Royal family
-
ఉదయ్ పూర్ ప్యాలెస్ 'మహారాజు కు నో ఎంట్రీ..
-
Lok Sabha election 2024: కింగ్ వర్సెస్ క్వీన్
హిమాచల్ప్రదేశ్లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...తొలి నుంచీ రాజులే... పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.కంగనాకు ఆదరణ... కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.పరస్పర విమర్శలు... పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది. హిమాచల్లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.‘మండి’ ప్రస్థానం.. మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు. -
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్టాపిక్గా మారింది. రీజన్ ఏంటంటే..డచెస్ ఆఫ్ సస్సెక్స్గా పేరుగాంచిన మేఘన్ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్ హెడీ మెరిక్ చేత డిజైన్ చేయించుకుంది. డిజైనర్ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్ గౌన్ బ్లష్. విండర్స్ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్ మార్క్లే ప్రిన్స్ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్ ఎలిజబెత్II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్హామ్ ప్యాలెస్లోని విండ్సర్ ఎస్టేట్లో నివశించేవారు. గతేడాది జూన్లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్ చార్లెస్ మేఘన్కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!) -
Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
గుజరాత్లో అన్ని లోక్సభ స్థానాలకూ మే 7న మూడో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది. అయితే అంతకుముందే ఒక సీటు అధికార బీజేపీ ఖాతాలో పడింది! సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ‘తిరస్కరణ’కు గురవడం, ఆ వెంటనే పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులూ నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. దాంతో పోలింగ్తో పని లేకుండా బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవ ఎంపీగా ఎన్నికైపోయారు! అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ మీడియాకు ముఖం చాటేయడంతో ఇదంతా బీజేపీ స్క్రిప్టేనంటూ ఆరోపణలొచ్చాయి. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలను ఓసారి చూస్తే... లోక్సభ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం అసాధారణమైన విషయం. తొలి లోక్సభ ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఇప్పటిదాకా ఇలా పోటీ లేకుండా గెలిచిన 29వ ఎంపీ దలాల్. బీజేపీ నుంచైతే ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. 1952, 1957, 1967 ఎన్నికల్లో ఐదేసి మంది చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో ఏకగ్రీవమైన ఐదుగురు ఎంపీల్లో ఒక్క జమ్మూ కశీ్మర్ నుంచే నలుగురుండటం విశేషం! ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాలు ఒకరికంటే ఎక్కువ మంది ఎంపీలను పోటీ లేకుండా లోక్సభకు పంపాయి. పారీ్టలపరంగా చూస్తే ఏకంగా 20 మంది ఏకగ్రీవ ఎంపీలతో ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్ర స్థానంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ల నుంచి ఇద్దరేసి ఏకగ్రీవమయ్యారు. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గారు. సిక్కిం, శ్రీనగర్ లోక్సభ స్థానాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ ప్రముఖులు.. ఏకగ్రీవంగా గెలుపొందిన ఎంపీల్లో పలువురు ప్రముఖులున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైబీ చవాన్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, నాగాలాండ్ మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఎస్సీ జమీర్, ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు టీటీ కృష్ణమాచారి, కేంద్ర మాజీ మంత్రులు పీఎం సయీద్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడ నుంచి కేఎల్ రావు పోటీ లేకుండా గెలిచారు. రాజ కుటుంబీకుల నుంచి మొదలు... లోక్సభకు ఏకగ్రీవాలు రాజ కుటుంబీకుల నుంచి మొదలయ్యాయి. 1952 తొలి ఎన్నికల్లో లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి నాయకునిగా ఆనంద్ చంద్ రికార్డులకెక్కారు. అంతేగాక ఏకగ్రీవమైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కూడా ఆయనే! బిలాస్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. నిధుల కొరతను కారణంగా చూపుతూ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. ఆయనకు చంద్ లంచం ఇచి్చనట్టు కాంగ్రెస్ ఆరోపించింది. చంద్ ఎన్నికను కోర్టులో సవాలు కూడా చేసింది. అయితే తీర్పు చాంద్కే అనుకూలంగా వచ్చింది. ఇక ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్ 1962లో అంగుల్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై బరిలో ఉన్న గణతంత్ర పరిషత్ పార్టీ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అదే ఏడాది తెహ్రీ గడ్వాల్ నుంచి మానవేంద్ర షా కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1967లో లద్దాఖ్ కాంగ్రెస్ అభ్యర్థి, బౌద్ధ ఆధ్యాతి్మక నాయకుడు చోగ్నోర్ పోటీ లేకుండా గెలుపొందారు. 1971లోనూ ఆయన విజయం సాధించారు. 1977లో సిక్కిం స్థానంలో ఏకంగా ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లకపోవడంతో ఛత్ర బహదూర్ ఛెత్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్ వెస్ట్ స్థానంలో రించిన్ ఖండూ ఖ్రీమే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనా పోటీ లేకుండా నెగ్గారు. 1989లో కశీ్మర్లో మూడు లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో కేవలం 5 శాతం ఓటింగ్ నమోదైంది. కాశీ్మర్ లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మహమ్మద్ షఫీ భట్ శ్రీనగర్ నుంచి పోటీ లేకుండా గెలిచారు! కన్నౌజ్ నుంచి డింపుల్ దలాల్కు ముందు చివరిసారిగా ఏకగ్రీవంగా గెలిచిన ఎంపీ సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్. కన్నౌజ్ ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. దాంతో ఖాళీ అయిన కన్నౌజ్ లోక్సభ స్థానం నుంచి ఆయన భార్య డింపుల్ బరిలో దిగారు. కాంగ్రెస్, బీఎస్పీ, రా్రïÙ్టయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)తో సహా ప్రధాన పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. కొందరు స్వతంత్రులతో పాటు బీజేపీ, పలు చిన్న పారీ్టలు బరిలో దిగాయి. కానీ అంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో డింపుల్ ఏకగ్రీవంగా నెగ్గారు. తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఎస్పీ అడ్డుకుందని బీజేపీ, పీస్ పార్టీ వంటివి ఆరోపించడం విశేషం! చివరి నిమిషం ఉపసంహరణలు... 1985 సిక్కిం లోక్సభ స్థానం సిట్టింగ్ ఎంపీ నార్ బహదూర్ భండారీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో లోక్సభకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఆయన భార్య దిల్ కుమారి భండారీ సిక్కిం సంగ్రామ్ పరిషత్ నుంచి ఏకగ్రీవంగా నెగ్గారు. కాంగ్రెస్తో సహా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అధికార పార్టీ వారిపై బెదిరింపులకు పాల్పడిందంటూ ఆరోపణలొచ్చాయి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
