Rejects
-
ఫడ్నవీస్-శిందేల మధ్య కోల్డ్వార్? ఠండా ఠండా కూల్ కూల్?!
ముంబై: గార్డియన్ మంత్రి పదవి మొదలుకొని ప్రత్యేక వైద్య విభాగాలకు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు, పర్యవేక్షణ ప్రాజెక్టుల కోసం ’వార్రూమ్’ల వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన డిప్యూటీ ఏక్నాథ్ షిండే మధ్య భిన్నాభిప్రాయాల కోల్డ్వార్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. గతేడాది నవంబర్లో అసెంబ్లీ ఫలితాల తరువాత రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఈసారి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవలసి వచి్చంది. ఇందుకోసం రెండు వర్గాల మధ్య పలు ఒప్పందాలు, రాజీ చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో శిందే నాయకత్వం, అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల వల్లే బీజేపీ, శివసేన, ఎన్సీపీ(ఏపీ)ల మహాయుతి కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు శిందే మొదట్లో విముఖత వ్యక్తంచేశారని, అయితే ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం కావాలంటూ ఆయన సహచరులు, బీజేపీ అగ్రనేతలు ఒప్పించారని శివసేన నేతలు పేర్కొంటున్నారు. అందువల్లే మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తైనా వారికి శాఖల కేటాయింపునకు దాదాపు వారం రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ప్రత్యేకంగా వ్యవహరించడం వెనుక... అయితే ఫడ్నవీస్, శిందేలిద్దరూ తమ విభేదాలున్నాయన్న వార్తలను ఖండిస్తున్నారు. తాము పరస్పర సహాకారం, సమైక్యతతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో పలు సందర్భాల్లో రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక మంత్రులుగా అదితి తట్కరే, గిరీష్ మహాజన్ల నియామకంపై శివసేన(శిందే) అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో ఈ నియామకాలు వాయిదా పడ్డాయి. ఇంతేకాక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ‘వార్ రూమ్‘తో పాటు, డిప్యూటీ సీఎంలు అజిత్పవార్, శిందేలిద్దరూ తమ పారీ్టల మంత్రులు నిర్వహించే శాఖలు, వారు సంరక్షక మంత్రులుగా ఉన్న జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు మెడికల్ ఎయిడ్ సెల్ను కూడా శిందే ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో 2027 కుంభమేళా సన్నాహాల గురించి చర్చించేందుకు నాసిక్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ఆర్డీఏ) సహా ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన అనేక సమావేశాలకు శిందే దూరంగా ఉన్నారు. తాజాగా ఫడ్నవీస్ పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం శిందే మరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తోడు 20 మంది శివసేన ఎమ్మెల్యేల భద్రత తగ్గింపు కూడా శివసేనలో మరింత అసంతృప్తిని రాజేసింది. ఎంపీల మద్దతు కోసమే బీజేపీ మౌనం: సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ ఈ పరిస్థితిపై సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ మాట్లాడుతూ ఇద్దరు నేతల మధ్య ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ కొనసాగుతుందని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని శిందే భావించారు. కానీ బీజేపీకి బంపర్ మెజారిటీ రావడంతో అది సాధ్యపడలేదు. దీంతో సహజంగానే శిందే కొంత అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్ వ్యతిరేకులు శిందేకు మద్దతునిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి శిందే పార్టీలోని ఏడుగురు ఎంపీల మద్దతు అవసరం. అందుకే ఈ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు’అని అకోల్కర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్షబహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి: రత్నాకర్ మహాజన్ ‘సంకీర్ణ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలున్నా ఐక్యంగా కొనసాగాల్సిన అవసరముంటుంది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత పోరు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేరు. గత ఎన్నికల కంటే బీజేపీ బలం రెండింతలు పెరిగింది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ వాటా ఆశించింది. దాన్ని దక్కించుకోగలిగింది ’అని మహారాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ మహాజన్ అన్నారు. అవన్నీ ఊహాగానాలు: ఏక్నాథ్ శిందే కాగా తామిద్దరి మధ్య విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను ఏక్నాథ్ శిందే ఖండించారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. మహాయుతి సంకీర్ణంలో ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ అవాస్తవం. అంతా ‘ఠండా ఠండా కూల్ కూల్’. మేం కలిసికట్టుగా అభివృద్ధి నిరోధకులపై యుద్ధం చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి లాగా పదవుల కోసం వెంబడించడం లేదా అధికారాన్ని దోచుకోవడం మహాయుతి ఎజెండాకు వ్యతిరేకం. ఎవరేమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’అని ఉద్ఘాటించారు. మీడియా సెల్ ఏర్పాటులో తప్పేంలేదు: ఫడ్నవీస్ సచివాలయంలో మీడియా సెల్ ఏర్పాటుపై విలేకరుల ప్రశ్నకు సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి అలాంటి సెల్ ఏర్పాటులో తప్పు లేదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా ఇలాంటి సెల్ను ఏర్పాటు చేసాను.‘ అని తెలిపారు. -
కాట.. ఏపీబాట !
