తానుగా స్వతంత్రం ప్రకటించారు! తద్వారా అంతర్జాతీయ చట్టాలను, న్యాయాలను తుంగలో తొక్కారు. అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్తామని తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడికి ఆరంభమే’’ అంటూ బైడెన్ మండిపడ్డారు. ఇందుకు ప్రతి చర్యగా ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలతో కూడిన బాల్టిక్ ప్రాంతానికి మరిన్ని అమెరికా దళాలను, ఆయుధాలను పంపుతున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. అయితే రష్యాతో యుద్ధానికి దిగే ఉద్దేశమేదీ అమెరికాకు లేదని స్పష్టం చేశారు. కాకపోతే నాటో సభ్య దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడి తీరతామని రష్యాకు గట్టి సందేశమివ్వడమే తమ ఉద్దేశమన్నారు. రష్యా దూకుడు మానకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని ఇంగ్లండ్ కూడా మరోసారి హెచ్చరించింది. సంక్షోభం నుంచి బయట పడేందుకు ఉక్రెయిన్కు 50 కోట్ల డాలర్ల దాకా రుణ సాయం చేస్తామని పునరుద్ఘాటించింది. ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు కూడా బుధవారం రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యాపై ఆంక్షలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలిస్తూ సమస్యను అమెరికాయే ఎగదోస్తోందని ఆరోపించింది. సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించడం తక్షణావసరమని సూచించింది. మరోవైపు ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై గురువారం జరగాల్సిన అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ రద్దయింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ మేరకు ప్రకటించారు. కాకపోతే సంక్షోభ నివారణకు చర్చలకు తామిప్పటికే సిద్ధమేనని బైడెన్ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి విఘాతమంటూ పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి పెద్ద సంక్షోభమిది: గుటెరెస్ రష్యా దూకుడుతో ప్రపంచ శాంతి, భద్రత పెను సంక్షోభంలో పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఉక్రెయిన్లోకి సైన్యాన్ని పంపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దుయ్యబట్టారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు, ఐరాస నియమావళికి గొడ్డలి పెట్టేనన్నారు. పొరుగు దేశంలోకి జరిపిన సైనిక చొరబాటుకు శాంతి పరిరక్షణ అని పేరు పెట్టడం దారుణమన్నారు. తన దూకుడు చర్యల నుంచి తక్షణం వెనక్కు తగ్గాలని రష్యాను హెచ్చరించారు. లేదంటే ఇరు దేశాలూ అంతమంగా తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కు ఐరాస పూర్తి మద్దతుంటుందని చెప్పారు. తిరిగొస్తున్న మన విద్యార్థులు న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్లకు చెందిన విద్యార్థులు మంగళవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి టర్కీకి, అక్కడి నుంచి కతార్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. తామున్న చోట్ల ఉద్రిక్త పరిస్థితులేమీ లేకున్నా భారత ఎంబసీ సూచన మేరకు తిరిగొచ్చినట్టు చెప్పారు. అదే ఉద్రిక్తత కీవ్: రష్యా దూకుడు నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. వేర్పాటువాద ప్రాంతాల వద్ద సైన్యానికి, రెబెల్స్కు మధ్య కాల్పులు పెరుగుతున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశించారు. రష్యాతో సహా పలు దేశాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్లోని తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తున్నాయి. యుద్ధ భయాల దెబ్బకు పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు పడకేశాయి. దాంతో కొద్ది వారాల వ్యవధిలో వందల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు హరించుకుపోయి ఆర్థికంగా దేశం అల్లాడుతోంది. రష్యా పథకం ప్రకారం ఉక్రెయిన్ను ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బ తీస్తోందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచ గోధుమ సరఫరాల్లో 12 శాతం, మొక్కజొన్నలో 16 శాతం వాటా ఉక్రెయిన్దే. వాటి ఎగుమతులపై దెబ్బ పడేలా కన్పిస్తోంది. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దేశం వీడుతున్నారు. జనం తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఉన్నపళంగా ఖాళీ చేసుకుంటున్నారు. జనవరిలో 1,250 కోట్ల డాలర్లు విత్డ్రా అయ్యాయని అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు. రష్యాపై దేశాల ఆంక్షలు ► అమెరికా వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 సబ్సిడరీలపై నిషేధం. ఐదుగురు రష్యా కుబేరుల ఖాతాల స్తంభన. డోన్బాస్ రీజియన్తో అమెరికావాసులెవరూ వర్తక లావాదేవీలు చేయొద్దని ఆదేశాలు. ► జర్మనీ రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్కు అనుమతుల నిలిపివేత ► ఇంగ్లండ్ ఐదు రష్యా బ్యాంకులపై నిషేధం. ముగ్గురు ఆ దేశ సంపన్నుల ఖాతాల స్తంభన. ► యూరోపియన్ యూనియన్ రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమాలోని 351 మంది సభ్యుల ఆస్తుల స్తంభన, వీసాలపై నిషేధం. ► ఆస్ట్రేలియా రష్యా సెక్యూరిటీ కౌన్సిల్లోని 8 మందిపై, సైనిక సంబంధాలున్న రష్యా బ్యాంకులపై నిషేధం ► జపాన్ రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, వర్తకంపై నిషేధం ► కెనడా రష్యా బ్యాంకులపై, సావరిన్ రుణ లావాదేవీల్లో కెనడావాసులు పాల్గొనడంపై నిషేధం. -