ప్రపంచంలోనే ధనిక కుటుంబం.. ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రాజ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు, తరిగినపోని ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి. కోటానుకోట్ల రూపాయాలు కూడా వాళ్ల సొంతం! అయితే ప్రపంచంలో కోట్ల ఆస్తులు ఉన్న రాజ కుటుంబాలు ఉన్నప్పటీకి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ రాజ కుటుంబం చాలా ప్రత్యేకమైంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడిస్తారు! ఇటువంటి రాజ కుటుంబాల ఆస్తులు, సౌకర్యాలు, వ్యాపార విలువ తెలిస్తే.. మనమంతా నోరెళ్లబెట్టక తప్పదు! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సుమారు 4,078 కోట్ల అధ్యక్ష భవనం(మూడు అమెరికా పెంటాగన్ భవనాలతో సమానం), 8 ప్రైవేట్ జెట్స్, అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్ కలిగి ఉన్నారు. ఈ రాజ కుటుంబం ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 6శాతం కలిగి ఉంది. అదే విధంగా మాంచెస్టర్ నగరంలోని ఫుట్ క్లబ్, ప్రముఖ కంపెనీల్లో వందల షేర్లు కూడా ఉన్నాయ. అందులో హాలీవుడ్ గాయాని బ్యూటీ బ్రాండ్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ వరకు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ షేర్లు ఉండటం గమనార్హం. యూఏఈ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద SUV వాహనంతో పాటు ఐదు బుగట్టి వేరాన్లు, ఒక లంబోర్గిని వరెన్టన్, ఒక మెర్సిడెస్ బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX, ఒక Mc12 ఆర్ఎన్ వాహనాలు ఉన్నాయి. ఇక.. ఈ రాజకుటుంబం నివాసం ఉండే కస్ర్ అల్-వతన్ ( యూఏఈ అధ్యక్ష భవనం) ఆ దేశంలోనే అత్యంత పెద్ద రాజభవనంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3,50,000 ప్రత్యేకమైన క్రిస్టల్స్లో తయారు చేయబడిన షాన్డీలియర్, విలువైన చారిత్రక కళాఖండాతో పాలెస్ అబ్బుర పరిచేలా ఉంటుంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 మరోవైపు అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రాజకుటుంబంలోనే ప్రధానమైన పెట్టుబడి కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని విలువ ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 235 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ వ్యవసాయం, చమురు, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. అదీకాక కంపెనీ పదివేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. యూఏఈ కాకుండా ఈ రాజ కుటుంబానికి లండన్, పారిస్ వంటి ప్రపంచశ్రేణి నగరాల్లో విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇక రాజ కుటుంబంలోని మాజీ కుటుంబ పెద్దకు ‘లండన్ భూస్వామి’ అనే పేరు ఉండటం విశేషం. 2015లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబంతో పోటీపడే ఆస్తులు యూఏఈ రాజ కుటుబానికి ఉన్నాయని పేర్కొన్నారంటే.. వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! 2008లో మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూకే ఫుట్బాల్ టీం(మాంచెస్టర్ సీటీ)ను సుమారు 2,122 కోట్ల భారీ ధరకు కోనుగోలు చేసి సంచలనం సృష్టించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ది 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు గల పెద్ద రాజ కుటుంబం. ఆయనకు 9 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉండటం గమనార్హం. చదవండి: ఇరాన్పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా? -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్సింగ్తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు
భోపాల్: మధ్యప్రదేశ్లోని శ్రీ జుగల్ కిషోర్ మందిరంలో వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్న సమయంలో పన్నా రాజ కుటుంబీకురాలు జితేశ్వరీ దేవి ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించినందుకు పన్నా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. Maharani Jiteshwari Devi of Panna Royal house of Madhya Pradesh arrested Due to widowhood of Queen, she was prevented from performing the Aarti of Shri Krishna in Jugal Kishore Temple in Panna#G20India2023 #G20जनता_विरोधी #G20_Anti_Social#सनातनी_ऐक_शैतानी #BharatMandapam #G20 pic.twitter.com/tR5hHx4kYz — Vikram Kumar (@VikramKumar6262) September 9, 2023 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్నా జిల్లా బుందేల్ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరంలో కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. అయితే ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే 'చాన్వార్' సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారని, అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని తెలిపారు. कल रात जब उनकी विधवा पत्नी जेतेश्वरी देवी अपने बेटे को लेकर जुगल किशोर मंदिर पूजा करने के लिए आई और गर्भ गृह में घुसने लगी तो विधवा बता कर उन्हें और बेटे को रोक दिया गया। कुछ देर बाद जीतेश्वरी गर्भगृह के अंदर घुस गई और आरती करने लगी तो विधवा द्वारा आरती करना अशुभ बता कर कथित थाली… pic.twitter.com/svOZjgcW5y — काश/if Kakvi (@KashifKakvi) September 8, 2023 కానీ జితేశ్వరీ దేవి నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి హారతినిచ్చారన్నారు. దీంతో అర్చకులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకోగా వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లామని ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. पन्ना राजपरिवार की महारानी #jiteshwaridevi को श्री जुगलकिशोर जू मंदिर से बाहर फेंका गया pic.twitter.com/J7wKpELBYF — Piyush Kumar Shukla (@Piyushkumarshu8) September 8, 2023 అరెస్టు సమయంలో జితేశ్వరీ దేవి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రక్షణ శాఖ సంక్షేమ నిధిలో సుమారు రూ.65,000 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేశారన్నారు. వైధవ్యం కారణంగానే గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని సంఘటన సమయంలో ఆమె బాగా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. बवाल के बाद महारानी जीतेश्वरी देवी अदालत जाते वक्त बोली- पुजारियों ने गलत किया! हमारे साथ बुरा बर्ताव किया, उन पर कोई FIR नहीं हुई#Queen #JiteshwariDevi #Court #Panna pic.twitter.com/BP40yRECQH — Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) September 8, 2023 ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి -
ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా?