సాక్షి, సిటీబ్యూరో: ఊహించినట్లుగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి..ఆంధ్రప్రదేశ్ బాట పట్టక తప్పలేదు. తనను తెలంగాణలోనే కొనసాగించాలని మరికొందరు ఐఏఎస్ అధికారులతో పాటు క్యాట్ను ఆశ్రయించగా..అక్కడ చుక్కెదురుకావడంతో.. వెంటనే హైకోర్టు మెట్లెక్కినా, ఉపశమనం లభించలేదు. ముందైతే డీఓపీటీ ఆదేశాల కనుగుణంగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు పేర్కొనడంతో జీహెచ్ఎంసీ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పునివ్వగలదని జీహెచ్ఎంసీ వర్గాలు భావించాయి. క్యాట్లో ఊహించని పరిణామం ఎదురవడంతో.. కనీసం హైకోర్టు అయినా మిగతా వారితోపాటు ఆమ్రపాలికి అనుకూలంగా ఆదేశాలివ్వగలదని ఆశించినప్పటికీ, హైకోర్టు సైతం ఏపీకి వెళ్లాలని స్పష్టం చేయడంతో జీహెచ్ఎంసీ వర్గాలు ఉస్సూరుమన్నాయి. ఇప్పుడిప్పుడే.. బల్దియా వ్యవహారాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో కమిషనర్ మార్పుతో పరిస్థితులు మళ్లీ మొదటికి రానున్నాయి. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో ఆరుజోన్లు, 30 సర్కిళ్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పరిధికి తగ్గట్లే చెత్త సమస్యలు, తదితరమైనవి ఉన్నాయి. ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ సైతం సవ్యంగా జరగని దుస్థితినుంచి పరిస్థితుల్ని ఓ గాడిన పెట్టేందుకు ఆమ్రపాలికి సమయం సరిపోలేదు. జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, ఇప్పుడిప్పుడే ఒక్కో విభాగంపై పట్టు సాధిస్తున్న తరుణంలో అనూహ్యంగా వెళ్లాల్సి వచ్చింది. అసలే అస్తవ్యస్తంగా ఉన్న జీహెచ్ఎంసీలో సిబ్బంది జీతాల చెల్లింపుల నుంచి నిర్వహణ పనులకు సైతం నిధుల కటకట ఉంది. క్రమశిక్షణ లేని సిబ్బంది..బదిలీలైనా సీట్లను వదలని ఉద్యోగులు.. ఒప్పందాలున్నా పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టు ఏజెన్సీలు..విధులకు చుట్టపుచూపుగా వచ్చిపోయే ఉద్యోగులు..వచ్చినా పనులు చేయకుండా కాలక్షేపం చేసే వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జీహెచ్ఎంసీలో సమస్యలకు అంతేలేదు. అంతర్గత బదిలీల్లోనూ ఆమ్రపాలినే మాయ చేసి కావాల్సిన సీట్లలో పాతుకుపోయిన వారు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో కొత్త కమిషనర్కు బాధ్యతల నిర్వహణ కత్తిమీద సామే కానుంది. జీహెచ్ఎంసీ విభజన, దాదాపు ఏడాది కాలంలో జరగనున్న పాలకమండలి ఎన్నికలు ఇలా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కమిషనర్గా ఇలంబర్తి ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలంబర్తి గతంలో సెంట్రల్జోన్ (ఖైరతాబాద్) కమిషనర్గా పనిచేశారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆయనకు జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలప్పగించిందని జీహెచ్ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. -
చిన్నారులపై జచింత నెత్తుటేరుల అవార్డ్ నాకొద్దు
తన ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక జీవితం గురించి లోతుగా రాయడమే కాదు పిల్లల ప్రపంచం గురించి కూడా రాస్తోంది కవయిత్రి జసింతా కెర్కెట్టా. ఎక్కడ చూస్తే అక్కడ వారై – విశ్వరూపమున విహరిస్తున్న ఈ కాలంలో పిల్లల కోసం జసింత రాసిన ‘జిర్హుల్’ అనే పుస్తకానికి ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్–2024’ అవార్డ్ ప్రకటించారు. పాలస్తీనాలో బాంబు దాడుల్లో మరణించిన, హింసకు గురవుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్ను జసింత తిరస్కరించింది.‘రూమ్ టు రీడ్ ఇండియా’ అనేది అక్షరాస్యత, లింగసమానత్వం... మొదలైన వాటిపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఏరోస్పేస్ దిగ్గజం ‘బోయింగ్’తో సంబంధం ఉంది అని ఆరోపిస్తూ తనకు ప్రకటించిన అవార్డ్ను జసింత కెర్కెట్టా తిరస్కరించింది. ‘బోయింగ్కు ఇజ్రాయెల్ సైన్యంతో 75 ఏళ్లుగా సంబంధం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ఆయుధాలను సరాఫరా చేసే కీలక సంస్థ అయిన బోయింగ్ ‘రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్’కు నిధులు అందజేస్తుంది’ అని జసింత తన తిరస్కరణ కారణాలపై ఆ ట్రస్ట్కు లేఖ రాసింది.‘ఆయుధాలతో పిల్లల ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు ఆయుధాల వ్యాపారం, పిల్లల సంరక్షణ ఏకకాలంలో ఎలా కొనసాగుతాయి?’ అని ఆ లేఖలో ప్రశ్నించింది జసింత.‘సాహిత్యంలో వైవిధ్యమైన, పిల్లల కోసం రాస్తే పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి. బాల సాహిత్యానికి సంబంధించిన జిర్హుల్ పుస్తకానికి అవార్డ్ రావడం సరిౖయెనదే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అవార్డ్ను స్వీకరించలేను’ అని చెప్పింది.ఈ తిరస్కరణ మాట ఎలా ఉన్నా ‘సాహిత్యానికి జసింత కెర్కెట్టా చేసిన కృషి విలువైనదిగా భావిస్తున్నాం’ అని స్పందించింది ‘రూమ్ టు రీడ్ ఇండియా’ ట్రస్ట్. ఇప్పుడు మాత్రమే కాదు సామాజిక కారణాలతో తనకు వచ్చిన కొన్ని అవార్డ్లను గతంలోనూ తిరస్కరించింది జసింత.ఉద్యమ నేపథ్యం...ఝార్ఖండ్లోని ఖుద΄ోష్ గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన జసింత మాస్ కమ్యూనికేషన్, వీడియో ్ర΄పొడక్షన్లో డిగ్రీ చేసింది. రాంచీలోని ఒక ప్రముఖ దినపత్రికలో పని చేసింది. కెరీర్ పరంగా ఎంత ముందుకు వెళ్లినా తన మూలాలను మాత్రం మరవలేదు. ‘ఆదివాసీ అండ్ మైనింగ్ ఇన్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఝార్ఖండ్’ పేరుతో అధ్యయన పత్రాన్ని వెలువరించింది.‘ఇండిజినస్ వాయిస్ ఆఫ్ ఆసియా’ అనే పరిశోధన పత్రానికి ఇండిజినస్ పీపుల్స్ ఫ్యాక్ట్ అవార్డు లభించింది. జర్నలిస్ట్గానే కాదు కవిత్వానికి సంబంధించి సృజనాత్మక రచనలతోనూ ఎన్నో అవార్డ్లు అందుకుంది. తన కవిత్వం విషయానికి వస్తే అది ఆకాశపల్లకిలో ఊరేగదు. జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉంటుంది. గాయాలను గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది. బూటకపు అభివృద్ధిని ప్రశ్నించేలా ఉంటుంది.జసింత మనోహర్పూర్లోని మిషినరీ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో తల్లి పుష్ప అనిమ తండ్రి చేతిలో తరచు హింసకు గురయ్యేది. మరచి΄ోలేని ఆ హింసాత్మక దృశ్యాలు తన కవిత్వంలో కనిపిస్తాయి. వ్యక్తిగత చేదు అనుభవాలే కాదు అభివృద్ధి పేరుతో ఆదివాసీ గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం కూడా జసింత కవిత్వంలో కనిపిస్తుంది.జసింత కెర్కెట్టా జర్నలిస్ట్ మాత్రమే కాదు సోషల్ యాక్టివిస్ట్ కూడా. బాలికల విద్యకు సంబంధించి ఎన్నో ఆదివాíసీ గ్రామాల్లో పనిచేసింది. ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ 20 సెల్ప్మేడ్ ఉమెన్’లో ఒకరిగా ఎంపిక అయింది.పిల్లల్లో సామాజిక చైతన్యం‘పిల్లలూ... మీరు ఎన్ని పువ్వుల గురించి విన్నారు? పూలన్నింటి గురించి తెలియనప్పుడు, కొన్ని పువ్వుల గురించి మాత్రమే తెలిసినప్పుడు... అవి మాత్రమే గొప్ప పుష్పాలూ, ప్రత్యేకమైన పుష్పాలూ ఎలా అవుతాయి? ఇవి మాత్రమే కాదు జిరాహుల్, జతంగి, సోనార్టి, సరాయ్, కోయినార్, సనాయ్ లాంటి ఎన్నో పూలు ఉన్నాయి’ అంటూ పది పువ్వుల గురించి జసింత కవిత్వం రాసింది. ఈ పువ్వుల గురించి ఎప్పుడూ వినని, ఎప్పుడూ చూడని పిల్లలు కూడా జసింత రాసిన కవిత్వం చదివి, పక్కన ఉన్న బొమ్మలు చూస్తే ఎక్కడ ఏ పువ్వు కనిపించినా ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈశ్వర్ ఔర్ బజార్, జసింతా కీ డైరీ, ల్యాండ్ ఆఫ్ ది రూట్స్తో సహా ఏడు పుస్తకాలు రాసింది. ‘జిర్హుల్’లో పువ్వుల ప్రపంచం కనిపించిన్పటికీ అది అణగారిన వర్గాల కోసం ప్రతీకాత్మకంగా రాసిన పుస్తకం. ఆదివాసీ సంస్కృతి ఆధారంగా చేసుకొని పిల్లల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెం΄పొందించడమే ఈ పుస్తక లక్ష్యం. గాజాలో పదహారువేల మందికి పైగా చిన్నారులు మరణించారు. నెత్తుటేరులు పారాయి. ఈ నేపథ్యంలో ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్’ అవార్డ్ను జసింత తిరస్కరించింది. -
ఇలా చేయకుంటే... హెల్త్ క్లెయిమ్ తిరస్కరణ!