కమోడిటీ కొత్త ఫ్యూచర్స్కు సెబీ చెక్
న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల డెరివేటివ్ కొత్త కాంట్రాక్టులపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కన్నెర్ర చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ముడిపామాయిల్, పెసరపప్పు, గోధుమలు తదితర 7 వ్యవసాయ సంబంధ కమోడిటీలలో కొత్తగా ప్రవేశపెట్టే ఫ్యూచర్స్(కాంట్రాక్టులు)ను నిషేధించింది. తద్వారా పెరుగుతున్న ధరల(ద్రవ్యోల్బణం)కు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టులలో పొజిషన్లను ముగించుకునేందుకు(స్క్వేరింగ్ అప్) అనుమతిస్తూనే.. కొత్త పొజిషన్లకు చెక్ పెట్టింది. తాజా ఆదేశాలు ఏడాది కాలంపాటు అమలులో ఉంటాయని సెబీ స్పష్టం చేసింది. బాస్మతియేతర ధాన్యం, గోధుమలు, సోయాబీన్, తత్సంబంధ ఉత్పత్తులు, ముడిపామాయిల్, పెసరపప్పు వంటి ఉత్పత్తులలో తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవవరకూ కొత్త కాంట్రాక్టులను ప్రవేశపెట్టకుండా నిలువరించింది. ఈ జాబితాలో సెనగలు, ఆవాలు, సంబంధిత ఉత్పత్తుల డెరివేటివ్స్ను సైతం జాబితాలో చేర్చింది. కాగా. ఈ కమోడిటీలలో డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ ఏడాది మొదట్లోనే నిషేధించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ద్రవ్యోల్బణంపై పడుతున్న ఆహార సరుకుల ప్రభావాన్ని అరికట్టే బాటలోనే సెబీ 7 వ్యవసాయ కమోడిటీల డెరివేటివ్స్ను ఏడాదిపాటు సెబీ నిషేధించినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ అభిప్రాయపడ్డారు. కాగా.. వీటిలో కొత్త పొజిషన్లు తీసుకునేందుకు అనుమతించబోమని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్సే్ఛంజీ(ఎన్సీడీఈఎక్స్) తాజాగా తెలియజేసింది. ఉన్న పొజిషన్లను ముగించేందుకు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. అనుమతించిన కొన్ని కమోడిటీలలోనే ఎఫ్అండ్వో కాంట్రాక్టులకు వీలుంటుందని వివరించింది. సెబీ నిషేధించిన కమోడిటీలలో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ కొత్తగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టబోమని వెల్లడించింది. -
‘ఎన్ఎస్ఓ గ్రూప్పై నిషేధం’ ప్రతిపాదన లేదు
న్యూఢిల్లీ: ‘ఎన్ఎస్ఓ గ్రూప్’ అని పేరున్న సంస్థలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. పెగాసస్ స్పైవేర్ను ప్రభుత్వాలకు అందించినందుకు గాను ఎన్ఎస్ఓ గ్రూప్ను అమెరికా ప్రభుత్వం బ్లాక్లిస్టులో చేర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్ను భారత్లో నిషేధిస్తారా? అని రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి ప్రతిపాదన లేదన్నారు. దేశంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతున్న సంగతి నిజమేనని అంగీకరించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసి, విక్రయించిన పెగాసస్ స్పైవేర్తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుతోంది. పెగాసస్ స్పైవేర్ వాడకంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
విమానాల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. -
డిజిటల్ గోల్డ్ సేవలకు చెక్
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లు, సభ్యులు డిజిటల్ గోల్డ్ విక్రయించకుండా నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 10 నాటికి తమ ప్లాట్ఫామ్లపై డిజిటల్ గోల్డ్ విక్రయాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. కొందరు సభ్యులు తమ క్లయింట్లకు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు, విక్రయాలకు వీలుగా వేదికలను అందుబాటులో ఉంచుతున్నట్టు గుర్తించిన సెబీ ఈ మేరకు స్టాక్ ఎక్సే్చంజ్లకు లేఖ రాసింది. ‘‘ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీల కాంట్రాక్టుల నిబంధనలు (ఎస్సీఆర్ఆర్) 1957కు వ్యతిరేకమంటూ, సభ్యులను ఈ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలంటూ ఆగస్ట్ 3న రాసిన లేఖలో సెబీ కోరింది’’అంటూ ఎన్ఎస్ఈ పేర్కొంది. సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్లు మినహా ఇతర ఏ కార్యకలాపాలు నిర్వహించడానికి లేదని ఎస్సీఆర్ఆర్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తన సభ్యులు అందరూ డిజిటల్ గోల్డ్ తరహా కార్యకలాపాలు నిర్వహించకుండా నియంత్రణపరమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘డిజిటల్ గోల్డ్ సేవల్లో ఉన్న సభ్యులు ఇందుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి నెలలోపు అమలు చేయాలి’’ అంటూ ఎన్ఎస్ఈ ఈ నెల10నే ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణల పరిధిలో లేదు.. దీనిపై ట్రేడ్స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా స్పందిస్తూ.. డిజిటల్ గోల్డ్ యూనిట్లను నియంత్రణపరమైన సంస్థలు జారీ చేయడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్లకు సరిపడా భౌతిక బంగారాన్ని నిల్వ చేస్తున్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. -
బ్లాటర్పై మళ్లీ నిషేధం
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు. ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. -
సాక్షాత్తు పోలీసు అధికారే..