Worlds Most Richest Royal Family: ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుండి వచ్చాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజులు, రాజకుటుంబాల పాలన నడిచేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసింది. కానీ బ్రిటిష్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా భావిస్తారు. కింగ్ చార్లెస్ III అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన డబ్బు గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆశ్యర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా నిలుస్తోంది. ఎందుకంటే 1.4 ట్రిలియన్లు డాలర్ల సంపదతో బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు విలువైన సంపద ఈ సౌదీ ఫ్యామిలీ సొంతం. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే. సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో టన్నుల కొద్దీ బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్రాండ్ ప్యాలెస్లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఖరీదైన బంగారు పూతతో కూడిన కారు కూడా ఉంది. ఇంకా కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్ జీప్ , బెంట్లీ ఉన్నాయి. 2011లలోనే ఫోర్బ్స్ అతని , అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది. యమామా ప్యాలెస్లో సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్యాచ్, విలాసవంతమైన క్రూయిజ్ షిప్లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్లో 2 హెలిప్యాడ్లు , స్పోర్ట్స్ గ్రౌండ్తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్లో ఉండే సౌకర్యాలుండటం మరో విశేషం. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్ను బహుమతిగా ఇచ్చాడని ప్రతీతి. సౌదీ అరేబియా రాజకుటుంబం తర్వాత, ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుండి వచ్చారు, మొత్తం కుటుంబం 360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ 88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్లలో 5వ స్థానంలో ఉన్నారు. -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు శుక్రవారం లండన్కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్ రాజరికం కనుమరుగు
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మరో బ్రిటిష్ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్ ఛార్లెస్ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్ తాజాగా ప్రకటించింది. అయితే, ఛార్లెస్ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. ఎలిజబెత్ ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ రాజరికమే అత్యున్నత పరిపాలన హోదాలో ఉంది. కానీ మారిన వర్తమాన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఆ రాజరికం కేవలం అలంకారప్రాయంగా తయారైంది. ‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్ చామర్స్ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
రాజవంశానికి చెందిన వాడినంటూ మహిళలకు వల...చివరికీ..
రాజకుటుంబానికి చెందిన వాడినంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. చివరికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ముంబైకి చెందిన రాజ్వీర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను రాజస్తాన్లోని రాజకుటుంబానికి చెందిన వాడిగా పరిచయం చేసుకుంటూ పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఒక మహిళా అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన గోరెగావ్ పోలీసులు అతన్ని ఒక ప్రైవేట్ హోటల్లో పట్టుకుని అరెస్టు చేశారు. అతను రాజస్తాన్లోని రాజకుటుంబానికి చెందినవాడిగా నటించి అమ్మాయిల నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేవాడో వివరించారు. ఇప్పటి వరకు అతడు బాధిత మహిళ నుంచి సుమారు రూ. 13 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాజ్వీర్ సింగ్పై ఇప్పటికే జుహు పోలీస్టేషన్లో కేసు నమోదైందని, అతను ఒక ఏడాదిపాటు జైల్లో ఉండి వచ్చాడని చెప్పారు. ఐతే ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా మరో మహిళను వేదించడమే కాకుండా ఆమె ఎనిమిదేళ్ల కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. (చదవండి: అమానుష ఘటన: విద్యార్థికి డ్రిల్లింగ్ మిషన్తో పనిష్మెంట్ ఇచ్చిన టీచర్) -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ప్లీజ్.. ఒక్కసారి కలవాలి: కింగ్ ఛార్లెస్కు మేఘన్ లేఖ
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యింది. క్వీన్ ఎలిజబెత్-2 రెండో మనవడు ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్తో కలసి రాయల్ డ్యూటీస్కు దూరంగా కాలిఫోర్నియాలో స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే.. రాణి-మేఘన్కు, ప్రిన్స్ సోదరుడు విలియం భార్య క్యాథరిన్ ఎలిజబెత్ మిడిల్టన్-మేఘన్కు మధ్య గిట్టని పరిస్థితుల్లోనే ప్రిన్స్హ్యారీ రాజహోదాకు దూరమైనట్లు ఒక ప్రచారం ఉంది. అంతేకాదు.. బ్రిటన్ను వీడాక.. బకింగ్హమ్ ప్యాలెస్లో తమకు ఎదురైన పరిస్థితులపై సంచలన ఆరోపణలే చేశారు ఆ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో.. క్వీన్ అంత్యక్రియలకు మేఘన్ దూరంగా ఉంటుందని, అసలు రాజకుటుంబం ఆమెను ఆహ్వానించకపోవచ్చని అంతా భావించారు. అయితే ఆ అంచనాలు తలకిందులు చేస్తూ.. మేఘన్ మార్కెల్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరైంది కూడా. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ కలహాలకు పుల్స్టాప్ పడాలని మేఘన్ భావిస్తోంది. అందుకే ఆమె బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3(ప్రిన్స్ హ్యారీ తండ్రి)ని ప్రైవేట్గా కలిసి చర్చించాలని ఓ లేఖ రాసింది. కాలిఫోర్నియాకు వెళ్లే ముందు.. రాజకుటుంబానికి చెందిన కీలక విషయాలు చర్చించాల్సి ఉందని కింగ్ ఛార్లెస్-3 అపాయింట్మెంట్ కోరుతూ ఆమె రాజప్రసాదానికి అభ్యర్థన లేఖ రాసిందని, ఇది అభినందించదగ్గ సాహసోపేత నిర్ణయమంటూ రాజకుటుంబ వ్యవహరాల విశ్లేషకుడు నెయిల్ సీన్ తన యూట్యూబ్లో ఓ వీడియో అప్లోడ్ చేశాడు. రాజకుటుంబంలోని పొరపచ్చాల్ని తొలగించుకునేందుకు ఇదే మంచి సందర్భమని ఆమె అనుకుంటున్నట్లు అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్-2తో పాటు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేథరిన్ మిడెల్టన్(ప్రిన్స్ విలియం భార్య)పై మేఘన్ ఆరోపణలు గుప్పించింది గతంలో. కానీ, కింగ్ ఛార్లెస్తో పాటు ఆయన సతీమణి క్యామిల్లాకు, మేఘన్కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ తనను ఒక కూతురిలా భావిస్తారని తరచూ మేఘన్ చెప్తుండేవారు. అంతెందుకు రాజప్రసాదంపై విమర్శల తర్వాత.. కొడుకుకొడలిని మన్నిస్తానని కింగ్ ఛార్లెస్ ఒక ఇంటర్వ్యూలో సైతం తెలిపారు కూడా. ఈ తరుణంలో.. తమ మధ్య చర్చల ద్వారా కుటుంబ కలహాలకు చెక్ పెట్టాలని మేఘన్ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జన సందోహం మధ్య ఆమె శవపేటికను విండ్సోర్ కాస్టిల్కు తరలించారు. అక్కడే ఖననం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి! -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్హాం ప్యాలెస్లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్టాక్లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్ను ట్విట్టర్లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు. అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాక్కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?