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే.. ఆదుకుంటుందన్న భరోసాతోనే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు బీమా సంస్థ చెల్లింపులకు నిరాకరిస్తే..? పాలసీదారులు కంగుతినాల్సిందే. కరోనా ఆరోగ్య విషయంలో ఎంతో మందికి కళ్లు తెరిపించింది. ఆ ఫలితమే తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పాలసీ నిబంధనలను కచి్చతంగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో లోపం చోటుచేసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే రిస్క్ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా కుటుంబంపై ఆరి్థక భారం పడిపోతుంది. బీమా సంస్థ చెల్లింపులు చేయకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులను నివారించొచ్చు. ఈ వివరాలు అందించే కథనమే ఇది. పాలసీ దరఖాస్తు పత్రంలో అప్పటికే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లడించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. పాలసీదారు ఆరోగ్య చరిత్ర ఆధారంగానే క్లెయిమ్ రిస్్కను బీమా సంస్థలు అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చెప్పకపోతే బీమా సంస్థకు తెలియదుగా అని చెప్పి కొందరు అనారోగ్య సమస్యలను వెల్లడించరు. ఇది బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థలు వీటిని గుర్తించినట్టయితే.. చెల్లింపులకు నిరాకరించడంతోపాటు, కవరేజీని సైతం రద్దు చేయొచ్చు. ముందస్తు వ్యాధులనే కాదు, ఏదైనా అనారోగ్యానికి సంబంధించి లోగడ చికిత్స తీసుకున్నా వెల్లడించడమే మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అయితే, కుటుంబ సభ్యులందరి వైద్య చరిత్రను నమోదు చేయాలి. సరైన సమాచారం ఇవ్వాలిబీమా సంస్థకు సమరి్పంచే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పత్రంలో పూర్తి వివరాలు ఉండాలి. తేదీలు, చికిత్సల ప్రక్రియలకు సంబంధించి చిన్న దోషాలు కూడా ఉండకూడదు. రోగి వయసు, పేరులోనూ వ్యత్యాసాలు ఉండకూడదు. బీమా సంస్థలు ప్రతి క్లెయిమ్ దరఖాస్తును లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే మరింత సమాచారం కోరడం లేదా తిరస్కరించడం చేయొచ్చు. క్లెయిమ్ వచి్చనప్పుడు, అందులోని వ్యాధి నిర్ధారణ వివరాలను, అప్పటికే పాలసీదారు వైద్య చరిత్రతో పోల్చి చూస్తాయి. హాస్పిటల్ రికార్డులు, డాక్టర్ నోట్లను పరిశీలిస్తాయి. ఈ సమయంలో వ్యత్యాసాలు కనిపిస్తే చెల్లింపులను నిరాకరిస్తాయి. పాలసీ పత్రంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నట్టు గుర్తిస్తే దాన్ని మోసం కింద పరిగణిస్తాయి. దీంతో క్లెయిమ్ రాకపోవడం కాదు, పాలసీ కూడా రద్దు కావచ్చు. అదనపు సమాచారం, వివరణ, డాక్యుమెంట్లను బీమా కంపెనీ కోరొచ్చు. దీంతో నగదు రహిత క్లెయిమ్ కాకుండా రీయింబర్స్మెంట్ మార్గంలో రావాలని కోరే అధికారం సైతం బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా రీయింబర్స్మెంట్ క్లెయిమ్కు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.మినహాయింపులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారు తమ పాలసీ పరంగా ఉన్న మినహాయింపుల గురించి కచి్చతంగా తెలుసుకోవాలి. దీనివల్ల క్లెయిమ్ పరంగా సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. కొన్ని రకాల అనారోగ్యాలు, చికిత్సలు లేదా సేవలకు కొన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. నిబంధనల్లో మార్పులు కొన్ని సందర్భాల్లో పాలసీ నిబంధనలు, ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా క్లెయిమ్లకు తిరస్కారం ఎదురవుతుంది. వాస్తవానికి ఇలాంటి వాటి గురించి పాలసీదారులకు బీమా సంస్థలు విధిగా తెలియజేస్తాయి.సకాలంలో తెలపాలి.. ముందస్తుగా నిర్ణయించుకుని తీసుకునే నగదు రహిత చికిత్సలకు కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రిలో చేరినప్పుడు నగదు రహిత క్లెయిమ్కు సంబంధించి 24 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ పెట్టుకునే వారు సైతం.. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలు అయితే 48 గంటల ముందుగా, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితే 24–48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సిందే. ఇక రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు, డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 30 రోజుల్లోపు సమరి్పంచాలి. బీమా సంస్థల మధ్య ఈ గడువులో వ్యత్యాసం ఉండొచ్చు. పాలసీ ల్యాప్స్ పాలసీ ప్రీమియం గడువు మించకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి క్లెయిమ్లను బీమా సంస్థలు అనుమతించవు. పాలసీ గడువు ముగిసిన తర్వాత 15–30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఈ కాలంలో అయినా ప్రీమియం చెల్లించాలి. లేదంటే పాలసీ రద్దయిపోతుంది. దీంతో బీమా కవరేజీ కోల్పోయినట్టు అవుతుంది. ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వరకు కవరేజీ ఉండదు. వెయిటింగ్ పీరియడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల క్లెయిమ్లకు వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండాల్సిన కాలం) ఉంటుంది. ఆ కాలంలో వచ్చే క్లెయిమ్లను బీమా సంస్థలు తోసిపుచ్చుతాయి. హెరి్నయా, క్యాటరాక్ట్, చెవి, ముక్కు, గొంతు సమస్యలు (ఈఎన్టీ), మోకాలి చిప్ప మారి్పడి తదితర చికిత్సలకు రెండేళ్ల పాటు వెయిటింగ్ ఉంటుంది. అలాగే, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు సైతం క్లెయిమ్ కోసం నిర్ధేశిత కాలం పాటు వేచి ఉండాల్సిందే. ఆ కాలంలో క్లెయిమ్లను అనుమతించరు. కవరేజీ ఖర్చయిపోతే.. ఒక పాలసీ సంవత్సరంలో నిర్దేశిత కవరేజీ మొత్తం వినియోగించుకున్న తర్వాత వచ్చే క్లెయిమ్లకు బీమా సంస్థలు చెల్లింపులు చేయవు. అందుకే అన్ లిమిటెడ్ రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని తీసుకోవాలి. అప్పుడు బీమా ఖర్చయిపోయినా, తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్దరిస్తాయి. ముందస్తు అనుమతి.. కొన్ని రకాల చికిత్సలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ బీమా సంస్థ నిబంధనలు విధించొచ్చు. అలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే క్లెయిమ్ నిరాకరణకు నోచుకోదు.తిరస్కరిస్తే ఏంటీ మార్గం? బీమా సంస్థ సహేతుక కారణం లేకుండా చెల్లింపులకు నిరాకరిస్తే చూస్తూ ఉండిపోనక్కర్లేదు. పాలసీ నియమ, నిబంధనలను ఒక్కసారి పూర్తిగా అధ్యయనం చేయాలి. ‘పాలసీ వర్డింగ్స్’లో పూర్తి వివరాలు ఉంటాయి. క్లెయిమ్ తిరస్కరించడానికి కారణాలు తెలుసుకోవాలి. రిజెక్షన్ లెటర్లో ఈ వివరాలు ఉంటాయి. బీమా సంస్థ నిర్ణయం వాస్తవికంగా లేదని భావిస్తే అప్పుడు అప్పీల్కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (ఫిర్యాదుల పరిష్కార) విభాగం ఉంటుంది. క్లెయిమ్ నిరాకరించడానికి తగిన కారణాలు లేవంటూ వారికి ఫిర్యాదు సమరి్పంచాలి. పరిష్కారం లభించకపోతే అప్పుడు బీమా అంబుడ్స్మెన్ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు. క్లెయిమ్ పూర్తిగా కాకుండా, పాక్షికంగా చెల్లింపులు చేసిన సందర్భాల్లోనూ పాలసీదారులు న్యాయం కోరొచ్చు. ఐఆర్డీఏఐ... ఐఆర్డీఏఐ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్ను సంప్రదించొచ్చు. టోల్ఫ్రీ నంబర్లు 155255 లేదా 1800 4254 732కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదా complaints@irdai.gov.inకు మెయిల్ పంపొచ్చు. లేదా ఐఆర్డీఏకు చెందిన https://irdai. gov.in/ igms1 పోర్టల్ సాయంతో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కార వేదికలుఅంబుడ్స్మెన్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల కోర్టుకు వెళ్లినా సరే పెద్దగా ఖర్చు కాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది.రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తేగా.. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా.. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో భుజంగరావు తిరుపతన్న ఉన్నారు. -
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఓ ఇరవై ఏళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకునేందుకు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం(మే15) కీలక తీర్పిచ్చింది. తన గర్భం తొలగించుకునేందుకు అనుమతివ్వాలని యువతి చేసిన విజ్ఞప్తిని గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో యువతి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు ‘సారీ ఈ విషయంలో మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని తెలిపింది. యువతి తరపు న్యాయవాదికి సుప్రీం ప్రశ్నలివీ... గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కుంది. దీనికి మీరేమంటారు’ అని యువతి తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కేవలం తల్లి గురించే చెబుతోందని యువతి న్యాయవాది సమాధానమిచ్చారు.బెంచ్ తిరిగి స్పందిస్తూ ‘ఇప్పుడు గర్భం 7 నెలలు దాటింది. గర్భస్త శిశువుకు ఉన్న బతికే హక్కుపై మీరేం చెప్తారో చెప్పండి’ అని బెంచ్ మళ్లీ న్యాయవాదిని అడిగింది. ‘శిశువు జన్మించేదాకా అది తల్లి హక్కే తప్ప శిశువుకు ప్రత్యేక హక్కులేవీ ఉండవు.యువతి మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఆమె ప్రస్తుతం నీట్ పరీక్ష క్లాసులు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సమాజానికి ముఖం చూపించలేరు. యువతి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి’అని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి బెంచ్ స్పందిస్తూ ‘సారీ’అని సమాధానమిచ్చింది. యువతి, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఇప్పటికే సర్టిఫై చేసింది. కాగా, 24 వారాలు దాటిన గర్భం తీయించుకోవాలంటే తల్లికి, శిశువుకుగాని ఆరోగ్యపరంగా ఏదైనా హాని ఉంటేనే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద అనుమతిస్తారు. -
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్పై జిందాల్ పవర్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్కు అనుమతిస్తూనే.. సీఐఆర్పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు
ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్పై దాఖలైన పిటిషన్కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు న్యాయవాదుల పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు..
-
పరువు నష్టం కేసులో రాహుల్కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు. పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు. పరువు తీయడం కాంగ్రెస్కు అలవాటే: బీజేపీ గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
మహేష్ బాబు డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన నాగ చైతన్య..