మునుగోడు: ధూమపానం చట్టరిత్యానేరం. బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదని ఇప్పటికే అనేక చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. అయితే ఇక్కడో పోలీస్ అధికారి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే సిగరెటు తాగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళ్తే. ఆదివారం మునుగోడు పోలీస్స్టేషన్లో ఓ అధికారి ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో సిగరేట్ వెలిగించిన ఆ అధికారి తాను పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్నానన్న సంగతి కూడా మరిచిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. సాధారణ పౌరులకు ఒక రూల్.. పోలీసులకు మరో రూల్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఇక మధ్యప్రదేశ్లో ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే! -
కొత్త క్యూఆర్ కోడ్లపై ఆర్బీఐ నిషేధం
ముంబై: చెల్లింపుల లావాదేవీల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్వో) కొత్తగా మరిన్ని సొంత క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్లనే కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత క్యూఆర్ కోడ్లు ఉపయోగించే పీఎస్వోలు కూడా ఈ రెండింటికి మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2022 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. జపాన్కి చెందిన డెన్సో వేవ్ అనే సంస్థ 1990లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్లను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్లు ప్రధానంగా భారత్ క్యూఆర్, యూపీఐ క్యూఆర్లతో పాటు సంస్థల సొంత క్యూఆర్లను సపోర్ట్ చేస్తున్నాయి. -
‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు
సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నీటి విడుదలతో.. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. ధర తక్కువంటూ.. ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్ పురుగు, దోమలకు , మూవ్ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నష్టాలు ఎక్కువే... గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి -
వీసా బ్యాన్పై కసరత్తు!
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్ ఆథరైజేషన్తో కూడిన స్టుడెంట్ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ‘వర్క్ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్ కార్డ్లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్లో ప్రతిపాదన చేశారు. -
కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్–పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్ సంస్థ కపిల్ చేసిన ట్వీట్లను తొలగించింది. -
ఓడల్లో ప్లాస్టిక్ నిషేధం
న్యూఢిల్లీ: ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్న తేలిన విషయం తెలిసిందే. -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
మత్తు దిగుతోంది
సాక్షి, గుంటూరు: ఎన్నో పచ్చని కుటుంబాలు మద్యం చిచ్చుకు నిలువునా కూలిపోతున్నాయి. దాంపత్య బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీటన్నింటినీ తన పాదయాత్రలో దగ్గరుండి చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే బెల్ట్ షాపుల రద్దు, ఎమ్మార్పీకే విక్రయాలు వంటి నిర్ణయాలతో ముందడుగు వేశారు. ఈ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మద్యం దుకాణాల రెన్యువల్ విషయంలో జిల్లాలో 20 శాతం యజమానులు వెనుకంజ వేశారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మద్య నిషేధంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బెల్టుషాపుల నిర్మూలన, బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేసే మద్యం దుకాణాలపై కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలను సర్కార్ అమలులోకి తీసుకువచ్చింది. దీంతో జిల్లాలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను అడ్డుకట్టపడింది. సమయపాలన కచ్చితంగా పాటించాలి, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. 20 శాతం తగ్గిన దుకాణాలు.. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా జిల్లాలో మద్యం దుకాణాల్లో 20 శాతం మేర తగ్గాయి. గత నెల 30కి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసింది. కొత్త మద్యం పాలసీ రూపలకల్పనకు కొంత సమయం పడుతుంటంతో ప్రభుత్వం మూడు నెలలు మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్కు అవకాశం ఇచ్చింది. జిల్లాలో 355 మద్యం దుకాణాలున్నాయి. జూన్ 30 నాటికి లైసెన్స్ రెన్యూవల్కు ప్రభుత్వం గడువు విధించగా 287 మద్యం దుకాణాల యజమానులు మాత్రమే లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్నారు. మిగిలిన 68 దుకాణాల నిర్వాహకులు ముందుకు రాలేదు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తగ్గిన మద్యం అమ్మకాలు.. ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల జిల్లాలో మద్యం అమ్మకాలు సైతం తగ్గుముకం పట్టాయి. సార్వత్రిక ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటై మద్యం అమ్మకాలపై నిబంధనలు కఠినతరం చేయడంతో జూన్ నెలకు ముందు జరిగిన అమ్మకాలతో పోల్చుకుంటే సుమారు రూ.20 కోట్లకు పైగా తగ్గాయి. జూన్ నెలలో రూ.149.66 కోట్ల మద్యం విక్రయాలు జరిగగా.. ఇక ముందు కూడా విక్రయాలు మరితం తగ్గుతాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మద్యం దుకాణాలు 355 లైసెన్సులు రెన్యువల్ చేయించుకున్న షాపులు 287 జూన్లో మద్యం అమ్మకాలు రూ.149 కోట్లు గత ఏడాది జూన్లో మద్యం అమ్మకాలు రూ.170 కోట్లు ఒక్క నెలలో తగ్గిన అమ్మకాలు రూ.21 కోట్లు -
పల్లెలు ప్రశాంతం..!