లండన్: రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు. అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ, రాజకుటుంబం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు మొత్తం ఈ ఫొటోలో చూడండి. నూతన రాజముద్రిక రాజకిరీటం, దానికింద సీఆర్ అంటూ పొడి అక్షరాలతో కింగ్ చార్లెస్–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్ అంటే రెక్స్ (లాటిన్లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్ పాలన సాగినంత కాలం బ్రిటన్తో పాటు ఇతర కామన్వెల్త్ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్ హయాంలో రాజముద్రికపై ఈఆర్ (ఎలిజబెత్ రెజీనా) అని ఉండేది. సవరణ బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల గ్రాఫ్లో కార్న్వాల్ ఎస్టేట్ విలువ 1,300 కోట్ల డాలర్లు, బకింగ్హాం ప్యాలెస్ విలువ 4,900 కోట్ల డాలర్లు అని పొరపాటుగా వచ్చింది. వాటిని 130 కోట్ల డాలర్లు, 490 కోట్ల డాలర్లుగా చదువుకోగలరు. చదవండి: బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా? -
రాణి కడసారి చూపునకు... మెగన్ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది. 'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్ క్యాస్టిల్కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నానమ్మతో అన్యోన్యంగా.. గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్విక్టస్ గేమ్స్ కాంపిటీషన్ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గేమ్స్కు హ్యారీనే ప్రమోటర్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు.. అయితే అమెరికాకు చెందిన మేఘన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు. అప్పటి నుంచి మరింత దూరం ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది. మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి. చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్ది కూడా గ్రీసే అని సిప్రస్కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్పై జంట ఇంద్రధనుస్సులు -
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్కు చార్లెస్
లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్తో భేటీ అయ్యారు. అంత్యక్రియలపై అస్పష్టత ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది సంతాపాల వెల్లువ ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు. -
ఎలిజబెత్ అస్తమయంతో మారిన వారసుల జాబితా
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు. ► బ్రిటన్లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్–2 కింగ్ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్ విలియం కూతురు చార్లెట్ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్ కంటే ముందుంది. ► రోమన్ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్ క్యాథలిక్కులు అయి ఉండరాదు. ► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్ చర్చికి, ప్రొటస్టెంట్ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి. జాతీయ గీతమూ మారుతుంది చార్లెస్ రాజు కావడంతో బ్రిటన్ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్లో ‘గాడ్ సేవ్స్ ద క్వీన్’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్ సేవ్ అవర్ గ్రేషియస్ కింగ్’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్ ఆంథెమ్గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్ బదులు ఇక చార్లెస్ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్హం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే క్వీన్స్ గార్డ్ ఇకపై కింగ్ గార్డ్గా మారుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అగ్గి రాజేసిన భార్యలు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. తల్లి ప్రిన్సెస్ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్ విలియమ్(40), హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్(రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. ► అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్ ఫిట్జ్విలియమ్స్ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. ► 1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయసు 15, హ్యారీ వయసు 12. ► ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియమ్ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ► తన ప్రియురాలు కేట్ మిడెల్టన్తో 2011లో విలియమ్ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ► ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. ► హ్యారీ 2018లో మేఘన్ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ► ఆపై హ్యారీ, మేఘన్లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్, కేట్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. ► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. తమదేం రేసిస్ట్ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు. ► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. ► అయితే.. ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. ► ఆ ప్రభావం జూన్ 2022 క్వీన్ ఎలిజబెత్ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ► హ్యారీ, మేఘన్లు ఈ సెప్టెంబర్లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్సోర్ ఎస్టేట్లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. ► ఇక ప్రిన్స్ విలియమ్ కూడా ఎర్త్షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబర్లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. -
తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా కుమారి
జైపూర్: ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజ్ మహల్లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న ప్రాంతం.. తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని బుధవారం రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్ మహల్లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే తమ పూర్వీకులకు(జైపూర్ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు. -
యువరాణి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్మేట్ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు. -
ఓ సామాన్యుడితో పెళ్లి కోసం.. 13 లక్షల డాలర్లను వదులుకోనున్న యువరాణి