-
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఆశారాంకు జైలులోనే ఆయుర్వేద చికిత్స అందించండి’
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. కాగా, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తర ఖండ్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.. ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్పూర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్పూర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. గతంలో.. ఆశారాం బాపూకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 మందిపై ఆయన అనుచరులు దాడిచేశారు. దీనిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆయన గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు కోరారు. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్యులను నియమించింది. కాగా, ఆశారాం బాపూను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. చదవండి: అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే -
‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్
హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్ఐహెచ్ డెల్టా వేరియంట్పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్ఐహెచ్ సహకరించింది. -
Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్తో ప్రతిపాదనలను బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాగ్జిన్ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. అయితే ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. కోవాగ్జిన్కు సంబంధించిన మాస్టర్ ఫైల్ను అందజేయాలని ఎఫ్డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్ను యూఎస్కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెన ఆక్యుజెన్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అయితే మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ యూఎస్ఎఫ్డీఏ దీన్ని తిరస్కరించింది. ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇండియాలో మూడో దశ క్లినికల్ ప్రయోగాల జూలైలో ఈ డేటాను కంపెనీ అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. మూడో దశ పరీక్షల డేటాను పరిశీలించిన మీదటే డబ్ల్యూహెచ్వో గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను గుర్తించలేదు. అంతేకాదు డబ్ల్యూహెచ్వో గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్వాక్సినేటెడ్” గానే పరిగణిస్తారు. భారత్ బయోటెక్స్పందన: అమెరికాలో తమ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తిరస్కరణపై భారత్ బయోటెక్ స్పందించింది. అమెరికా ఎఫ్డీఏకు పూర్తిస్థాయి క్లినికల్ డేటా ఆక్యూజెన్ అందించిందని వివరించింది. అయితే మరింత సమాచారం అందించాలని ఎఫ్డీఏ కోరిందని తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్ పూర్తిస్థాయిలో ఆమోదం పొందేందుకు బయోలాజిక్ లైసెన్స్ అప్లికేషన్ అనుమతి కూడా అవసరమని భారత్ బయోటెక్ తాజా ప్రకటనలో వెల్లడించింది. చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు! oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్ -
85 రోజుల్లో 10,12,84,282 డోసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రస్తుతం రోజువారీగా సగటున 38,93,288 డోసులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ దేశంలో 10,12,84,282 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. -
‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన 11వ దఫా చర్చలు సుమారు నాలుగున్నర గంటల పాటు జరుగగా, అందులో ఇరుపక్షాలు కేవలం 30 నిమిషాలపాటే ముఖాముఖి భేటీ అయ్యాయి. 10వ దఫా చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని, చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి తదుపరి చర్చల విషయంలో తమ వైఖరిని ప్రభుత్వం రైతుల ముందు స్పష్టంచేసింది. తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటేనే తదుపరి చర్చలు జరుగుతాయని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కచ్చితంగా నిర్వహించి తీరుతామని వ్యవసాయ సంఘాల నాయకులు చర్చల అనంతరం తెలిపారు. సాగు చట్టాలలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, రైతుల నిరసనలపై గౌరవంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని తోమర్ తెలిపారు. చట్టాల అమలును నిలిపివేసే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించాలనుకుంటేనే మరో సమావేశానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు తోమర్ స్పష్టం చేశారు. సమావేశం తరువాత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీకి చెందిన ఎస్ఎస్ పంఢేర్ మీడియాతో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించి వ్యవసాయ మంత్రి తమను మూడున్నర గంటలపాటు వేచి ఉండేలా చేయడం అవమానకరమన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని మంత్రి కోరడంతో తాము నిరసనగా సమావేశం నుంచి బయటికి వచ్చామని వివరించారు. ఈ దఫా చర్చల్లోనూ సాగు చట్టాల రద్దుడిమాండ్ను రైతు సంఘాల నేతలు ముందుకు తేగా ప్రభుత్వం మాత్రం చట్టాల సవరణకు సిద్ధంగా ఉందని చెప్పిందని రైతు నాయకుడు శివ కుమార్ కక్క తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి తమను కోరినప్పుడు, తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని తాము కోరామని, మంత్రి సమావేశం నుంచి వెళ్ళిపోయారని శివకుమార్ పేర్కొన్నారు. అంతకుముందు, రైతు నాయకుల అంతర్గత సమావేశాల్లో.. ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన ఇవ్వాలన్న చర్చ సైతం జరిగింది. చట్టాల అమలును ఏడాదిన్నర కాకుండా, మూడేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కొందరు నేతలు సూచించారు. అంతేగాక వ్యవసాయ రుణ పరిమితిని ఎకరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పాత వడ్డీ రేటును కొనసాగించాలని ప్రతిపాదించారు. 26న ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది: రాకేశ్ టికైత్ ప్రభుత్వంతో 11వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లుగా, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ట్రాక్టర్ పరేడ్కు సంబంధించిన అనుమతి కోసం పోలీసులు, రైతులు మధ్య గురువారం జరిగిన మూడో రౌండ్ సమావేశం అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతుల పరేడ్కు అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కుండ్లి–మనేసర్–పాల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై పరేడ్ జరపాలని పోలీసులు సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. -
కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాలు నో
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల అమలును 18నెలల పాటు నిలిపివేయడంతో పాటు చర్చల కోసం ఇరుపక్షాల నుంచి జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆ ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. గురువారం ఎస్కేఎం సర్వసభ్య సమావేశం జరిగిందని, ఇందులో కేంద్రం బుధవారం ప్రకటించిన ప్రతిపాదనను తిరస్కరించడం జరిగిందని ఎస్కేంఎం ప్రకటించింది. చట్టాలు సంపూర్ణంగా ఉపసంహరించేవరకు వెనక్కు తగ్గమని తేల్చిచెప్పింది. అయితే 41 యూనియన్లలో ఒకటైన భారతీయ కిసాన్ యూనియన్(సింధ్పూర్) నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్రం ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కొందరు నేతలు ఇంకా చర్చిస్తూనే ఉన్నారన్నారు. కానీ మిగిలిన నేతల్లో ఎక్కువమంది ప్రతిపాదనలను తిరస్కరించామనే చెప్పారు. కాగా, 26న జరపతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఢిల్లీ వెలుపల నిర్వహించుకోవాలని పోలీసులు సూచించగా సాధ్యం కాదని తాము తిరస్కరించినట్లు స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. రైతు సంఘాలతో సంప్రదింపులు షురూ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రైతు సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టింది. ప్యానెల్లో సభ్యులుగా ఉన్న మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, వ్యవసాయ ఆర్థికవేత్తలు అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి గురువారం 8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంప్రదింపుల ప్రక్రియలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్కు చెందిన పది రైతు సంఘాలు పాల్గొన్నాయని కమిటీ పేర్కొంది. పాల్గొన్న రైతు సంఘాల నాయకులు చట్టాల అమలు మెరుగుçకు సూచనలు కూడా ఇచ్చాయని తెలిపారు. -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. విలువైన విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వలేమని, కరోనా వైరస్ ఉన్నప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. (3 కోట్లు దాటిన పరీక్షలు) ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జేఈఈ పరీక్ష సెప్టెంబరు 1 –6 తేదీల్లో, నీట్ పరీక్ష అదే నెల 13వ తేదీన జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా వీటిని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదకొండు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టివేయాలని తమ పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశాలపై జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్ను దీర్ఘకాలం డోలాయమానంలో ఉంచలేమని వ్యాఖ్యానించారు. దీంతో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబరులోనే జరిగేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని, పరీక్షల వాయిదాతో తమకు సాంత్వన చేకూరుతుందని లక్షల మంది విద్యార్థులు సుప్రీంకోర్టువైపు చూస్తున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ, నీట్ నిర్వహించడం పిటిషన్దారులతోపాటు లక్షలాది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడమే. మరికొంత కాలం వేచి చూడటం మేలైన పని. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాతే పరీక్షలు నిర్వహించాలి’’అని ఆ పిటిషన్లో కోరారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఈ ఏడాది 161 కేంద్రాల్లో జేఈఈని ఆన్లైన్ పద్ధతిలోనూ, నీట్ను ఆఫ్లైన్లోనూ నిర్వహించాలని తీర్మానించిందని పిటిషన్దారులు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్టీఏ జూన్ 22న జరగాల్సిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేసిందని పిటిషన్దారులు తెలిపారు. బిహార్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రాష్ట్రాల విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఇదిలా ఉండగా.. ఆయుష్ పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీని వాయిదా వేయాలని, కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పరీక్ష నిర్వహణ సరికాదని పలువురు డాక్టర్లు సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం కొసమెరుపు. -
త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడుతూ ఆహార సంబంధిత వ్యాపార ప్రణాళికలకు ఫ్లిప్కార్ట్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ఫ్లిప్కార్ట్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదిత ప్రణాళిక నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నియంత్రణ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) తెలిపింది. మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన ఫ్లిప్కార్ట్ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఆధారంగా నడిచే మార్కెట్ దేశ రైతులు భారీ ప్రయోజనాన్ని సమకూరుస్తుందన్నారు.సప్లయ్ చెయిన్ సామర్థ్యం పెంపు, పారదర్శకతతో దేశ రైతులకు,ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయమైన విలువను చేకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవసాయంలో కీలక మార్పులకు దోహపడుతుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెజాన్ 2017లో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. కాగా దేశం పెరుగుతున్న ఆహార రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికను గత ఏడాది అక్టోబర్లో ప్రకటించిన, ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఈ కొత్త వెంచర్లో 258 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో కిరాణా విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది. కఠిన ఆంక్షలతో ఇంటికే పరిమితమైన చాలామంది వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. దీంతో గ్రోఫర్స్, బిగ్బాస్కెట్ అమెజాన్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. రాబోయే నెలల్లో కూడా ఇది కొనసాగుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహార రిటైల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండటం గమనార్హం. చదవండి : అతిపెద్ద మొబైల్ మేకర్గా భారత్: కొత్త పథకాలు షావోమి ల్యాప్టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు
బీజింగ్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భంగపాటు ఎదురైంది. భారత్–చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ను చైనా తిరస్కరించింది. భారత్–చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ తొలిసారి స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్–చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. పరస్పరం చర్చించుకోవడానికి, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి రెండు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత అధికార యంత్రాంగం, కమ్యూనికేషన్ చానళ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల సామర్థ్యం రెండు దేశాలకు ఉందన్నారు. భారత్–చైనా మధ్య మధ్యవర్తిగా పనిచేస్తానంటూ గురువారం చెప్పిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కూడా ఆదే విషయం పునరుద్ఘాటించారు. మిలటరీ ఉద్రిక్తతలపై ట్రంప్–మోదీ చర్చించుకోలేదు తూర్పు లడఖ్లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్–మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్–మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని, ఆ తర్వాత ఇరువురు నేతలు ఎప్పుడూ చర్చించుకోలేదని వెల్లడించాయి. తాను మోదీతో మాట్లాడానని, భారత్–చైనా మధ్య ఉద్రిక్తతల విషయంలో ఆయన మంచి మూడ్లో లేరని ట్రంప్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనం’ ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ ద్వారా ఈ ఏడాది చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనకూడదని స్థానికులు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో అడుగుపెట్టడం ప్రమాదకరమని గిరిజన వ్యాపారుల సంఘం నాయకుడు, భారత్–చైనా వ్యాపార్ సంఘటన్ ప్రతినిధి విశాల్ గార్బియాల్ చెప్పారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రతియేటా జూన్ నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. -
నిర్భయ దోషికి మరణ శిక్షే
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను బుధవారం జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్కు మరణశిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై 9న ఈ కేసులో మరో ముగ్గురు దోషులు ముఖేష్, పవన్గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. వారి రివ్యూ పిటిషన్లకి, అక్షయ్ పిటిషన్కి ఎలాంటి తేడా లేదని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీంతో అక్షయ్ తరపు లాయర్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి మూడు వారాల గడువివ్వాలని కోరారు. రాజకీయపరమైన, మీడియా ఒత్తిళ్ల వల్లనే తన క్లయింట్ను దోషిగా తేల్చారని ఆరోపించారు. ఇక దోషులకు న్యాయ పరంగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం మాత్రం మిగిలుంది. డెత్ వారెంట్లపై విచారణ 7కి వాయిదా నిర్భయ దోషులు ఉరిశిక్షపై రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకుంటారో లేదో వారంలోగా వారి స్పందనను తెలుసుకోవాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించింది. డెత్ వారెంట్లు జారీపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్రలోనూ ‘దిశ’ తరహా చట్టం నాగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు సంబంధించి యావత్ జాతికి దిశానిర్దేశం చేసేలా తీసుకువచ్చిన దిశ చట్టంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దిశ చట్టం ఎంత శక్తిమంతమైనదో గ్రహించిన మహా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బాటలో నడవాలని యోచిస్తోంది. మహిళల అకృత్యాలపై 21 రోజుల్లోగా విచారణ జరిపి, అత్యాచారం కేసుల్లో మరణ దండన విధించాలని దిశ చట్టం చెబుతోంది. ఈ తరహాలోనే చట్టం చేయాలని భావిస్తున్నట్లు హోం మంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం శాసన మండలిలో చెప్పారు. ‘మహిళలపై అకృత్యాల విషయంలో చట్టాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం తరహాలో సత్వర న్యాయం కోసం ఒక కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉంది’ అని హోం మంత్రి వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాల విషయంలో విపక్షాలిచ్చిన సావధాన తీర్మానానికి హోం మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. బిహార్లో మరో ఘోరం ససారం: బిహార్లోని రోహ్తాస్ జిల్లాలో ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మంగళవారం రాత్రి బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడింది. నిందితులను ఆదివారమే అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామన్నారు. -