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : శాసన సభ ఎన్నికల పుణ్యమా అని పచ్చని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుండడంతో మండలంలోని గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే మద్యం బెల్ట్ షాపులు మూతపడ్డాయి. దీంతో విచ్చల విడిగా మద్యం లభించకపోవడంతో మం దుబాబులు పొద్దుగూకగానే గూటికి చేరుకుంటున్నారు. దీనివల్ల గ్రామాల్లో ప్రశాతంత నెలకొంది. గ్రామాలకి 3–5 బెల్ట్ షాపులు ఎన్నికల ప్రకటన రాక మునుపు ప్రతి మారు మూల పల్లెల్లో సహితం 3నుంచి 5 బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్ షాపులో ఎప్పుడు మద్యం అయిపోయినా వైన్ షాపు నిర్వాహకులు వెంటనే సరఫరా చేసే వారు. దీంతో మద్యం ప్రియులకు ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండేది. నిషేధంతో మహిళలు హర్షం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైతే పోలీసులు బెల్ట్షాపులపై ఖచ్చితత్వం పాటించారో.. గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే బెల్ట్ షాపులు మూత పడ్డాయి. మందు ప్రియులకు విచ్చలవిడిగా మద్యం లభించకపోవడంతో తమ పతులు త్వరగా ఇళ్లకు చేరుతున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం కొనసాగించాలి: బెల్టుషాపుల నిషేధం కొనసాగించాలి. వీటి వల్ల గ్రామాల్లో విచ్చల విడిగా మధ్యం లభించడంతో అదుపులేకుండా మద్యం సేవించి రోగ్యం, ఇటు ఆర్థికంగా గుల్ల అయ్యేవారు. బెల్టుషాపుల నిషేధంతో మద్యం అందుబాటులో లేక పోవడంతో మందు ప్రియులు మితిమీరిన చేష్టలు కట్టడి అయ్యాయి. పల్లెలు ప్రశాతంగా మారాయి.–చలెండ్ల పద్మయ్య, అవంతీపురం -
ఎగ్జిట్పోల్స్పై ఎన్నికల సంఘం నిషేధం
-
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్లు నిరాకరించే అధికారం ఉంది. -
నిషేధం అమలెక్కడ?
ఆరోగ్యానికి హానికరంగా పరిణమించిన గుట్కాలను ప్రభుత్వం నిషేధించినా జిల్లాలో అమలు కావడం లేదు. గడిచిన ఆరు నెలల కాలంలో 31కి పైగా కేసులు నమోదవడం, రూ.కోట్లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం నిఘా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా గుట్కా వ్యాపారం జోరందుకోవడానికి కారణమని తెలుస్తోంది. భువనగిరి : నిషేధిత గుట్కా వ్యాపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. నిషేధించిన కొంతకాలం పాటు గుట్టుగా సాగిన వ్యాపారం మళ్లీ రెక్కలు విప్పుకుంది. జిల్లాలో పోలీసులు ఇటీవల భారీగా గుట్కాలను పట్టుకు న్న విషయం తెలిసిందే. పట్టుబడిన గుట్కాలకు సంబంధించి సరఫరా చేస్తున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాలు గుట్కా వ్యాపారానికి అడ్డాలుగా మారాయి. పట్టపగలే సరఫరా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెద్ద మొత్తంలో గుట్కాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జిల్లాలో గుట్కాల వ్యాపారం జోరుగా జరుగుతుందని చెప్పడానికి ఈసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 31కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ కేంద్రంగా.. ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, జర్దా మాఫియా మళ్లీ పుంజుకుంటోంది. హైదరాబాద్లోని ఉప్పల్, రామంతాపూర్, పాతబస్తీ, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గుట్కాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం అధికారుల నిఘా కొరవడటంతో రోజూ లక్షల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది. బస్సుల్లో సరఫరా.. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి కేంద్రాల నుంచి ప్రతి రోజూ సుమారు 70 నుంచి 120 మంది అక్రమార్కులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి గుట్కాలను జిల్లాకు తీసుకువస్తున్నారు. అక్రమార్కులు తాము కొనుగోలు చేసిన గుట్కాలను ఎవరికీ అనుమానం రాకుండా బట్టల బ్యాగుల్లో బిగించుకుని ఆర్టీసీ బస్సులో ఎక్కుతున్నారు. ఇలా బస్సుల్లో వచ్చి బస్టాండ్కు కొంత దూరంలో ఉన్న స్టేజీల వద్దనే దిగుతున్నారు. అనంతరం వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారుల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. గుట్కాలను ప్రధానంగా టీస్టాల్స్, పాన్షాపులు, కిరాణం, దాబాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం.. జిల్లాలో 7,39,448జనాభా ఉంది. ఇందులో గుట్కాలు తినే అలవాటు సుమారు 5శాతం మందికి ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 36,972మంది గుట్కాలు అమ్ముడవుతుండగా సగటున ఒక్క వ్యక్తి రోజుకు రెండు గుట్కాల చొప్పున తినేస్తున్నాడు. రూ.5 ఉన్న గుట్కాను రూ.10కి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 73,944 గుట్కా ప్యాకెట్లను తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.దీని ప్రకారం రోజూ రూ.7,39,440 విలువ చే సే వ్యాపారం జరుగుతుంది. ఒక్క నెలలో రూ. 22,18,3200 వ్యాపారం జరగగా ఏటా 26.61కోట్ల బిజినెస్ నడుస్తుంది. జిల్లాలో పట్టుబడిన గుట్కాల వివరాలు కొన్ని.. ఈనెల 20వ తేదీన భువనగిరి పట్టణంలో రూ.1.72లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 18న భువనగిరిలోని అర్బన్కానీలో రూ.18వేలు విలువ చేసే గుట్కాలను విక్రయిస్తుండగా పట్టుకున్నారు. బీబీనగర్ మండలం నెమురగోములలో ఫిబ్రవరిలో రూ.2లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈనెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలో రూ.20విలువ చేసే గుట్కాలను పట్టుకున్నారు. వీటితోపాటు జిల్లాలో మొత్తం 31కేసులు నమోదు చేయగా 31మందిని అరెస్టు చేశారు. కేసులు నమోదు చేస్తాం జిల్లాలో నిషేధిత గుట్కాలు విక్రయించిన, కొనుగోలు చేసిన గుట్కాలను సరఫరా చేయడంలో మధ్యవర్తిత్వం వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో గుట్కాలు విక్రయించే వారి దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాం. అవసరమైతే ప్రత్యేక దాడులు నిర్వహిస్తాం. – భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి -
పాక్ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్
లండన్: పాకిస్థాన్ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్ వాచ్లతో ఫిక్సింగ్కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్ హసన్ అలీ మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు ఇంగ్లాండ్ టూర్లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిటెస్ట్ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్ టీమ్కు ఆదేశాలు అందాయి. పాక్ టీమ్ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్ వాచ్లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్లో స్మార్ట్ వాచ్ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఫిక్సింగ్కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్(కమ్యూనికేషన్కు సంబంధించి) డివైజ్లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడటం, పాక్ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. The ICC has confirmed that smart watches are not allowed on the field of play or areas designated as the Player and Match Officials Area (PMOA).https://t.co/MAv4mRNAqv pic.twitter.com/tYgDi1LJwn — ICC (@ICC) 25 May 2018 -
మద్య నిషేధానికి కమల్ విముఖత
సాక్షి, చెన్నై : మద్యనిషేధం సమాజానికి మేలు కంటే ఎక్కువగా చేటు చేస్తుందని..తాను సంపూర్ణ మద్యనిషేధానికి వ్యతిరేకమని ఇటీవల రాజకీయ ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్ హాసన్ చెప్పారు. తమిళనాడులో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ఉచిత వరాలు గుప్పించనని చెప్పుకొచ్చారు. అయితే విచ్చలవిడిగా మద్యం దుకాణాలను అనుమతించరాదని అన్నారు. తమిళనాడులో పోస్ట్ఆఫీస్ కోసం వెతకాల్సిన అవసరం ఉంది కాని మద్యం మాత్రం ఏరులైపారుతోందని..ఈ పరిస్థితిని మనం మార్చాలని కమల్ చెప్పారు. తమిళనాడులో పలు విపక్ష పార్టీలు మద్యనిషేధం విధించాలని గళమెత్తిన నేపథ్యంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే మద్యం మాఫియా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ పత్రిక ఆనంద వికటన్లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. -
గుట్కాపై నిషేధం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. గత ఏడాది జారీచేసిన ఉత్తర్వు గడువు బుధవారంతో ముగిసింది. కాగా, నిషేధం కొనసాగింపుపై పునరాలోచించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత నెలలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. గురువారం జారీచేసిన ఉత్తర్వులతో ఈ అస్పష్టతకు తెరపడింది. -
నిషేధం.. సమర్పయామి!
ప్రభుత్వ భూములకు రెక్కలు! - లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు - ప్రొహిబిటెడ్ లిస్టు గొడలకే పరిమితం - రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల కీలకపాత్ర - అధికారులతో ప్లాట్ల బ్రోకర్ల మిలాఖత్ - సెంటుకో రేటుతో వ్యాపారం - ఆక్రమణలపై అధికారుల ఉదాసీన వైఖరి కర్నూలు మండలం రుద్రవరంలో సర్వే నెం.675లోని ప్రభుత్వ భూమిని సెక్షన్ 71(కోర్టు అనుమతి) కింద రిజిస్ట్రేషన్ చేశారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని సర్వే నెం.336, 337(మంగళగిరి కాలనీ)లలో 59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమి నగర పరిసరాల్లో ఉండటంతో రిజిస్ట్రేషన్ చేశారు. కల్లూరు పరిధిలోని రేడియో స్టేషన్ సమీపంలో 320/1ఏ వక్ఫ్ బోర్డు భూమి ఉంది. పరిమళనగర్ పేరిట ప్లాట్లు వేసి విక్రయించారు. ఇక్కడ కోర్టు కాపీని సాకుగా చూపి పని కానిచ్చేశారు. ఉల్చాల రోడ్డులోని సర్వే నెం.124లో వక్ఫ్ భూమి ఉంది. దీన్ని గంపగుత్తగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ సెంటుకు రూ.3వేలు చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వెనుక సర్వే నెం.19లో 60 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రూ.20వేల నుంచి రూ.40వేల వరకు మామూళ్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. కర్నూలు శివారు బళ్లారి చౌరస్తా నుంచి కొత్త ఈద్గాకు వెళ్లే రహదారి(సంతోష్నగర్)లోని సర్వే నెం.382లో వక్ఫ్ స్థలం ఉంది. ఈ స్థలానికీ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ప్రభుత్వ భూములను ఎలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేకపోయినా.. లొసుగులను అవకాశంగా చేసుకొని పని కానిచ్చేస్తున్నారు. కర్నూలు(టౌన్): ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు అక్కడ వాలిపోతున్నారు. అధికారుల చేతులు తడిపి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి కానిచ్చేస్తున్నారు. ఇంకాస్త సమస్యత్మకం అయితే.. మామూళ్ల రేటు కాస్త పెంచితే పని ఇట్టే అయిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ తంతు సాగుతున్నా.. కర్నూలు శివారు, గ్రామాల పరిధిలోని భూముల విషయంలో వ్యవహారం మితిమీరింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ భూమి యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతోంది. ప్రతి రిజిస్ట్రేషన్కు రూ.2వేలు వసూలు చేస్తుండగా.. అసైన్డు భూముల రిజిస్ట్రేషన్కు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అసైన్డు.. ప్రొహిబిటెడ్ లిస్టులోని సర్వే నెంబర్లు.. దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ ఆస్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయరాదు. వాస్తవానికి ఈ భూములకు మార్కెట్ విలువ కూడా ఉండదు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆ భూములకు సమీపంలోని ప్రయివేట్ భూముల సర్వే నెంబర్ల మార్కెట్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రికార్డుల్లో మాత్రం ఈ భూములను నిషేధిత సర్వే నెంబర్లుగానే చూపుతుండటం గమనార్హం. ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ల విషయంలో కర్నూలు, కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు కంప్యూటర్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాట్ల బ్రోకర్లు ముందుగానే అధికారులతో మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్న తర్వాత చకచకా పని జరిగిపోతోంది. అడిగే నాథుడే లేకపోవడంతో ఈ దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. సెంటు రిజిస్ట్రేషన్కు రూ.20వేల నుంచి రూ.40వేలు దేవాదాయ, వక్ఫ్ బోర్డు, క్రైస్తవ ఆస్తులతో పాటు వివాదాస్పద స్థలాల విషయంలో రిజిస్ట్రేషన్ అధికారులు సెంటుకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సంతోష్నగర్ సమీపంలో వక్ఫ్ బోర్డు స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో సెంటుకు రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. రుద్రవరం మండలంలో రూ.10వేల నుంచి రూ.15వేలు.. పుల్లారెడ్డి కళశాల వెనుక(సమీపంలో) రూ.20వేల ప్రకారం వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఈ భూములు ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉండటం.. ప్రస్తుతం నగర పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేచింది. అదేవిధంగా 2014 సంవత్సరంలో స్టాంటన్పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో పట్టణానికి సమీపంలోని దేవాదాయ, వక్ఫ్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఆక్రమణలపై చూసీచూడనట్లుగా..! జిల్లాలో ప్రభుత్వ భూములతో పాటు వక్ఫ్, క్రిస్టియన్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా అధికారుల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే తప్ప కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించట్లేదు. దేవాదాయ, వక్ఫ్ బోర్డు, క్రైస్తవ ఆస్తులను ఆయా వర్గాల సంక్షేమం దృష్ట్యా కేటాయించినా.. ఆ దిశగా ఎలాంటి ఫలితం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ కొరవడటం.. అధికారుల అవినీతి.. అక్రమార్కుల చాకచక్యం.. వెరసి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఫిర్యాదులు వాస్తవమే.. విచారణ చేయిస్తా దేవాదాయ, వక్ఫ్ బోర్డు, క్రైస్తవ ఆస్తులు, భూముల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయి. నిషేధిత సర్వే నెంబర్లలో ప్లాట్లు, భూములతో పాటు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయరాదు. ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ల లిస్టు కార్యాలయంలో ప్రదర్శించాం. కొనుగోలుదారులు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేయిస్తాం. నిబంధనలకు విరద్ధుంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే చర్యలు తీసుకుంటాం. – యు.వి.వి.రత్న ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
మధ్యప్రదేశ్లో లిక్కర్ బ్యాన్
-
దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్
భోపాల్: దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నర్సింగ్పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 'తొలి విడతలో నర్మద నదికి ఇరువైపులా 5 కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నింటినీ మూసివేయిస్తాం. రెండో విడతలో నివాస ప్రాంతాల్లో, విద్యా సంస్థలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో మద్యం షాపులను అనుమతించం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం' అని చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్లో మధ్యనిషేధం విధించాలని ఆందోళనలు చేస్తున్నారు. -
బిహార్లో ప్రపంచ రికార్డు
పట్నా: దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం బిహార్లో 11,000 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మద్యపానాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమలుచేస్తోన్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రజలంతా శుక్రవారం రోడ్లపైకి వచ్చారు. చిన్నా, పెద్దా చేతులు కలిపారు. అలా నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలుపుతూ దాదాపు 45 నిమిషాలపాటు(మధ్యాహ్నం 12:15 నుంచి 1:00 వరకు) మానవహారంలా రోడ్లపై నిలబడ్డారు. చూడటానికి రెండు కళ్లు చాలని ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏకంగా మూడు శాటిలైట్లు, నాలుగు విమానాలు, రెండు హెలికాప్టర్లు, 40 డ్రోన్లను వినియోగించారు. ఇస్రోకు చెందిన రెండు శాటిలైట్లతోపాటు ఒక విదేశీ శాటిలైట్ కూడా ఈ భారీ మానవహారాన్ని ఫొటోలు తీశాయని ప్రభుత్వాధికారులు తెలిపారు. పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ కుమార్, మిత్రపక్షం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు మానవహారం కట్టారు. కొద్ది రోజుల కిందట బిహార్లో పర్యటించిన ప్రధాని మోదీ.. నితీశ్ సర్కారు అమలు చేస్తోన్న మద్యనిషేధాన్ని మెచ్చుకోవడమేకాక దేశానికి ఆదర్శంగా నిలిచారని కితాబు ఇవ్వడం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు సీఎం నితీశ కుమార్.. 2016, ఏప్రిల్ 5 నుంచి మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చారు. నిర్ణయం అమలుపై మొదట్లో కొన్ని అవాంతరాలు, అనుమానాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ గడిచిన 10 నెలలుగా బిహార్లో మద్యనిషేధం పకడ్బందీగా అమలవుతుండటం విశేషం. -