టోక్యో: జపాన్ యువరాణి మాకో ప్రేమించిన వ్యక్తి కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వానికి కూడా తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు 29 ఏళ్ల మాకో తన బాయ్ఫ్రెండ్ కీయ్ కౌమురోను పెళ్లి చేసుబోతోంది. కాగా వీరివురికి 2017లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్ల పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. అయితే యువరాణి మాకో వివాహం చేసుకోబోతున్న కౌమురో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. చట్టం ప్రకారం, రాజ కుటుంబంలోని మహిళా సభ్యులు ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం ద్వారా వారి రాజ హోదాను కోల్పోవడమే కాక రాజకుటుంబంలో వారికి రావాల్సిన ఆడ ఇంటి భరణం కూడా ఇవ్వరు. రాజకుటుంబంలోని మహిళలకు రాజభరణం కింద 13 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే మాకో సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఆమె వదులుకోవడానికి సిద్ధపడింది. ప్రిన్సెస్ మాకోకు డబ్బు ఇవ్వకపోతే, యుద్ధానంతర జపనీస్ చరిత్రలో అలాంటి చెల్లింపు జరగకపోవడం ఇదే మొదటిసారిగా కానుంది. యువరాణి వివాహం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత యునైటెడ్ స్టేట్స్లో వారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని.. -
చేయూతలో మహా‘రాణి’
పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగూ ఆర్బాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవనశైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతున్నారామె. గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే .. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యనభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్కు వెళ్లేవారు. అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్ను అందిస్తూనే మరోక్క పోస్టుగ్రాడ్యుయేషన్ను పూర్తి చేసారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. బరోడా మహారాణి.. ఒకపక్క రాధిక తన చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమెకోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతోమందిని చూశాక బరోడా యువరాజు సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది. రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి... బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక.. పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశ్యంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్డౌన్ సమయంలోను రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు. నాన్న దగ్గరే తొలిపాఠం నేర్చుకున్నాను.. ‘‘నేను సంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను. రాజరిక కట్టుబాట్లు దాటి మానాన్న గారు మహారాజ్ కుమార్ డాక్టర్ రంజిత్ సింగ్జి నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984 లోనే ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ్రçపజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవచేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమయ్యింది. అప్పటినుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మకూడా ప్రోత్సహించేవారు. అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండని ప్రోత్సహిస్తున్నాను’’ అని రాధికరాజే చెప్పారు. నాన్నతో రాధికారాజే గైక్వాడ్ -
మా కుటుంబం ‘జూ’లా అనిపించేది: బ్రిటన్ యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం 'ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్' పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. బాధలు, కట్టుబాట్లు నుంచి విముక్తి కోసమే రాజ కుటుంబం బంధాలను తెంచుకుని అమెరికాకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే కాదు తన 20 ఏళ్ళ వయసులో అనేక సందర్భాల్లో ఆయన తన రాజ జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన చాలా సార్లు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 2020 ప్రారంభంలో రాజ కుటుంబం తనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టినట్లు హ్యారీ తెలిపాడు. తన తల్లి వదిలివెళ్లిన డబ్బుతోనే ఆ సమయంలో ఎటువంటి ఆర్థిక సమస్య రాకుండా చూసుకున్నట్లు తెలిపారు. రాజ కుటుంబంలో అలవాట్లు, పద్ధతులు తనకి పెద్దగా నచ్చేవి కాదని ఒక్కోసారి అక్కడ వాళ్లతో జీవించడం జంతుప్రదర్శనశాలలో ఉన్నట్లు అనిపించేదని అన్నారు. తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించిన రోజులను గుర్తు చేసుకుని బాధని వ్యక్తం చేశాడు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ( చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! ) -
మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా
లండన్: బ్రిటన్ రాచరిక కుటుంబాన్ని వీడి రావడానికి మీడియా పెట్టిన ఒత్తిడే కారణమని ప్రిన్స్ హ్యారీ నిందించారు. బ్రిటన్ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిందని, దీని వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అమెరికాలోని సీబీఎస్ చానెల్లో జేమ్స్ కార్డన్ హోస్ట్గా నిర్వహించే లేట్ లేట్ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు. ప్రజా సేవ నుంచి తానేమీ దూరంగా పారిపోలేదని స్పష్టం చేశారు. ‘‘‘నేను ఎప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదు. కానీ బ్రిటన్ మీడియా వల్ల ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. అలాంటప్పుడు ప్రతీ భర్త, ప్రతీ తండ్రి ఏం చేద్దామనుకుంటారో నేనూ అదే చేశాను. ఇది బాధ్యతల్ని విడిచిపెట్టడం కాదు. ఒక్క అడుగు వెనక్కి వేయడమే. బ్రిటన్ మీడియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే’’అని అన్నారు. ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మెర్కల్ గత ఏడాది జనవరిలో రాచ కుటుంబాన్ని వీడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జంట ఇప్పడు ఇక పూర్తిగా రాచ కుటుంబానికి దూరమయ్యారని గత వారమే బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చడానికి ముందు బ్రిటన్లోని టాబ్లాయిడ్లు తమపై జాతి వివక్షని ప్రదర్శించాయంటూ హ్యారీ దంపతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మెఘన్ తండ్రి శ్వేతజాతీయుడు కాగా,తల్లి ఆఫ్రికన్ అమెరికన్ కావడంతో బ్రిటన్ పత్రికల రాతలు తమను బాధించాయని హ్యారీ చెప్పారు. ఆ సిరీస్ అంతా కట్టుకథే రాచకుటుంబాన్ని వీడిన తర్వాత హ్యారీ ఒక చానెల్కి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. రాణి ఎలిజెబెత్పై నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది క్రౌన్ సిరీస్లో వాస్తవాలేవీ చూపించలేదని ధ్వజమెత్తారు. నిజజీవితంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిళ్ల కంటే, మీడియా కథనాల వల్ల ఎక్కువ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయంటూ హ్యారీ వ్యాఖ్యానించారు. -
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మార్కెల్ బ్రిటన్ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ(36), ఆయన భార్య డచెస్ ఆఫ్ సస్సెక్స్ మెఘన్ మార్కెల్(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు. తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. -
63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!