రవిప్రకాశ్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
ట్రంప్కు షాకిచ్చిన పుతిన్
మాస్కో : ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో ప్రపంచదేశాలు ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ట్రంప్ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకోవాలంటూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్లో కోరారు. అయితే ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకునేది లేదని పుతిన్ స్పష్టం చేసినట్లు రష్యా మీడియా వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తర కొరియామీద కఠినమైన ఆంక్షలను విధించారని.. అంతమించి చర్యలు తీసుకోవాల్సి అవసరం లేనట్లు అమెరికాకు రష్యా తెలిపింది. అమెరికా తీసుకుంటున్న చర్యలు.. ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని రష్యా పేర్కొంది. ఇటీవల ఉత్తర కొరియా జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా యుద్ధానికి కాలుదువ్వుతోందని చెప్పారు. ఒక వేళ యుద్ధమే సంభవిస్తే.. ఉత్తరకొరియాను ధ్వంసం చేస్తామని ఆమె హెచ్చరించారు. -
పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి నిజామాబాద్ : వివాహం నిశ్చయం చేసుకొని, రోజూ ఫోన్లో మాట్లాడిన యువకుడు.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాల్కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై స్వామిగౌడ్ కథనం ప్రకారం.. బాల్కొండకు చెందిన తోట నవత (23) స్థానిక ఉర్దూ మీడయం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమెకు, వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన రజనీకాంత్తో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం దూరంగా ఉండడంతో రజనీకాంత్ దుబాయి వెళ్లాడు. ఇద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకునే వారు. అయితే, నాలుగు రోజుల నుంచి రజనీకాంత్ ఫోన్ చేయడం లేదు. ఆదివారం వరుడి తరఫు బంధువులు నవత ఇంటికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం రజనీకాంత్కు ఇష్టం లేదని, సంబంధం రద్దు చేసుకుందామని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నవత ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో పాటు అదే గల్లీలో ఉండే అమ్మమ్మ తదితరులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, అమ్మమ్మ తమ ఇంటికే వెళ్లిందని గుర్తించిన నవత ఆమె ఇంట్లోకి వెళ్లి తాడుతో ఉరేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు వేయడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కట్నం కోసమేనా..? నవతతో పెళ్లి రద్దు చేసుకోవడానికి కారణం అదనపు కట్నమే కారణమని తెలిసింది. బాల్కొండ మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతి వాళ్లు ఎక్కువగా కట్నం ఇస్తారనడంతోనే ఈ సంబంధాన్ని వద్దన్నారని సమాచారం. పెళ్లి కుదిరిన సమయంలో నవత తల్లిదండ్రులు కట్నం కింద తొలి విడతలో రూ.లక్ష ముట్టజెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితే, అదనపు కట్నంపై ఆశతోనే పెళ్లిని రద్దు చేసుకున్నారని, దీంతో మనస్థాపానికి గురైన నవత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. -
ఎన్జీటీలో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : పాత డీజిల్ వాహనాలపై నిషేధంపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. పదేండ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టివేసింది. డీజిల్ వాహనాల కాలుష్యం ప్రజల పాటి ప్రమాదకరంగామారిందని పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిషేధ ఆజ్ఞలను సవరిండానికి నిరాకరించిన ఒక డీజిల్ వాహనం 24 పెట్రోల్ వాహనాలు, 40 సిఎన్జీ వాహనాలకు సమానం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగా నవంబర్ 2014 లో, జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున 15 ఏళ్ల కంటే ఎక్కువ డీజిల్, పెట్రోల్ వాహనాలకు అనమతి లేదని ఎన్జీటీ ఆదేశించింది. ఆ తరువాత ఏప్రిల్, 2015 లో ట్రిబ్యునల్ మరోసారి డీజిల్ వాహనాలను 10 ఏళ్ళకు పైబడిన డీజిల్ వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఎన్జీటీ మరోసారి ఆదేశించింది. జనవరి, 2017 లో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిధిని 15 ఏండ్లకు పెంచాలని కోరింది. ఎన్జీటీ నిర్ణయంతో పబ్లిక్, ప్రయివేటు సెక్టార్లు తీవ్రంగా దెబ్బ తింటాయని కేంద్రం వాదిస్తోంది. అటు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియను ఢిల్లీ ఆర్టీఓ గతేడాది నవంబర్లో ప్రారంభించిన అసంగతి తెలిసిందే. -
జియో క్యాబ్లపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ముంబై: యాప్ ఆధారిత టాక్సీ సేవలపై రిలయన్స్ స్పందించింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టాక్సీ సేవల రంగంలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలను రిలయన్స్ వర్గాలు వ్యతిరేకించాయి. ప్రత్యక్షంగా రిలయన్స్ జియో నేరుగా స్పందించ కపోయినప్పటికీ, రిలయన్స్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ద్వారా ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రణాళికలేవీ లేవని వివరణ ఇచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ కంపెనీ త్వరలోనే జియో ప్రారంభించనుందన్న వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ వార్తలు తప్పు అంటూ కొట్టి పారేశారు. మరోవైపు రిలయన్స్ జియో సంబంధంలేని రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఏదీ లేదని రిలయన్స్ అధికారి ఒకరు వివరించారు. జియో ప్రీపెయిడ్ వాలెట్ జియో మనీ ద్వారా టాక్సీ చెల్లింపులకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఈ వారం టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జిమో మనీ ద్వారా ఈ ఉబెర్ సేవలను వినియోగించుకుని చెల్లింపులు చేసిన వినియోగదారులకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా 170 రోజుల్లో 100 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ప్రారంభ ఆఫర్ లోనే టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజ కంపెనీలకు సైతం చుక్కలు చూపించింది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు క్యాబ్ సర్వీసుల మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలో ఉందన్నవార్తలు ఇటీవల బాగా వ్యాపించాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ క్యాబ్ మార్కెట్ను పూర్తిగా స్టడీ చేస్తున్నారనీ జియో క్యాబ్స్ పేరిట సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నారని నివేదికలొచ్చాయి. ఏప్రిల్లోనే లాంచ్ చేయనున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలల్లోనే కమర్షియల్గా అందుబాటులోకి తేనున్నారన్న అంచనాలు బాగా వచ్చాయి. ఇందుకోసం ఇప్పటికే మహింద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపారనీ, 600 కార్లను కూడా ఆర్డర్ ఇచ్చిందని, తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి అనంతరం ఢిల్లీ, ముంబై విస్తరిస్తుందని వెల్లడించిన సంగతి విదితమే. -
పవర్ స్టార్కు నో చెప్పిన హీరోయిన్ ?
-
రవి రుయా అభ్యర్థనను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్సార్ గ్రూపు ప్రమోటర్ రవి రుయా విదేశీ పర్యటన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు కూడా ఓ వ్యక్తి తమ లాగే చెప్పి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంది. 2002లోని 2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో రవి రుయా భాగమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొటున్నారు. కెనడా, యూఎస్, సౌదీ అరేబియాలోని బిజినెస్ పనులపై ఆయన విదేశీ పర్యటన వెళ్లాల్సి ఉందని రవిరుయా తరుఫున లాయర్లు కోర్టుకు విన్నపించుకున్నారు. రవి బెయిల్ కండీషన్లను ఉల్లంఘించరని లాయర్లు వాదించారు. కానీ ఈ విషయాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒకవేళ రవిరుయాను విదేశీ పర్యటనకు అనుమతించాక, అతను అక్కడి నుంచి తిరిగి రాకపోతే ఎలా అని ప్రశ్నలు సంధించింది. ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కావడంతో రవి రుయాను తిరిగి భారత్కు తీసుకురావడం కష్టతరమవుతుందని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనను కోర్టు అంగీకరించింది. ముందుకూడా ఇలానే జరిగిందని, ఓ వ్యక్తి ఇలానే వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోయాయడని, ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటన అనుమతిని తిరస్కరిస్తున్నట్టు సుప్రీం పేర్కొంది. ఈ కేసులో రుయా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. రష్యా, యూకే, ఫ్రాన్స్కు వెళ్లడానికి గతేడాది ఆయనకు అనుమతించిన కోర్టు, ఈ ఏడాది తిరస్కరించింది. -
పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత...
-
బేయర్ కు మోన్ శాంటో ఝలక్
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్ కు అమెరికా సీడ్స్ కంపెనీ మోన్ శాంటో ఝలక్ ఇచ్చింది. బేయర్ ప్రకటించిన 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను తిరస్కరించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో ప్రకటించింది. అయితే ఈ విలీనంపై మరిన్ని చర్చలు జరుపుతామని మోన్ శాంటో తెలిపింది. గతకొంతకాలంగా జరిపిన చర్చల అనంతరం బేయర్ ఈ ఆఫర్ ను మోన్ శాంటోకు ప్రకటించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంగ్ గ్రాంట్ మంగళవారం తెలిపారు. ఈ ఫైనాన్స్ డీల్ పై కానీ, రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కోవటంపై కానీ సరియైన హామీని బేయర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. బేయర్ ప్రతిపాదన అసంపూర్తిగా, ఆర్థికంగా తగినవిధంగా లేదని మోన్ శాంటో బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన తెలిపారు. కానీ ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగించడానికి మోన్ శాంటో షేర్ ఓనర్స్ ఆసక్తి చూపినట్టు కంపెనీ ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్స్, వ్యవసాయ పురుగుమందులు, జెనరిక్ గా పంటలను ఎప్పడికప్పుడూ మార్చగల సామర్థ్యం గల కంపెనీగా ఆవిర్భవించడానికి మోన్ శాంటోకు బేయర్ ఈ అతిపెద్ద టేకోవర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను మోన్ శాంటో తిరస్కరించడంతో, బేయర్ ఈ బిడ్ విలువను మరింత పెంచుతుందా అనేది మార్కెట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే బేయర్ ఈ ఆఫర్ తో మోన్ శాంటో షేర్లు బలపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం అంతర్జాతీయ ట్రేడింగ్ లో మోన్ శాంటో షేర్లు 1.7శాతం పెరిగి, 107.77 డాలర్లుగా నమోదయ్యాయి. కానీ ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి బేయర్ షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. మోన్ శాంటో ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు మార్కెట్లోకి వార్త పొక్కడంతోనే బేయర్లు షేర్లు పునఃస్థానానికి వస్తున్నాయి. -
'హౌసింగ్ సొసైటీ' పిటిషన్ను అనుమతించని సుప్రీం
ఢిల్లీ : హౌసింగ్ సొసైటీ కేసు పై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరణ పిటిషన్ వేసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉపసంహరణ పిటిషన్ను సుప్రీం కోర్టు అనుమతించలేదు. పాలసీలో మార్పులు చేసుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది. దీనికి తెలంగాణ తరఫు న్యాయవాది అంగీకరించారు. ప్రతివాదిగా ఏపీ సర్కార్ను కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. -
ఆర్ఎస్ఎస్ ఆర్ నో
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట
-
దంపతుల అరెస్టుకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ను ముంబై సీబీఐ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు దీనిపై ముంబై హైకోర్టులో సవాల్ చేసేందుకు సెతల్వాద్ తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్రమోదీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలోవారి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఆప్ మాజీ మంత్రి తోమర్ కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కి నిరాశే మిగిలింది. తోమర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. తన అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ, బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై ఆయన సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి ఇవాళ్టకు వాయిదా వేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అదుపులోకి తీసుకోగా, మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించిన విషయం తెలిసిందే. -
అసాంజేపై వారంటు రద్దుకు స్వీడిష్ కోర్టు నో
స్టాక్హోం: లక్షలాది రహస్య పత్రాలను బయటపెట్టి అమెరికా సహా వివిధ దేశాలను వణికించిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేపై అరెస్టు వారంటును రద్దు చేసేందుకు స్వీడన్ సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. తనపై స్వీడన్ జారీ చేసిన అరెస్టు వారంటును తిరస్కరించాలంటూ అసాంజే చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఓ మహిళపై అత్యాచారం, మరో మహిళపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన కేసుల్లో అసాంజే అరెస్టుకు స్వీడన్ 2010లో వారంటు జారీ చేసింది. అయితే, స్వీడన్కు అప్పగింతను తప్పించుకునేందుకుగాను అసాంజే 2012 నుంచీ లండన్లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోనే తలదాచుకుంటున్నారు. అసాంజేను స్వీడన్కు అప్పగించాలన్న డిమాండ్ను స్వీడిష్ పోలీసులు పక్కనపెట్టారని, ఆయనను లండన్లోనే విచారించేందుకూ వారు సంసిద్ధత వ్యక్తం చేసినందున అరెస్టు వారెంటును రద్దు చేయాల్సిన అవసరం లేదని స్వీడిష్ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
క్షమాపణ చెబితే సరిపోతుందా....
దౌసా: ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలను గజేంద్ర సింగ్ కుటుంబం తిరస్కరించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకును కాపాడటం కేజ్రీవాల్ ఒక్కడి వల్లే సాధ్యంకాకపోతే...కనీసం కార్యకర్తలను, పోలీసులను ఆదేశించి ఉండాల్సిందని గజేంద్ర సింగ్ తండ్రి బనే సింగ్ విమర్శించారు. చనిపోతున్న మనిషిని రక్షించలేకపోవడం ఢిల్లీ ముఖ్యమంత్రికి అవమానమన్నారు. దౌసా జిల్లాలోని నంగల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ , కేజ్రీవాల్ సహచరులతో కలిసి వైదికపై నుంచి చోద్యం చూశారు తప్ప తన కొడుకును రక్షించే ప్రయత్నం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే తన సొంత పిల్లలు ఆ పరిస్థితిలో ఉండి ఉంటే కేజ్రీవాల్ ఇలాగే చేశావారా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్ తప్పు దిద్దుకునే పనిలో భాగంగా ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత తప్పుచేశాను క్షమించండన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే మన్నించండంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించిన అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించడం వివాదాస్పదమైంది. దీనిపై గురువారం పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. -
అడపిల్ల పూట్టడమే శాపమా!
-
బ్రిటన్ సమైక్యతకు ఢోకా లేనట్లే!
-
విభజనతో ఏపీ ఈఆర్సీ ఉనికి కోల్పోయింది
-
మోహన్బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: ‘పద్మశ్రీ’ పురస్కారం ఉపసంహరణకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న సినీనటుడు, నిర్మాత ఎం.మోహన్బాబు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గతంలో మరేదైనా సినిమాలో పేరుకు ముందు ‘పద్మశ్రీ’ని వాడి ఉంటే అక్కడా తొలగించాలన్న ఆదేశాలను తాము అమలు చేశామని మోహన్బాబు రాతపూర్వకంగా నివేదించారు. దానిని పరిశీ లించిన ధర్మాసనం... ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ విచారణను ముగించింది. ‘దేనికైనా రెడీ’ సినిమాలోనేగాక, ‘ఝుమ్మంది నాదం’ సినిమాలోనూ పద్మశ్రీని పేరుకు ముందు ఉపయోగించారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిల్ దాఖలు చేయడం తెలిసిందే. -
26 జీవోల పిటిషన్ కొట్టివేత