మద్యం కంపెనీలకు ఝలక్
లైసెన్సులు పొడగింపునకు సీఎం నితీశ్ నో పట్నా: రాబోయే ఆర్థిక సంవత్సరం (2017-2018) నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ఉత్పత్తి కంపెనీలకు లైసెన్సులను పొడగించబోమని, కొత్త లైసెన్సులను ఇవ్వబోమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం క్షేత్ర స్థాయిలో ఏవిధంగా అమలవుతుందో తెలుసుకోవడానికి గత డిసెంబర్లో సీఎం నితీశ్ ‘నిషాయ్ యాత్ర ’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారం చేతన్ సభ అనే ప్రాంతంలో ఈ యాత్ర నిర్వహించిన నితీష్ మాట్లాడుతూ ‘‘ఎక్సైజ్ యాక్ట్–2016’’ ప్రకారం 2017 ఏప్రిల్1నుంచి రాష్ట్రమంతటా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం కంపెనీలకూ, బీర్ల కంపెనీలకూ ఇక నుంచి లైసెన్సులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇథనాల్ యూనిట్లను మాత్రం కొనసాగిస్తామని,దాని పర్యావరణానికి మేలు జరిగేలా పెట్రోల్లో మిశ్రమంలా కలుపుతామన్నారు. -
గండిపేటలో పతంగులపై నిషేధం
హైదరాబాద్: గండిపేట చెరువు పరిసరాల్లో గాలిపటాల ఎగురవేతను పోలీసులు నిషేధించారు. ప్లాస్టిక్, రసాయనిక రంగులు కలిగిన పతంగులు, మాంజా (దారం) కారణంగా గండిపేట ప్రాంతంలోని జీవవైవిధ్యం దెబ్బతింటోందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, వీటివల్ల గండిపేట చెరువు నీరు కలుషితమవుతోందని కమిషనరేట్ తెలిపింది. గండిపేట ప్రాంతానికి వలస వచ్చే అరుదైన పక్షులను రక్షించుకుందామని పిలుపునిచ్చింది. పతంగులు ఎగురవేసేందుకు వచ్చేవారు అదనంగా తీసుకువచ్చే ప్లాస్టిక్ బ్యాగులలో ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, వాటర్ బ్యాగ్లను అక్కడే వదిలివేస్తున్నారని తెలిపింది. వీటితో పాటు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టడం, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని వివరించింది. పర్యావరణం కలుషితమవుతోందని, అందుకే గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్) పరిసర ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేత పూర్తిగా నిషేధించినట్లు కమిషనరేట్ తెలిపింది. -
త్వరలో అన్నా మరో ఉద్యమం
పుణె: ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో సంపూర్ణ మద్యనిషేధం కోసం ఉద్యమించనున్నట్టు హజారే ప్రకటించారు. మద్యపానం వల్ల కుటుంబాలు చెడిపోతున్నాయని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో హజారే మాట్లాడుతూ.. మద్య నిషేధం కోసం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. ఇందుకోసం ముసాయిదాను దాదాపుగా సిద్ధంచేశామని, దీన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు సమర్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మద్యపాన నిషేధ చట్టానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ముసాయిదాను పటిష్టంగా రూపొందించేందుకు సాయం చేయాల్సిందిగా వేదికపై ఉన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గాడ్బొలేను హజారే కోరారు. -
తూచ్...నాన్ వెజ్ అమ్ముకోవచ్చు
►మాంసం విక్రేతలకు ‘పచ్చ’జెండా ►తమ్ముళ్ల డీల్ సెట్ విజయవాడ సెంట్రల్ : నగరంలో మాంసం విక్రయాల నిషేధానికి అధికారులు చెల్లుచీటి ఇచ్చేశారు. పవిత్ర కృష్ణా పుష్కరాలు అయినప్పటికీ మాసం అమ్ముకోవచ్చు. కబేళా కూడా పనిచేస్తోందంటూ కమిషనర్ జి.వీరపాండియన్ బుధవారం ప్రకటించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపలు మాంసపు ఉత్పత్తుల విక్రయాలను 9 నుంచి 25వ తేదీ వరకు నిషేధిస్తున్నామని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని మొన్న హెచ్చరించారు. రెండు రోజులు గడిచే సరికి తూచ్...అన్నారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ ఇదీ మాంసం విక్రయాల నిషేధం నగరంలోని స్టార్ హోటల్ నిర్వాహకులకు మింగుడుపడలేదు. కృష్ణాపుష్కరాలకు మద్యం, మాంసం భారీఎత్తున విక్రయాలు జరుగుతాయని, ఇలాంటి సమయంలో నిషేధం విధిస్తే తమ ఆదాయం ఏం కానూ? అని టీడీపీ ప్రజాప్రతి నిధుల వద్ద పంచాయితీ పెట్టారు. ఎంపీ కార్యాలయంలో సర్వం తానై వ్యవహరించే ఓ చోట నేత రంగంలోకి దిగాడు. స్టార్ హోటళ్ల నిర్వాహకులతోపాటు చిన్న చితకా హోటళ్ల యజమానులు, మాంసం దుకాణ విక్రయదారులతో రాయ‘బేరాలు’ సాగించాడు. మంగళవారం రాత్రి డీల్ కుదిరింది. తెల్లవారే సరికి ఓ మంత్రి కమిషనర్తో మాట్లాడేశారు. మాంసం లేకపోతే హోటళ్ల యజమానులు ఇబ్బంది పడతామంటున్నారు, వదిలేయమంటూ మంత్రి కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. మాంసం విక్రయాలపై నిషేధం శుభ్రంగా అటకెక్కింది. కబేళా యథావిధిగా పనిచేస్తోందని, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ చెబుతున్నారు. పారిశుధ్యానికి విఘాతం కల్గిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరికల కొసమెరుపు విసిరారు. మంత్రి పేషీ హడావుడి సిటీలో చికెన్, మటన్, చేపలు ఇతరత్రా మాంసం రోజుకు సగటున 20 టన్నులు విక్రయం జరుగుతోందని అంచనా. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వ్యాపారం సాగుతోంది. వేడుకలు, ఫంక్షన్ల సీజన్లో 50 శాతం అదనంగా వ్యాపారం ఉంటోంది. ఈక్రమంలో నాన్ వెజ్ విక్రయాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించగానే ఓ మంత్రి పీఏ నగరపాలక సంస్థ అధికారులకు ఫోన్ చేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో సార్ అడగమన్నారంటూ వివరాలు సేకరిం చారు. రెండు రోజుల్లో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు డీల్ సెట్ చేసేశారు. -