ఆమెకు థాయ్లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది. ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్నెట్ వర్క్కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్కండక్టింగ్ (హెచ్టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు! -
రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్’ మృతి
ముంబై: బ్రిటన్ రాజవంశానికి వీరాభిమాని, బ్రిటానియా&కో రెస్టారెంట్ ఓనర్ అయిన బోమన్ కోహినూర్(93) బుధవారం మృతి చెందాడు. గుండెపోటుతో నిన్న సాయంత్రం 4.45గంటలకు కన్ను మూసినట్లు పార్సీ జనరల్ ఆస్పత్రి అధికారి తెలిపారు. బ్రిటానియా రెస్టారెంట్ ఓనర్గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన బోమన్ కోహినూర్.. 2016లో ఆకస్మాత్తుగా దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండియా-భూటాన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ప్రిన్స్ విలియమ్స్ దంపతులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి బోమన్ని కలుసుకున్నారు. ఈ సంఘటనతో బోమన్కు ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. బోమన్ కోహినూర్ తండ్రి 1923లో ముంబైలో బ్రిటానియా&కో రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కోహినూర్ జీవితం ఆ రెస్టారెంట్కు అంకితమయ్యింది. చిన్ననాటి నుంచి కోహినూర్ బ్రిటన్ రాజవంశం పట్ల వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే బోమన్ రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన వారికి ముందుగా క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మగాంధీ నిలువెత్తు ఫోటోలు దర్శనమిస్తాయి. అంతేకాక కోహినూర్ ప్రతి ఏడాది క్వీన్ ఎలిజబెత్ IIకు ప్రత్యేక సందర్భాల్లో ఉత్తరాలు రాస్తుంటాడు. రాజ ప్రసాదం నుంచి క్వీన్ ప్రతినిధులు ఆమె తరఫున ప్రత్యుత్తరం కూడా పంపుతారు. కోహినూర్కు రాజ కుటుంబం అంటే ఎంత అభిమానం అంటే.. తన మనవరాలికి ఏకంగా ప్రిన్స్ విలియమ్స్ తల్లి డయానా పేరు పెట్టాడు. కోహినూర్ మరణం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రియమైన బొంబాయి వాసి ఇక లేరని తెలిసి బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. -
రాణివ్వండి
ఆకలయిందాడైనింగ్ టేబుల్ మీదకు వచ్చామాతిన్నామావెళ్లిపోయామా..ఇదేం కుదరదు ప్యాలెస్లో.రాణిగారు రావలసిందేరూల్సన్నీ ఫాలో అవాల్సిందే!రాణిగారు రాకపోతే..?రానివ్వండి అంటారంతే..! వంద దేశాలు కలిస్తే అమెరికా.వంద పద్ధతులు కలిస్తే బ్రిటన్. బ్రిటన్ అంటే రాణిగారు అండ్ ఫ్యామిలీ. రాణిగారింట్లో.. కూర్చున్నా రాయల్గానే కూర్చోవాలి. నిలుచున్నా రాయల్గానే నిలుచోవాలి. మెట్లు ఎక్కుతున్నా, దిగుతున్నా రాయల్గానే ఎక్కాలీ దిగాలి. ఇంటి ఆడపడుచులు రాణిగారికి మోకాళ్ల మీద కాస్త వంగి అభివాదం చెయ్యాలి. అదీ ఎవరూ గమనించకుండా క్షణాల్లో చేసేయాలి! అంతఃపుర వనితలు దుస్తులు సరిగా వేసుకోవాలి. ఒంటి మీద అవి కుదురుగా ఉండాలి. తలపై టియారా (అర్ధ చంద్రాకారపు ఆభరణం) ధరించాలి. ఇంట్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ ‘మోనోపలి’ (బిజినెస్ గేమ్) ఆడకూడదు. ఎక్కడికైనా వెళ్లినా, కూర్చున్నా అంతా ఒక ఆర్డర్లోనే ఉండాలి. (మొదట రాణి గారు. తర్వాత ఆమె భర్తగారు. తర్వాత ఆమె కొడుకు గారు. తర్వాత ఆ కొడుకు భార్యగారు. తర్వాత కొడుకు పెద్ద కొడుకు గారు. తర్వాత ఆ పెద్దకొడుకు భార్యగారు.. ఇదీ లైన్!). షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, తీసుకోడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే రాచకుటుంబీకులెవరూ బ్రిటన్ ఎన్నికల్లో ఓటు వేయకూడదు. ఆటోగ్రాఫ్లు ఇవ్వకూడదు. అమెరికన్ అమ్మాయి మేఘన్ మార్కల్ బ్రిటన్ రాచకుటుంబానికి కొత్త సభ్యురాలిగా వచ్చాక ఈ పద్ధతుల్లో కొన్ని బ్రేక్ అయ్యాయి. రాణిగారు చూసీ చూడనట్లు పోనిచ్చారు. తోడికోడలు (భర్త అన్నగారు ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్) దగ్గరుండి కొన్ని పద్ధతులు నేర్పించారు. ఇప్పుడు మళ్లీ రాజప్రాసాదంలో సందడి మొదలైంది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులకు పెళ్లయి ఏడాది అవుతుండగా బకింగ్హ్యాప్ ప్యాలెస్కి మరో కొత్త మెంబర్ వచ్చాడు. సోమవారం మేఘన్ మార్కల్ పండంటి కొడుక్కి జన్మనిచ్చారు. వాడికీ ఈ పద్ధతులు తప్పనివే. అయితే కొంత టైమ్ పడుతుంది. ఊహ వచ్చేవరకు వాడేం చేసినా, ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడిక రాణిగారింటి విందుల సమయమిది. కనీసం కొన్నాళ్ల వరకైనా అయినవాళ్లు, అతిథులు వచ్చిపోతుంటారు. ఆ ఆతిథ్యం అంతా కూడా రాచకుటుంబ పద్ధతులకు అనుగుణంగానే ఉంటుంది. ఒక్క మాటలో దానిని ‘టేబుల్ మేనర్స్’ అనలేం. ‘భోజన సంప్రదాయం’ అనే మాటేదో అనాలి. నో తొందర.. నో నిదానం అమెరికాలోని ముప్ఫైమూడు కోట్ల మందిలో ఎవరిష్టం వాళ్లది. బ్రిటన్లో మాత్రం.. అంత పెద్ద రాచకుటుంబం అయినా సరే అందరూ ఒకే ట్రాక్ మీద ఉండాలి. మేఘన్మార్కల్ అమెరికా అమ్మాయి కనుకే ఈ పోలిక తేవడం. డైనింగ్ దగ్గరా అంతే. ఇష్టమైన ఐటమ్స్ వేర్వేరుగా ఉండొచ్చు. పద్ధతుల పాటింపును మాత్రం ఎవరూ తప్పకూడదు. భోజనానికి త్వరపడకూడదు. భోజనానికి ఆలస్యం చేయకూడదు. భోజనం త్వరగా చేసేయకూడదు. మరీ నెమ్మదిగా భోజనం చేయకూడదు. భోంచేస్తున్నప్పుడు ఏ చేతిలో ఉండాల్సిన స్పూన్, ఫోర్క్ ఆ చేతిలోనే ఉండాలి. అల్లరల్లరిగా భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక పాత్రలు, డైనింగ్ టేబులూ కదిలేలా కుర్చీల్లోంచి లేవకూడదు. క్వీన్ ఎలిజబెత్కి ఫుడ్డును వేస్ట్ చెయ్యడం ఇష్టం ఉండదు. అంతా తిని లేచాక గిన్నెల్లో ఆహార పదార్థాలు మిగిలిపోతే, వాటిని రూపురేఖలు మార్చి తర్వాతి భోజనానికి సిద్ధం చేయమని వంటవాళ్లకు చెబుతారు రాణిగారు! వెల్లుల్లికి అల్లంత దూరం అంతఃపుర వంటశాలలో వెల్లుల్లి వాడకమే ఉండదు. ఘాటైన ఆ వాసనకు నోటి దుర్వాసన వస్తుందని రాజ కుటుంబం తమ వంటల్లో వెల్లుల్లిని ఏళ్ల క్రిందటే నిషేధించింది. రాణి గారి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్ల్స్ అందరూ తినే కాయగూరలు తినరు. ఆయన తనకై తాను పండించుకున్నవే తింటారు! ఆయనకో తోట ఉంది. ఆ తోటలో తనకు ఇష్టమైన కూరగాయల్ని ఎరువులు వాడకుండా పండించుకుంటారు. రాణిగారింట్లో పెంకు చేపల్ని (షెల్ ఫిష్) తినడం నిషిద్ధం. పెంకు చేపల్ని తింటే ఎంతటి ఆరోగ్యవంతులైనా తేలిగ్గా జబ్బున పడతారని ఇంగ్లండ్లో ఒక నమ్మకం. అదే నమ్మకం రాచకుటుంబానికీ ఉంది. అయితే ఈ నిషేధాన్ని కుటుంబంలోని యంగ్ జనరేషన్ చాటు మాటుగా బ్రేక్ చేస్తుంటారట. ఏళ్లతరబడి వాళ్ల వంట శాలలో పని చేసి బయటికి వచ్చిన షెఫ్లు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటివి బయపెడుతుంటారు. ప్రిన్స్ చార్ల్స్ తన భోజనాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోడానికి ఇష్టపడరు. అందుకే రాయల్ షెఫ్స్ ఆయన కోసం వండినవి ఎవరికీ వడ్డించకుండా జాగ్రత్త పడతారు. రాణిగాకి సైడ్ డిష్గా పెద్ద బౌల్ నిండా కాయగూరల సలాడ్స్ ఉండాలి. మధ్యమధ్య వాటిని భుజిస్తూ, ముఖ్యాహారాన్ని ఆరగిస్తారు. డార్క్ చాక్లెట్ బిస్కెట్లంటే రాణిగారికి మహా ప్రీతి. పర్యటనలకు, విహారాలకు వెళ్లినప్పుడు కూడా ఇంటి నుంచి ఆమె డార్క్ చాక్లెట్ బిస్కెట్లు తీసుకుని వెళ్తారు. పర్సు తీశారంటే ఫినిష్! డైనింగ్ టేబుల్ మీద ఆ పూట పాస్తా ఉందంటే ప్రత్యేక సందర్భం ఏదో ఉందనే అర్థం. ఎప్పుడో కానీ ప్యాలెస్ డైనింVŠ టేబుల్పై పాస్తా కనిపించదు. డిన్నర్ పార్టీలప్పుడు మస్ట్గా ఉంటుంది. వడ్డన సేవకులకు రాచ కుటుంబీకులు ఏదీ నేరుగా చెప్పరు. టేబుల్ మీద ఫోర్క్పై, నైఫ్ని అడ్డంగా పెడితే ప్లేట్లకు చేతుల్ని, గరిటెల్ని తాకించవద్దని చెప్పడం. రాణిగారి భోజనం పూర్తయితే ఇక మిగతావాళ్లెవరూ తినడానికి లేదు. అందరూ ఆపేయాల్సిందే. రాణిగారి కన్నా ఎవరూ ముందు మొదలెట్టడానికి లేదు. పిల్లలైనా సరే! తింటూ తింటూ రాణిగారు బల్లమీద తన పర్సు పెట్టారంటే కుటుంబ సభ్యులకు గానీ, అతిథులకు గానీ ఐదునిముషాల్లో భోజనం ముగించాలని సంకేత పరచడం. రాణిగారు తన కుడివైపు కూర్చొని ఉన్న వారితో మాటకలుపుతూ భోంచేయడం ప్రారంభిస్తారు. రెండో వడ్డనలో తన ఎడమవైపు కూర్చొని ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం కొనసాగిస్తారు. స్పూన్తో తింటున్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నోట్లో ఉంచుకోవడం కోసం ఫోర్క్ వెనుక భాగాన్ని ఉపయోగించాలి. అందుకోసం ఫోర్క్ని ఎడమ చేతిలో ఉంచుకోవాలి. ఒక రోజులోని భోజనాలన్నిటికీ కూడా డైనింగ్ హాల్కి ఒకే విధమైన ఫార్మల్ డ్రెస్లో వెళ్లాలి. అన్నట్లు రాణిగారికి డార్క్ చాక్లెట్ బిస్కెట్లతో పాటు మామిడి పండ్లన్నా కూడా మహా ఇష్టం. అసలు రాణిగారితో భోజనం అంటేనే తినే ఐటమ్స్ కన్నా, పాటించాల్సిన రూల్సే ఎక్కువగా ఉంటాయి. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ల పెళ్లికి అనుబంధంగా జరిగిన విందుల్లో ఆ రూల్స్ అన్నిటినీ ఆ అమెరికా అమ్మాయి మేఘన్ తప్పని సరిగా పాటించవలసి వచ్చింది. మినహాయింపులేమీ లభించలేదు. కనీసం రెండు రూల్స్ అయితే తప్పనిసరి. డైనింగ్ చైర్ మీద రాణిగారు కూర్చున్నాకే మిగతావాళ్లు కూర్చోవాలి. అదీ ఆర్డర్లో. ఇది రూల్ నెంబర్ వన్. రాణిగారు భోజనం పూర్తవ్వగానే మిగతావారూ తమ భోజనాన్ని ముగించాలి. ఇది రూల్ నెంబర్ టూ. రాణిగారికి అబద్ధాలు! వలసలు పెరిగినప్పుడు పద్ధతులు తగ్గుముఖం పడతాయి. వయసు పెరుగుతున్నప్పుడు పద్దతుల పాటింపు ఓపికా తగ్గుతుంది. రాణిగారి ప్యాలెస్లో డిన్నర్కి అంతా ఒకే టైమ్కి రావాలి. అది రూలు. రాణిగారు వస్తే కానీ భోజన కార్యక్రమం మొదలవదు. అయితే కొన్నిసార్లు రాణిగారు రావడం ఆలస్యం అయ్యేది. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్నవారు రాణి గారి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇక అలా లాభం లేదని భోజన సమయాన్ని ఇవతలికి జరిపి రాణిగారికి వర్తమానం పంపేవారు. డిన్నర్ రాత్రి తొమ్మిది గంటలకు అనుకుంటే.. ఎనిమిదీ నలభై ఐదుకు అని చెప్పేవారు. అలాగే అందరికీ ఎనిమిదిన్నరకు అని చెబితే, రాణిగారికి మాత్రం ఎనిమిదింపావుకే అని కబురు చేరవేసేవారు. అలా అనేకసార్లు అబద్దాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని షెప్ గార్డన్ బయటపెట్టారు. వంటింట్లోకి రాణిగారి భర్త! 1982–1993 మధ్య కాలంలో డారెన్ మెక్గ్రేడి అనే ఆయన రాణిగారి కుటుంబ సభ్యులకు పర్సనల్ షెప్గా పని చేశారు. ఆయన రిౖటñ ర్ అయ్యి బయటికి వచ్చాక కొన్ని ఆసక్తికరమైన సంగతులు కూడా ఆయనతోపాటు బయటికి వచ్చాయి. అవన్నీ పద్ధతులు బ్రేక్ అయిన సందర్భాలు. ఫిలిప్ ఓసారి వంటగదికి వెళ్లారు. అక్కడ పదుల సంఖ్యలో వంట సిబ్బంది ఉంటారు. ఫిలిప్ అంటే క్వీన్ ఎలిజబెత్ భర్త. ఆయనంతటి వారు డైనింగ్ హాల్లో కనిపించాలి కానీ, కిచెన్లోనా! సిబ్బంది అంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ‘‘రాత్రికి డిన్నర్లోకి ఏముంది?’’ అని అడిగారు ఫిలిప్. ‘‘మీ కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించిన లేత మాంసం ఉంది యువర్ రాయల్ హైనెస్’’ అని చెప్పాడు షెఫ్ డారెన్. ‘‘ఆ వైపున ఉన్నదేమిటి?’’ అని అడిగారు ఫిలిప్. ‘‘అవి మాకోసం చేసుకున్న చాప్స్’’ అని చెప్పాడు షెఫ్. ‘మా కోసం’ అంటే కిచెన్ సిబ్బంది కోసం. చాప్స్ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా వేయించిన మాంసం. ‘‘అయితే అవే నాకూ కావాలి’’ అని చాప్స్ తెప్పించుకుని తిన్నారు ఫిలిప్ ఆ రాత్రి డిన్నర్లో! -
బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడు
లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు. -
రాణిగారికీ రూల్స్ ఉన్నాయి!
బ్రిటన్ యువరాజు హ్యారీని హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ ఇటీవల వివాహమాడిన విషయం తెలిసిందే. యువరాజుని పెళ్లాడటంతో యువరాణి అయిపోయారు మేఘన్. సకల సౌకర్యాలు లభిస్తాయి అనుకోవడంలో ఎటువంటి సందేహాలు లేవు. వాటితో పాటుగా రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయట ఈ యువరాణిగారికి. రాజకుటుంబంలో సభ్యురాలు అయ్యారు కాబట్టి మేఘన్ మార్కెల్ ఇక మీదట ఇంతకుముందులా మామూలు సిటిజన్ కాదు. రాజకుటుంబీకుల లైఫ్ స్టైల్కు, వాళ్ల పద్ధతులకు అలవాటు పడాలి. అందులో కొన్ని రూల్స్ ఈ విధంగా ఉంటాయని సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం చేయకూడదు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే మినీ–స్కర్ట్స్కు దూరంగా ఉండాలి. షెల్ ఫిష్ తినకూడదు. డిన్నర్ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హస్బెండ్ హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోకూడదు. కావాలంటే ఒకవైపు వాలుగా కాళ్లు పెట్టుకోవచ్చు. తన కంటే పై స్థాయిలోని వాళ్లు రూమ్లోకి రాగానే మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇలాంటి కొన్ని నియమాలను రాజకుటుంబంలోకి వెళ్తున్నందుకు మార్కెల్ పాటించాలట. సో.. మార్కెల్ ఇక మీదట పాత మార్కెల్లా ఉండబోరన్నమాట. -
అబుదాబి రాయల్ ఫ్యామిలీతో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో చిత్రీకరణ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతోంది. 50 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీన్లు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు ఈ షూటింగ్ కోసం అబుదాబి చేరుకున్నారు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న ప్రభాస్ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్తో పాటు ఆయన సోదరుడు, యూవీ క్రియేషన్స్ నిర్మాత ప్రమోద్ కూడా రాయల్ ఫ్యామిలీని కలిసిన వారిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మనవడి పూర్వజన్మ జ్ఞాపకాలే రప్పించాయి
నాగార్జున కొండను సందర్శించిన భూటాన్ రాణి తల్లి విజయపురిసౌత్: ప్రముఖ బౌద్ధరామం నాగార్జున కొండను భూటాన్ దేశపు రాణి తల్లి అఫీదోర్జీ వాంగ్మోవాంగ్చౌ తన రెండో కూతురు, మనమడితో కలసి ఆదివారం సందర్శించారు. భూటాన్ రాజు చెల్లెలు కొడుకు జిగ్మే జితేన్వాంగ్చుక్ పూర్వ జన్మ జ్ఞానంతో గతేడాది నుంచి ఐదు తలల పాము (నాగముచ్ఛలేంద్ర), బుద్ధుడు ఉన్న ప్రాంతానికి జలాశయంలో నుంచి లాంచీలో వెళ్లాలని కలలో వచ్చిందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇంటర్నెట్లో వెతకగా అది నాగార్జున కొండగా గుర్తించి ఇక్కడకు తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు రాజ కుటుంబీకులు ఆ బాలుడిని తీసుకువచ్చారు.