లిక్కర్ బాటిల్తో స్టాలిన్ ముందుకు యువతి
వెల్లూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్కు ఓ యువతి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కంటినిండా నీరుతో గద్గద స్వరంతో చేతిలో బీరు బాటిల్ పట్టుకొని ఊపుతూ ఆమె తన ఆవేదనను వెల్లిబుచ్చింది. వెల్లూరులో ఆయన బుధవారం 'నమక్కు నామే' అనే ఓ ప్రచార కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఆ యువతి లిక్కర్ బాటిల్ తో ఆయన ముందుకు వచ్చింది. మద్యం మహామ్మారి తన తండ్రిని పొట్టన పెట్టుకుందని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మద్యాన్ని మాన్పించలేకపోతున్నారని, ఫలితంగా తమలాంటి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ సారి డీఎంకే ప్రభుత్వమైనా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇవ్వాలని చెప్పింది. ఇందుకు స్పందించిన స్టాలిన్.. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, తమ అజెండాలో ఆ అంశం కూడా ఉందని చెప్పారు. -
మహానందిలో సెల్పోన్ల నిషిద్ధం
మహానంది : కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను సెల్ఫోన్లతో ఆలయంలోకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు, కెమెరాలను ఆలయంలోకి అనుమతించమని చెప్పారు. అలాగే రుద్రగుండం, రెండు చిన్న కోనేరులలో పుణ్యస్నానాలాచరించే భక్తులు సాంప్రదాయ దుస్తులను దరిస్తేనే స్నానాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. బీడీలు, సిగిరెట్లు, గుట్కాలు ఆలయంలోకి అనుమతించకుండా, రాజగోపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పవిత్రతకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. -
ర్యాగింగ్ నిరోధంపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి కార్యాచరణ అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ఈనెల 7న సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధంపై మండలి చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కాలేజీ హాస్టళ్లలో రాత్రి వేళల్లో అధ్యాపకులు నిద్రించాలని, వీలైతే ప్రథమ సంవత్సర విద్యార్థులకు వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. -
మద్యనిషేధానికి గ్రామస్తుల ప్రతిజ్ఞ
భైంసా రూరల్: సంపూర్ణ మద్య నిషేధానికి ఓ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుంసరా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని యువకులు, కులసంఘాలు, పెద్దలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యావంతులు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యంతో ఇబ్బందులు వస్తున్నాయని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరాదని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి దూరంగా ఉంటూ గ్రామంలో మద్యం విక్రయాలు సైతం చేపట్టకుండా ఉండాలని అంతా నిర్ణయానికి వచ్చారు. -
అప్పుడు మ్యాగీ.. ఇప్పుడు యిప్పీ!
అలీగఢ్: మ్యాగీ నూడుల్స్పై నిషేధం అంశం మరుగునపడ్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో ప్రముఖ నూడుల్స్ బ్రాండ్ ‘యిప్పీ’ శాంపుల్స్లోనూ నిషేధిత సీసం(లెడ్) పరిమితికి మించి ఉందని తేలింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఉన్న వివిధ షాపుల నుంచి సేకరించిన యిప్పీ నూడుల్స్ను పరీక్షించిన యూపీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ(ఎఫ్డీఏ) ఈ మేరకు నిర్ధారించింది. ‘యిప్పీ’ ప్రముఖ దేశీయ సంస్థ ఐటీసీకి చెందిన నూడుల్స్ బ్రాండ్. సీసం పరిమితి 1 పీపీఎం లోపు ఉండాల్సి ఉండగా, యిప్సీలో అది 1.057పీపీఎంగా ఉందని తమ పరీక్షల్లో తేలిందని అలీఘడ్ డివిజన్ ఎఫ్డీఏ డివిజన్ హెడ్ చందన్ పాండే ఆదివారం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి నిషేధిత పదార్ధాలు ఉన్న విషయం మొదట యూపీలోనే వెల్లడి కావడం విశేషం. అయితే, మ్యాగీ నూడుల్స్పై నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ నూడుల్స్ను మరోసారి పరీక్షించాలని ఆ కోర్టు ఆదేశించింది. -
నగరంలో నిషేధాజ్ఞల పొడిగింపు
హైదరాబాద్ : నగరంలో కొనసాగుతున్న నిషేదాజ్ఞల గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, సచివాలయం చుట్టుపక్క ప్రాంతాలలో పోలీసు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధార్నలు, రాస్తారోకోలు, ప్రసంగాలే చేయరాదని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేందర్రెడ్డి హెచ్చరించారు. -
26 వరకు సెక్రటేరియట్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్, జీహెచ్ఎంసీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, మింట్ కాంపౌండ్, నిజాం కాలేజ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్రోడ్, ఐమాక్స్ థియేటర్, నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు.